-
కామెంట్లపై కలకలం.. ‘అలాంటి అగత్యం దాపురించే ప్రమాదముంది’
సోమిరెడ్డి రాజమహేంద్రారెడ్డి అనాలోచిత, అవాంఛిత వ్యాఖ్యలతో దేశంలో చిచ్చు రేపిన నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు తాజాగా చేసిన మౌఖిక వ్యాఖ్యలు సోషల్ మీడియాను కుదిపేశాయి. వాటిపై హేతుబద్ధమైన విమర్శలతో పాటు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు సైతం ట్రెండ్ అయ్యాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లన్నింటినీ ఢిల్లీ కోర్టుకు బదలాయించాలని నుపుర్ వేసిన పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డివాలాలతోకూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించిన సందర్భంలో న్యాయమూర్తులు ఆమెపై కొన్ని మౌఖిక వ్యాఖ్యలు చేశారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, మరో 60 మంది రాజకీయ నాయకులు, అధికారులకు సిట్ ఇచ్చిన క్లీన్చిట్ను సుప్రీంకోర్టు సమర్థించడాన్ని వేనోళ్ల పొగిడిన బీజేపీ శ్రేణులు, తాజాగా నుపుర్ కేసులో న్యాయమూర్తులు చేసిన మౌఖిక వ్యాఖ్యలను మాత్రం తూర్పారబట్టాయి. సోషల్ మీడియా వేదికగా వాటిపై విమర్శల వర్షం కురిపించాయి. సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఈ విమర్శలు సహజంగానే సుప్రీం న్యాయమూర్తులకు ఇబ్బంది కలిగించాయి. ఆదివారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో జస్టిస్ జేబీ పార్డివాలా మాట్లాడుతూ, ‘‘న్యాయమూర్తులపై సోషల్ మీడియా వ్యక్తిగత దాడులు ఓ ప్రమాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. దీనివల్ల చట్టం ఏం చెబుతుందో పట్టించుకోకుండా మీడియా ఏం వ్యాఖ్యానించనుందోనని ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీర్పులు చెప్పాల్సిన అగత్యం దాపురించే ప్రమాదముంది’’ అని ఆవేదన వెలిబుచ్చారు. మరోవైపు కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు ఇంకో కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘‘కోర్టు తీర్పులపై, మౌఖిక వ్యాఖ్యలపై నేను వ్యాఖ్యానించడం సరికాదు. ఒకవేళ నాకు తీవ్ర అభ్యంతరాలున్నప్పటికీ సరైన వేదికపై సరైన సమయంలోనే చర్చిస్తాను’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. నిజానికి విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలు చాలావరకు తుది తీర్పులో చోటుచేసుకోవు. వ్యాఖ్యలు, పరిశీలనలు వేరు... తీర్పులు వేరు. నుపుర్ పిటిషన్ విషయంలోనూ నిజానికి జరిగిందదే. ఆమె తీరుపై కీలక వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తులు, పిటిషన్ను ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు. పిటిషన్ విచారణార్హమైనది కాదని చెబుతూ, ఢిల్లీ హైకోర్టు గడప తొక్కాల్సిందిగా సూచించారు. తీర్పు కాని తీర్పు...! నుపుర్ పిటిషన్ విషయాన్ని పక్కన పెడితే విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు, పరిశీలనలే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చక్కర్లు కొట్టాయి. పత్రికల్లోనూ పతాక శీర్షికలయ్యాయి. పిటిషన్ను తోసిపుచ్చడాన్ని ఎవరూ పట్టించుకోలేదు. సరికదా, న్యాయమూర్తుల మౌఖిక వ్యాఖ్యలనే పెద్ద ఎత్తున చర్చించారు. వాటిపై సోషల్ మీడియాలో ప్రశంసల కన్నా విమర్శలే ఎక్కువగా ట్రెండ్ అయ్యాయి. నుపుర్ కేసులో ఢిల్లీ పోలీసులు ప్రదర్శించిన ఉదాసీనత, ఆమెను కాపాడేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు కూడా విమర్శలకు దారి తీశాయి. బీజేపీ మద్దతుదార్లు మరో అడుగు ముందుకేసి నుపుర్ పిటిషన్పై తీర్పు ఇవ్వకుండానే సుప్రీంకోర్టు తన వ్యాఖ్యల ద్వారా ఆమెను దోషిగా బోనెక్కించిందనే వాదనను బలంగా విన్పించాయి. వ్యాఖ్యలొద్దన్న సుప్రీం తీర్పే శిరోధార్యం ఒకవేళ నుపుర్ శర్మ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తే విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోదా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఏ కోర్టయినా రికార్డుల్లో ఉన్న విషయాలనే చూస్తుంది. అంతే తప్ప మౌఖిక వ్యాఖ్యలను, పరిశీలనలను పరిగణనలోకి తీసుకోదు. ఇలాంటి మౌఖిక పరిశీలనలు లీగల్ పరిధిలోకి రావు కూడా. మరైతే న్యాయమూర్తులు ఇలాంటి మౌఖిక వ్యాఖ్యలు ఎందుకు చేస్తారనే అనుమానం రావచ్చు. ‘‘పిటిషన్ విచారణ సమయంలో తమ ముందుకొచ్చే అంశాల తీవ్రతను బట్టి న్యాయమూర్తులు అలాంటి అసంకల్పిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తీర్పు వెలువరించే సమయానికి కేసుపై పూర్తి అవగాహన ఏర్పరచుకుని తుది నిర్ణయానికి వస్తారు’’ అన్ని ఓ న్యాయ నిపుణుడి విశ్లేషణ. అయితే కోర్టుల మౌఖిక పరిశీలనలు, వ్యాఖ్యలు జనంలోకి వెళ్లి విపరీతమైన ప్రచారం పొందుతాయి. రాజకీయ నాయకులు సహజంగానే వాటినుంచి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తారు. కానీ అవి ఒకోసారి బెడిసికొడతాయి కూడా. ఉదాహరణకు 2007 గుజరాత్ ఎన్నికల్లో మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చేసిన ‘మౌత్ కా సౌదాగర్’ వ్యాఖ్య ఆమెకే తిప్పికొట్టింది. ఫలితంగా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతింది. అయితే, మోదీపై సుప్రీంకోర్టు ‘నయా నీరో’ వ్యాఖ్యలు చేసిన తర్వాతే సోనియా ఆ వ్యాఖ్య చేయగలిగారన్నది ఇక్కడ ఆసక్తికరమైన అంశం! అందుకే కోర్టు తన దృక్పథాన్ని తీర్పుల ద్వారా, లేదా లిఖితపూర్వక ఆదేశాల ద్వారా చెప్పాలే తప్ప మౌఖికంగా కాదన్నది నిపుణుల అభిప్రాయం. దీనిపై సుప్రీంకోర్టు కూడా గతేడాది స్పష్టతనిచ్చింది. ‘‘న్యాయమూర్తులు తమ అభిప్రాయాన్ని తీర్పులు, ఆదేశాల ద్వారానే కుండబద్దలు కొట్టినట్టు చెప్పాలి. అంతే తప్ప రికార్డుల్లోకెక్కని మౌఖిక వ్యాఖ్యలతో కాదు’’ అని సూటిగా చెప్పింది. నిజానికి ఇదే ఉత్తమం కూడా. కదా! ఇది కొత్తేమీ కాదు... లిఖితపూర్వక తీర్పులో లేని అంశాలను మౌఖికంగా వ్యాఖ్యానించి న్యాయమూర్తులు విమర్శలకు గురికావడం ఇదదేమీ కొత్త కాదు. రాజకీయ పార్టీలు ఆ వ్యాఖ్యలను తమకు తోచిన విధంగా మలచుకుని లబ్ధి పొందాలని చూడటమూ కొత్త కాదు. 2002 గుజరాత్ అల్లర్లపై సుప్రీంకోర్టు 2004లో చేసిన వ్యాఖ్యలను బీజేపీయేతర పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఇప్పటికీ వాడుకుంటూ ఉంటుంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని అప్పటి గుజరాత్ ప్రభుత్వాన్ని నయా నీరోగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. ఈ వ్యాఖ్యను మోదీ ప్రధాని అయిన తర్వాత కూడా ప్రతిపక్షాలు సమయం వచ్చినప్పుడల్లా తెరపైకి తెస్తున్నాయి. అయితే అల్లర్ల వెనక ప్రభుత్వ ఉదాసీనతను ఎండగట్టేలా ఆ వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు, అదే కేసులో మోదీకి సిట్ ఇచ్చిన క్లీన్చిట్ మాత్రం సరైందేనంటూ ఇటీవలే తీర్పు ఇవ్వడం తెలిసిందే! విచారణ సందర్భంలో చేసే వ్యాఖ్యలకు చివర్లో ఇచ్చే తీర్పుకు పొంతన ఉండదనే విషయం దీంతో మరోసారి స్పష్టమైంది. విచారణలో భాగంగా సందర్భానుసారం వ్యక్తపరిచే వ్యాఖ్యలను కేవలం వ్యాఖ్యలుగానే చూడాలి. అంతే తప్ప వాటినే తీర్పుగా భావించకూడదు. అవి తుది తీర్పును ప్రభావితం చేయవు కూడా. తీర్పు ఎప్పుడూ సాక్ష్యాలు, చట్టాలకు లోబడే ఉంటుంది. -
ఆ చట్టం ముస్లింలకూ వర్తిస్తుంది
అహ్మదాబాద్: గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. బాల్యవివాహ నిరోధక చట్టం అన్ని మతాలవారికీ వర్తిస్తుందని తేల్చి చెప్పింది. గుజరాత్కు చెందిన యూనుస్ షేక్ అనే ముస్లిం దాఖలు చేసిన పిటిషన్పై స్పందించిన హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. బాల్యవివాహ నిరోధక చట్టం ప్రత్యేక చట్టమని, కనుక ముస్లింలకు కూడా ఇది సమానంగా వర్తిస్తుందని తీర్పు వెలువరించింది. ముస్లిం, హిందూ లేదా ఇతర మతాల వ్యక్తిగత చట్టాల్లోని కొన్ని అంశాలను సైతం తోసిపుచ్చుతుందని జస్టిస్ జెబి పర్దివాలా స్పష్టం చేశారు. ఆయా పర్సనల్ లా లోని అంశాలకు అతీతంగా బాల్య వివాహ నిరోధక చట్టం పని చేస్తుందన్నారు. దీంతోపాటు మార్పులు, చేర్పులకు అనుమతించని ముస్లిం పర్సనల్ లా చట్టం వల్ల ముస్లింలకు తీరని నష్టం జరుగుతోందని వ్యాఖ్యానించారు. గుజరాత్లో యూనుస్ షేర్ అనే వ్యక్తి 16 ఏళ్ల బాలికను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. తాను ముస్లింననీ, ముస్లిం పర్సనల్ లా ప్రకారం బాల్య వివాహ నిరోధక చట్టం తనకు వర్తించదని వాదిస్తూ పిటిషన్ పెట్టుకున్నాడు. అయితే యూనుస్ వాదనలను హైకోర్టు తిరస్కరించింది. చట్టప్రకారం అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement