-
మార్చిలో నియామకాలు పెరిగాయ్
ముంబై: ఈ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో నియామకాలు స్వల్పంగా పెరిగాయి. నౌకరీ జాబ్స్పీక్ ఇండెక్స్ ప్రకారం గత నెలలో జాబ్ లిస్టింగ్స్ 3 శాతం అధికమయ్యాయి. వివిధ ఉద్యోగాల కోసం నౌకరీ.కామ్లో నమోదయ్యే ప్రకటనల ఆధారంగా ప్రతి నెల కంపెనీ నౌకరీ జాబ్స్పీక్ ఇండెక్స్ విడుదల చేస్తోంది. దీని ప్రకారం.. ఐటీ, రిటైల్ రంగాల మూలంగా ఈ పెరుగుదల నమోదైంది. ఫిబ్రవరిలో జాబ్ లిస్టింగ్స్ 2,356 అయితే, మార్చిలో ఈ సంఖ్య 2,436 ఉంది. జాబ్ లిస్టింగ్స్ ఐటీ రంగంలో 11 శాతం, రిటైల్లో 15 శాతం వృద్ధి చెందాయి. చమురు, సహజ వాయువు రంగంలో 7 శాతం, అకౌంట్స్, ట్యాక్సేషన్, ఫైనాన్స్ 6, టెలికం, ఐఎస్పీ 5, బీపీవో, ఐటీఈఎస్ 1, బీఎఫ్ఎస్ఐలో 1 శాతం పెరిగాయి. జనవరి–మార్చిలో 23 శాతం.. కోవిడ్ సెకండ్ వేవ్తో విద్యా రంగంలో 13 శాతం, ఎఫ్ఎంసీజీ 10, హోటల్స్, ఎయిర్లైన్స్, ట్రావెల్ రంగాల్లో 8 శాతం నియామకాలు తగ్గాయి. 2020 అక్టోబర్–డిసెంబర్తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–మార్చిలో రిక్రూట్మెంట్ 23 శాతం పెరిగిందని నౌకరీ.కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ తెలిపారు. వృత్తి నిపుణుల కోసం డిమాండ్ మార్కెటింగ్, ప్రకటనల విభాగంలో 10 శాతం, హెచ్ఆర్, అడ్మినిస్ట్రేషన్ 8, సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్ విభాగంలో 6 శాతం పెరిగింది. 4–7, 8–12 సంవత్సరాల అనుభవం ఉన్న నిపుణుల కోసం నియామకాల వృద్ధి 6% నమోదైంది. నాయకత్వ విభాగంలో 16 ఏళ్లకుపైగా అనుభవం ఉన్నవారి కోసం జరిగే నియామకాలు 3 శాతం తగ్గాయి. -
హైదరాబాద్లో కొత్త కొలువుల జోరు: నౌకరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక పరిస్థితులపై సెంటిమెంటు మెరుగుపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్లో గత నెల జోరుగా నియామకాలు జరిగాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈసారి హైరింగ్ 17% పెరిగింది. నియామకాలకు సంబంధించి నౌకరీడాట్కామ్ నిర్వహించే జాబ్ స్పీక్ సూచీ ద్వారా ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఫార్మా, ఐటీ, ఐటీఈఎస్ రంగాల ఊతంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో జాబ్ మార్కెట్ గణనీయంగా ఊపందుకుందని నౌకరీడాట్కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వి. సురేష్ తెలిపారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు, పండుగ సీజన్ కారణంగా రాబోయే రోజుల్లో హైరింగ్ సెంటిమంటు మరింత మెరుగుపడొచ్చని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా చూస్తే .. టెలికం, ఐటీ/బీపీవో రంగాల ఊతంతో గత నెల నియామకాలు 18% మేర పెరిగాయి. 2013తో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో ఈ సూచీ 18% పెరిగి 1,478 వద్ద నిల్చింది. జూలైతో పోలిస్తే ఆగస్టులో నియామకాలు సుమారు 10% క్షీణించినప్పటికీ.. రాబోయే రోజుల్లో మాత్రం జోరు కొనసాగవచ్చని నౌకరీడాట్కామ్ అంచనా. రంగాల వారీగా చూస్తే టెలికంలో 36%, బీపీవోలో 26 శాతం మేర వృద్ధి నమోదైంది. మెట్రో నగరాల వారీగా చూస్తే ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో గరిష్టంగా నియామకాలు జరగ్గా.. బెంగళూరు, చెన్నై, కోల్కతా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ముంబైలో అత్యంత తక్కువ శాతం నమోదైంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement