-
నేతలనే ముంచేశాడు!
⇔ ప్రభుత్వ అధికారినంటూ పథకాల పేర్లతో ఫోన్లు ⇔ రుణాలు ఇప్పిస్తామంటూ అందినకాడికి స్వాహా ⇔ టీడీపీ నేత రేవంత్రెడ్డి పీఏ ఫిర్యాదుతో కేసు నమోదు ⇔ పాత నేరస్తుడిని పట్టుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు హైదరాబాద్: ఐఏఎస్ అధికారిననో... ఆర్థిక శాఖలో ఉన్నతాధికారననో... కేంద్ర ప్రభుత్వ ఉన్నతోద్యోగిననో... ప్రజా ప్రతినిధులకు ఫోన్లు చేస్తాడు. వివిధ రకాలైన పథకాల పేర్లు చెప్పి వారిని బుట్టలో వేసుకుంటాడు. పథకం గడువు ముగుస్తుందని, ‘స్పందిస్తే’ నియోజక వర్గంలోని ప్రజలకు రుణాలు ఇప్పిస్తానని అంటాడు. ఖర్చుల కోసమంటూ అందినకా డికి నగదు తన బ్యాంకు ఖాతాలో వేయించు కుని ఆపై సైలెంటైపోతాడు. ఈ పంథాలో రెచ్చిపోతున్న తోట బాలాజీనాయుడు మరోసారి పోలీసులకు చిక్కాడు. ఈసారి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డినే టార్గెట్గా చేసుకుని రూ.90 వేలు గుంజా డు. ఆయన వ్యక్తిగత కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహల్స్ పోలీసులు నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పీడీ యాక్ట్ ప్రయోగించినా... తూర్పుగోదావరి జిల్లా చిర్లంకిపాడు గ్రామానికి చెందిన తోట బాలాజీనాయుడు అలియాస్ మనోహర్ (38) కొన్నాళ్లు రామగుండంలోని ఎన్టీపీసీలో పనిచేశాడు. అనేక ఆరోపణల నేపథ్యంలో 2008లో ఉద్యోగం కోల్పోయాడు. అప్పటి నుంచి ప్రజా ప్రతినిధులే టార్గెట్గా మోసాలు చేయడం ప్రారంభించాడు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఐఏఎస్ అధికారినంటూ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఫోన్లు చేయడం... ప్రభుత్వ పథకాల పేర్లు చెప్పి వాటి గడువు ముగుస్తోందని, స్పందిస్తే మీ నియోజక వర్గంలో ఉన్న ఓటర్లకు ఎక్కువ రుణాలు, సహాయం వచ్చేలా చూస్తానంటూ నమ్మించడం అతడి దైనందిన చర్య. దీనికి అంగీకరించిన వారి నుంచి ఖర్చుల కోసమంటూ రూ.25వేల నుంచి రూ.1.5 లక్షల వరకు వసూలు చేస్తాడు. ఆపై వారిని సంప్రదించిన సెల్ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి సైడైపోతాడు. ఈ రకంగా గతంలో టాస్క్ ఫోర్స్తో పాటు మల్కాజ్గిరి పోలీసులకు చిక్కాడు. గత ఏడాది ఓ ప్రజా ప్రతినిధిని ఇదే పంథాలో మోసం చేసిన కేసులో బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వరుసగా మోసాలకు పాల్పడుతున్నాడనే కారణంగా బాలాజీ నాయుడిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. దీంతో ఏడాది పాటు జైల్లో ఉన్న ఇతగాడు గత నెలలో విడుదలయ్యాడు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శినంటూ... అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వివిధ సామాజిక వర్గాల వారికి ప్రధాన మంత్రి కృషి యోజన పథకం కింద రుణాలు ఇప్పిస్తానని రేవంత్రెడ్డికి బాలాజీ ఫోన్ చేసినట్టు తెలిసింది. గొంతు మార్చిన బాలాజీ... తాను ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీనంటూ పరిచయం చేసుకున్నాడు. సదరు పథకంలో భాగంగా రూ.2 కోట్లు రుణం ఇప్పిస్తానని చెప్పాడు. దీనికి కొంత మొత్తం ఖర్చవుతుందని, ఆ మొత్తం తన బ్యాంకు ఖాతాలో వేయాల్సిందిగా తెలిపాడు. దీంతో బాలాజీ చెప్పిన బ్యాంకు ఖాతాలో రూ.90 వేలు డిపాజిట్ అయ్యాయి. అయితే సరదు పథకం గడువు ఎప్పుడో ముగిసిపోవడంతో ఆ విషయం తెలుసుకున్న రేవంత్రెడ్డి... తన వ్యక్తిగత కార్యదర్శి నగేష్ ద్వారా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయించారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు సోమవారం వలపన్ని బాలాజీనాయుడిని అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని.. రేవంత్రెడ్డి పీఏ ఇచ్చిన ఫిర్యాదు మినహా మరే ఫిర్యాదులూ ఇప్పటి వరకు అందలేదని జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటి వరకు మూడుసార్లు అరెస్టు అయిన బాలాజీ చేతిలో దాదాపు 30 మంది వరకు ప్రజాప్రతినిధులు మోసపోయి నట్లు తెలుస్తోంది. 2015లో రూ. 90 వేలు మోసపోయిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే కనకారెడ్డి ఇతడిపై ఫిర్యాదు చేశారు. అయితే అనేకమంది ఎంపీలు, ఎమ్మె ల్యేలు బాలాజీ నాయుడి చేతిలో మోస పోయినా... పరువు పోతుందనే ఉద్దే శంతో వారు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయట్లేదని తెలుస్తోంది. -
బెంజ్ యాజమాన్యానికి పోలీసుల లేఖ
సందేహాలు నివృత్తి చేయాలని విజ్ఞప్తి హైదరాబాద్: హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు మెర్సిడస్ బెంజ్ కార్ల కంపెనీ యాజమాన్యానికి 6 ప్రశ్నలతో కూడిన లేఖను పంపారు. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 36లో బుధవారం తెల్లవారుజామున మెర్సిడస్ బెంజ్ కారు అతివేగంగా వెళ్తూ మెట్రోపిల్లర్ను ఢీకొట్టిన ఘటనలో ఏపీ మంత్రి నారాయణ కొడుకు నిశిత్ నారాయణతో పాటు ఆయన స్నేహితుడు రాజా రవిచంద్ర మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన నడుపుతున్న మెర్సిడస్ బెంజ్ ఇంపోర్టెడ్ జి– 63 మోడల్ కారుకు సంబంధించి పోలీసులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మహారాష్ట్రలోని పుణెలో ఉన్న మెర్సిడస్ బెంజ్ ఇండియా ప్రధాన కార్యాలయానికి శుక్రవారం పోలీసులు ఈ లేఖను పంపారు. ప్రమాదంలో ఎయిర్బెలూన్లు ఏ పరిస్థితుల్లో తెరుచుకుంటాయి.. నిశిత్ మరణించిన సమయంలో ఎందుకు పగిలిపోయాయి.. అన్న సందేహాలను లేవనెత్తారు. మెకానికల్ డిఫెక్ట్స్ ఉన్నాయా..? అని ప్రశ్నించారు. స్పీడోమీటర్ ఎంతవరకు లాక్ చేయాలి.. ఎంత స్పీడ్ ఉంటే ఎయిర్బ్యాగ్లు తెరుచుకుంటాయో తెలపాల్సిందిగా కోరారు. సీటుబెల్టు పెట్టుకుంటే తెరుచుకుంటాయా...? పెట్టుకోకున్నా తెరుచుకుంటాయా..? అన్న విషయాలు తెలపాల్సిందిగా కోరారు.
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Ankita Basappa: ఒక్క మార్కూ వదల్లేదు!
వ్యవసాయం పండగ
అరాచకాల అసత్యమూర్తి
విద్యలో సరికొత్త విప్లవం
ఈ 5 ఏళ్ల లోనే ఇదంతా...
డబుల్ డిజిట్ పక్కా: అమిత్ షా
Lok Sabha Election 2024: త్రిముఖ ‘కురుక్షేత్రం’
15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
ప్రశాంత పోలింగ్కు పటిష్ట ఏర్పాట్లు
రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు
తప్పక చదవండి
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- సీమలో తు‘ఫ్యాన్’
- అరాచకాల అసత్యమూర్తి
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- Kishori Lal Sharma: నేను గెలిస్తే గాంధీలు గెలిచినట్లే
- ప్రజలకు రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలి
Advertisement