-
'జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ బోగస్ అని హైకోర్టే చెప్పింది'
హైదరాబాద్ : జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ బోగస్ అని హైకోర్టే చెప్పిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శనివారం ఉదయం ఆయన ఓ చానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ హైదరాబాద్పై ఆధారపడి బ్రతుకుతున్నామనే అపోహను సీమాంధ్ర ప్రజల్లో కల్పించవద్దని అన్నారు. కాంగ్రెస్ వైఖరి ప్రజల్లో ఆందోళన ఉందని... పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యేవరకూ అప్రమత్తంగా ఉండాలని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆనాడే చెప్పారన్నారు. తెలంగాణ ఏర్పాటు ఆలస్యం అయితే కాంగ్రెస్ని ఎవరూ నమ్మరన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఢిల్లీ ఎందుకు వెళ్లారో చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. విభజన ప్రకటన వెలువడిన తర్వాత పార్టీలు వైఖరి మార్చటం సరికాదన్నారు. -
'వైఎస్ ఒకే ఒక్కడిగా రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడారు'
కాకినాడ : శ్రీకృష్ణ కమిటీ సూచనలను పక్కన పెట్టి... రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు విభజించాలి అనుకుంటుందో చెప్పాలని షర్మిల ప్రశ్నించారు. సమైక్య శంఖారావంలో భాగంగా ఆమె శనివారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ప్రసంగించారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఎవరికి లాభం..? తెలుగజాతి ఒక్కటిగా ఉంటే ఎవరికి నష్టం.. ? వైఎస్ఆర్ లాంటి సీఎం ఆవిర్భవిస్తే తట్టుకోలేని బలహీనత ఎవరికి ఉంది..? అంటూ షర్మిల నిప్పులు చెరిగారు. మంచి పనుల ద్వారా ఓట్లు, సీట్లు సంపాదించుకునే సత్తా.. కాంగ్రెస్ పార్టీకి ఉండి ఉంటే..ఈ రోజు ఈ గతి పట్టి ఉండేది కాదన్నారు. చెడు చేసైనా వారి స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విభజించడానికి పూనుకుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి వైఎస్ఆర్ చేసిన సేవలను ఆమె గుర్తు చేశారు. వైఎస్ఆర్ బతికి ఉంటే రాష్ట్రానికి ఈ గతి పట్టి ఉండేది కాదని ప్రధానమంత్రి సహా కోట్ల మంది అభిప్రాయపడుతున్నారని షర్మిల తెలిపారు. ఒక్క వైఎస్ మాత్రమే విభజన అనే గొడ్డలికి అడ్డంగా నిలబడి ఒకే ఒక్కడిగా రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడారన్నారు. అసలు అన్యాయం ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి... రోశయ్య కమిటీ వేశారని, 2009లో టీఆర్ఎస్, టీడీపీ పొత్తు కుదుర్చుకున్నా నాలుగు పార్టీలు కలిసి..ఏకధాటిగా యుద్ధం చేసినా వైఎస్ఆర్ ఒకే ఒక్కడిగా నిలబడి ఒంటి చేత్తో పోరాటం చేసి ఆ ఎన్నికల్లో గెలిచారని షర్మిల గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది సంక్షేమం, అభివృద్ధి తప్ప ప్రత్యేక రాష్ట్రం కాదని వైఎస్ నిరూపించారని అన్నారు. వైఎస్ఆర్ లాంటి సత్తా ఉన్న సీఎం లేకపోబట్టే రాష్ట్రానికి ఈ గతి పట్టిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన చేయండి అంటూ..18 అక్టోబర్, 2008న కేంద్రానికి చంద్రబాబు రాసిన లేఖను చదివి షర్మిల వినిపించారు. చంద్రబాబు రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ..కేంద్ర ప్రభుత్వానికి పంపిన లేఖను సమైక్య వాదులకు చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎన్జీవోలకు జీతాలు ఇవ్వక పోయినా.. జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. వారికి జీతాలు ఇవ్వడమే కాకుండా...వారిని గౌరవిస్తూ....ఒక నెల బోనస్ కూడా ఇస్తుందని..జగనన్న తరపున మాట ఇస్తున్నట్లు.. షర్మిల ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీఎన్జీవోలను వేధించడంపై మండిపడ్డారు. -
సీఎంది అధికార దాహం: శ్రీకాంత్రెడ్డి
ముఖ్యమంత్రిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి ధ్వజం 2011లో అభివృద్ధి ప్యాకేజీ అడ్డుకున్నారు పదవీ వ్యామోహంతో రెండుసార్లు ప్రజలకు అన్యాయం చేశారు చంద్రబాబు కాంగ్రెస్తో కలిసి తెలుగుతల్లిని నిలువునా చీల్చడానికి ఒప్పుకున్నారు బాబు ‘విభజన’ లేఖ వెనక్కి తీసుకుని రాజీనామా చేస్తే... రాష్ట్రం సమైక్యంగా ఉండే అవకాశం ఉంది ఇప్పటికైనా కాంగ్రెస్తో చేసుకున్న ఒప్పందమేమిటో ఆయన బయటపెట్టాలి సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి పదవీ వ్యామోహంతో రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతోపాటు, ప్రాణత్యాగాలకు సీఎం కిరణ్కుమార్రెడ్డి ప్రధాన కారణమని విమర్శించారు. ముఖ్యమంత్రికి కొన్ని ప్రశ్నలు వేస్తూ వీటిపై రాష్ట్ర ప్రజలకు బహిరంగంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు అందజేసిన తర్వాత 2011లో కేంద్రం రాష్ట్ర ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఢిల్లీ పిలిచి, తెలంగాణతో పాటు మిగతా ప్రాంతాల్లోని కొన్ని వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్యాకేజీ విషయమై చర్చించిన మాట వాస్తవమా? కాదా? అప్పుడు మీ స్వార్థం కోసం, పదవిని ఎంజాయ్ చేసేందుకు ప్యాకేజీని అడ్డుకున్నది నిజం కాదా? రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కేంద్రం ప్రయత్నించినట్టుగా మీ పార్టీ నేతలే కొందరు చెబుతున్నారు... అయితే మీరు పదవీకాంక్షతో రెండుసార్లు ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా అన్యాయం చేసిన మాట నిజంకాదా? ఇవి అవాస్తవమైతే దేవుని మీద ప్రమాణం చేసి చెప్పాలి..’ అని శ్రీకాంత్రెడ్డి అన్నారు. ప్రజల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోని సీఎం ఢిల్లీ వెళ్లి అక్కడివారి కాళ్లు పట్టుకుంటారని.. బయటకొచ్చిన తర్వాత వారి అనుమతితో ప్రజలను మభ్యపెట్టే విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తాను సమైక్యవాదిన ని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్న కిరణ్.. సీడబ్ల్యూసీ, యూపీఏ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పదవికి రాజీనామా చేయాలని ఎంత డిమాండ్ చేసినా పట్టించుకోకుండా అధికారమే పరమావధిగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. నాలుగేళ్లుగా ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా పేద,మధ్య తరగతి ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీల డ్రామా వీధి నాటకాన్ని తలపిస్తోందని ఎద్దేవా చేశారు. ‘ఆంటోనీ కమిటీ వేశారని, రాష్ట్ర విభజనను అడ్డుకుంటున్నామని వారంటారు.. మరోవైపు హోంమంత్రి షిండే మాత్రం విభజన ప్రక్రియ ఆగలేదంటారు. దీనికి ఏం సమాధానం చెబుతారు ఆ ఎంపీలు? ఇలాంటి వ్యక్తులకు పదవుల్లో కొనసాగే అర్హత ఉందా? సీఎం కిరణ్, కాంగ్రెస్ ఎంపీలు వారి పదవుల కోసం డ్రామాలు ఆడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని అన్నారు. సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చేందుకే బాబు యాత్ర టీడీపీ అధినేత చంద్రబాబు తనపై ఉన్న కేసులు విచారణకు రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ నేతలతో లాలూచీ పడి తెలుగుతల్లిని నిట్టనిలువునా కోసేయడానికి ఒప్పుకున్న దుర్మార్గుడని శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వార్థం కోసం గోతికాడి నక్కలా మారి కాంగ్రెస్తో కలిసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని అన్నారు. ప్రజల కోసం పాటుపడతానంటూ బస్సుయాత్ర చేస్తున్న చంద్రబాబు తన వైఖరిని ఎందుకు స్పష్టం చేయడం లేదని నిలదీశారు. విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కుతీసుకుని ప్రజల కోరిక మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షనేతగా చంద్రబాబు రాజీనామా చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరిగి రాష్ట్రం సమైక్యంగా ఉండే అవకాశముందని శ్రీకాంత్ చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్తో చేసుకున్న ఒప్పందమేమిటో చంద్రబాబు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు బస్సుయాత్ర చేస్తున్నారని, అందులో భాగంగానే ముఖ్యమంత్రి కిర ణ్ కుమార్రెడ్డి తానూ యాత్ర తలపెడతానంటూ మీడియాకు లీకులిస్తున్నారని చెప్పారు. ప్రజల సెంటిమెంటును చీల్చడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు, కిరణ్లను చరిత్ర క్షమించదని, వారు చేస్తున్న డ్రామాలను సమైక్యాంధ్ర జేఏసీ నేతలు మున్ముందు నిలదీసే అవకాశం కచ్చితంగా ఉంటుందని శ్రీకాంత్ పేర్కొన్నారు. -
'సమైక్యం'తో బాబుకు భయం పట్టుకుంది: ఉమ్మారెడ్డి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలమంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏనాడు చెప్పలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆదివారం గుంటూరులో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే నష్టమని, సమైక్యంగా ఉంచాలని ఆయన గతంలో కేంద్రాన్ని కోరారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలనతో రాష్ట్రం అస్తవ్యస్తమైందన్నారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజనపై గతంలో కేంద్రం నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్కే దిక్కులేదు, ఇక ఆంటోని కమిటీ ఏం చేస్తుందని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న సమైక్య ఉద్యమాన్ని చూసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు భయం పట్టుకుందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement