-
ఈ కంపెనీలో ఒక రోజు
వీధి రౌడీ నుంచి మాఫియా డాన్ వరకు దావూద్ ఇబ్రహీం నేర పరిణామ క్రమాన్ని దగ్గరి నుంచి చూసింది జర్నలిస్ట్ షీలాభట్. ఆమె దావూద్ను ఎన్నోసార్లు ఇంటర్వ్యూ చేసింది. 1970లో...‘చిత్రలేఖ’ మ్యాగజైన్లో మాఫియా డాన్ కరీమ్లాలాతో షీలాభట్ ఉన్న ఫోటోను చూసి ఆమెకు కాల్ చేశాడు దావూద్. అప్పుడు దావూద్ ‘జస్ట్ ఏ క్రిమినల్’ మాత్రమే. ‘మీరు నాకు ఒక సహాయం చేయాలి. ముంబైలోని గవర్నమెంట్ రిమాండ్ హోమ్లో ఉన్న అమ్మాయిలను కరీమ్లాలా మనుషులు వేధిస్తున్నారు. మీరు వాళ్ల దుర్మార్గాల గురించి పత్రికల్లో రాయాలి’ అని షీలాను అడిగాడు దావూద్. ‘దావూద్ అంటే భయం కంటే ప్రయాణ ఖర్చుల గురించి బాధే నాలో ఎక్కువగా ఉండేది’ అని దుబాయ్ ప్రయాణాన్ని గుర్తు చేసుకొని నవ్వుతూ చెప్పింది షీలా. ఒకసారి దావూద్ను ఇంటర్య్వూ చేయడం కోసం దుబాయ్కు వెళ్లింది. ‘లెట్స్ ఈట్’ అంటున్నాడే తప్ప ఇంటర్య్వూకు మాత్రం ‘నో’ అంటున్నాడు దావూద్. మూడురోజుల తరువాత మాత్రం ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఒక మర్డర్ గురించి మాట్లాడుతూ ‘వాడిని నేను చంపి ఉండకపోతే, వాడు నన్ను కచ్చితంగా చంపేవాడు. షీలాజీ... మీరే చెప్పండీ. నేను చేసింది ఏమైనా తప్పంటారా?’ అని అమాయకంగా ముఖం పెట్టాడు దావూద్! తాజాగా ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలాంటి విషయాలెన్నో చెప్పింది షీలాభట్. -
క్షణమొక యుగంలా..
పాలక్కడ్: దేవభూమిగా, ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లుగా పేరుపడ్డ కేరళలో ఇప్పుడంతా జల విలయమే. మలయాళ సీమ మరుభూమిని తలపిస్తోంది. చిరుజల్లులతో దేశ, విదేశీ పర్యాటకులకు ఎల్లప్పుడూ ఆహ్లాదాన్ని పంచే ఆ రాష్ట్రం కుంభవృష్టితో చిగురుటాకులా వణికిపోతుంది. ఎప్పుడూ ఏ వైపు వరద ప్రవాహం ముంచుకొస్తుందోనని జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సహాయక బృందాలు ఎప్పుడొస్తాయా? అని ఎదురుచూస్తూ క్షణమొక యుగంగా గడుపుతున్నారు. సాయం కోసం ఎదురుచూస్తున్న అక్కడి ప్రజల దుస్థితిని స్వయంగా చూడడమే కాకుండా.. వరద ఉగ్రరూపం నుంచి తృటిలో తప్పించుకున్న పీటీఐ జర్నలిస్టు మనోజ్ రామ్మోహన్ ప్రత్యక్ష అనుభవం ఇది. కేరళలోని వేలాది మంది ప్రజలు ఇలా ప్రాణాలు అరచేత పట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తుంటే.. మరికొందరు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టాలని ప్రార్థిస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఆ కష్టాలు ఆయన మాటల్లోనే.. క్షణాల్లో చుట్టుముట్టిన వరద ‘ఆగస్టు 9న మా తల్లిదండ్రులు నివసిస్తున్న పాలక్కడ్ పట్టణాన్ని ఒక్కసారిగా వరద చుట్టుముట్టింది. విషయం తెలియగానే నేను ఢిల్లీ నుంచి ఇంటికి ఫోన్ చేశారు. కింది అంతస్తు నీటితో నిండిపోయిందని, పై అంతస్తులో తలదాచుకున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లో సామాగ్రి, వంట సామాన్లు, బట్టలు కొట్టుకుపోయాయి. వంటగది మొత్తం చిందరవందరైంది. అన్ని గదుల్లో నీరే. అదృష్టవశాత్తూ మొదటి అంతస్తులో ఆహారపదార్థాలు ఉండడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. అప్పటికప్పుడు నేను ఢిల్లీ నుంచి బయల్దేరి ఎలాగోలా కొయంబత్తూరు చేరుకున్నా. అక్కడి నుంచి గంటసేపు ప్రయాణించి ఎలాగోలా పాలక్కడ్ చేరుకున్నా. ఆ రోజు ఆకాశం కొద్దిగా తెరిపినిచ్చింది. అయితే మళ్లీ ఆకాశానికి చిల్లుపడ్డట్లు భారీ వర్షం. దీంతో సమీపంలోని కాలువ ఉప్పొంగి అనేక ఇళ్లను ముంచెత్తింది. దీంతో మాలో ఆందోళన మొదలైంది. తరువాతి రోజు కూడా నింగినేలా ఏకమైనట్లు ఒకటే వాన. మా ఇంటి ముందు భాగం మొత్తం మునిగిపోయింది. కేవలం రెండు కొబ్బరి చెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. కరెంటు లేదు.. ఫోన్లు మూగబోయాయి. కేవలం చుట్టుపక్కల జనం ఇచ్చే సమాచారంపైనే ఆధారపడ్డాం. ఒకవైపు పాములు, విష పురుగుల భయం, మరోవైపు ఆగకుండా కురుస్తున్న వర్షం ఇక ఆలస్యం చేస్తే ప్రాణాలకు ముప్పు తప్పదని గ్రహించి నా స్నేహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పాను. మమ్మల్ని రక్షించేందుకు కొందరు యువకులు ముందుకొచ్చారు. వరద నీటిలో మా తల్లిదండ్రుల్ని ఆ యువకులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారిద్దరిని సురక్షిత ప్రాంతంలోని బంధువుల ఇంట్లో ఉంచి నేను ఢిల్లీ బయల్దేరాను. అయితే కొందరు స్థానికులు మాత్రం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడానికి ఇష్టపడలేదు. వరద తగ్గుముఖం పడుతుందని వారు ఎదురుచూస్తున్నారు. అయితే సమీపంలోని మలంపుజా డ్యాంలో నీటి ప్రవాహం పెరిగితే ముప్పు తప్పదని స్థానిక ప్రజలు ఆందోళనతో ఉన్నారు’ గర్భిణిని కాపాడారిలా.. ఇళ్ల పైకప్పులు, కొండ ప్రాంతాలు, ఇతర మారుమూల ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్, సైనిక బృందాలు కాపాడుతున్నాయి. పడవలు వెళ్లే వీలులేని ప్రాంతాల నుంచి ప్రజలను హెలికాప్లర్ల ద్వారా బయటికి తీసుకొస్తున్నారు. పురుటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు తాడు కట్టి నేవీ హెలికాప్టర్ ద్వారా ఇంటి నుంచి బయటికి లాగిన దృశ్యాలు టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. గాల్లో చాలాసేపు ప్రమాదకరంగా వేలాడటంతో ఆమె ఉమ్మనీటి సంచి పగిలింది. వెంటనే ఆ మహిళను నేవీ ఆసుపత్రికి తరలించగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఆలువాలో కోళ్లను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్న యువకులు -
మరోసారి వివాదంలోకి గేల్
బిగ్బాష్ లీగ్ సందర్భంగా ఆస్ట్రేలియాలో ఓ మహిళా జర్నలిస్ట్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన గేల్... తాజాగా మరోసారి వివాదం సృష్టించుకున్నాడు. ఇంగ్లండ్కు చెందిన ఓ మహిళా జర్నలిస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసభ్యంగా మాట్లాడాడు. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు... జర్నలిస్ట్తో ద్వంద్వార్థాలు వచ్చే మాటలు మాట్లాడాడు. ఐపీఎల్ సందర్భంగా బెంగళూరులోనే ఇది జరిగింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement