-
ప్రభుత్వ పథకాలను అమలు చేయండి
హొసూరు : ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు జరిపి జిల్లా సమగ్రాభివృద్ధికి సహకరించాలని క్రిష్ణగిరి ఎంపీ కే.అశోక్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ టి.పి.రాజేష్ అధ్యక్షతన జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం 2013-2014, 2014-2015 సంవత్సరాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, ఇంధిరాగాంధీ గృహ నిర్మాణ, జాతీయ జీవనాధార, ప్రధానమంత్రి గ్రామీణ రోడ్ల నిర్మాణ పథకాలు, నిర్మల్ భారత్ అభియాన్, వాటర్ షెడ్, సంయుక్త బీడుభూముల అభివృద్ధి తదితర పథకాల అమలుపై చర్చించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వర్షపు నీటి సేకరణ పథకాన్ని సమర్థవంతంగా అమలుచేయాలన్నారు. పాఠశాలలు, అంగన్వాడీల్లో మరుగుదొడ్ల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.11,100 ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఊతంగెరె ఎమ్మెల్యే మనోరంజితం నాగరాజు, జిల్లా రెవెన్యూ అధికారి బాలసుబ్రమణ్యం, పథక అధికారి మంత్రాచలం, హొసూరు మున్సిపల్ చైర్మన్ బాలక్రిష్ణారెడ్డి, క్రిష్ణగిరి మున్సిపల్ చైర్మన్ తంగముత్తు, హొసూరు యూనియన్ చైర్ పర్సన్ పుష్పాసర్వేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కళ్లు చెదిరే సెట్టింగ్లతో... ఆర్ట్ డైరెక్టర్
అప్కమింగ్ కెరీర్: ‘ఒక్కడు’ సినిమాలో చార్మినార్ను చూసి ఆశ్చర్యపోనివారు ఉండరు. పాతబస్తీలోని నిజమైన చార్మినార్ను తలపించేలా దాన్ని కృత్రిమంగా నిర్మించారు. ఆ క్రెడిటంతా ఆర్ట్ డెరైక్టర్కే దక్కుతుంది. అలాగే మగధీర, యమదొంగ వంటి సినిమాల్లోని సెట్టింగ్లు ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్లాయి, తమ సృజనాత్మకతతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న ఆర్ట్ డెరైక్టర్లకు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. చేతినిండా పని: సినిమాలు, టీవీ కార్యక్రమాలు, యాడ్ ఫిల్మ్ల చిత్రీకరణకు, రంగ స్థలంపై నాటకాలకు సందర్భానికి తగిన సెట్టింగ్లు వేయడం తప్పనిసరి. వీటివల్లే దృశ్యానికి నిండుతనం వస్తుంది. వీక్షకులను మెప్పిస్తుం ది. సినిమాల చిత్రీకరణతోపాటు టీవీ ఛానళ్ల సంఖ్య పెరగడంతో ఆర్ట్ డెరైక్టర్లకు చేతినిండా పని దొరుకుతోంది. స్డూడియోల్లో వీరికి అవకాశాలు లభిస్తున్నాయి. నైపుణ్యాలు పెంచుకోవాలి: ఆర్ట్ డెరైక్టర్గా వృత్తిలో పైకి ఎదగాలంటే ప్రధానంగా శ్రమకు వెనుకాడని లక్షణం ఉండాలి. విసృ్తతంగా చదివే అలవాటుతో ఊహాశక్తి, సృజనాత్మకత పెరుగుతాయి. పరిశీలనా శక్తి అవసరం. ఎప్పటికప్పుడు టైమ్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్, ప్లానింగ్, నెట్వర్కింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. ఈ రంగంలో ప్రారంభంలో తక్కువ వేతనాలు ఉన్నప్పటికీ మంచి పనితీరుతో గుర్తింపును తెచ్చుకుంటే అవకాశాలు, ఆదాయం పెరుగుతాయి. ఆర్ట్ డెరైక్షన్ కోర్సు పూర్తిచేసిన తర్వాత మొదట సీనియర్ డెరైక్టర్ వద్ద సహాయకుడిగా పనిచేసి వృత్తిలో అనుభవం సంపాదించాలి. తర్వాత సొంతంగా ప్రాజెక్ట్లు చేపట్టవచ్చు. అర్హతలు: ఫైన్ ఆర్ట్స్లో భాగంగా ఆర్ట్ డెరైక్షన్ కోర్సులు ఉన్నాయి. ఇంటర్మీయెట్ పూర్తయిన తర్వాత ఫైన్ ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీ చేయొచ్చు. ఇంటీరియర్ డిజైన్, ఆర్కిటెక్చర్ విభాగాల్లోనూ నైపుణ్యం, తగిన అనుభవం సంపాదించినవారు ఆర్ట్ డెరైక్షన్లోకి ప్రవేశించొచ్చు. వేతనాలు: అసిస్టెంట్ ఆర్ట్ డెరైక్టర్కు ప్రారంభంలో నెలకు రూ.7 వేల వేతనం ఉంటుంది. తర్వాత హోదాను బట్టి పెరుగుతుంది. కనీసం మూడేళ్లపాటు పనిచేసి, నైపుణ్యాలు పెంచుకుంటే నెలకు రూ.30 వేలకు పైగానే సంపాదించుకోవచ్చు. సొంత ప్రాజెక్టులతో రూ.లక్షల్లో ఆర్జించవచ్చు. ఆర్ట్ డెరైక్షన్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా-పుణె వెబ్సైట్: www.ftiindia.com ఆసియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టీవీ వెబ్సైట్: www.aaft.com బనారస్ హిందూ యూనివర్సిటీ; వెబ్సైట్: www.bhu.ac.in మహారాజా శాయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా వెబ్సైట్: www.msubaroda.ac.in సృజనాత్మకత ఉండాలి! శ్రీసినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలతోపాటు అడ్వర్టైజ్మెంట్ చిత్రీకరణకు సెట్స్ నిర్మాణం తప్పనిసరి అవుతోంది. ఈ నేప థ్యంలో చిత్ర రంగంలో ఆర్ట్ డెరైక్టర్స్కు మంచి అవకాశా లున్నాయి. ఒక్కో సెట్కు దీర్ఘకాలం పాటు కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఓర్పు, సహనం, కష్టపడే తత్వం ఉండాలి. ఉదాహరణకు ‘ఒక్కడు’ సినిమా సెట్ వేయడానికి 300 మంది మూడు నెలలు కష్టపడాల్సి వచ్చింది. దానికి ప్రతిఫలంగానే సెట్కు మంచి గుర్తింపు లభించింది. ఈ రంగంలో డిమాండ్ను బట్టి వేతనాలు/పారితోషకాలు లభిస్తాయి. పరిశ్రమలో రూ. 30 వేలు తీసుకునేవారితోపాటు రూ. 40లక్షలు పారితోషకం పొందేవారూ ఉన్నారు.్ణ - కె. అశోక్ కుమార్, ప్రముఖ సినీ ఆర్ట్ డెరైక్టర్ .
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement