-
నిదురపుచ్చే కలాచి!
‘‘ఏంటి డియర్... పనుండి వెళ్తున్నా. హడావుడిలో నీకు చెప్పలేకపోయాను. చీకటి పడేలోపు నీ ముందు ఉంటాను కదా... టెన్షన్ ఎందుకు?’’... కారు నడుపుతూనే భార్య జరీనాకు సర్ది చెప్తున్నాడు అజ్మల్. ‘‘నువ్వు ఇలాగే అంటావ్ అజ్మల్. కచ్చితంగా త్వరగా రావు. రుబినా వాళ్లు మనకెంతో కావలసినవాళ్లు. వాళ్ల ఇంట్లో ఫంక్షన్కి కూడా ఆలస్యంగా వెళ్తే ఏం బాగుంటుంది?’... కినుకగా అంది జరీనా.అజ్మల్ నవ్వాడు. ‘‘నీ బుంగమూతి నాకు కనబడుతుందోయ్. అలిగినప్పుడు భలే ఉంటావ్లే’’... అల్లరి పెట్టాడు.‘‘చాలు చాలు. దీనికేం తక్కువ లేదు’’... ఉడుక్కుంది జరీనా. ‘‘సరే. ఐదున్నరకల్లా ఇంట్లో ఉంటాను. ఇక అలక వదిలెయ్. నేను వచ్చేసరికి రెడీగా ఉండు. నేను రాగానే...’’ అజ్మల్ మాట మధ్యలో ఆగి పోయింది. ‘‘హలో... హలో...’’... అరి చింది జరీనా. కానీ అవతలి నుంచి అతడి స్వరం వినిపించడం లేదు. అలాగని లైన్ కట్ కాలేదు కూడా. కారు బ్రేక్ వేసిన శబ్దం వినిపించింది. ఇంకా చుట్టుపక్కల నుంచి ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి. కానీ అజ్మల్ మాట మాత్రం వినిపించడం లేదు. జరీనా గుండె ఝల్లుమంది. కొంపదీసి ఏదైనా ప్రమాదం జరగలేదు కదా! ఫోన్ కట్ చేసి మళ్లీ డయల్ చేసింది జరీనా. ఈసారి అజ్మల్ ఫోన్ ఎత్తలేదు. దాంతో జరీనా కంగారు మరీ ఎక్కువై పోయింది. మళ్లీ మళ్లీ చేసింది. నో రెస్పాన్స్. ఆమె గుండె దడదడా కొట్టుకుం టోంది. ఏం చేయాలో పాలుపోలేదు. అక్షత్ గుర్తొచ్చాడు. తను అజ్మల్ తమ్ముడు. ఆ ఊళ్లోనే కాస్తంత దూరంలో ఉంటున్నాడు. అతనికి ఫోన్ చేసి జరిగింది చెప్పింది. ఎందుకో అక్షత్ మనసు కూడా కీడు శంకించింది. అరగంట తిరిగేసరికల్లా వదినగారి ముందు ఉన్నాడు. ఇద్దరూ కలిసి అజ్మల్ కోసం ‘కలాచి’ గ్రామానికి బయలుదేరారు. కలాచిలో ప్రవేశించి కొన్ని మైళ్లు వెళ్ల గానే రోడ్డు పక్కన కనిపించింది అజ్మల్ కారు. కంగారుగా దాని దగ్గరకు పరు గెత్తారు అక్షత్, జరీనా. డ్రైవింగ్ సీట్లో వెనక్కి ఒరిగి ఉన్నాడు అజ్మల్. ఒంటిమీద దెబ్బలేవీ లేవు. కానీ మనిషి మాత్రం స్పృహలో లేడు. ఎంత లేపినా లేవట్లేదు. ఊపిరి మాత్రం ఆడుతోంది. వెంటనే అతణ్ని తీసుకుని తిరుగు ప్రయాణ మయ్యారు. తమ సిటీకి వెళ్తూనే నేరుగా ఓ పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లారు. అజ్మల్ని పరీక్షించిన డాక్టర్ చెప్పాడు... ‘‘ఎందుకంత కంగారు? ఇతను నిద్రపోతున్నాడంతే.’’ఉలిక్కిపడ్డారు అక్షత్, జరీనా. ‘‘ఏంటీ... నిద్రపోతున్నాడా?’’ అన్నారు ముక్తకంఠంతో. అవునన్నట్టు తలూపాడు డాక్టర్. ‘‘ఇతను వెళ్లింది కలాచికి కదా! అందుకే ఈ నిద్ర’’ అన్నాడు కూల్గా. మళ్లీ అయోమయానికి లోనయ్యారు ఇద్దరూ. కలాచికి వెళ్లడమేంటి? నిద్రపో వడమేంటి? నిజానికి ఈ ఇద్దరికే కాదు. ఇలాంటి షాక్ గత రెండేళ్లలో చాలా మందికి తగిలింది. కలాచి వెనుక ఉన్న మిస్టరీ ప్రపంచం ముందుకు వచ్చింది. కలాచి... కజకిస్తాన్లోని ఓ గ్రామం. ఐదు వందల కుటుంబాలకు మించి జనాభా ఉండరు. రెండేళ్ల క్రితం ఆ ఊరికి ఓ విపత్తు ముంచుకొచ్చింది. అక్కడి వారు ఉన్నవాళ్లు ఉన్నట్టే నిద్రపోసాగారు. ఒక్క సారి నిద్రలోకి జారుకున్న వారు రోజుల తరబడి నిద్రపోతూనే ఉండేవారు. తీరా మెలకువ వచ్చాక కొందరికి గతం గుర్తుం డేది కాదు. తమ ఇల్లు, తమ వాళ్లు, చివరికి తమ పేరు కూడా మర్చి పోయిన వాళ్లు ఉన్నారు. మెలకువే రాకుండా కోమాలోకి వెళ్లి ప్రాణాలు వదిలినవాళ్లూ ఉన్నారు. ఈ పరిస్థితి అందరినీ హడలెత్తిం చింది. వైద్యులు రంగంలోకి దిగారు. పరిశోధనలు చేశారు. కానీ ఆ పరిస్థితికి కారణమేంటో బోధపడలేదు. కలాచిని ఆనుకుని ఒక యురేనియం గని ఉంది. దాన్ని ఎప్పుడో మూసేశారు. కానీ దాని మీద నుంచి వచ్చిన కలుషిత గాలిని పీల్చడం వల్ల కానీ, నేలలో ఉన్న యురేనియం నిల్వల వల్ల పెరిగిన రేడి యేషన్ కారణంగా గానీ తమకీ పరిస్థితి వస్తుందేమోనన్నది కలాచి ప్రజల సందేహం. వైద్యులు, అధికారులు మాత్రం అది నిజం కాదంటున్నారు. గాలిలో కార్బన్ మోనాక్సైడ్ నిల్వలు పెరగడం వల్ల ఇలా జరిగిందేమోనంటూ థియరీలు చెబు తున్నారు. తమ వాదనను నిరూపించే ఆధారాలు మాత్రం చూపించలేక పోతున్నారు. దాంతో చేసేదేమీ లేక ప్రభుత్వం ఆ గ్రామస్తులందరినీ వేరే ప్రాంతాలకు తరలించింది. దాంతో కలాచి ఖాళీ అయిపోయింది. అక్కడ వచ్చిన సమస్య ఓ మిస్టరీగా మిగిలిపోయింది. -
మెలకువ వచ్చాక తేదీలు చూసుకుంటారు!
ఆ ఊర్లో కోడికూతలుండవు. ఒకవేళ కోడి కూసినా.. నిద్రలేవడం కాదు కదా.. కనీసం ఉలిక్కిపడేవారూ ఉండరు. ఎందుకంటే.. ఊరు ఊరంతా నిద్రమత్తులో జోగుతోంది. ఒకసారి నిద్ర ముంచుకొచ్చిందంటే.. కొన్ని రోజులు గడిస్తే గానీ వారికి మెలకువ రాదు. కుంభకర్ణుడి వారసులతో నిండినట్లున్న ఆ ఊరు ఉత్తర కజాఖ్స్థాన్లో ఉంది. పేరు కలాచీ. జనాభా ఆరొందలే. నాలుగేళ్ల నుంచీ జనాలంతా బ్యాచ్లు బ్యాచ్లుగా నిద్రలోకి జారుకుంటున్నారు. మెలకువ వచ్చాక తేదీలు చూసుకుని అవాక్కవుతున్నారు. ఇప్పటికే కొంతమందికి భ్రమలు, జ్ఞాపకశక్తి సమస్యలూ మొదలయ్యాయట. కొందరు నిలబడలేకపోతుండగా, మరికొందరు అడ్డదిడ్డంగా నడుస్తూ, పరుగెడుతున్నారట. ఆ ఊరి ప్రజల మెదళ్లలో అప్పుడప్పుడూ అదనపు నీరు చేరుతుండటం వల్లే ఇలా జరుగుతోందని ఎట్టకేలకు వైద్యులు గుర్తించారు. కానీ అతినిద్ర వ్యాధి గానీ, వైరల్, బ్యాక్టీరియల్ వ్యాధులేమీ లేకపోవడంతో ఈ అతినిద్ర ఎందుకొస్తోందో తేల్చలేకపోతున్నారు. అక్కడి మట్టిలో, నీటిలో కూడా ప్రమాదకర రసాయనాలు లేవని పరిశోధనల్లో తేలింది. అయితే, ఈ గ్రామానికి సమీపంలో సోవియెట్ కాలం నాటి మూతపడిన యురేనియం గనుల నుంచి వస్తున్న రేడియేషన్ వల్లే నిద్రరోగం వస్తోందని కొందరు, గ్రామం వద్ద విషపూరిత వ్యర్థాలను పాతిపెట్టారని మరికొందరు భావిస్తున్నారు. గ్రామంలో రేడియేషన్ సాధారణం కంటే 16 రెట్లు ఎక్కువగా ఉన్నా, ఈ నిద్రరోగానికి రేడియేషన్కు సంబంధం లేదనీ తేలడంతో ఇది మరింత మిస్టరీగా మారింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
డీప్ ఫేక్ బారిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!
బీజేపీకి ఆదరణ పెరుగుతోంది
విద్యతోపాటు సంస్కారం ప్రధానం
పోలింగ్ను నిశితంగా పరిశీలించాలి
ఎన్నికల వేళ తనిఖీలు ముమ్మరం
ప్రచార పాట్లు
ఎన్నికల నిబంధనలు పాటించాలి
ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
గ్యారంటీలు అమలైతే ఓట్లడగం
ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement