-
గంటా లాంటి నీచుడు రాజకీయాల్లో లేడు
రాజకీయాల్లో విజయం సాధించాలనే సంకల్పం సహజం. దాని కోసం ప్రజలకు చేరుక కావడానికి అభ్యర్థులు తమ లక్ష్యాలను వివరిస్తారు. మంత్రి గంటా శ్రీనివాసరావు లాంటి అవినీతి పరులు మాత్రం పూర్తిగా అర్ధం మార్చేశారు. ఐదేళ్లకోసారి నియోజకవర్గాలను మార్చుతూ.. దొడ్డి దారిన సంపాదించిన సొమ్ముతో ఓటర్లను, నాయకులనుకొనుగోలు చేసే నీచుడు.. ఇలాంటి రాజకీయ నాయకుడు ఉండరు అని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ విశాఖపార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు కంతేటి సత్యనారాయణరాజు అన్నారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన పరిశీలనకు వచ్చిన అంశాలను వివరించారు. సాక్షి: విశాఖ పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన మీరు ఏడు నియోజకవర్గాల ప్రజలను కలిశారు ..ఓటర్ల నాడి ఎటువైపు ఉంది? కంతేటి : నేను విశాఖ పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడిగా వచ్చి నెలరోజులైంది. అన్ని వర్గాల ప్రజలను కలిసి మాట్లాడాను. విశాఖలో ప్రభుత్వ భూములను కబ్జాలు చేశారని, చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని భూకుంభకోణాలతో భ్రష్టు పట్టించిందని చెప్పారు. దాదాపు 70 శాతం విశాఖ ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. రాజన్న తనయుడికి ఒక్క అవకాశం ఇచ్చి చూద్దామనే ఆలోచన విశాఖ ప్రజల్లో బలంగా ఉంది. సాక్షి:‘నవరత్నాల’కు ప్రజాధరణ ఎలా ఉంది ? అవి ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారా? కంతేటి :వందశాతం ప్రజల్లోకి తీసుకెళ్లాం. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలు అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించాయి. ప్రధానంగా మా పార్టీలో బూత్ కమిటీలు ఏర్పాటు చేసి వారి ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాం. నవరత్నాలతో ప్రజలలో విశేషస్పందన వచ్చింది. ఇది మా తొలివిజయంగా భావిస్తున్నాం. సాక్షి:విశాఖలో డబ్బు ప్రభావం ఎక్కువ ఉండనుందా..? నియోజక వర్గాలు మారే గంటాను ఓడించనున్నారా? కంతేటి :గంటాను విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. అవినీతి డబ్బుతో మంత్రి గంటా అడ్డగోలుగా ఓటర్ల ప్రభావితం చేయాలని డబ్బు జల్లుతున్నాడు. రాజకీయమంటే కేవలం డబ్బు కాదని, విశాఖ ప్రజలు డబ్బుకు దాసోహం అవ్వరని ఈ ఎలక్షన్లో చూపిస్తారు. ఒక్కో ఎలక్షన్కు ఒక్కో నియోజకవర్గం మారే అవినీతి మంత్రి గంటాను విజ్ఞలైన విశాఖ ఉత్తర ప్రజలు ఓడించడం తధ్యం. సాక్షి: ఈ ఎన్నికల్లో యువత, నిరుద్యోగులు ఏ పార్టీవైపు ఉంటారు? కంతేటి : ఈ ఎన్నికల్లో యువత, నిరుద్యోగులు వైఎసార్సీపీకే ఓట్లు వేయనున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాల్లో 10 ఉద్యోగాలు, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా రెండు లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలకు రోస్టర్ విధానం అమలు, స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించనున్నారు. సాక్షి:మీకు వైఎస్ రాజశేఖరరెడ్డితో ఉన్న అనుబంధం గురించి చెప్పండి.? కంతేటి : మేము స్నేహితులంగా ఉండేవాళ్లం. 1980–82 ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, నేను కేబినేట్ మంత్రులుగా చేశాం. అప్పటి నుంచే రాజశేఖరరెడ్డితో సాన్నిహిత్యం ఉండేది. 2004 ఎన్నికల్లో గెలిచేముందు వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రకు ప్రజలు ఏవిధంగా బ్రహ్మరథం పట్టారో..ఇప్పుడు ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు రెట్టింపు ఆదరణ లభించింది. అప్పుడు రాజశేఖరరెడ్డితో పాటు పాదయాత్ర నేనూ చేశాను. -
కాంగ్రెస్ పార్టీని కిరణ్ మోసం చేశారు: కంతేటి
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మోసం చేశారని ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు మండిపడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం పార్టీని భ్రష్టు పట్టించిందని, కాంగ్రెస్లో గంజాయి మొక్కల సంఖ్య పెరుగుతోందని ఆయన విమర్శించారు. పార్టీలో కుల, మత , అవినీతి ప్రాబల్యం అధికమవుతోందని, పార్టీ సీమాంధ్ర నాయకత్వం కూడా విఫలమైందని ఆయన చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉందని, గెలుపోటములతో సంబంధం లేకుండా నేతలు ఎన్నికల బరిలోకి దిగితేనే కాంగ్రెస్ బలపడుతుందని కంతేటి అన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ఏడాది ఆలస్యం చేసి తప్పుచేశారని మండిపడ్డారు. -
కంతేటి, ఎల్లయ్య, రత్నాబాయి పేర్లు ఖరారు
న్యూఢిల్లీ: గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న నాలుగు నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలకు ముగ్గురు పేర్లను కాంగ్రెస్ ఖరారు చేసింది. కంతేటి సత్యనారాయణరాజు, నంది ఎల్లయ్య, రత్నాబాయి పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. నామినేటెడ్ ఎమ్మెల్సీల రేసులో పలువురు నేతలు నిలిచినప్పటికీ పీసీసీ క్రమశిక్షణ సంఘం కమిటీ ఛైర్మన్ కంతేటి సత్యనారాయణరాజు, పదవీకాలం పూర్తి కానున్న ఎంపీలు నంది ఎల్లయ్య, రత్నాబాయిలకు కాంగ్రెస్ అవకాశం కల్పించింది. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణి పేరు కూడా వినిపించినప్పటికీ ఆమెకు అవకాశం దక్కలేదు. అయితే నాలుగో స్థానంపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీన్ని ఎవరికి కట్టబెడతారనే దానిపై కాంగ్రెస్ పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. ఆశావహలు నాలుగో సీటుపై ఆశలు పెట్టుకున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
Advertisement