-
హైందవ ధర్మాన్ని విదేశాల్లో కూడా ప్రచారం చేయాలి : శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి
-
70వ పీఠాధిపతిగా శంకర విజయేంద్ర
సాక్షి, చెన్నై: జయేంద్ర సరస్వతి శివక్యైం పొందడంతో కంచి కామకోటి మఠం 70వ పీఠాధిపతిగా శంకర విజయేంద్ర సరస్వతికి పట్టాభిషేకం చేయనున్నారు. ఈయన అసలు పేరు శంకరనారాయణన్. 1969 మార్చి 18న జన్మించారు. తిరువళ్లూరు జిల్లా ఆరణి సమీపంలోని పెరియపాళయం గ్రామం ఆయన స్వస్థలం. 1983 మే 29న పోలూరులో ఆధ్యాత్మిక గురువయ్యారు. జయేంద్ర సరస్వతితో కలసి అడుగులు వేశారు. వివాదాల్లోనూ, కారాగారవాసంలోనూ తోడుగానే నిలబడ్డారు. మేఘాలయ వరకు పర్యటించి ఆధ్యాతిక బోధనలు చేశారు. పెడదారి పడుతున్న యువతను సన్మార్గంలో నడిపించడంతో పాటు విద్యా ప్రమాణాల పెంపు, దేశంలో సాంస్కృతిక, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, కొరవడుతున్న నైతిక, మానవీయత విలువల్ని రక్షించే రీతిలో ఆయన పయనం సాగించారు. యువకుల్లో చైతన్యం లక్ష్యంగా ఎక్కువ సమయాన్ని కేటాయించారు. పురాతన సాహిత్యాన్ని కాపాడడం, భారతీయ, విదేశీ భాషల్లో భక్తుల కోసం అనేక ప్రచురణలను తీసుకొచ్చారు. పంచ భూతాల్లో పృథ్వీ క్షేత్రం.. కాంచీపురం దక్షిణ భారతంలో ఉన్న శివ ఆరాధనలో పంచ భూతాల్లో పృథ్వీ క్షేత్రంగా కాంచీపురం అలరారుతోంది. ఈ క్షేత్రంలోని కంచి కామకోటి పీఠానికి విశిష్ట చరిత్ర ఉంది. ఆది శంకరాచార్య చేతుల మీదుగా ఆవిర్భవించిన ఈ మఠం ద్వారా హిందూ మత సేవలో రెండు దశాబ్దాలకు పైగా జయేంద్ర సరస్వతి నిమగ్నమయ్యారు. భౌగోళికంగా భూమి(కాంచీపురం), ఆకాశం(కడలూరు జిల్లా చిదంబరం), గాలి( చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి), అగ్ని(తిరువణ్ణామలై), నీరు(తిరువన్నై కోయిల్) క్షేత్రాలను పిలుస్తుంటారు. వీటన్నింటి సమ్మేళనంతో శ్రీ కంచి కామకోటి పీఠం ఆవిర్భవించినట్టు చరిత్ర చెబుతోంది. ఈ మఠానికి తల భాగంగా శంకరాచార్య వారిని అభివర్ణిస్తుంటారు. క్రీ.శ 482లో ఆది శంకర భగవత్పదచార్య స్వామి ఈ మఠాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఈ కామకోటి పీఠం సంప్రదాయంగా కామాక్షి అమ్మవారిని సూచిస్తుంటుంది. కామకోటి దుర్గాదేవిని సూచిస్తుంది. శ్రీ శంకర భగవత్పాడ(శ్రీశంకరాచార్య) స్వామి వారు కంచిలో స్థిరపడుతూ తన కంటూ ఓ సొంత నివాసంగా ఈ మఠాన్ని నెలకొల్పారు. ఆయన అడుగు జాడల్లో శిష్యులైన శ్రీ సురేశ్వర చార్య, సర్వజ్నాత్మాన్, సత్య భోదేంద్ర సరస్వతి, జ్ఞానందేంద్ర సరస్వతి, సుధానందేంద్ర సరస్వతి వంటి పీఠాధిపతుల నేతృత్వంలో సనాతన హిందూ ధర్మ పరిరక్షణలో ఈ పీఠం ముందుకు సాగింది. ఇది వరకు ఉన్న 68 మంది పీఠాధిపతులతో పోల్చితే, జయేంద్ర సరస్వతి ఈ పీఠం పరిరక్షణకు, హిందూ ధర్మ ప్రచారంలో విశిష్ట సేవల్ని అందించారు. ఆధ్యాత్మికమే కాదు, విద్య, వైద్య, సేవాపరంగానూ ఈ మఠాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన ఘనత ఆయనదే. -
కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం
-
‘కంచి కామకోటి పీఠం’ శంకుస్థాపన
కొలనుకొండ(తాడేపల్లి రూరల్): మండలంలోని కొలనుకొండ జాతీయ రహదారి మోడల్ డెయిరీ పక్కన కంచి కామకోటి పీఠం అమరావతి పుర శాఖ భవన సముదాయానికి ఆదివారం కంచి కామకోటి పీఠాధిపతులు స్వామి జయేంద్ర సరస్వతి, స్వామి విజయేంద్ర సరస్వతి శంకుస్థాపన చేశారు. అనంతరం విజయేంద్ర సరస్వతి మాట్లాడుతూ భవన నిర్మాణం అనంతరం ఇక్కడ నుంచే రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భవనంలో వేద పాఠశాల ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల స్వామీజీలు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement