-
కంది ధర ఢమాల్
సాక్షి, హైదరాబాద్: కంది ధర పతనమవుతోంది. మార్కెట్కు వస్తున్న రైతులను ప్రైవేటు వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. అత్యంత తక్కువ ధరకు కంది పంట కొనుగోలు చేస్తున్నారు. 2017–18 సంవత్సరానికి కేంద్రం కందికి ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటాలుకు రూ.5,450 కాగా.. మార్కెట్లలో రూ.4 వేల లోపే ధర పలుకుతోందని సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ తాజాగా తన నివేదికలో ప్రస్తావించడం పరిస్థితికి అద్దం పడుతోంది. కనిష్టంగా రూ.2 వేలు, గరిష్టంగా రూ.4 వేల వరకే ధర ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలాఖరు నుంచి కంది పంట మార్కెట్లలోకి విరివిగా రానుంది. గతేడాది గణనీయంగా ఉత్పత్తి ఉండటంతో డిమాండ్ తగ్గి ధర పడిపోయిందని భావించారు. కానీ ఈసారి ఉత్పత్తి తక్కువగా ఉన్నా డిమాండ్ పెరగకపోవడంపై రైతులు దిగాలు పడుతున్నారు. ఓవైపు పత్తి ధర పడిపోయి రైతులు హాహాకారాలు చేస్తుంటే.. మరోవైపు కంది కూడా రైతును కుదేలు చేస్తోంది. గతేడాది కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి కంది పప్పును దిగుమతి చేసుకోవడం వల్లే ధర పడిపోయిందని కొందరు అధికారులు విశ్లేషిస్తున్నారు. ఎక్కడెక్కడ ఎంతెంత ధర.. గతేడాది ఖరీఫ్లో కంది విస్తీర్ణం 10.77 లక్షల ఎకరాలు కాగా.. ఈ ఏడాది ఖరీఫ్లో కేవలం 6.27 లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఈసారి 1.65 లక్షల టన్నులు కంది ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సాధారణంగా కంది పంట నూర్పిడి డిసెంబర్లో మొదలవుతుంది. మార్చి వరకు మార్కెట్కు వస్తుంది. ఇప్పటికే కొన్నిచోట్ల మార్కెట్కు వచ్చింది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ గత నెల ఒకటో తేదీ నుంచి 15 వరకు రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో కందికి ఏ స్థాయిలో ధర పలికిందో వివరిస్తూ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం నవంబర్ 10న కరీంనగర్ మార్కెట్లో కందికి పలికిన గరిష్ట ధర క్వింటాలుకు రూ.3,056 మాత్రమే. అదేరోజు సూర్యాపేట మార్కెట్కు 235 క్వింటాళ్ల కంది పంట రాగా కనిష్ట ధర రూ. 3,069 పలికింది. గరిష్ట ధర రూ.3,929 పలికింది. అదే మార్కెట్లో 11న 156 క్వింటాళ్ల కంది రాగా.. కనిష్టంగా రూ.3,129, గరిష్టంగా రూ.3,843 ధర పలికింది. 13న వరంగల్ మార్కెట్కు 14 క్వింటాళ్ల కంది రాగా.. కనిష్ట ధర రూ.3,685, గరిష్ట ధర 3,789 మాత్రమే పలికింది. అదేనెల 14న ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు కనిష్టంగా రూ.2,100, గరిష్టంగా రూ.3,800 దక్కింది. కొనుగోలు కేంద్రాలపై స్పష్టత ఏది? కేంద్రం రాష్ట్రంలో కందిని ఎంఎస్పీకి కొనుగోలు చేయాలని సూచించింది. అయితే ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ఎన్ని ప్రారంభించాలన్న దానిపైనా స్పష్టత రాలేదు. గతేడాది 98 కంది కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ప్రారంభించింది. వాటి ద్వారా రికార్డు స్థాయిలో రూ.1,030 కోట్ల విలువైన 2.04 లక్షల టన్నుల కందిని కొనుగోలు చేసింది. మొత్తం 2.03 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇప్పటికే మార్క్ఫెడ్ను కంది కొనుగోలుకు నోడల్ ఏజెన్సీగా నియమించారు. త్వరగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తేనే రైతులకు ప్రయోజనం ఉంటుంది. లేకుంటే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. పెద్ద నోట్ల రద్దు ఓ కారణం ఈసారి దేశవ్యాప్తంగా పప్పుధాన్యాల ధరలు పడిపోతున్నాయి. ప్రస్తుతం అదే తీరు కొనసాగుతోంది. మున్ముందు ఇలాగే ఉండనుంది. ఉత్పత్తి తగ్గినా డిమాండ్ పెరగకపోవడానికి పెద్ద నోట్ల రద్దు ఒక కారణంగా కనిపిస్తుంది. వ్యాపారుల వద్ద గతంలో మాదిరి నగదు చేతిలో లేదు. దీంతో ఎక్కువ పరిమాణంలో కందిని కొనుగోలు చేయడం లేదు. ఇతర పంటల పరిస్థితి అలాగే ఉంది. కేంద్రం కందికి ప్రకటించిన ఎంఎస్పీ రూ.5,450 కాగా.. మార్కెట్లో రూ.4 వేల కంటే తక్కువగా వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కదలాలి. రైతుల నుంచి కందిని కొనుగోలు చేయాలి. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు లేఖ రాశాను. – పార్థసారథి, వ్యవసాయ శాఖ కార్యదర్శి -
కందులకు ధర రాలేదని.. రైతు ఆత్మహత్య
దౌల్తాబాద్: ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు ధర రాలేదని మనస్తాపానికి గురైన ఓ కందిరైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం సూరయపల్లిలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన బిచ్చయ్య(52) కందిపంట సాగు చేశాడు. పండిన పంటను అమ్మడానికి యత్నించగా సరైన ధర రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన బిచ్చయ్య పొలంలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. -
‘కందుల ధర ఢమాల్’పై సీఎస్ ఆరా
‘సాక్షి’కథనంపై సర్కారు స్పందన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కంది ధర పడిపోవడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ ఆరా తీశారు. ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన ‘‘చేతి‘కంది’నా చేయూత కరువు’’కథనంపై ఆయన స్పందించారు. గతేడాది కంటే క్వింటాలుకు రూ. 2 వేలు పైగా ధర పడిపోవడానికి గల కారణాలను తెలపాలంటూ వ్యవసాయ శాఖను ఆయన ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ తీసుకుంటున్న చర్యలేంటో నివేదిక ఇవ్వాలని కోరినట్లు సమాచారం. రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించినట్లు తెలిసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement