-
మిసెస్ ఇండియా రన్నరప్గా ఆదిలాబాద్ వాసి
ఎదులాపురం(ఆదిలాబాద్): మిసెస్ ఇండియా అందాల పోటీల్లో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వర్షశర్మ రన్నరప్గా నిలిచి తన ప్రతిభను చాటుకుంది. ఈ నెల 2న ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల సంస్థ పనాషే ముంబాయిలో మిసెస్ ఇండియా పోటీ నిర్వహించగా వర్షశర్మ 35 మందితో పోటీపడి మొదటి రన్నరప్గా నిలిచింది. ఇదిలా ఉండగా ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే జోగురామన్న శనివారం వర్షశర్మను శాలువాతో సన్మానించి సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ పట్టణానికి చెందిన వర్షశర్మ అందాల పోటీల్లో మొదటి రన్నరప్గా నిలవడం జిల్లాకే గర్వకారణమన్నారు. భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని జిల్లాకు ఖ్యాతి పెంచాలని ఆకాంక్షించారు. అనంతరం వర్షశర్మ మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కాకూడదన్నారు. ప్రయత్నిస్తే మహిళలు రాణించలేని రంగమంటూ లేదన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, నాయకులు సాయిని రవి, దేవన్న, ఖయ్యుం తదితరులు పాల్గొన్నారు. -
పరిషత్ ‘పరీక్ష’!
సాక్షి, ఆదిలాబాద్: ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తుంది. మొదటి విడత ఘట్టం ముంచుకొస్తుంది. మరో రెండు రోజుల్లో తొలి సమరం జరగనుంది. దీంతో అందరి దృష్టి దీనిపైనే నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల కంటే గెలుపోటముల ప్రభావం ముఖ్య నేతలపై ఉంది. దీంతో ఆ నేతలకు ఈ ఎన్నికలు కీలకమయ్యాయి. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొన్న ఆ నేతల్లో కొందరికి తీపి, మరికొందరికి చేదు ఫలితాలు ఎదురయ్యాయి. అలా మొదటి పరీక్ష ఎదుర్కొనున్నారు. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల ద్వారా రెండో పరీక్షలోనూ ఫలితాలు చూశారు. అనంతరం లోక్సభ ఎన్నికల ద్వారా మూడో పరీక్షను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ప్రాదేశిక ఎన్నికల ద్వారా మరో పరీక్షకు సిద్ధమయ్యారు. ఈ నేతలకు కీలకం.. ప్రాదేశిక ఎన్నికల్లో పార్టీ పరంగా మంచి ఫలితాల కోసం కొంతమంది ముఖ్య నేతలు జిల్లాలో విస్తృతంగా కృషి చేస్తున్నారు. ఈ ఫలితాల ప్రభావం వారికి కీలకం కానుంది. ప్రధానంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జోగు రామన్న, బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భార్గవ్ దేశ్పాండేలకు ఈ ఫలితాలు ప్రభావం చూపనున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న జోగు రామన్న మరోసారి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత మొదటి విడత విస్తరణలో ఆయనకు అవకాశం రాకపోయినప్పటికీ ఎక్కడా వెనుకంజ వేయకుండా పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో గత నెల జరిగిన లోక్సభ ఎన్నికలతో పాటు ప్రస్తుతం జరగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. మిగతా నేతలకు అందనంత దూరంలో ఆయన ప్రచారం సాగింది. తద్వారా నియోజకవర్గంలో అటు లోక్సభ, ఇటు ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్ఎస్కు మంచి ఫలితాలు వస్తాయని ఆశ పెట్టుకున్నారు. ఇక బీజేపీ పరంగా చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి రెండో స్థానంలో నిలిచిన పాయల శంకర్ ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా అంత పెద్దగా ప్రభావం చూపనప్పటికీ స్వల్ప ఫలితాలు సాధించి పార్టీ ఉనికిని చాటారు. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కోసం విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటించారు. ఈ ఫలితాలు అనుకూలంగా వస్తే అటు పార్టీతోపాటు పాయల శంకర్కు వ్యక్తిగతంగా ఇమేజ్ పెరుగుతుంది. ఇక కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు భార్గవ్దేశ్ పాండేకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టికెట్ ఆశించినా గండ్రత్ సుజాతకు దక్కడంతో ఆమె గెలుపుకోసం ప్రయత్నించారు. అయితే నియోజవర్గంలో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఫలితాల్లో టీఆర్ఎస్ తర్వాత నిలిచినా ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ప్రస్తుతం జరగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో జిల్లాలో అంతాతానై వ్యవహరిస్తుండడంతో ఫలితాలు కీలకంగా మారాయి. జిల్లా అధ్యక్షుడిగా ఆయన రాజకీయ జీవితానికి అనుకూల ఫలితాలు వస్తే ఉన్నతి లభించే అవకాశం ఉంటుంది. బోథ్ నియోజవర్గంలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలుపొందినా పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం బాపురావుకు ఊరటనిచ్చింది. ఇక లోక్సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ కూడా బోథ్ నియోజకవర్గానికే చెందిన వారు కావడంతో ఆ ఫలితాల బాధ్యత ఇరువురిపై ఉండే అవకాశం ఉంటుంది. ఇక ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు కీలకం కానుంది. ప్రధానంగా రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఫలితాలు అనుకూలంగా వచ్చిన పక్షంలో సీఎం దగ్గర పలుకుబడి ఉంటుందని ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి సోయం బాపురావుకు ప్రాదేశిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో గెలుపుకోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఆయన లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరడం, ఆ తర్వాత బీజేపీ లోక్సభ అభ్యర్థిగా ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆయన నియోజకవర్గంలో పట్టుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీకి మెజార్టీపై ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో ప్రాదేశిక ఎన్నికల్లో మంచి ప్రభావం చూపాలని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ సోయం బాపురావుకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఇక ఖానాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాలు జిల్లాలోకి వస్తాయి. ఇక్కడ కాంగ్రెస్ గెలుపు కోసం కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి రాథోడ్ రమేశ్ విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఈ మండలాలతోపాటు జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ సీనియర్ నేతగా, పార్టీలో మరింత పట్టుకోసం ఈ ఎన్నికల ద్వారా కృషి చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఈ మండలాల్లో గెలుపు కీలకం కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన రాథోడ్ రమేశ్పై గెలుపుతో నియోజకవర్గంలో ప్రభావం చూపారు. అదే సరళిలో లోక్సభ ఎన్నికల్లోనూ ఆమె భుజస్కందాలపై ప్రచారం నిర్వహించారు. ఈ ప్రాదేశిక ఎన్నికల్లోనూ ఇక్కడ గెలుపు పొందడం ద్వారా తన ప్రత్యర్థి రాథోడ్ రమేశ్ను గట్టిగా రాజకీయంగా దెబ్బతీయాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. ఇక నార్నూర్, గాదిగూడలో ఈ ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పరంగా విజయం సాధించడం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కుమురంభీం జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి కోవ లక్ష్మికి కీలకం కానుంది. -
అభివృద్ధికే ఓటు వేయండి
సాక్షి, ఆదిలాబాద్టౌన్: తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసే పల్లె, పట్టణం అనే తేడా లేకుండా పలువురు స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీ తీర్థం పు చ్చుకుంటున్నారని ఆపద్ధర్మ మంత్రి జోగురామ న్న అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్, శాంతినగర్ కాలనీల్లోని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు టీఆర్ఎస్లో జోగురామన్న సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా రామన్న వారికి పార్టీ కండువాల ను కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం చేసిన పథకాలను చూసే ప్రజలు తమ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఇందులో భా గంగానే ఈ కాలనీల్లోని మహిళలు, యువకులు సైతం పార్టీలో చేరినట్లు వివరించారు. కేసీఆర్తోనే బంగారు తెలంగాణ సాధ్యమని, మళ్లీ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. టీఆర్ఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలే మళ్లీ తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో లోక భూమారెడ్డి, అయ్యుబ్, యూసుఫ్, షేక్ అజీమ్, రాథోడ్ దత్తు, కార్తిక్, హేమంత్ పాల్గొన్నారు. -
అంబరాన్నంటిన దసరా సంబరాలు
ఆదిలాబాద్కల్చరల్: విజయదశమిని పురస్కరించుకుని గురువారం జిల్లాలో దసరా సంబరాలు అంబరాన్నంటాయి. శమి పూజ, రావణాసుర దహనం కార్యక్రమాల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. పలు చోట్ల అధికారులు, మరి కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులు రావణాసురుడి ప్రతిమకు నిప్పు అంటించారు. జిల్లా వ్యాప్తంగా వేడుకలను ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆనందోత్సాహాల మధ్య పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. అన్ని మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లో సైతం దసరా ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో ఎంతో ఘనంగా జరుపుకున్నారు. జమ్మిచెట్టుకు పూజ చేయడంతోపాటు పనిముట్లు, యంత్రాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకల్లో పాల్గొన్న ప్రజలు జమ్మి ఆకును బంగారంగా భావిస్తూ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. సంఘటితంతోనే విజయం ఎన్నో కులాలు, మతాలు ఉన్న మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా పేరొందిందని, సంఘటితంగా ఉండడం ద్వారా ప్రతి పనిలో విజయం సాధించవచ్చని ఆపద్ధర్మ మంత్రి జోగు రామన్న అన్నారు. సనాత హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన దసరా వేడుకల్లో ఆయన మాట్లాడారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ దసరా ఉత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. అంతకుముందు శ్రీగోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతితో కలిసి జమ్మిచెట్టుకు పూజలు నిర్వహించారు. అనంతరం జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రికి నిర్వాహకులు ఖడ్గాన్ని అందజేశారు. వేడుకల్లో భాగంగా కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన రావణుని బొమ్మను దహనం చేసి వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమంలో సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈర్ల సత్యనారాయణ, ప్రమోద్ఖత్రి, నాయకులు దుర్గం రాజేశ్వర్, అసోసియేట్ అధ్యక్షుడు డాక్టర్ ప్రఫూల్ వఝే సభ్యులు బండారి దేవన్న, కందుల గజేందర్, పడకంటి సూర్యకాంత్, మేకల అశోక్, సతీష్ మిత్తల్, జగదీశ్వర్, బాసెట్టి గజేందర్, అంజుకుమార్, గెడం మాధవ్, భవానీ సంతోష్, రేనికుంట రవీందర్, నర్సోజి, గాలే నర్సింగ్, లోలపు శ్రీనివాస్, కె.సంజీవ్, గజానన్, రాంకిషన్ తదితరులు పాల్గొన్నారు. చెడుపై విజయానికి ప్రతీక ఆదిలాబాద్రూరల్: చెడుపై మంచి విజయానికి ప్రతీకగా నిలిచే దసరా వేడుకలు జిల్లా ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ మైదానంలో నిర్వహించిన దసరా వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి, సన్మార్గంలో సాగితే తప్పకుండా విజయం కలుగుతుందని అన్నారు. హైదరాబాద్ తర్వాత అత్యంత వైభవంగా జరిగే వినాయక నవరాత్రి ఉత్సవాల్లో శాంతియుతంగా నిర్వహించిన, మట్టి విగ్రహాలను ప్రతిష్టాపించిన నిమజ్జన యాత్రలో విగ్రహాలను అందంగా అలంకిరించిన గణేష్ మండలి నిర్వాహకులకు ఆయన చేతుల మీదుగా నగదు పురస్కారాలను అందజేశారు. అంతకుముందు శమి, ఆయుధ పూజ నిర్వహించారు. అనంతరం వేలాదిగా తరలి వచ్చిన ప్రజలు హిందూ సమాజ్ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రావణ దహనాన్ని నిర్వహించారు. వేడుకలను తిలకించేందుకు ఆదిలాబాద్ పట్టణ ప్రజలతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా, ఆర్డీవో సూర్యనారాయణ, ఆశన్న, రాజేశ్వర్, కాసర్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
ఇన్నాళ్లకు గుర్తొచ్చామా సార్..?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పార్టీలోని వ్యతిరేకవర్గం పన్నాగమో... ప్రజల్లో నిక్షిప్తమైన ఆగ్రహమో తెలియదు గానీ... టీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత తప్పడం లేదు. పూజలు చేసేందుకు వెళ్లిన అభ్యర్థిని ఒక గ్రామంలో నిలదీస్తే... యోగక్షేమాలు అడిగిన అభ్యర్థికి ఓ వృద్ధురాలి నుంచి వ్యతిరేకత ఎదురైంది. తాజాగా సోమవారం ఖానాపూర్లో తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి రేఖానాయక్కు చేదు అనుభవం ఎదురైంది. జన్నారం మండలంలోని బాదంపల్లిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాఖానాయక్ను ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నాలుగున్నరేళ్లలో ఒక్కసారైనా రాని ఎమ్మెల్యే ఇప్పుడెందుకు వచ్చారంటూ గ్రామస్తులు నిలదీశారు. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా గ్రామానికి రావడంపై స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా గ్రామస్తులతో గొంతుకలపడం గమనార్హం. చివరికి పోలీసుల జోక్యంతో ఆందోళన సద్దుమణిగింది. చైతన్యమా... రాజకీయ ప్రోద్బలమా..? ముందస్తు ఎన్నికల్లో భాగంగా సెప్టెంబర్ 6న ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసినప్పటి నుంచే నియోజకవర్గాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో చెన్నూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు సీటివ్వలేదు. మిగతా చోట్ల సిట్టింగ్లకే అవకాశం కల్పించారు. దీంతో చెన్నూర్తో పాటు మిగతా స్థానాల్లో అభ్యర్థులకు వ్యతిరేకంగా టీఆర్ఎస్లోనే వ్యతిరేకత మొదలైంది. చెన్నూర్లో అభ్యర్థి బాల్క సుమన్ ప్రచారాన్ని ప్రారంభించిన ఇందారంలో గట్టయ్య అనే ఓదెలు అభిమాని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఖానాపూర్లో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ పార్టీని వీడారు. బోథ్లో ఎంపీ నగేష్ అంతర్గతంగా తనవంతు ప్రయత్నాలు ఇప్పటికీ చేస్తున్నారు. ముధోల్లో సిట్టింగ్ ఎమ్మేల్యేకు వ్యతిరేకంగా ఎస్.వేణుగోపాలచారి వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. బెల్లంపల్లిలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు కంటిలో నలుసుగా మారారు. ఈ పరిణామాల క్రమంలో పార్టీ మారడాలు, సద్దుమణగడం వంటివి జరిగినట్లు కనిపిస్తున్నా... పోరు ఆగలేదు. ఈ నేపథ్యంలోనే ప్రజలు తిరుగుబాటు చేసే దృశ్యాలు కనిపిస్తున్నాయని టీఆర్ఎస్ నేతలు కొట్టివేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, నేతల ప్రోద్బలంతోనే వ్యతిరేక సీన్లు కనిపిస్తున్నాయని అంటున్నారు. జైనథ్లో మంత్రి జోగు రామన్నకు తప్పని వ్యతిరేకత... ఇటీవల రాష్ట్ర మంత్రి జోగు రామన్నకు జైన£థ్ మండలంలో రెండుచోట్ల స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. సాంగ్వి, భోరజ్ గ్రామాల్లో మంత్రి ప్రచారానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... సాంగ్విలో మంత్రిని వ్యతిరేకించడం వెనుక రాజకీయ కారణాలే కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్లోనే కొనసాగిన ఓ వ్యక్తి తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న కారణంతో మంత్రి రామన్నకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఇటీవల బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్న ఆ వ్యక్తి ప్రోద్బలంతోనే సాంగ్విలో స్థానికులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే మండలంలోని భోరజ్లో మాత్రం ఒక దళిత బస్తీలో స్థానికులు మంత్రిని ప్రశ్నించడం గమనార్హం. మూడెకరాల ప్రభుత్వ భూమి, ఉపాధిహామీ ద్వారా నిర్మించే సీసీ రోడ్డు తమ బస్తీకి ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. భోరజ్లో ప్రజా చైతన్యం కొట్టొచ్చినట్లు కనిపించిది. బెల్లంపల్లి, బోథ్లలో... బెల్లంపల్లి మండలం పరిధిలోని చాకెపల్లి, బుదాగుర్ధు గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రచారం నిర్వహిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. తమ గ్రామాలను ఇన్నాళ్లు పట్టించుకోకుండా ఇప్పుడెందుకు వచ్చారంటూ నిలదీసే ప్రయత్నం చేశారు. బోథ్లో టీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపూరావు ప్రచారాన్ని తరచూ అడ్డుకోవడం జరుగుతోంది. ఇక్కడ గిరిజన తెగల్లోని రెండు వర్గాల మధ్య గత కొంతకాలంగా వైషమ్యాలు పెరగడం అనే అంశంతో పాటు రాజకీయ పరిణామాలు కూడా ఈ ఆందోళనల వెనుక ఉన్నట్లు సమాచారం. బోథ్లో టీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని మార్చి తనకు అవకాశం ఇవ్వాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ గత కొంతకాలంగా అధిష్టానాన్ని కోరుతున్నారు. అయినా కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాథోడ్ బాపూరావుకే సీటు ఇవ్వడం ఆయన వర్గీయులకు ఇబ్బందిగా మారింది. నియోజకవర్గంలోని పలు మండలాల్లో నగేష్ వర్గీయులే కీలక స్థానాల్లో ఉండడంతో బాపూరావుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. అయినా అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ వెళుతుండడం గమనార్హం. మిగతా పార్టీల అభ్యర్థులు ఖరారైతే... నెలరోజుల క్రితమే టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేయడంతో ప్రస్తుతం వారే ప్రచారంలో అధికారికంగా పాల్గొంటున్నారు. దీంతో కొన్ని గ్రామాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడం గమనిస్తున్నాం. త్వరలో కాంగ్రెస్ మహా కూటమి, బీజేపీ నుంచి ఖరారయ్యే అభ్యర్థుల విషయంలో ప్రజాక్షేత్రంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది ఆసక్తిగా మారింది. చెన్నూర్ మినహా టీఆర్ఎస్ అభ్యర్థులంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలే కావడంతో సహజంగడా ప్రజల్లో ఉండే అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకునే దిశగా నేతలు పావులు కదుపుతున్నారని సమాచారం. ప్రస్తుతం పార్టీలో టికెట్టు ఆశించి భంగపడ్డ వారి ప్రోద్బలంతోనే టీఆర్ఎస్ అభ్యర్థులను అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని నాయకులు ఆరోపిస్తున్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు, నాయకులు కూడా వీరినే ఫాలో అయితే పరిస్థితి ఏంటనేది టీఆర్ఎస్ అభ్యర్థులను కలవరానికి గురిచేస్తోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే: సీఎం జగన్
భార్యాభర్తలిద్దరూ స్టార్ క్రికెటర్లే.. అతడు కాస్ట్లీ.. ఆమె కెప్టెన్!(ఫొటోలు)
టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు.. తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
నాకు జాబ్ ఇవ్వండి.. నేనే రూ.40 వేలిస్తా!
రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement