-
Hyderabad: మాజీ ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడ్డ సాఫ్ట్వేర్ ఇంజినీర్
సాక్షి, హైదరాబాద్: అర్ధరాత్రి సాఫ్ట్వేర్ ఇంజినీర్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలి ఇంట్లోకి చొరబడ్డాడు. తమను హత్య చేసేందుకు వచ్చాడని ఆరోపిస్తూ ఆమె కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బల్కంపేట రోడ్డులో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి ఓ వ్యక్తి ప్రహరీ దూకి మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ఉంటున్న పై పోర్షన్ గది తలుపులు తెరిచేందుకు యత్నించాడు. కింది ఫ్లోర్లో డ్రైవర్ అప్రమత్తమై ప్రసూనకు ఫోన్ చేసి ఎవరో తన గదికి బయటి నుండి గడియ వేశారని తెలిపాడు. దీంతో అప్రమత్తమైన ఆమె కుటుంబ సభ్యులు లైట్లు వేయడంతో సదరు వ్యక్తి తిరిగి గోడ దూకి పారిపోయాడు. సీసీ కెమెరాల ఫుటేజీలను ఆధారంగా ప్రసూన, ఆమె కుమార్తె కరణం అంభిక కృష్ణ చౌదరి తమ అనుచరులతో కలిసి అతడి కోసం గాలించారు. సమీపంలోని బార్లో కూర్చుని ఉన్న నిందితుడిని పట్టుకున్నారు. అతడిని ప్రశ్నించగా ప్రకాశం జిల్లా, కనిగిరికి చెందిన చంద్రశేఖర్ అని చెప్పినట్లు కరణం అంభిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కరణం వెంకటేష్ అనే వ్యక్తితో తనకు విభేదాలున్నాయని, తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆమె ఆరోపించింది. వెంకటేష్ అనుచరుడు త్రివేది అనే వ్యక్తిపై ఇదివరకే చీరాల డీఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపింది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని చంద్రశేఖర్రెడ్డిగా గుర్తించినట్లు ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్న అతను బల్కంపేటలోని ఓ హాస్టల్లో ఉంటున్నట్లు తెలిపారు. మద్యం మత్తులో ఇంట్లోకి ప్రవేశించానని చెబుతున్నాడని, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. చదవండి: కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య -
మమ్మల్ని అడ్డం పెట్టుకుని రెచ్చగొడుతున్నారు
హైదరాబాద్: సెక్షన్ -8 ఉండాలి... కాని ఇప్పుడు అమలు చేయాల్సిన పరిస్థితి అయితే లేదని సెటిలర్స్ ఫోరం కన్వీనర్ కాట్రగడ్డ ప్రసూన అభిప్రాయపడ్డారు. గురువారం హైదరాబాద్లో కాట్రగడ్డ ప్రసూన విలేకర్లతో మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటుతో హైదరాబాద్ విలువ పెరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ పాలకులు మమ్మల్ని అడ్డం పెట్టుకుని రెచ్చగొడుతున్నారని ఆమె ఆరోపించారు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను కాట్రగడ్డ ప్రసూన ఖండించారు. తెలంగాణ సచివాలయంలో సెటిలర్స్ కోసం ఫిర్యాదు కేంద్రం ఏర్పాటు చేయాలని కాట్రగడ్డ ప్రసూన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement