-
మంత్రివర్యా.. నీకిది తగునా?
సాక్షి, న్యూఢిల్లీ : స్వచ్ఛ భారత్ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని స్ఫూర్తిగా తీసుకొని రాజస్థాన్ ప్రభుత్వం ‘స్వచ్చ్ భారత్ అభియాన్’ కింద మంచి ర్యాంక్ను కొట్టేయాలని ప్రయత్నిస్తోంది. సరిగ్గా ఈ సమయంలోనే రాజస్థాన్ ఆరోగ్య మంత్రి కాలిచరణ్ శరఫ్ బుధవారం జైపూర్లోని ఓ గోడకు మూత్రం పోస్తూ దొరికిపోయారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించింది. ఇది చాలా చిన్న విషయమంటూ మంత్రి కాలిచరణ్ శరఫ్ కొట్టివేయగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం బహిరంగంగా మూత్ర విసర్జన చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా చాలా మంది మంత్రి ప్రవర్తనను విమర్శిస్తున్నారు. ఈ ఫొటోను షేర్ చేసిన ప్రముఖ క్రికెటర్ హరిభజన్ సింగ్ కూడా మంత్రి ప్రవర్తనను సున్నితంగా విమర్శించారు. -
మంత్రి షాకింగ్ కామెంట్స్
జైపూర్: బీజేపీ నాయకుడు, రాజస్థాన్ మంత్రి కాళిచరణ్ సరాఫ్ అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్నారు. అత్యాచారాలను అరికట్టలేమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటనపై స్పందిస్తూ ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నగల దుకాణం యాజమాని ఇంట్లో పనిచేసే వ్యక్తి ఓనర్ కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు లేదా ప్రభుత్వం ఏం చేయగలుగుతుంద’ని అన్నారు. ఇలాంటి కేసులు నమోదైనప్పుడు నిందితుడిపై కఠిన చర్య తీసుకోవడం, బాధితురాలికి మంచి వైద్య సహాయం అందించడం మినహా తామేమి చేయలేమని చెప్పుకొచ్చారు. రాజస్థాన్లో రేప్ కేసులు పెరిగిపోతుండడం గురించి ప్రశ్నించగా మంత్రి విచణక్ష కోల్పోయారు. ‘రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాళం వేయాలని మీరు భావిస్తున్నారా? ప్రతి గుమ్మం దగ్గర పోలీసులను కాపలా పెట్టాలా? రోజురోజుకు నేరాలు పెరుగుతున్నాయి. దీనికి మేమేం చేయగలమ’ని ఎదురు ప్రశ్నించారు. మంత్రి వ్యాఖ్యలపై విపక్షాలు, ప్రజా సంఘాలు మండిపడ్డాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవాలి
మరింత ఆలస్యంగా..?
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement