-
దీపిక vs జోష్నా
► ఆసియా స్క్వాష్ మహిళల టైటిల్ మనదే ► నేడు ఫైనల్లో అమీతుమీ చెన్నై: భారత స్క్వాష్ చరిత్రలో ఆదివారం కొత్త చరిత్ర లిఖించబడనుంది. ప్రతిష్టాత్మక ఆసియా వ్యక్తిగత స్క్వాష్ చాంపియన్షిప్ మహిళల వ్యక్తిగత విభాగంలో భారత్ నుంచి తొలి చాంపియన్ అవతరించనుంది. 31 ఏళ్ల ఈ మెగా ఈవెంట్ చరిత్రలో మొదటిసారి భారత్ నుంచి ఒకేసారి ఇద్దరు క్రీడాకారిణులు టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లో నాలుగో సీడ్ దీపిక పళ్లికల్ 11–9, 7–11, 11–7, 11–9తో టాప్ సీడ్ ఆనీ అవు (హాంకాంగ్)ను బోల్తా కొట్టించగా... రెండో సీడ్ జోష్నా చినప్ప 11–6, 11–4, 11–8తో ఆరో సీడ్ తోంగ్ వింగ్ (హాంకాంగ్)పై గెలిచింది. 1996లో భారత్ నుంచి మిషా గ్రెవాల్ మాత్రమే ఏకైకసారి ఫైనల్కు చేరుకొని రన్నరప్గా నిలిచింది. ఆ తర్వాత ఈ పోటీల్లో భారత్ నుంచి ఎవరూ ఫైనల్కు చేరుకోలేదు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో ఫైనల్కు చేరిన తొలి భారతీయ క్రీడాకారుడిగా సౌరవ్ ఘోషాల్ ఘనత వహించాడు. సెమీఫైనల్లో రెండో సీడ్ సౌరవ్ 11–6, 11–7, 11–3తో ఐదో సీడ్ లియో అవు (హాంకాంగ్)పై గెలుపొందాడు. ఆదివారం జరిగే ఫైనల్లో టాప్ సీడ్ మాక్స్ లీ (హాంకాంగ్)తో సౌరవ్ తలపడతాడు. రెండో సెమీఫైనల్లో మాక్స్ లీ 12–10, 11–6, 11–5తో నఫీజ్వాన్ అద్నాన్ (మలేసియా)ను ఓడించాడు. -
క్వార్టర్స్లో జోష్నా
ఎల్ గౌనా (ఈజిప్టు): భారత అగ్రశ్రేణి స్క్వాష్ క్రీడాకారిణి జోష్నా చినప్ప పీఎస్ఏ ప్రపంచ చాంపియన్షిప్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్స్లో జోష్నా 11–5, 7–11, 9–11, 11–8, 11–9తో తొమ్మిదో ర్యాంకర్ అలీసన్ వాటర్స్ (ఇంగ్లండ్)ను కంగుతినిపించింది. మరో భారత క్రీడాకారిణి దీపిక పల్లికల్ 9–11, 10–12, 6–11తో నికోల్ డేవిడ్ (మలేసియా) చేతిలో తొలి రౌండ్లోనే ఓడింది. టాప్–10లో సాక్షి, సందీప్ న్యూఢిల్లీ: యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ర్యాంకింగ్స్లో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్, సందీప్ తోమర్ టాప్–10లో చోటు సంపాదించారు. మహిళల 58 కేజీల విభాగంలో సాక్షి ఐదో స్థానాన్ని సంపాదించగా... పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో సందీప్ తోమర్ ఏడో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం వీరిద్దరూ న్యూఢిల్లీలో మేలో జరిగే ఆసియా చాంపియన్షిప్ పోటీలకు సిద్ధమవుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేదల అక్షరంపై కక్ష
పెద్దపల్లి జిల్లాకు ధాన్యం తరలింపు
కాంగ్రెస్లో కౌన్సిలర్ల చేరిక
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
‘మరోసారి ప్రధానిగా మోదీ’
ఎన్నికల విధులకు సింగరేణి ఉద్యోగులు
గ్రీన్బక్కెట్ పార్శిల్ హోటల్లో చోరీ
‘కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలి’
ధాన్యం కొనుగోళ్లు లేక రైతుల ఇబ్బందులు
నేతకాని కార్పొరేషన్ కాంగ్రెస్తోనే సాధ్యం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement