-
నిజామాబాద్ అర్బన్ ఇండిపెండెంట్ అభ్యర్థి ఆత్మహత్య
సాక్షి, నిజామాబాద్: సైబర్ మోసగాళ్ల వలలో పడి నిజామాబాద్ అర్బన్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నయ్య గౌడ్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో కలకలం రేపింది. గాయత్రినగర్లో ఉండే కన్నయ్యకుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. అయితే శనివారం రాత్రి తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. కన్నయ్య కుమార్ గౌడ్ ఫోన్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన ఎన్నికలు అఫిడవిట్ సైతం సైబర్ నేరగాళ్లు కాజేసినట్లు చెబుతున్నారు. రెండు రోజుల్లో గృహప్రవేశం పెట్టుకున్న కన్నయ్య ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరుతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. చదవండి: వారసులకు ‘హోం’ సిక్ -
ట్యాంక్బండ్పై ఐలమ్మ విగ్రహాన్నిఏర్పాటు చేయాలి
తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ 31వ వర్ధంతి సందర్భంగా పోస్టర్ను ఫిలింనగర్ రజక సంఘం అధ్యక్షుడు కనకయ్య ఆదివారం ఫిలింనగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. చాకలి ఐలమ్మ పోరాటాన్ని దృష్టిలో ఉంచుకొని ట్యాంక్బండ్పై ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ను కోరారు. రజకులకు ప్రత్యేక సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ నెల 10వ తేదీన రజకుల ఆత్మగౌరవ సభకు పెద్ద సంఖ్యలో విచ్చేయాలని, సుందరయ్య కళానిలయంలో జరిగే ఈ కార్యక్రమానికి రజక కులస్తులంతా హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో ఫిలింనగర్ రజక సంఘం నాయకులు వి.రామలింగం, ఎం.శ్రీనివాస్, బి.యాదగిరి, జి.ఎల్లయ్య, ఆర్.బాలనర్సయ్య, ఎం.మణెమ్మ, జి.లలిత తదితరులు పాల్గొన్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
రుణ భారం తాళలేక ఓ రైతు బలవన్మరణం చెందాడు. నల్లగొండ జిల్లా రాజపేట మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని కొండేటిచెరువు గ్రామానికి చెందిన రైతు ఎల్మ కనకయ్య(35) ఆదివారం రాత్రి పొలానికి వెళ్లి అక్కడే ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన రైతులకు అతడు చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. ఈ ఏడు సరిగా పంటలు సరిగా పండకపోవటంతో అప్పులు తీర్చే దెలాగో తెలియక కనకయ్య ఆత్మహత్య చేసుకున్నాడని రైతులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఎమ్మార్వో దంపతులకు గాయాలు
వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం ఎదురుగట్ల గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తహశీల్దార్ దంపతులకు గాయాలు అయ్యాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట తహశీల్దార్ కనకయ్య, భార్య, ఇద్దరు పిల్లలతో కలసి ఆదివారం స్వగ్రామం ఎదురుగట్లకు వచ్చారు. సాయంత్రం తిరుగు ప్రయాణమైన కొద్దిసేపటికే వారి కారును ఎదురుగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీకొంది. కనకయ్య, ఆయన భార్యకు గాయాలు కాగా, వారిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
షాకులమీద షాకులిస్తున్న టిఆర్ఎస్
హైదరాబాద్: ఖమ్మం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే కొర్రం కనకయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రేపు తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్)లో చేరుతున్నట్లు కూడా కనకయ్య ప్రకటించారు. గత ఎన్నికలలో ఇల్లందు ఎస్టీ నియోజకవర్గం నుంచి కనకయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా 11వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అధికార పార్టీ టిఆర్ఎస్ కాంగ్రెస్, టిడిపిలకు షాకులమీద షాకులిస్తోంది. ఇప్పటికే ఈ పార్టీలకు చెందిన పలువురు టిఆర్ఎస్లో చేరారు. తాజాగా ఎమ్మెల్యే కనకయ్య ఆ పార్టీలో చేరనున్నారు. ఖమ్మం జిల్లా నుంచే టిడిపి నేత తుమ్మల నాగేశ్వరరావు కూడా టిడిపిలో చేరుతున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల క్రితం కనకయ్య తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. అప్పుడే ఆయన టిఆర్ఎస్లో చేరబోతున్నట్లు అర్ధమైపోయింది.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement