-
ఫ్యాన్ గుర్తుకు ఓటేయండన్నా..
సాక్షి, కడప కార్పొరేషన్: ఫ్యాన్ గుర్తుకు ఓటేయండన్నా...ఒక్క సారి వైఎస్ జగన్కు అవకాశం ఇద్దాం అన్నా.. అంటూ కడప ఎమ్మెల్యే ఎస్బీ అంజద్బాషా ప్రచారం నిర్వహించారు. ఆదివారం ‘రావాలి జగన్, కావాలి జగన్’ కార్యక్రమంలో భాగంగా 32వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికీ తిరిగి ఎమ్మెల్యేకు, ఎంపికీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని అభ్యర్థించారు. అనంతరం అంజద్బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు మోసగించబడ్డారని గుర్తు చేశారు. జగన్ సీఎం అయితే పింఛన్లు రూ.3వేలకు పెంచుతారని, ఆటో డ్రైవర్లకు, బార్బర్ షాపు ఉన్న నాయీ బ్రాహ్మణులకు ఏడాదికి రూ.10వేలు ఉచితంగా ఇస్తారన్నారు. వీధి వ్యాపారస్తులకు ప్రతి ఏటా పావలా వడ్డీకే రూ.10వేలు రుణం ఇవ్వడం జరగుతుందన్నారు. చిన్నపిల్లలను బడికి పంపితే ప్రతి తల్లి ఖాతాలో రూ.15వేలు జమ చేస్తారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.75వేలు ఆయా కార్పొరేషన్ల ద్వారా మంజూరు చేస్తారన్నారు. మన జిల్లావాసి, మన సమస్యలన్నీ తెలిసిన వ్యక్తి సీఎం అయితే మన జిల్లాకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని వివరించారు. వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, 32వ డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ అన్సర్ అలీ, నాయకులు రెడ్డి ప్రసాద్, దాసరి శివప్రసాద్, మున్నా, షఫీ, గౌస్, మురళీ, గోపాలక్రిష్ణ, టీపీ వెంకటసుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. -
కడపలో భారీగా ఓట్లు గల్లంతు!
కడప కార్పొరేషన్: కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా లక్షా పన్నెండు వేల ఓట్లు గల్లంతయ్యాయి. ఇందులో ముస్లిం మైనార్టీల ఓట్లు 35వేల వరకూ ఉన్నాయి. నగరంలో అస్తవ్యస్తంగా డోర్ నంబర్లు కేటాయించడం వల్లే ఓట్లు తీసేశారని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. 2014 ఎన్నికల నాటికి కడప నియోజకవర్గంలో పురుషుల ఓట్లు 1,27,143, మహిళల ఓట్లు 1,28,050 కలిపి మొత్తం 2,53,193 ఓట్లు ఉండేవి. ప్రస్తుతం తొలగించిన ఓట్లతో ఆ సంఖ్య 1.41లక్షలకు పడిపోయింది. సాధారణంగా కొత్త డోర్ నంబర్లు వేయాలంటే కలెక్టర్ గెజిట్ తీసుకొని చేయాలి. కానీ ఎన్నికల కమిషన్ ఆదేశించిందని చెప్పి రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు ఆగమేఘాలపై రూ.45లక్షల వ్యయంతో ఒక ప్రైవేటు సంస్థకు ఈ బాధ్యత అప్పగించారు. ఆ సంస్థ నగరాన్ని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనే నాలుగు జోన్లుగా విభజించి ఈ డోర్ నంబర్లు కేటాయించింది. ఈక్రమంలో కొన్ని ఇళ్లకు నంబర్లు వేయకపోగా, రెండు, మూడు అంతస్తులు ఉన్న ఇంటికి గ్రౌండ్ఫ్లోర్కు మాత్రమే ఒకే డోర్ నంబర్ ఇచ్చారు. దీంతో పైరెండు అంతస్తుల్లో ఉన్నవారి ఓట్లు గల్లంతయ్యాయి. ఇలా వందల సంఖ్యలో ఇళ్లకు కొత్త డోర్ నంబర్లు కేటాయించలేదు. విచారణ చేపట్టకుండానే తొలగింపు నగరశివార్లలోని తులసీప్రాజెక్టు వెంచర్లో 100 కుటుంబాలు నివసిస్తుంటే ఒక్క ఇంటికి కూడా కొత్త డోర్ నంబర్లు వేయలేదు. కడప నగరంలో మొత్తం 84వేల నివాసగృహాలు ఉన్నాయి. అనధికారికంగా మరో ఐదువేలు ఉండే అవకాశం ఉంది. ఇంటికి ఇద్దరు ఓటర్లు అని లెక్కవేసుకున్నా 1.80లక్షల ఓట్లు ఉండాలి. కానీ ఎలాంటి విచారణ చేపట్టకుండానే గత తహసీల్దార్ ఈ ఓట్లను తొలగించినట్లు తెలుస్తోంది. మరో ఏడాదిన్నర వరకూ ఎన్నికలు లేనందున ఎవరి ఓట్లు ఉన్నాయో, ఎవరి ఓట్లు గల్లంతయ్యాయో ప్రజలకు తెలియడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికలేవీ లేవు కాబట్టి ప్రస్తుతం వారికి దానిపై అంత ఆసక్తి లేదు. కొత్తగా వేసిన డోర్ నంబర్లనే ఓటు కార్డుల్లో పొందుపరిచడం వల్ల కొత్త నంబర్లు వేయని ఇళ్లలో ఉన్నవారి ఓట్లన్నీ తొలగించినట్లే. చెల్లాచెదురైన ఓట్లు కొత్త డోర్ నంబర్ల వల్ల ఓట్లన్నీ చెల్లాచెదురయ్యాయి. గతంలో ఒక డివిజన్లోని ప్రజలు మూడు లేదా నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేసేవారు. ప్రస్తుత డోర్ నంబరింగ్ విధానం వల్ల ఆయా ఓట్లన్నీ 20 నుంచి 30 పోలింగ్ స్టేషన్లకు మారిపోయాయి. ఉదాహరణకు మాజీ కార్పొరేటర్ భాగ్యమ్మ చెమ్ముమియ్యాపేటలో నివసిస్తుండగా, ఆమె ఓటు అగాడి పోలింగ్ స్టేషన్లో ఉంది. అలాగే ప్రస్తుత కార్పొరేటర్ ఎస్ఏ షంషీర్ నకాస్లో నివసిస్తుండగా ఆయన ఓటు బెల్లంమండీ పోలింగ్స్టేషన్లో ఉంది. అంతేగాక 11మంది కార్పొరేటర్ల ఓట్లు మాయం అయ్యాయి. 47వ డివిజన్ కొత్త డోర్ నంబర్లతో ఓట్లన్నీ చెల్లాచెదరయ్యాయి. ఒక డివిజన్ ప్రజలు గతంలో కేవలం మూడు బూతుల్లో ఓట్లు వేసేవారు. మారిన విధానం ప్రకారం 26 బూతులకు ఆ ఓట్లను చెల్లాచెదరు చేశారు. అదే డివిజన్కు సంబంధించి 16వ నంబర్ పోలింగ్ బూత్ మరియాపురం జూనియర్ కాలేజీలో ఉండగా, దాన్ని 11గా మార్చి వికాస్ ఇంగ్లిషు మీడియం స్కూల్లో వేశారు. అంటే అక్కాయపల్లెలోని ప్రజలంతా చెమ్ముమియ్యాపేటకు పోయి ఓట్లు వేయాలన్నమాట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చెల్లాచెదరైన ఓట్లు, పోలింగ్బూతుల వల్ల 15శాతం ఓటింగ్ కూడా జరగడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈనెలలో మళ్లీ మొదలుపెడుతున్నాం: రెండు, మూడు అంతస్తుల్లో ఉన్న ఇళ్లకు నంబర్లు కేటాయించకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తింది. అది ఇప్పుడు జరిగింది కాదు. ఈ నెలలో డోర్నంబర్లు వేయని ఇళ్లకు నంబర్లు కేటాయిస్తాము. తద్వారా కొత్త ఓట్లు నమోదు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తాం. –ప్రేమంత్ కుమార్, కడప తహసీల్దార్ కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మేయర్, ఎమ్మెల్యే కడప నగరంలో లక్షా ముప్పై ఐదు వేల ఓట్లు గల్లంతు కావడంపై మేయర్ సురేష్బాబు, ఎమ్మెల్యే అంజద్బాషా కలెక్టర్ బాబూరావునాయుడుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మళ్లీ ఓటు నమోదు చేసుకోవచ్చంటున్న అధికారులు ఉన్న ఓట్లన్నీ తొలగించిన రెవెన్యూ అధికారులు కొత్తగా మళ్లీ ఎక్కించుకోవచ్చని తాపీగా చెబుతుండటంపై ప్రజాప్రతినిధులు, ప్రజలు మండిపడుతున్నారు. ఎలాంటి విచారణ లేకుండా లక్షకు పైగా ఓట్లు తొలగించి, ఇప్పుడు నమోదు చేసుకోమంటే ఎవరి ఓటు ఉందో, ఎవరి ఓటు లేదో నిరక్షరాస్యులకు ఎలా తెలుస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement