-
బేగంబజార్లో సోదాలు
అనువణువూ పోలీసుల జల్లెడ అసాంఘికశక్తుల సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి అబిడ్స్/అఫ్జల్గంజ్: ‘కార్డన్ అండ్ సెర్చ్’ కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ జోన్ పోలీసులు బుధవారం సాయంత్రం బేగంబజార్ను జల్లెడ పట్టారు. బేగంబజార్కు వెళ్తే అన్ని ద్వారాలను మూసివేసి ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. సెంట్రల్ జోన్ డీసీ పీ కమలాసన్రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 400 మంది పోలీసులు ఫీల్ఖానా, తోఫ్ఖానాలకు దారి తీసే 20 రహదారులను బారికేడ్లతో పూ ర్తిగా మూసివేసి సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతి ఒక్కరినీ సోదా చేశారు. అబిడ్స్, అసెంబ్లీ, సెక్రటేరియట్ల ఏసీపీలు జైపాల్, సంజీవ, వీరన్నల నేతృత్వంలో బేగంబజార్, అబిడ్స్, నారాయణగూడ ఇన్స్పెక్టర్లు గంగసాని శ్రీధర్, ఉమామహేశ్వరరావు, భీమ్రెడ్డిలు, ఎస్ఐలు తమ సిబ్బందితో కలిసి బృందాలుగా విడిపోయి ప్రతి వీధిలోనూ తనిఖీలు నిర్వహించారు. విధ్వంసకర చర్యలను సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు తమ కు సహకరించాలని ఈ సందర్భంగా పోలీసు లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అసాంఘిక శక్తుల వివరాలు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అసాంఘిక శక్తులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఎన్నో సత్ఫలితాలు: డీసీపీ కమలాసన్రెడ్డి ఈ తనిఖీల ద్వారా ప్రజలకు ఎన్నో సత్ఫలితాలు కలుగుతున్నాయని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్రెడ్డి తెలిపారు. తనిఖీల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం కూడా తా ము ఇలాంటి తనిఖీలు చేశామన్నారు. ప్రతీ వ్యాపారి తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించి తీరాల్సిందేనన్నారు. సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు అమర్చుకోని వ్యాపారులకు ముందుగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. అయినా వా రు భద్రతా ప్రమాణాలు పాటించకపోతే నోటీసులు ఇచ్చి 2013 పోలీస్చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ భద్రతా చర్యలు తీసుకొని పోలీస్ శాఖకు సహకరించాలని డీసీపీ కోరారు. -
నాంపల్లి రైల్వే స్టేషన్లో బాంబు కలకలం
పరుగులు పెట్టిన ప్రయాణికులు ‘మాక్డ్రిల్’ అని తెలిసి ఊపిరి పీల్చుకున్న వైనం ప్రజల అవగాహన కోసమే: డీ సీపీ కమలాసన్రెడ్డి నాంపల్లి: ప్రాంతం.. నాంపల్లి రైల్వే స్టేషన్. సమయం.. సోమవారం సాయంత్రం 4 గంటలు కావొస్తుంది. స్టేషన్ మొత్తం ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఇంతలో ప్లాట్ఫాం-1 మీద ఓ టిఫిన్ బాక్స్ను గుర్తించారు. అనుమానాస్పదంగా ఉండటంతో రైల్వే సిబ్బంది, ప్రయాణికులు 100 ఫోన్చేసి సమాచారం అందించారు. వెంటనే బాంబు స్క్వాడ్, డాగ్స్క్వాడ్, ఆర్పీఎఫ్, జీఆర్పీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు స్టేషన్కు చేరుకుని తనిఖీలు చేయగా బాక్స్లో బాంబు ఉన్నట్టు నిర్ధారించారు. దీంతో పాటు పక్కనే ఉన్న రైలు పట్టాలపై మరో టిఫిన్ బాక్స్ను కనుగొన్నారు. అందులోనూ బాంబును గుర్తించారు. పోలీసులు అప్రమత్తమై ప్రయాణికులు దూరంగా జరగాలని మైక్ అనౌన్స్ చేశారు. అదే సమయంలో టిఫిన్ బాక్స్ను వదిలివెళ్లిన ప్లాట్ఫాం మీదకే లింగంపల్లి-హైదరాబాద్ ఎంఎంటీఎస్ వస్తోంది. రైలు చేరుకోక ముందే ఓ టిఫిన్ బాక్స్ పెద్ద శబ్ధంతో పేలిపోయింది. దీంతో ప్రయాణికులు ఉరుకులు పరుగులు పెట్టారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వెంటనే పోలీసులు చొరవ తీసుకుని పట్టాలపై పడివున్న మరో టిఫిన్ బాక్స్లోని బాంబును నిర్వీర్యం చేశారు. ఇదంతా నిజమే అనుకుంటున్నారా..? అంతా ఉత్తుత్తిదే. బాంబు పేలుళ్లపై రైలు ప్రయాణికులకు అవగాహన కల్పించడానికి పోలీసులు సోమవారం మాక్డ్రిల్ నిర్వహించారు. అనంతరం ప్రయాణికులకు బాంబు పేలుళ్లపై అవగాహన కల్పించారు. ఇందులో అనుమానిత వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే చేయాల్సిన విధానాలను ప్రదర్శన ద్వారా ప్రయాణికులను చైతన్యం చేశారు. దక్షిణ మధ్య రైల్వే సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు రైల్వే సీపీఆర్వో సాంబశివరావు, రైల్వే ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, మధ్య మండలం డీసీపీ కమలాసన్రెడ్డి, సీఎస్డబ్లూ, ఐఎస్డబ్లూ అడిషనల్ డీసీపీలు రామకృష్ణ, ప్రతాప్, ఆర్పీఎఫ్ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు. పొర్టర్లు, హ్యాకర్ల ఫోన్ నంబర్ల సేకరణ అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు పరిసర ప్రాంతాల్లో ఉంటున్న ఫుట్పాత్ వ్యాపారులు, పోర్టర్స్, హాకర్స్, క్లీనింగ్ స్టాఫ్, పార్కింగ్ స్టాఫ్ ఫోన్ నంబర్లను సేకరిస్తున్నట్టు డీసీపీ కమలాసన్రెడ్డి తెలిపారు. సీపీఆర్వో సాంబశివరావు మాట్లాడుతూ నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి 106 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయని, 40 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారన్నారు. దీంతో పాటు సికింద్రాబాద్, తిరుపతి రైల్వే స్టేషన్లలో భద్రతను పటిష్టం చేసేందుకు రూ.6.20 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో 41 సీసీ కెమెరాలను అమర్చామన్నారు. బాంబు నిర్వీర్యానికి అధునాతన పరికరం అనుమానాస్పద వస్తువులను పరిశీలించేందుకు నగర పోలీసు విభాగం సుమారు రూ.3 లక్షలతో టెలిస్కోపిక్ మానిపులేటర్ పరికరాన్ని కొనుగోలు చేసింది. దీని సహాయంతో అనుమానిత వస్తువులను తనిఖీ చేస్తున్నారు. సోమవారం నాంపల్లి రైల్వే స్టేషన్లో జరిగిన మాక్ డ్రిల్లో ఈ పరికరాన్ని సీఎస్డబ్లూ బీడీ టీమ్ ఇన్చార్జి ఆఫీసర్ నాగసాయి ఆధ్వర్యంలో వినియోగించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
బాబు కుట్రలు..పెన్షన్ కష్టాలు
T20 WC జట్టులో నో ఛాన్స్.. రింకూతో రోహిత్ సీరియస్ డిస్కషన్
అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్
వాళ్లే కావాలని ఎఫైర్స్ అంటగట్టేవారు: స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి
టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
తప్పక చదవండి
- వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
- ఇదేం స్నాక్ రా బాబూ...రేటు ఎంతైనా సరే ఎగబడుతున్న జనం
- SRH: వాళ్లిద్దరు అద్భుతం.. నితీశ్రెడ్డి సూపర్: కమిన్స్
- టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?
- శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- నాకు నేనే సవాల్గా మారా: స్టార్ హీరోయిన్
- రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ
- దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’నోట్లే!
Advertisement