-
అర్ధరాత్రి కలకలం
►మంత్రి కార్యాలయంపై పెట్రో బాంబులతో దాడి ► అన్నాడీఎంకే కార్యాలయంపైనా నాటు బాంబులు ► మంత్రి సెల్లూరు కె. రాజు టార్గెట్గా దాడి? సాక్షి, చెన్నై : మదురైలో అర్ధరాత్రి కలకలం రేగింది. మంత్రి సెల్లూరు కె. రాజును టార్గెట్ చేస్తూ, ఆయన కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు నా టు, పెట్రోల్ బాంబులతో దాడికి దిగా రు. అన్నాడీఎంకే కార్యాలయంపై కూ డా పెట్రోల్ బాంబులు విసిరారు. ఈ ఘటనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫలితంగా కార్యాలయాలకు , చెన్నైలో ని సెల్లూరు కె. రాజు ఇంటికి భద్రతను పెంచారు. మదురైలో ఇటీవల కాలంగా అధికార అన్నాడీఎంకే వర్గాల మధ్య గ్రూ పు తగాదాలు రాజుకుంటూ వస్తున్నాయి. చాపకింద నీరులా కొందరు మంత్రి సెల్లూరు రాజుకు వ్యతిరేకంగా వ్యవహరించడం మొదలెట్టారు. అయి తే, సీఎం జయలలిత వద్ద మంత్రికి మంచి గుర్తింపు ఉండటంతో వ్యతిరేక శక్తులు కుదేల్ కాక తప్పలేదు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం నేతృత్వంలో ఓ కార్యక్రమానికి మదురైలో ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ విషయంగా సెమ్మం పట్టిలోని తన కార్యాలయంలో పార్టీ వర్గాలతో పన్నెం డు గంటల వరకు మంత్రి సెల్లూరు రాజు సమాలోచనలో నిమగ్నం అయ్యా రు. తదుపరి అక్కడి నుంచి వెళ్లి పోయా రు. ఆయన అటు వెళ్లిన కాసేపటికే మోటారు సైకిళ్లపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు నాటు బాంబుల్ని విసిరారు. వరుసగా బాంబుల దాడి జరగడం, పెద్ద శబ్దం రావడంతో ఆ పరిసర వాసులు అటు వైపుగా పరుగులు తీశా రు. దీంతో అక్కడి నుంచి ఆ వ్యక్తులు ఉడాయించారు. అదే సమయంలో మ దురై పనగల్ సాలైలో ఉన్న అన్నాడీఎం కే కార్యాలయంపై పెట్రోల్ బాంబు దా డి జరగడంతో కలకలం బయలుదేరిం ది. సమాచారం అందుకున్న కమిషనర్ శైలేష్కుమార్ నేతృత్వంలో అధికార వ ర్గాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ పెట్రోల్ బాంబు దా డిలో మంత్రి కార్యాలయం తలుపులు ధ్వంసం అయ్యాయి. అన్నాడీఎంకే కా ర్యాలయంలో విద్యుత్ లైట్లు దెబ్బతిన్నాయి. అక్కడ పేలకుండా పడి ఉన్న కొన్ని నాటు, పెట్రోబాంబుల్ని పోలీసు లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘట నల్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు యంత్రాంగం, దీనివెనుక ఉన్నవారి భ రతం పట్టేందుకు ఐదు బృందాల్ని రం గంలోకి దించారు. తిరుమల నాయకర్ జయంతి అధికారిక ప్రకటన ప్రయత్నా ల సమయంలో తీవ్రంగా వ్యతిరేకించిన తమిళ సంఘం ఈ దాడి చేసి ఉండొచ్చ న్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. అదే సమయంలో అన్నాడీఎంకే లో సాగుతున్న గ్రూపు విభేదాలను కూ డా పోలీసులు పరిగణలోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు. తన కా ర్యాలయం, పార్టీ కార్యాలయంపై దాడి సమాచారంతో ఉదయాన్నే అక్కడికి చేరుకుని మంత్రి సెల్లూరు రాజు పరిశీ లించారు. అయితే, మంత్రిని టార్గెట్ చేసి దాడికి వ్యూహ రచన జరిగి ఉండొచ్చని, ఆయన అక్కడి నుంచి వెళ్లి పోవ డం వల్ల పెను ప్రమాదం చోటు చేసుకోలేదని పలువురు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఘటన తో మదురైలోని సెల్లూరు రాజు ఇళ్లు, కార్యాల యాలకు, చెన్నై గ్రీన్ వేస్ రోడ్డులోని ఇంటివద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసుల అదుపులో అనుమానితులు ఈ దాడికి సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిలో అన్నాడీఎంకే కౌన్సిలర్ మురుగేషన్ సైతం ఉండడంతో దర్యాప్తును ముమ్మరంచేసి ఉన్నారు. గతవారం మదుర మీనాక్షి అమ్మవారి ఆలయ పరిసరాల్లో పెట్రో బాంబులు లభించిన ఘటన మరువక ముందే, ప్రస్తుతం మళ్లీ రాష్ర్ట మంత్రిని టార్గెట్ చేసి దాడులు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. -
సబ్సిడీ కట్
కొత్తగూడెం : ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక ద్వారా విడుదలయ్యే నిధులతో ఆయా వర్గాల వారికే లబ్ధి చేకూరేలా ప్రవేశపెట్టిన పథకాలు అర్హులకు అందడం లేదు. 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకునే ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఈ నిధుల నుంచే బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే వీటి విడుదలలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఏడాది క్రితం నుంచి పెండింగ్లో ఉన్న విద్యుత్ బిల్లులు చెల్లించాలంటూ ట్రాన్స్కో అధికారులు చెపుతుండడంతో పేద గిరిజన, దళిత వర్గాల వారు లబోదిబోమంటున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో దళితులు, గిరిజనులకు చెందిన బకాయిలను రద్దు చేయడంతోపాటు 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకునే వారికి బిల్లు మాఫీ అయ్యేలా గత ప్రభుత్వం తీర్మానించింది. ఇందుకు సంబంధించి జిల్లాలో 2013 మార్చి వరకు 22,327 మంది ఎస్సీలకు చెందిన రూ.4.51 కోట్లు, 48,054 మంది గిరిజనులకు చెందిన రూ.6.02 కోట్ల బకాయిలు రద్దు చేయాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీల బకాయిలను ఎస్సీ కార్పొరేషన్, గిరిజనుల బకాయిలను ఐటీడీఏ నుంచి ట్రాన్స్కోకు చెల్లించాల్సి ఉంది. అయితే అప్పటి నుంచి నిధులు విడుదల చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. బకాయిలు పెరగడంతో ఇప్పుడు వాటిని లబ్ధిదారుల నుంచి వసూలు చేసేందుకు ట్రాన్స్కో అధికారులు రంగం సిద్ధం చేశారు. పైసా విదల్చని ఐటీడీఏ.. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధుల ద్వారా ఎస్టీలకు సంబంధించిన రూ.6.02 కోట్ల బకాయిలను జిల్లాలోని గిరిజన సమీకృతాబివృద్ధి సంస్థ (ఐటీడీఏ) భద్రాచలం వారు విడుదల చేయాల్సి ఉంది. అయితే ఏడాది కాలంగా ట్రాన్స్కోకు ఈ నిధులు చెల్లించడంలో జాప్యం చేయడంతో ఇప్పుడు రద్దయిన బకాయిలు తిరిగి వినియోగదారులు చెల్లించాల్సి వస్తోంది. ట్రాన్స్కో అధికారులు అడిగినప్పుడు నిధులు ఇస్తామని చెపుతున్న ఐటీడీఏ అధికారులు.. ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఇక ఎస్సీలకు సంబంధించిన రూ.4.51 కోట్ల బకాయిలో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు రూ.2.25 కోట్లు చెల్లించారు. మిగిలిన రూ. 2.26 కోట్లు విడుదల చేయలేదు. దీంతో ఈ మొత్తాన్ని కూడా వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు ట్రాన్స్కో సిద్ధమైంది. ఆందోళనలో గిరిజనులు, దళితులు.. ఏడాది క్రితం రద్దు చేసిన బకాయిలను జూన్ నెల బిల్లులో కలిపి ఇవ్వడం, తప్పనిసరిగా అవి చెల్లించాల్సిందేనని విద్యుత్ శాఖ సిబ్బంది చెప్పడంతో జిల్లాలోని సుమారు 70 వేల మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ట్రాన్స్కో ఎస్ఈ తిరుమలరావును వివరణ కోరగా సంబంధిత శాఖలు బకాయి సొమ్ము చెల్లించకపోవడంతో లబ్ధిదారుల నుంచి వసూలు చేసేందుకు ఈ నెల బిల్లులో వాటిని చేర్చామని తెలిపారు. అయితే వాటిని చెల్లించాలని తమ సిబ్బంది ఎవరినీ బలవంత పెట్టడం లేదని చెప్పడం గమనార్హం. ఒకేసారి బిల్లు వస్తే చెల్లించేదెలా నేను నెలకు 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్నాను. ఏడాది నుంచి ఇప్పటి వరకు బిల్లు మాత్రం రాలేదు. ఈ నెలలో కరెంట్ వాళ్లు వచ్చి బిల్లు ఇచ్చారు. అందులో ఈ నెలకు చెందిన రూ.167తో పాటు బకాయికి సంబంధించి రూ.692 కలిపి ఇచ్చారు. మాఫీ అయిపోయాయని అనుకున్న బిల్లులు ఇప్పుడు చెల్లించమంటే ఎలా.. దీనిపై అధికారులు మరోసారి ఆలోచించి రద్దైన బకాయిలను వదిలివేయాలి.
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
T20 World Cup 2024: ఉత్కంఠ పోరులో పాక్ను చిత్తు చేసిన భారత్
నైపుణ్యాన్ని వెలికితీస్తున్న చెస్ పోటీలు
ముగిసిన చెస్ పోటీలు
అన్నప్రాశన రోజే తిరిగిరాని లోకాలకు
పేరుపాలెం బీచ్లో సందడి
పచ్చిరొట్టగా జీలుగ సాగు
భయపెడుతున్న ప్లాస్టిక్ భూతం
క్రికెట్ జట్టు ఎంపిక
ఉరేసుకొని బాలిక ఆత్మహత్య
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల విడుదల
Advertisement