-
సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
-
దుర్గమ్మ సన్నిధిలో న్యాయమూర్తులు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను శనివారం పలువురు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి, అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ వైస్ చైర్మన్ వై.రామకృష్ణ, రైల్వేకోర్టు న్యాయమూర్తి రామచంద్రరావు అమ్మను దర్శించుకున్న వారిలో ఉన్నారు. తొలుత వీరికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఏఈవో అచ్యుతరామయ్య అమ్మవారి చిత్రపటాలను, ప్రసాదాలు ఇచ్చారు. -
మాకొద్దీ.. జోగినివ్యవస్థ
హిమాయత్నగర్(హైదరాబాద్): ఏళ్ల తరబడి మమ్మల్ని జ్యోగినిలుగా గుర్తించడంతో అన్నీ కోల్పోతున్నామని తెలంగాణ రాష్ట్ర జ్యోగిని వ్యవస్థ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు ఆందోళన, ఆవేదన వ్యక్తంచేశారు. తెలిసీ తెలియని వయసులో తమకు దేవుళ్లతో పెళ్లిళ్లు చేయడంతో మా పిల్లలకు తండ్రి ఎవరో చెప్పుకోలేని దుస్థితి వచ్చిందని కన్నీటిపర్యంతమయ్యారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే వెయ్యిమంది జ్యోగినిలతో సచివాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. బుధవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ‘తెలంగాణ రాష్ట్ర జ్యోగిని వ్యవస్థ వ్యతిరేక పోరాట కమిటీ’ మహబూబ్నగర్ జిల్లాకు చెందిన హజమ్మ, నిర్మల, నర్సమ్మ, చెన్నమ్మ, ఈశ్వరమ్మ, నర్సమ్మ విలేకరులతో మాట్లాడారు. ఆరేళ్ల ప్రాయంలో గ్రామానికి, కుటుంబానికి మంచి జరుగుతుందనే నెపంతో దేవుళ్లతో తమకు పెళ్లిళ్లు చేశారన్నారు. ఆ తరువాత తమకు పిల్లలు పుట్టి వారు పెద్దవారై స్కూల్లో చేరే సమయంలో మీ తండ్రి ఎవరు, ఎవరికి పుట్టావు అని మా పిల్లలను అంటుంటే మేం ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు జ్యోగినీ వ్యవస్థ లేదని చెప్పే ప్రభుత్వం బతుకమ్మ, బోనాలకు జ్యోగినీలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని, వారిని జాతకం ఎందుకు చెప్పమంటున్నారని ప్రశ్నించారు. తామంతా దళితవర్గానికి చెందిన వారం కాబట్టే ప్రభుత్వం తమపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ‘మీరు దేవుడ్ని పెళ్లి చేసుకున్నారుగా... దేవుడు చచ్చిపోలేదుగా’ అంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. డిమాండ్లు నెరవేర్చాలి వీరికి మద్దతుగా రచయిత్రిలు జోగు శ్యామల, జూపాక సుభద్ర మాట్లాడుతూ ప్రతి జ్యోగినికి రూ.3వేలు పింఛన్ను ఇవ్వాలని, మూడు ఎకరాల భూమిని ఇవ్వాలని, ఉచితంగా స్థలంతో పాటు ఇల్లును కట్టించి ఇవ్వాలని, గ్రామాల్లో ఉన్న విలేజ్ సెక్రటరీ పోస్టులను 10వ తరగతి పాసైన జ్యోగినిల పిల్లలకు ఇవ్వాలని, రూ.1లక్ష నుంచి 5లక్షల వరకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని డిమాండ్చేశారు. ఎస్సీ కార్పొరేషన్లోని బడ్జెట్లో 10శాతం జ్యోగినీల అభివద్ధికి ఖర్చుచేయాలని, 1988జ్యోగిని నిర్మూలన చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, రఘునాథరావు కమిటీ రిపోర్టును అమలుచేయాలని కోరారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
రేపే అప్పన్న చందనోత్సవం
రాజకీయ పోరు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement