-
‘బిడ్డా.. ఇంటికి రా’ అని పోస్టు పెట్టాడు.. అంతలోనే!
శ్రీనగర్: దక్షిణ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతా దళాలు, మిలిటెంట్లకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 18 ఏళ్ల ఫర్హాన్ వనీ కూడా ప్రాణాలు విడిచాడు. కుల్గామ్ జిల్లాలోని ఖుద్వానీ గ్రామానికి చెందిన ఫర్హాన్ వనీ గత ఏడాది మధ్యలో మిలిటెన్సీలో చేరాడు. గత నవంబర్లో అతని తండ్రి గులం మహమ్మద్ వనీ ఫేస్బుక్లో కొడుకును ఉద్దేశించి భావోద్వేగమైన పోస్టు పెట్టాడు. ‘బిడ్డా హింసను విడనాడి.. ఇంటికి తిరిగిరా’ అంటూ హృదయాన్ని పిండేసిరీతిలో విజ్ఞప్తి చేశాడు. ‘బిడ్డా.. నువ్వు మమ్మల్ని విడిచి వెళ్లిన నాటినుంచి నా శరీరం నా మాట వినడం లేదు. నువ్వు చేసిన దానికి బాధతో నేను అల్లాడిపోతున్నాను. అయినా నువ్వు ఇంటికి తిరిగి వస్తావన్న నమ్మకం నాలో ఉంది’ అని గులాం నవంబర్ 24న వనీ ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశాడు. ‘చిరునవ్వుతో కూడిన నీ ముఖాన్ని నేనెంతగా మిస్ అవుతున్నానో వివరించలేను. నువ్వు వెళ్లి ఆరు నెలలు అవుతోంది. నీ ఆలోచన లేకుండా ఒక్క నిమిషం కూడా నాకు గడవడం లేదు. నువ్వు బాగున్నావని, బాగుంటావని ఆశతో బతుకుతున్నాను. నేను నీ తండ్రిని. నేను కాకపోతే ఈ విషయాన్ని ఎవరు నీకు చెప్తారు.. నేను చనిపోతానేమో అనిపిస్తోంది. నాకు మరో మార్గం లేదు. నీకు నేను చాలా చెప్పాల్సి ఉంది. ఎంతో నేర్పించాల్సి ఉంది. తిడుతూ నీకు సాయం చేయాల్సి ఉంది’ అంటూ హృదయాన్ని కదిలించేరీతిలో గులాం ఈ పోస్టు పెట్టారు. వనీ తల్లి కూడా కొడుకు కోసం ఎంతో తపించిపోతున్నదని, నువ్వు ఎంచుకున్న మార్గాన్ని వదిలి ఇంటికి తిరిగి రావాలని, గడిచిందంతా మరిచిపోవాలని, నువ్వు ఎంచుకున్న మార్గం వల్ల నువ్వు శాశ్వతంగా దూరం అయ్యే అవకాశం కూడా ఉందని, కాబట్టి త్వరగా ఇంటికి తిరిగిరావాలని వేడుకుంటూ గులాం ఈ పోస్టు పెట్టాడు. మిలిటెన్సీలో చేరిన ఫుట్బాలర్ మజిద్ ఖాన్.. తన తల్లిదండ్రులు ఫేస్బుక్లో పెట్టిన పోస్టు చూసి.. తిరిగి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన నేపథ్యంలో గులాం కూడా అదే ఆశతో ఈ పోస్టు పెట్టాడు. పోలీసులు కూడా మిలిటెన్సీలో కలిసిపోయిన స్థానిక యువకులు, విద్యార్థులు తిరిగి జనజీవనస్రవంతిలో కలువాలని, వారిపై ఎలాంటి కేసులు, విచారణలు ఉండవని భరోసా ఇస్తున్నారు. అయినా, అతని పోస్టు వృథానే అయింది. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో ఫర్హాన్ వనీ మృతిచెందడం ఆయన కుటుంబంలో విషాదం నింపింది. -
వందల పెల్లెట్లు దిగాయి... చూపు పోయింది
జమ్ము,కశ్మీర్ : కశ్మీర్ లోయలో జరుగుతున్న హింస వందలాది యువకులను వికలాంగులుగా మారుస్తోంది. అతి సమస్యాత్మక ప్రాంతాల్లో వాడే పెల్లెట్ గన్ ప్రయోగం వివాదాస్పదమవుతోంది. పాత బారాముల్లా, పఠాన్, ఉత్తర, దక్షిణ కశ్మీర, పులవామా జిల్లాల్లో పిల్లెట్ గన్ బాధితుల సంఖ్య రోజుకు రోజుకూ పెరుగుతోంది. తాజాగా ఉత్తర కశ్మీర్ జిల్లాలో మిర్వాజ్ మౌల్వి ఫరూఖ్ 25వ వర్ధంతి సందర్భంగా గురువారం జరిగిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. పోలీసుల కాల్పులతో ఒక యువకుడు తన కంటిచూపును కోల్పోయాడు. పోలీసులు అతి తక్కువ దూరం నుండి జరిపిన పెల్లెట్ గన్ కాల్పుల్లో అనేకమంది గాయాల పాలయ్యారు. హమీద్ భట్ అనే పదహారేళ్ల యువకుడి ముఖం, తలలోకి దాదాపు 100 పెల్లెట్స్ (ఇనుప గోలీలు) దూసుకుపోయాయి. దీంతో అతని కుడికన్ను చూపును కోల్పోయాడు. కళ్లు, పెదాలు, ముక్కు ఇలా ముఖం అంగుళం ఖాళీ లేకుండా చాలా దారుణంగా గోలీలు దిగబడ్డాయి. అతని ముఖాన్ని తూట్లు, తూట్లుగా రంధ్రాలు చేశాయి. తీవ్ర గాయాలతో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ర్యాలీకి తమ కొడుక్కి సంబంధం లేదని భట్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ట్యూషన్కు వెళ్లి తిరిగి వస్తుండగా అతి సమీపం నుండి కాల్పులు జరిపారని తెలిపారు. రక్తమోడుతున్న అతన్ని ముఖాన్ని చూసి మొదట పోల్చుకోలేకపోయామని హమీద్ సోదరుడు జునైద్ నజీర్ తెలిపారు. గత ఐదేళ్లుగా ఇలా పెల్లెట్ గన్ కాల్పుల మూలంగా చాలామంది యువకులు చూపును కోల్పోతున్న కేసులు నమోదవటం ఆందోళన కలిగిస్తోందని డాక్టర్ రషీద్ అన్నారు. ముఖ్యంగా శ్రీ మహారాజ్ హరిసింగ్, బెమినా ఆసుపత్రి వైద్యులు చెపుతున్న లెక్కల ప్రకారం సుమారు 700మందికి పైగా యువకులు తమ చూపును కోల్పోయినట్టు తెలుస్తోంది. ఇలాంటి కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంపై శ్రీనగర్ కు చెందిన ప్రముఖ సీనియర్ నేత్ర వైద్యులు కూడా కలవరపడుతున్నారు. గాయపడిన యువకులు ప్రాణాలకు ప్రమాదం లేకున్నా... జీవితాన్ని కోల్పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో పెల్లెట్ గన్స్ వాడకాన్ని ప్రభుత్వం నియంత్రించింది. అయినా కొన్ని నగర శివారు ప్రాంతాల్లో, గ్రామాల్లోని కొన్నివెనుకబడిన ప్రాంతాలు, లోయ ప్రాంతాల్లో పెల్లెట్ గన్నును పోలీసులు విచ్చల విడిగా వాడుతున్నారని విమర్శలు చెలరేగుతున్నాయి. పెద్దగా హాని చేయని 9 నంబరు పెల్లెట్స్ వాడాలని రాతపూర్వక ఆదేశాలున్నా 5-12 నంబరు పెల్లెట్స్ వాడుతున్నారని మానవ హక్కుల సంఘాలు గగ్గోలు పెడతునే ఉన్నాయి. మరోవైపు పోలీసుల వేధింపులు, అరెస్టులకు భయపడిన గాయపడిన చాలామంది శరీరంలో పెల్లెట్స్, ఇన్ఫెక్షన్స్తోనే ఆసుపత్రుల నుండి వెళ్లిపోతున్నారని సమాచారం. అయితే విద్యాశాఖమంత్రి నయీమ్ అక్తర్ వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగించాయి. ఈ విషయం తమ దృష్టికి రాలేదనీ, పెల్లెట్ గన్స్ వాడకంపై వారి కారణాలు వారికి ఉంటాయంటూ పోలీసులను వెనకేసుకొచ్చారు. తొందరలోనే వీటిని నిషేధిస్తారని ఆశిస్తున్నానన్నారు. దీంతో ముఫ్తీ మహమ్మద్ సయాద్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను పోలీసులు అధికారులు ఖండిస్తున్నారు. నిబంధనల పరిధిలోనే వీటిని వాడుతున్నామంటున్నారు. ఒకసారి పెల్లెట్ గన్ ప్రయోగిస్తే ఒక్కసారిగా వందలాది గోలీలు ఆందోళనకారులపై దూసుకుపోతాయని.. అందుకే ఎక్కువమంది గాయపడుతూ ఉంటారని పోలీసు అధికారులంటున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement