-
వైఎస్సార్సీపీలో భారీగా కొనసాగుతున్న చేరికలు
తణుకు అర్బన్/నరసాపురం రూరల్/భీమవరం/పాలకొల్లు అర్బన్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ, జనసేన కార్యకర్తలు భారీగా వైఎస్సార్సీపీలో ఆదివారం చేరారు. అత్తిలి గోగులమ్మ పేటలో టీడీపీ, జనసేన పార్టీల మద్దతుదారులైన 30 కుటుంబాలు మంత్రి కారుమూరి సమక్షంలో పార్టీలో చేరాయి. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో జనసేన, టీడీపీల నుంచి భారీగా నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. భీమవరం 39వ వార్డుకు చెందిన జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. పాలకొల్లు మండలం చింతపర్రులో వైఎస్సార్సీపీ నేత పెన్మెత్స రామరాజు ఆధ్వర్యంలో నవ్యాంధ్ర దివ్యాంగుల సంక్షేమ సంఘం మండల శాఖ అధ్యక్షుడు దిద్దే సత్యనారాయణ, అతని అనుచరులు 100 మందికి పైగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. రాజమహేంద్రవరంలోని బర్మా కాలనీకి చెందిన టీడీపీ, జనసేన కార్యకర్తలు ఎంపీ మార్గాని భరత్ సమక్షంలో, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం హుకుంపేట వరలక్ష్మీ కాలనీకి చెందిన 500 మంది టీడీపీ కార్యకర్తలు మంత్రి చెల్లుబోయిన సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. -
టీడీపీ బీసీల వ్యతిరేక పార్టీ
చిత్తూరు రూరల్: టీడీపీ పేరుకు మాత్రమే బీసీల పార్టీ అని.. కానీ, నిజానికి అది బీసీల వ్యతిరేక పార్టీ అని ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ నేత రావూరి ఈశ్వరరావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబునాయుడుతో పాటు ఆ పార్టీని నమ్ముకుని తాను వీధిలో పడ్డానని కన్నీటిపర్యంతమయ్యారు. టీడీపీలోని ఓ నలుగురు నాయకులు తన కొంపముంచారని ఆరోపించారు. చిత్తూరు గురునగర్ కాలనీలోని తన నివాసంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని కావడంతో పార్టీలో తనను పూర్తిగా పక్కన పెట్టేశారన్నారు. అంతేకాక.. రూ.340 కోట్లు విలువచేసే తన ఫ్యాక్టరీని మూయించారన్నారు. ఇన్నాళ్లు పార్టీలో ఉన్నందుకు తన పరువు పూర్తిగా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. నిజానికి.. ప్రజాసేవ చేస్తూ 24 ఏళ్లు టీడీపీకి బానిసలా సేవచేశానని.. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా కూడా అనేక సంవత్సరాలు పనిచేశానని ఆయన చెప్పారు. పైగా.. 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన మనోహర్ విజయంలో కీలకపాత్ర పోషించానన్నారు. కానీ, పార్టీ కోసం ఇంతలా కృషిచేసిన తనకు టీడీపీ తీవ్ర ద్రోహం చేసిందని ఆరోపించారు. టీడీపీలోని ఆ నలుగురు నేతలు తనను దారుణంగా అవమానించారని.. వీరు చిత్తూరు జిల్లాలో బీసీ సామాజికవర్గ నేతలను అస్సలు ఎదగనివ్వడంలేదని ఆయన చెప్పారు. ప్రస్తుత టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న గురజాల జగన్మోహన్కు కూడా వారి నుంచి అవమానాలు ప్రారంభమయ్యాయన్నారు. ఇలాంటి నీచమైన పార్టీ నుంచి తాను వైదొలుగుతున్నానని.. టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా రావూరి ఈశ్వరరావును వైఎస్సార్సీపీ చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డి కలిశారు. రావూరికి పార్టీ కండువా వేసి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించి తన విజయానికి పాటుపడాలని అభ్యర్థించారు. సీఎం వైఎస్ జగన్ సింహంలాంటి వారని, ఆయన చేస్తున్న అభివృద్ధి తనకు బాగా నచ్చిందని రావూరి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జగన్తో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయానందరెడ్డి గెలుపునకు తాను శక్తివంచన లేకుండా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. -
వైఎస్సార్సీపీలో చేరిన ఏపీసీసీ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ గురునాథరావు
సాక్షి, అమరావతి: ఏపీసీసీ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ జెట్టి గురునాథరావు, జంగారెడ్డిగూడెం మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాస్ వైఎస్సార్సీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆరి్డనేటర్, ఎంపీ పీవీ విుథున్రెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద జెట్టి గురునాథరావు మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్ ఇతరులకు లాభం చేకూర్చే పార్టీలాగా మారిపోయిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం నేర్చుకున్నారని చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీ విధానాలు, ఆ పార్టీ నేతల వ్యవహారశైలి నచ్చక వైఎస్సార్సీపీలో చేరామని తెలిపారు. -
వైఎస్సార్సీపీలో చేరిన బీజేపీ ఆళ్లగడ్డ ఇన్చార్జి భూమా కిషోర్ రెడ్డి
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో బీజేపీ ఆళ్లగడ్డ ఇన్చార్జి భూమా కిషోర్రెడ్డితోపాటు భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్రెడ్డి, అంబటి మహేశ్వరరెడ్డి, పలువురు స్థానిక బీజేపీ నాయకులు, దాదాపు 500మంది అభిమానులు సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి (నాని), వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, కర్నూల్ విజయా డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద కిషోర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో బీజేపీ.. టీడీపీకి సీ టీమ్ పార్టీలా తయారైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి పథకాలు నచ్చి పార్టీలో చేరుతున్నా. ఆళ్లగడ్డ అభ్యర్థిగా గంగుల బిజేంద్రనాథ్రెడ్డిని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తాను. పెత్తందార్లను ఎదిరించి నిలబడ్డ నేతలుగా భూమా దంపతులు పేరు గడించారు. కానీ వారి కడుపున పుట్టిన అఖిల ప్రియ ఆళ్లగడ్డలో అరాచకశక్తిగా మారారు. అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్ ఆగడాలను అడుగడుగునా అడ్డుకుంటాం. భూమా బంధువర్గం అంతా అఖిలప్రియకు దూరంగా జరిగారు’ అని ఆయన చెప్పారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించటం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. -
వైఎస్ఆర్సీపీలో చేరిన 500మంది టీడీపీ కార్యకర్తలు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement