-
కాకినాడను చిత్తశుద్ధితో అభివృద్ది చేస్తాం
-
మంత్రి లోకేశ్ మరోసారి అభాసుపాలు
కాకినాడ: సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ మరోసారి తడబడ్డారు. ఇటీవల అంబేడ్కర్ జయంతిని వర్థంతిగా పేర్కొనడమే కాకుండా, శుభాకాంక్షలు కూడా చెప్పి నవ్వులపాలైన లోకేశ్, తాజాగా మరోసారి ప్రజలు అవాక్కయ్యేలా మాట్లాడారు. నిన్న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన లోకేశ్.. పెద్దాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో పలు పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కరపలో ఏర్పాటుచేసిన సభలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో ప్రతి పల్లెటూరుకు తాగునీరు లేని ఇబ్బందిని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమనడంతో సభలో జనం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. లోకేశ్ ఈ సమ యంలో ‘ఇబ్బంది.. కాదు.. కాదు’ అంటూ తడబడుతూ చివరివరకు ఒక్కో మాట వత్తి పల కడంతో సభకు హాజరైనవారు ఘొల్లున నవ్వారు. సహజంగా ఏ మంత్రయినా తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెబుతుంటారు. స్వయానా పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి అయిన సీఎం తనయుడు లోకేశ్ మాత్రం.. అసలు తాగునీరే లేకుండా ఇబ్బందులు కలుగజేస్తాననడంతో సభలో నవ్వులు విరిశాయి. అలాగే డ్వాక్రా గ్రూపులోని ఒక్కో మహిళకు రూ.7 వేలు చొప్పున ఇచ్చామని లోకేశ్ చెబుతుండగా, పక్కనే ఉన్న ఒక నాయకుడు కలుగజేసుకొని రూ.6 వేలే ఇచ్చామని చెవిలో చెప్పారు. దీంతో గొంతు సవరించుకున్న లోకేశ్ త్వరలోనే మిగిలిన రూ.4 వేలు ఇస్తామని ముక్తాయించారు. కాగా, ఇదే సభలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మరో అడుగు ముందుకేసి లోకేశ్ను కాబోయే ముఖ్యమంత్రి అంటూ తన స్వామిభక్తిని చాటుకునే ప్రయత్నం చేశారు. దండ వేస్తాను.. మీరంతా అక్కడే ఉండండి ఇదిలాఉండగా, కరపలో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన లోకేశ్.. అక్కడే ఉన్న డా.బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించకపోవడంపై అంబేడ్కర్ యువజన సేవా సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయాలని కోరగా.. మీరంతా అక్కడే ఉండండి, నేనొచ్చి దండ వేస్తానని లోకేశ్ వారికి బదులిచ్చాడు. దీంతో వారంతా అంబేడ్కర్ విగ్రహం వద్ద పూలదండలతో వేచిచూస్తుండగా.. లోకేశ్ మాత్రం అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆగకుండానే వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహానికి గురైన యువజన సంఘ నాయకులు అంబేడ్కర్కు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ నిరసనకు దిగారు. -
వెంకటరమణ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
కాకినాడ : కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ నిన్న కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆత్మహత్య చేసుకున్న కాపు ఉద్యమకారుడు వెంకట రమణమూర్తి కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. కాకినాడ డైయిరీ ఫామ్ సమీపంలోని వెంకట రమణమూర్తి నివాసానికి వెళ్లిన ఆయన... కుటుంబ సభ్యుల్ని పరామర్శించి, ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అధైర్యపడొద్దని, వారి కుటుంబానికి వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఏ కష్టం ఎదురైనా తాము ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఎవరూ భావోద్వేగాలకు లోనై ప్రాణాలు తీసుకోవద్దని వైఎస్ జగన్ కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని అన్నారు. కాగా శ్రీకాకుళం జిల్లాలో యువభేరి కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్ అక్కడ నుంచి నేరుగా కాకినాడ చేరుకున్నారు. -
ఖరారైన సీఎం చంద్రబాబు పర్యటన కార్యక్రమం
కాకినాడ సిటీ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 8న కాకినాడలో జరిపే పర్యటనకు సంబంధించిన కార్యక్రమం ఖరారైంది. ఆయన హెలికాప్టర్లో ఆ రోజు మధ్యాహ్నం 3.05 గంటలకు కాకినాడలోని పోలీసు పెరేడ్ గ్రౌండ్స్లోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ నుంచి కారులో 3.15 గంటలకు స్థానిక పర్లోపేటకు చేరుకుని ‘అందరికీ ఇళ్లు’ పథకానికి, అనంతరం నగరంలోని పార్కుల అభివృద్ధి పనులకు, నూతన పార్కుల నిర్మాణానికి, వర్షపునీటి డ్రైనేజీల నిర్మాణానికి, సమీకృత రహదారుల అభివృద్ధి పనులకు, ఎస్సీ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులకు శంకుస్థాపనలు చేస్తారు. 3.55 గంటలకు సాంబమూర్తినగర్లోని ఏఎంజీ స్కూల్ ఆవరణకు చేరుకుని సాయంత్రం 6.45 గంటల వరకు జన్మభూమి, మా ఊరు కార్యక్రమంలో పాల్గొంటారు. 6.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు ఎన్టీఆర్ బీచ్కు చేరుకుని ‘సాగర సంబరాల’ను ప్రారంభిస్తారు. 8.30 గంటల వరకూ అక్కడే ఉంటారు. 8.45 గంటలకు ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకుని బస చేస్తారు. -
2న జగన్ రాక
సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. ఆయన వచ్చే నెల 2, 3 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం ఏజెన్సీలో పర్యటించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూతో పాటు రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, ఆ నియోజకవర్గంలో పార్టీ కో ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్ విలేకరులకు చెప్పారు. ఈనెల 4న రంపచోడవరం వద్ద పెళ్లి వ్యాన్ బోల్తా పడ్డ ప్రమాదంలో గంగవరం మండలం సూరంపాలెం గ్రామానికి చెందిన ఎనిమిది మంది, కొత్తాడకు చెందిన ఒకరు మొత్తం 9 మంది గిరిజనులు మృతి చెందగా, సుమారు 80మంది క్షతగాత్రులయ్యారు. కాగా ఆ ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే జగన్ మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వస్తానన్నారని అప్పట్లో నేతలు చెప్పారు. ఆ క్రమంలోనే జగన్ ఇప్పుడు మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను, కోలుకుంటున్న క్షతగాత్రులను ఓదార్చనున్నారన్నారు. రెండో తేదీ ఉదయం రాజమండ్రికి చేరుకునే జగన్ అక్కడి నుంచి రంపచోడవరం నియోజకవర్గానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శిస్తారని, అనంతరం రంపచోడవరం నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారని తెలిపారు. అక్కడి నుంచి కాకినాడ రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారని చెప్పారు. సముద్రంలో వేటకు వెళ్లి వాయుగుండం కారణంగా మృతి చెందిన, గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను జగన్ ఓదారుస్తారని చెప్పారు. ఆ రోజు రాత్రి కాకినాడలో బస చే స్తారని, 3న ఉదయం కాకినాడ నుంచి బయలుదేరి తుని నియోజకవర్గంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తారని తెలిపారు. అనంతరం విశాఖ జిల్లా అచ్యుతాపురం వెళతారన్నారు. ఇటీవల ధవళేశ్వరం బ్యారేజ్పై నుంచి తుపాన్ వాహనం బోల్తాపడ్డ ఘటనలో ఆ గ్రామానికి చెందిన 22 మంది మరణించారని, జగన్ వారి కుటుంబాలను పరామర్శిస్తారని చెప్పారు. పర్యటన పూర్తి వివరాలను సోమవారం తెలియచేస్తామని నెహ్రూ చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
Advertisement