-
మిజోరం సీఎంగా లాల్దుహోమా ప్రమాణ స్వీకారం
ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో జోరామ్ నేషనలిస్ట్ పార్టీ (జెడ్ఎన్పీ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. శుక్రవారం జెడ్ఎన్పీ అధినేత లాల్దుహోమా చేత ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో మిజోరంలో భారీ విజయం సాధించిన జెడ్ఎన్పీ నూతన ప్రభుత్వం నేడు కొలువుదీరింది. #WATCH | Aizawl, Mizoram: Zoram People's Movement (ZPM) leader Lalduhoma takes oath as the Chief Minister of Mizoram as the swearing-in ceremony begins pic.twitter.com/oCMbU2xVSf — ANI (@ANI) December 8, 2023 నవంబర్ 7న జరిగిన మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాల్లో జోరామ్ నేషనలిస్ట్ పార్టీ 27 స్థానాల్లో ఘన విజయం సాధించింది. మిజో నేషనల్ ఫ్రంట్ కేవలం 10 స్థానాలకే పరిమితమైంది. -
బాబు తీరుతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది
సాక్షి, విశాఖపట్నం: కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఏర్పాటైన టీడీపీ ఇప్పుడు ఆ కాంగ్రెస్తో జత కట్టేందుకు తహతహలాడుతోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, విశాఖ ఎంపీ కె.హరిబాబు ఆరోపించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం గద్దెనెక్కి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ టీడీపీని కాంగ్రెస్ వైపు దారి మళ్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పడుతున్న ఆరాటాన్ని ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని హరిబాబు చెప్పారు. బాబు తీరుతో పైనున్న ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందన్నారు. కర్ణాటకలో జరిగిన కుమార స్వామి ప్రమాణ స్వీకారోత్సవంలో బాబు అసలు స్వరూపం బయట పడిందని తెలిపారు. 1996 నాటి రాజకీయ పరిస్థితులు పునరావృత మవుతు న్నాయని, ఆనాడు కాంగ్రెస్తో జతకట్టి యునైటెడ్ ఫ్రంట్కు మద్దతు పలికిన విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపో లేదన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా 2019 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు. విభజన హామీలు నెరవేర్చాం.. విభజన హామీల్లో 85 శాతం అమలు చేశామని హరిబాబు చెప్పారు. రైల్వే జోన్తోపాటు కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగ్గిరాజు పోర్టు, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, గిరిజన విశ్వవిద్యాలయం మాత్రమే మంజూరు చేయాల్సి ఉందన్నారు. ప్యాకేజీని ఆహ్వానించిన బాబు ఇప్పుడు యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉన్నతస్థాయి దర్యాప్తు చేయాలి టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు చేసిన ఆరోపణలపై ఉన్నత స్థాయి కమిటీతో దర్యాప్తు చేయాలని ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. పోటులో తవ్వకాలు, జెనీవాలో వేలం వేయడం వంటి ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సిందేనన్నారు. దివంగత వైఎస్సార్ హయాంలో నియమించిన ధార్మిక మండలి పదేళ్లు పనిచేసిందని.. చంద్రబాబు హయాంలో ఎందుకు వేయలేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్రాజు పాల్గొన్నారు. -
ఈ ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ
విశాఖపట్నం: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్పై టీడీపీ కార్యకర్తలు జరిపిన రాళ్ల దాడిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు ఖండించారు. విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ..ఈ ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేదిలా ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, శాంతి భద్రతలు కాపాడాల్సినది టీడీపీయేనని, అలాంటి పార్టీ ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం బాగోలేదని వ్యాఖ్యానించారు. ఈ విధమైన అరాచకానికి పాల్పడడం, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో అనే దానికి దర్పణం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కంభంపాటి డిమాండ్ చేశారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకుని శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరుడి దర్శనం కోసం వచ్చిన ఆయనకు టీడీపీ శ్రేణులు నల్లజెండాలతో నిరసనలు తెలుపుతూ, గో బ్యాక్ నినాదాలు చేస్తూ..అలిపిరి గరుడ సర్కిల్ దగ్గర అమిత్ షా కాన్వాయ్పై రాళ్లతో దాడిచేసిన సంగతి తెల్సిందే. -
హరిబాబు రాజీనామా..చేశారా.. చేయించారా?
జాతీయ పార్టీకి మూడేళ్లకుపైగా ఆయన రాష్ట్ర అధ్యక్షుడు.. ఒక దశలో కేంద్ర మంత్రి పదవి కూడా ఆయన్ను ఊరించింది.. టీడీపీ, బీజేపీ పొత్తు పెటాకులైన తర్వాత సీను మారిపోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రంలోని టీడీపీ సర్కారుపై అస్త్రశస్త్రాలు సంధించాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే కేంద్రంపై టీడీపీ సర్కారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని పలు వేదికలపై తిప్పికొట్టడానికి ప్రయత్నించిన ఎంపీ హరిబాబు రెండు రోజుల క్రితమే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు, ప్రాజెక్టుల వివరాలతో ప్రత్యేక బుక్లెట్ కూడా ఆవిష్కరించారు. అంతలోనే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. చర్చోపచర్చలకు తావిస్తోంది. రాష్ట్రంలోని టీడీపీ సర్కారు పట్ల ఆయన మెతక వైఖరితో ఉన్నారని సొంత పార్టీలోనే విమర్శలున్నాయి. అందుకనే పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారన్న ఊహాగానాలూ వినిపించాయి. ఈ క్రమంలో హరిబాబు విమర్శలకు వగచి తనంత తానుగా రాజీనామా చేశారా?.. అధిష్టానం చేయించిందా?? అన్న చర్చలు కొనసాగుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం : బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. హరిబాబు రాజీనామా స్వచ్ఛందంగానే చేశారా? లేక చేయమని ఒత్తిడి చేశారా? అనే చర్చ సర్వత్రా సాగుతోంది. మిత్రపక్షంతో చెడిన తర్వాత అధ్యక్ష మార్పు తప్పదన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే రాజీనామా చేశారని ఓ వాదన విన్పిస్తుండగా, తనపై పార్టీలో అంతర్గతంగా వస్తున్న విమర్శలు నేపథ్యంలో మనస్తాపం చెంది పార్టీ పదవికి రాజీనామా చేసి ఉంటారని మరో వాదన బలంగా విన్పిస్తోంది.ఉమ్మడి ఆంధ్రఫ్రదేశ్కు బీజేపీ అధ్యక్షునిగా కిషన్రెడ్డి ఉండేవారు. రాష్ట్ర విభజన అనివార్యమని తేలిపోయిన తర్వాత 13 జిల్లాలకు పార్టీ అధ్యక్షునిగా సీనియర్ నాయకుడైన కంభంపాటి హరిబాబుకు అప్పగించారు. 2014 జనవరిలో బా«ధ్యతలు చేపట్టిన హరిబాబు పదవీకాలం గతేడాదితోనే ముగిసింది. అప్పటి నుంచి అధ్యక్ష మార్పుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. విశాఖలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు, రాష్ట్ర పదాధికారుల సమావేశాల్లో సైతం ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. టీడీపీ పెద్దలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అభియోగంపై హరిబాబును మార్చాల్సిందేనంటూ ఆయన వ్యతిరేక వర్గీయులు పార్టీ అధిష్టానంపై పలుమార్లు ఒత్తిడి తీసుకొచ్చారు. కేంద్ర మంత్రిగా ఉన్న ఎం.వెంకయ్యనాయుడు పేరు ఉపరాష్ట్రపతిగా ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి హరిబాబుకు కేబినెట్ బెర్త్ ఖాయమన్న ప్రచారం జరిగింది. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య ఎన్నికైన తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణ సమయంలో రాజధాని నుంచి వచ్చిన పిలుపుతో హరిబాబు ఢిల్లీ కూడా వెళ్లారు. కానీ చివరి నిమిషంలో ఆయనకు కేబినెట్ బెర్త్ దక్కలేదు. కాగా తాజా రాజకీయ పరిణామాలతో టీడీపీ మంత్రులు కూడా రాజీనామాలు చేయడంతో కేంద్ర కేబినెట్లో ఏపీకి ప్రాధాన్యత లేకుండా పోయింది. సొంత పార్టీలోనే విమర్శల సెగ ఆది నుంచి సౌమ్యునిగా ముద్ర పడిన హరిబాబు ఏనాడు విపక్షాలపై కూడా ఘాటైన విమర్శలు చేసిన పాపాన పోలేదు. నాలుగేళ్ల కాపురం తెగతెంపులు చేసుకోవడంతో టీడీపీపైన, ఆ పార్టీ పెద్దలపై సొంత పార్టీ నేతలు ఓ వైపు విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే హరిబాబు మాత్రం కొద్దికాలం మౌనముద్ర వహించారు. దీంతో సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కోవల్సి వచ్చింది. తన సహజశైలికి భిన్నంగా ఇప్పుడిప్పుడే టీడీపీ పెద్దలపై విమర్శలు చేయడం మొదలు పెట్టినప్పటికీ హరిబాబుపై పార్టీలో విమర్శలు మాత్రం తగ్గలేదు.ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తక్షణమే అధ్యక్ష మార్పు చేయకపోతే రాష్ట్రంలో బీజేపీ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్న వాదన ఆయన వ్యతిరేక వర్గీయులు తెరపైకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఎంపీ హరిబాబు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం.. ఆ లేఖను గుట్టుచప్పుడు కాకుండా పార్టీ అధినేత అమిత్షాకు పంపడం చర్చనీయాంశమైంది. సాధారణంగా రాజీనామా చేస్తే తాను ఫలానా కారణంగా రాజీనామా చేస్తున్నానని పత్రికా ముఖంగా చెప్పిన తర్వాత ఎవరైనా సమర్పిస్తారు. కానీ హరిబాబు సోమవారం సాయంత్రమే తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అ«ధ్యక్షునికి పంపగా.. ఆ విషయాన్ని మంగళవారం మీడియాకు లీకులివ్వడం పార్టీని కుదుపేస్తోంది. ఆ తర్వాత తన రాజీనామా విషయాన్ని హరిబాబు ధ్రువీకరించారు. కొలిక్కి రాకుండానే.. సాధారణంగా కొత్త అధ్యక్షుడు ఎవరనేది ఖరారైన తర్వాత పాత అధ్యక్షునితో రాజీనామా చేయిస్తారు. పాత అధ్యక్షుడి నుంచి కొత్త అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ జరుగుతోంది. కానీ ఇక్కడ కొత్త అధ్యక్షుడెవరనేది కొలిక్కి రాకుండా హరిబాబు రాజీనామా చేయడం వెనుక రాజకీయ కోణం దాగి ఉందన్న ప్రచారం సాగుతోంది. టీడీపీ పెద్దలు చేస్తున్న విమర్శలను హరిబాబు సమర్ధ వంతంగా తిప్పికొట్టలేక పోతున్నారని తక్షణమే ఆయన్ని తప్పించాలంటూ పార్టీ అధినాయకత్వంపై ఆయన వ్యతిరేక వర్గీయులు ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో మనస్తాపం చెంది తనంతట తానుగా రాజీనామా చేసి ఉంటారని పార్టీలో ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షత పదవి మార్పు అనివార్యంగా మారిన నేపథ్యంలో అధిష్టానమే గౌరప్రదంగా తప్పుకోమని సూచించి ఉండవచ్చునని ఈ కారణంగానే ఆయన రాజీనామా చేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు. రాజకీయ కోణం లేదన్న విష్ణుకుమార్రాజు ఆది నుంచి పార్టీలో ఫైర్బ్రాండ్గా ఉన్న బీజేపీ శాసనసభాపక్ష నేత పి.విష్ణుకుమార్రాజు ఈ వ్యవహారంపై ఆచీతూచి స్పందించారు. హరిబాబు రాజీనామా వెనుక రాజకీయకోణం ఏమీ లేదంటూ ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించడం కూడా అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ కోణం లేనప్పుడు ఎందుకు రహస్యంగా రాజీనామా చేయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తే అది మా పార్టీ అంతర్గత వ్యవహారం అంటూ కొట్టిపారేశారు. కొత్త అధ్యక్షుడు కావాలంటే ఆ పదవిలో ఉన్న వారు రాజీనామా చేయాలి కదా? అని బీజేపీ నగర అధ్యక్షుడు నాగేంద్ర వ్యాఖ్యానించారు. హరిబాబుకు కచ్చితంగా కేబినెట్లో స్థానం లభిస్తుందన్న విశ్వాసం తమకుందని ఈ ఇరువురు నేతలు ధీమా వ్యక్తం చేశారు. కొత్త అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే రేసులో ఉన్న సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, పైడికొండల మాణిక్యాలరావు, పురందేశ్వరిలతో పాటు తాజాగా విశాఖకు చెందిన చెరువు రామకోటయ్య పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ అధిష్టానం మాత్రం వీర్రాజు, పైడికొండలలో ఎవరో ఒకర్ని ఖరారు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
బాబూ.. నీ పరపతేమిటో తేలిపోయింది
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సీఎం చంద్రబాబు పర్యటనపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. టీడీపీ పరపతి పూర్తిగా క్షీణించినట్లు తన ఢిల్లీ పర్యటన ద్వారా చంద్రబాబే బహిర్గతం చేసుకున్నారని వ్యాఖ్యానించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మంగళవారం సాయంత్రం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. రాజకీయంగా వైఎస్సార్సీపీకి, బీజేపీకీ ఎలాంటి సంబంధమూ లేదని కంభంపాటి హరిబాబు స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్కు బీజేపీ దగ్గరవుతోంది కాబట్టి తాము ఎన్డీఏ నుంచి విడిపోయామని టీడీపీ పేర్కొనటం అసంబద్ధమైన ఆరోపణ అన్నారు. ఒకవిధంగా చెప్పాలంటే టీడీపీ, వైఎస్సార్సీపీ రెండు పార్టీలూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని ఆడిన రాజకీయ క్రీడలో, రాజకీయ ఉచ్చులో టీడీపీ చిక్కుకుందని వ్యాఖ్యానించారు. బీజేపీ, టీడీపీ విడిపోవాలని పెట్టుకున్న లక్ష్య సాధనలో వైఎస్సార్ సీపీ విజయం సాధించిందన్నారు. వైఎస్సార్ సీపీని టీడీపీ అనుసరించింది.. టీడీపీకి ఎజెండాను నిర్దేశించింది వైఎస్సార్సీపీనే అని కంభంపాటి పేర్కొన్నారు. ‘మీ (టీడీపీ) మంత్రులు కేంద్రం నుంచి వైదొలగాలన్న డిమాండ్కు అనుగుణంగా మీరు రాజీనామా చేశారు. మంత్రులు రాజీనామా చేయడమే కాదు ఎన్డీఏ నుంచి బయటకు రావాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. మీరు బయటకు వచ్చారు. మోదీపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం మీరు పెడతారా లేదా అని వైఎస్సార్సీపీ టీడీపీ మెడపై కత్తిపెట్టింది. టీడీపీ.. వైఎస్సార్సీపీని అనుసరించింది. వైఎస్సార్సీపీ పన్నిన ఉచ్చులో టీడీపీ పడింది. అంతేకానీ బీజేపీ.. వైఎస్సార్సీపీకి దగ్గరవ్వలేదు’ అని కంభంపాటి చెప్పారు. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకున్నది ప్రత్యేక హోదా కోసం కాదని కంభంపాటి చెప్పారు. బీజేపీ వైఎస్సార్సీపీకి దగ్గరవుతోందన్న ఒక భ్రమతో తెగదెంపులు చేసుకున్న విషయం ఈరోజు స్పష్టం అవుతోందని తెలిపారు. ప్రతిపక్షాల భయానికి లోనై రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలను కాలదన్న వద్దని సూచించారు. ఆ ఆరోపణలు అసంబద్ధం ప్రధాని కార్యాలయాన్ని వైఎస్సార్ సీపీ ఎంపీ వాడుకుంటున్నారని టీడీపీ చేస్తున్న ఆరోపణ అసంబద్ధమైనదని కంభంపాటి తెలిపారు. ప్రధాని తన కార్యాలయాన్ని వేరొకరు వాడుకునేందుకు ఇస్తారని భావిస్తే అంతకంటే అమాయకులు ఎవరూ ఉండరని చెప్పారు. ఏపీ విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలు అమలు చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఈ నాలుగేళ్లలో ఏ రాష్ట్రానికీ చేయనంత సాయాన్ని ఏపీకి అందచేశామన్నారు. ఒక్క ప్రత్యేక హోదా తప్పితే మిగిలినవన్నీ ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందని చెప్పారు. నిధులను వాడుకోలేని దుస్థితి కేంద్రం ఇచ్చిన నిధులను కూడా సరిగా వాడుకోని దుస్థితి టీడీపీ సర్కారుదని నరసింహారావు విమర్శించారు. ‘ప్రజలు చింతిస్తున్నారు. అమరావతి అంటే.. అమ్మో అవినీతి అనే భయం కలుగుతోంది. రూ. 1,000 కోట్లు డ్రైనేజీకి ఇస్తే రూ. 200 కోట్లు మాత్రమే వాడుకున్నారు. కట్టిన భవనాలు ఎక్కడున్నాయో అని చర్చించుకుంటున్నారు. ఇస్తామన్న నిధులు తీసుకోకుండా రాజకీయం చేయటం తగదు..’ అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అన్ని పార్టీలు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయని విమర్శించారు. ఏ రాష్ట్రంపైనా తమకు కక్ష లేదన్నారు. లెక్కలు చెప్పలేకపోవటం పారదర్శకతా? నిధులు ఇచ్చి వెనక్కి తీసుకున్నారని టీడీపీ చెప్పడంలో వాస్తవం లేదని జీవీఎల్ తెలిపారు. ‘బురదజల్లే రాజకీయాలు సరికాదు. మొత్తం నాటకంలో ఇదొక భాగం. చేసిన ఖర్చుకు లెక్కలు చెప్పాలని అడిగాం. ఇచ్చిన రూ.990 కోట్లకు సరైన వివరాలు లేవు. డబ్బంతా ఎటు పోయిందన్న వివరాలు ఇవ్వలేనప్పుడు పారదర్శకత పాలన ఎలా అవుతుంది. ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న వ్యాఖ్యలు నాటకాన్ని రంజింపజేయడానికి చేసిన వ్యాఖ్యలే’ అని చెప్పారు. టీడీపీ బలహీనపడినట్లు మీరే తేల్చారు ఇప్పటివరకు ఏపీ వేదికగా ఉన్న రాజకీయ డ్రామాలను ఢిల్లీ పర్యటనతో చంద్రబాబు హస్తినకు తెచ్చారని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో టీడీపీ పరపతి ఎంత క్షీణించిందో ఈరోజు జరిగిన పరిణామాలను చూసి చెప్పవచ్చన్నారు. చంద్రబాబు చిన్నాచితక స్థాయి నేతలను కలిసి తమ వాదనలను వినిపించినట్లు చెబుతున్నారన్నారు. ఏ ఒక్క పెద్ద పార్టీ నేతా వారిని ఆలకించిన దాఖలాలు లేవన్నారు. చంద్రబాబు కలిసిన నేతల్లో శరద్పవార్ మినహా చెప్పుకోదగ్గ వారు ఎవరూ లేరన్నారు. ‘టీడీపీకి పరపతి లేదు. 20 ఏళ్ల క్రితం చక్రం తిప్పినా ఇప్పుడు వినేవాళ్లు లేరు. మీ పార్టీ బలహీనపడిన తీరును మీయాత్ర ద్వారా మీరే తేటతెల్లం చేశారు..’ అని నరసింహారావు వ్యాఖ్యానించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
Advertisement