-
జయలలిత చెప్పినవన్నీ అబద్ధాలే
తన పెంపుడు కొడుకు సుధాకరన్ పెళ్లి విషయంలో జయలలిత చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలేనని సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా జడ్జి ఈ వ్యాఖ్యలు చేశారు. జయలలిత అక్రమంగా భారీ మొత్తంలో డబ్బు సమకూర్చుకున్నారని, ఆమె పదవిలో ఉన్నప్పుడే ఇదంతా చేశారని న్యాయమూర్తి అన్నారు. దాదాపు 53 కోట్ల రూపాయల సంపద వెనకేసుకున్నా, ఆ సొమ్ము ఎలా వచ్చిందో మాత్రం వివరించలేకపోయారన్నారు. 1995లో చెన్నైలో జరిగిన సుధాకరన్ పెళ్లికి దాదాపు 40 వేల మంది అతిథులు వచ్చారు. వాళ్లందరికీ హోటళ్లలో బస ఏర్పాటుచేశారు. శుభలేఖల ప్రింటింగ్, కృతజ్ఞతా పూర్వక పత్రాలు, తాంబూలం, అతిథులకు విలువైన బహుమతులు.. వీటన్నింటికీ మూడు కోట్ల రూపాయలకు పైగా ఖర్చుపెట్టారని, అతి తక్కువ ఖరీదు వేసుకున్నా కూడా ఈ మొత్తం వస్తోందని జడ్జి జాన్ మైఖేల్ డికున్హా అన్నారు. వీఐపీలు బసచేసిన హోటల్ బిల్లులన్నింటినీ జయలలితే చెల్లించారని అనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే ఈ ఖర్చులను పెళ్లికూతురు కుటుంబం భరించినట్లు ఆమె చెప్పడం పూర్తిగా తప్పని, అవన్నీ అబద్ధాలేనని వ్యాఖ్యానించారు. -
ఆ పెళ్లికి జయ ఖర్చు.. 3 కోట్లు!
తన పెంపుడు కొడుకు వీఎన్ సుధాకరన్ పెళ్లికి అప్పట్లో జయలలిత పెట్టిన ఖర్చు దాదాపు మూడు కోట్ల రూపాయలని బెంగళూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చిచెప్పింది. ఇప్పుడంటే మూడు కోట్లు పెద్ద మొత్తం కాకపోవచ్చు గానీ... ఆ పెళ్లి జరిగింది 1995లో! అప్పట్లో జరిగిన పెళ్లిళ్లు అన్నింటిలోకీ చాలా విలాసవంతమైన పెళ్లిగా దాన్ని అందరూ చెప్పుకొన్నారు. వాస్తవానికి అప్పటికి, ఇప్పటికి డబ్బు విలువలో తేడా దాదాపు పది నుంచి ఇరవై రెట్ల వరకు ఉంది. అంటే.. అప్పటి పది రూపాయలు ఇప్పుడు 200 రూపాయలతో సమానం, లేదా అంతకంటే కూడా ఎక్కువే. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత అలాంటి సమయంలో మూడుకోట్లు వెచ్చించడం తీవ్ర వివాదానికి కారణమైంది. తాంబూలం దగ్గర నుంచి అతిథులకు ఇచ్చిన విలువైన బహుమతుల వరకు అన్నీ ఆనాటి ఖర్చును తెలియజేశాయని, మూడు కోట్ల లెక్క కూడా అన్నింటినీ పరిగణనలోకి తీసుకునే చేశారని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జాన్ మైఖేల్ డికున్హా తెలిపారు. ఈ కేసులో ఎ-1 నిందితురాలైన జయలలిత, ఎ-3 నిందితుడైన సుధాకరన్ పెళ్లి కోసం ఈ ఖర్చు చేశారని ఆయన అన్నారు. అయితే పె్లి కూతురి కుటుంబమే ఈ ఖర్చంతటినీ భరించిందని నిందితులు చెప్పడాన్ని ఆయన తిరస్కరించారు. ఈ పెళ్లికి చాలామంది వీఐపీలను పిలిచి, వాళ్లకు హోటళ్లలో బస ఏర్పాటుచేశారని, ఆ ఖర్చులన్నింటినీ జయలలితే భరించారని అన్నారు. పెళ్లిలో మండపం ఖర్చే దాదాపు రూ. 5.21 కోట్లు అయ్యిందని ప్రాసిక్యూషన్ వాదించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెస్ గ్రాండ్మాస్టర్ల కర్మాగారంలా మారిన భారత్.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
- పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్
Advertisement