-
నన్ను కించపరిచే విధంగా చంద్రబాబు మాట్లాడాడు -కరణం బలరాం
-
డిష్యుం.. డిష్యుం!
♦ కరణం, గొట్టిపాటి వర్గీయుల బాహాబాహీ ♦ ఇంటి స్థలాల పంపిణీ వివాదంలో ఘర్షణ ♦ కొరిశపాడు తహశీల్దార్ కార్యాలయం వేదిక ♦ ఇరువర్గాలను స్టేషన్కు తరలించిన పోలీసులు సాక్షి ప్రతినిధి, ఒంగోలు : అద్దంకిలో కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ల వర్గీయులు పరస్పరం సై అంటే సై అంటున్నారు. ఎక్కడపడితే అక్కడ బాహాబాహీకి దిగుతున్నారు. తాజాగా బుధవారం సాయంత్రం కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన కరణం వర్గీయుడు జాగర్లమూడి జయకృష్ణ, గొట్టిపాటి వర్గీయుడు, సర్పంచ్ రావి శ్రీధర్లు కొరిశపాడు తహశీల్దార్ కార్యాలయంలో పరస్పరం దాడులకు దిగారు. చొక్కాలు చింపుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. సాక్షాత్తు తహశీల్దార్ కార్యాలయమే ఇందుకు వేదిక కాగా, తహశీల్దార్ సాక్షిభూతంగా నిలిచారు. పమిడిపాడులో ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారం ఇందుకు కారణంగా తెలుస్తోంది. మండలంలోని పమిడిపాడు గ్రామపరిధిలోని సర్వే నెం.797, 798, 800, 807 పరిధిలో 15 ఎకరాలు స్థలం ఉంది. ఈ స్థలాన్ని గ్రామానికి చెందిన ఎస్సీ, బీసీ, ఓసీలకు చెందిన 362 మందికి పట్టాలివ్వాలంటూ టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో గత ఐదు నెలలుగా అధికారులు ఇదే కసరత్తులో ఉన్నారు. ఇటీవల గొట్టిపాటి వర్గానికి చెందిన సర్పంచ్ రావి శ్రీధర్ ఆధ్వర్యంలో వారి వర్గీయులు 15 ఎకరాల్లో 8 ఎకరాలను ఆక్రమించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అందరికీ పట్టాలు పంపిణీ చేయాలనుకున్న స్థలాన్ని గొట్టిపాటి వర్గీయులు ఆక్రమించుకోవడంతో ఆ స్థలాన్ని ఖాళీ చేయించి గ్రామస్తులందరికీ వెంటనే పట్టాలు పంపిణీ చేయాలంటూ కరణం బలరాం స్థానిక తహశీల్దార్పై ఒత్తిడి పెంచారు. దీంతో ఒకటి, రెండు రోజుల్లోనే 15 ఎకరాలను పూర్తిగా సర్వే చేసి అందులో గ్రామానికి చెందిన 362 మందికి పట్టాలు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తహశీల్దార్ ఎదుటే ధూషణల పర్వం.. విషయం తెలుసుకున్న గొట్టిపాటి వర్గీయుడు, సర్పంచ్ రావి శ్రీధర్ బుధవారం సాయంత్రం తహశీల్దార్ కార్యాలయానికి తన వర్గీయులతో వెళ్లారు. తమ స్వాధీనంలో ఉన్న పొలాలను సర్వే చేసి పంపిణీ చేయాలనుకుంటే ఊరుకునేది లేదని తహశీల్దార్పై గొడవకు దిగారు. అదే సమయంలో కరణం వర్గానికి చెందిన ఎంపీపీ అనుచరుడు జాగర్లమూడి జయకృష్ణ సైతం తన అనుచరులతో తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. స్థలాలు పేదలకు పంచాల్సిందే అంటూ కరణం వర్గీయులు, తమ స్వాధీనంలో ఉన్న పొలాల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ గొట్టిపాటి వర్గీయులు తహశీల్దార్ పి.వి.సాంబశివరావు ముందే వాదనకు దిగారు. మాటా మాటా పెరిగింది. తిట్లు, దూషణలు మిన్నంటాయి. వాగ్వాదం పతాకస్థాయికి చేరింది. వెంటనే రావి శ్రీధర్, జాగర్లమూడి జయకృష్ణలు ఒకరిపై ఒకరు కలియబడ్డారు. ‘నీ అంతు తేలుస్తానంటే.... నీ అంతు తేలుస్తానంటూ’ హెచ్చరికలు జారీ చేసుకున్నారు. గొడవ తీవ్రరూపం దాల్చటంతో తహశీల్దార్తో పాటు అక్కడున్న కొందరు ఇద్దరిని విడిపించారు. ఇంతలో కొందరు మేదరమెట్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన కొరిశపాడుకు చేరుకున్న మేదరమెట్ల పోలీసులు ఇద్దరిని పోలీస్స్టేషన్కు తరలించారు. పమిడిపాడులో పోలీస్ పికెట్.. ఇటు సర్పంచులతో పాటు రావి శ్రీధర్, ఎంపీపీ అనుచరుడు జాగర్లమూడి జయకృష్ణలపై రౌడీషీట్లు ఉన్నాయి. ఇద్దరి గొడవతో పమిడిపాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు పమిడిపాడులో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. పమిడిపాడులో 15 ఎకరాల స్థలాన్ని గ్రామస్తులందరికీ ఇంటి స్థలాలుగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తహశీల్దార్ పి.వి.సాంబశివరావు సాక్షికి తెలిపారు. అయితే ఒక వర్గం అందులో 8 ఎకరాలను ఆక్రమించుకున్నట్లు ఫిర్యాదు వచ్చిందన్నారు. ఆక్రమణలు తొలగించి గ్రామంలోని 362 మందికి పట్టాలు పంపిణీ చేయాలనుకున్న మాట నిజమేనన్నారు. ఇంతలో ఇరువర్గాలు వచ్చి గొడవ పడ్డారని తహశీల్దార్ తెలిపారు. ఇరువర్గాలు తహశీల్దార్ కార్యాలయంలోనే గొడవకు దిగిన విషయం సమాచారం అందటంతో అక్కడికి చేరుకొని ఇద్దరిని పోలీస్స్టేషన్లో ఉంచినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఇద్దరిపై రౌడీషీట్లు ఉన్నాయన్నారు. గ్రామంలో గొడవలు జరగకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా పోలీస్ పికెటింగ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
ప్రకాశం టీడీపీలో ‘మినీ’రణం
- కరణం, గొట్టిపాటి వర్గీయుల మధ్య ఘర్షణ - మంత్రులు, పార్టీ పరిశీలకుని ముందే రచ్చ రచ్చ సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు రోడ్డెక్కాయి. శనివారం ఒంగోలులో నిర్వహించిన మినీ మహానాడు వేదికగా.. అధికారపార్టీ పాత నేత కరణం బలరాం, కొత్తగా పార్టీలో చేరిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గాలమధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రులు రావెల కిషోర్బాబు, శిద్దా రాఘవరావు, పార్టీ పరిశీలకుడు బుచ్చయ్యచౌదరి.. సమక్షంలోనే ఇరువర్గాలవారు బాహాబాహీకి దిగారు. పరస్పరం దాడులకు దిగి సమావేశంలోనే కొట్టుకున్నారు.అడ్డొచ్చిన పోలీసులను తోసేశారు. ఈ నేపథ్యంలో అదనపు పోలీసు బలగాలు రావడంతో గొడవ సర్దుమణిగింది. అనంతరం గొట్టిపాటి మాట్లాడుతుండగా మళ్లీ గొడవ చెలరేగింది. దాంతో ప్రసంగాన్ని అర్ధంతరంగా ముగించి సమావేశం నుంచి గొట్టిపాటి వె ళ్లిపోయారు. తర్వాత ప్రసంగించిన కరణం బలరాం బహిరంగంగానే గొట్టిపాటిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్యాకేజీలకోసం వచ్చినవారు అదే చూసుకోవాలితప్ప తమ కార్యకర్తల్ని టార్గెట్ చేస్తే సహించేది లేదన్నారు. కొత్తగా వచ్చినవారు తమ మెడలపెకైక్కి స్వారీ చేయాలని చూస్తే.. బే ఆఫ్.. బెంగాల్(బంగాళాఖాతం)లో వేస్తామని వ్యాఖ్యానించారు. చాల్లే... మూసుకుని కూర్చో.. టీడీపీ జిల్లా మినీ మహానాడు కార్యక్రమాన్ని శనివారం ఉదయం 11.30 గంటలకు ఒంగోలులో నిర్వహించారు. తొలుత గొట్టిపాటిని వేదికపై కూర్చోనివ్వద్దంటూ కరణం వర్గీయులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసుల సహకారంతో గొట్టిపాటి వేదికపైకి చేరుకున్నారు. తర్వాత గొట్టిపాటి ప్రసంగిస్తుండగా.. ‘చాల్లే.... మూసుకొని కూర్చో... టీడీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీశావు. పదేళ్లు కేసులు భరించాం... ఇప్పుడు అధికారంకోసం పార్టీలో చేరతావా?’ అంటూ కరణం వర్గీయులు దూషించారు. ప్రసంగాన్ని అడుగడుగునా అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇందుకు ప్రతిగా గొట్టిపాటి వర్గీయులూ నినాదాలకు దిగారు. దీంతో మరలా ఘర్షణ వాతావరణం నెలకొంది. మంత్రులతోపాటు బుచ్చయ్యచౌదరి ఎంత వారించినా గొడవ సద్దుమణగలేదు. మరోమారు పోలీసులు రంగప్రవేశం చేయాల్సివచ్చింది. తర్వాత గొట్టిపాటి సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. స్వారీ చేస్తే సహించం: అనంతరం కరణం బలరాం మాట్లాడారు. గతంలో అధికారం అనుభవించి తమను ఇబ్బంది పెట్టిన గొట్టిపాటి.. ఇప్పుడు అధికారంకోసం సీఎం కార్యాలయం చుట్టూ పలుమార్లు తిరిగి పార్టీలో చేరారని మండిపడ్డారు. తమపై స్వారీచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అంతేగాక పార్టీ పెద్దలు అధిష్టానానికి వాస్తవాలు చెప్పాలంటూ ఆయన మంత్రులనుద్దేశించి వ్యాఖ్యానించారు. గొట్టిపాటి.. నియోజకవర్గంలో పోలీసులతోపాటు అధికారుల్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోలీసు బలగాల్లేకుండా ఆయన బయట తిరగలేరన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వైభవంగా గంగమ్మ జాతర..
ఉప్పు తగ్గించండిరా బాబోయ్! ఏటా 25 లక్షలమందికి ముప్పు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ ఫుల్ క్లారిటీ
విజయనగరం పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ వద్ద హైడ్రామా
వైద్యుడి నిర్లక్ష్యం..నాలుగేళ్ల చిన్నారి గొంతు మూగబోయింది!
Aishwarya Rajesh: సోయగంతో కవ్విస్తున్న ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)
తాడిపత్రి ఘటనలకు పోలీసులు బాధ్యత వహించాలి- YSRCP నేతలు
ఆగిపోయిన సూర్య & సుధా కొంగర కొత్త సినిమా
టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు
డార్లింగ్ లైఫ్లోకి స్పెషల్ పర్సన్?.. ఆసక్తికర పోస్ట్ (ఫొటోలు)
తప్పక చదవండి
- కొన్నేళ్లుగా పోలీసుల రక్షణలో సూర్య ఇల్లు.. కారణం ఇదే
- రెండు రోజులుగా బెంబేలెత్తించిన బంగారం.. నేడు కాస్త..
- తీహార్ జైల్లో కవితతో ఆర్ఎస్పీ, సుమన్ ములాఖత్
- షుగర్ పేషంట్లకు శుభవార్త.. మందుల ధరలు తగ్గింపు
- Paris Olympics 2024: ఒలింపిక్స్కు తెలంగాణ అమ్మాయి
- బదిలీల తర్వాతే హింస!
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- టీడీపీ చెప్పినట్లు ఆడినందుకే
- IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Advertisement