-
Kurnool, Nandyal: టీడీపీలో రగులుతున్న అసమ్మతి మంటలు
తెలుగుదేశం పార్టీలో అసమ్మతి మంటలు రగులుతూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఒక చోట ఎవరో ఒకరు ఆ పార్టీ అధిష్టానంపై ధిక్కారస్వరం వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. డోన్ అభ్యరి్థగా ధర్మవరం సుబ్బారెడ్డిని చంద్రబాబు ప్రకటించిన తర్వాత వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా డోన్ నుంచి కేఈ కుటుంబం పోటీ చేస్తుందని కేఈ వ్యాఖ్యానించడం చూస్తే నేరుగా అధిష్టానంతోనే అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారనేది స్పష్టమవుతోంది. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో టీడీపీతో పాటు ఇతర రాజకీయ పార్టీల్లో ప్రస్తుతం ఈ అంశమే తీవ్ర చర్చనీయాంశమైంది. సాక్షిప్రతినిధి కర్నూలు: టీడీపీలోని బలమైన కుటుంబాల్లో కేఈ కుటుంబం ఒకటి. ముఖ్యంగా డోన్ నియోజకవర్గాన్ని 40 ఏళ్లుగా తమ గుప్పిట్లో పెట్టుకుని రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. 2014 నుంచి కేఈ ప్రతాప్ టీడీపీ ఇన్చార్జ్గా కొనసాగారు. 2014, 2019లో డోన్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. ఈ క్రమంలో ఏడాది కిందట ధర్మవరం సుబ్బారెడ్డిని టీడీపీ ఇన్చార్జ్గా నియమించారు. ఆపై డోన్ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఏకంగా సుబ్బారెడ్డిని అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రకటనపై కేఈ కుటుంబం తీవ్రంగా రగిలిపోయింది. కేఈ వర్గీయులు బహిరంగంగా సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా కరపత్రాలు ముద్రించారు. బహిరంగ విమర్శలు చేశారు. అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. అయినా చంద్రబాబు తీరు మారలేదు. రాజకీయంగా బలపడే ఉద్దేశంతోనే ‘బీసీ’ పావులు కర్నూలు, నంద్యాల జిల్లా టీడీపీలో కేఈ, భూమా కుటుంబాల పెత్తనం సాగుతోంది. 2019 ఎన్నికల్లో కోట్ల కుటుంబం కూడా సైకిలెక్కింది. ఈ మూడు కుటుంబాల పెత్తనమే సాగుతుందని, వీరికి చెక్ పెట్టి రెండు జిల్లాల రాజకీయాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలనేది టీడీపీ బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి భావించినట్లు తెలుస్తోంది. ఆర్థికంగా బలంగా ఉండటంతో చంద్రబాబుకు కూడా బీసీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇన్చార్జ్గా కూడా నియమించారు. అధిష్టానం వద్ద ఉన్న చొరవతో జిల్లాలో బలమైన కుటుంబాలను బలహీన పరిచేలా పావులు కదుపుతున్నారు. తొలుత కేఈ కుటుంబం బలం తగ్గించేందుకు పత్తికొండకే పరిమితం చేసి డోన్ టిక్కెట్ దక్కకుండా ధర్మవరం సుబ్బారెడ్డి వెనుక తానే ఉండి వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో డోన్ నియోజకవర్గ ఖర్చు కూడా తానే భరిస్తానని బీసీ ఇచ్చిన హామీతోనే సుబ్బారెడ్డిపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత భూమా, కేఈ కుటుంబాలను లక్ష్యంగా చేసుకున్నారు. వీరిని దెబ్బతీసేందుకు కుటుంబానికి ఒకే టిక్కెట్ ప్రతిపాదన బీసీనే చంద్రబాబు వద్ద పదే పదే ప్రతిపాదించారని తెలుస్తోంది. దీంతో కుటుంబానికి ఒకే టిక్కెట్ అనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. ఆళ్లగడ్డలో అఖిలకు టిక్కెట్ ఇస్తే, నంద్యాలలో బ్రహ్మానందరెడ్డికి కాకుండా మైనార్టీ కోటాలో ఫరూక్ కుమారుడు ఫిరోజ్కు టిక్కెట్ ఇస్తే బాగుంటుందని ప్రతిపాదించారు. అలాగే కోట్ల సుజాతమ్మకు టిక్కెట్ దక్కకుండా ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల నుంచి బోయ, కురబలను బరిలోకి దింపితే బాగుంటుందని బీసీనే ప్రతిపాదించారని సమాచారం. ఈ దెబ్బతో కోట్ల కుటుంబం నుంచి కూడా సుజాతమ్మకు టిక్కెట్ దక్కే అవకాశాలు ఉండవు. దీంతో కేఈ, భూమా, కోట్ల కుటుంబాల బలం తగ్గించడంతో పాటు తాను ప్రతిపాదించిన అభ్యర్థులకు టిక్కెట్లు ఇస్తే ఎన్నికల ఖర్చు తానే భరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో బీసీ తనకంటూ కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉండి, ఉమ్మడి జిల్లాలో బలమైన నేతగా ఎదగాలని పథకం రచించారు. దీన్ని అమలు చేయడంలో భాగంగానే ఒక్కొక్క పావు కదుపుతున్నారని టీడీపీలోని కీలక నేతలు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. ఏదిఏమైనా డోన్ నుంచే పోటీ కేఈ ప్రభాకర్ జన్మదినాన్ని బుధవారం డోన్లోని ఓ ఫంక్షన్హాలులో ఘనంగా నిర్వహించారు. ఓరకంగా కేఈ బలపరీక్ష నిర్వహించారు. ఈ వేదికపై నుంచి కేఈ ప్రభాకర్ ఏకంగా చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేశారు. ‘జనబలం లేనివారిని ఇన్చార్జ్గా నియమించారు. వీరితో పారీ్టకి ప్రయోజనం లేదు. వచ్చే ఎన్నికల్లో కేఈ కుటుంబం కచ్చితంగా పోటీలో ఉంటుంది’ అని తేలి్చచెప్పారు. అంతటితో ఆగకుండా తనకు జనబలంతో పాటు ధనబలం కూడా ఉందనే సంగతి మరవొద్దన్నారు. టిక్కెట్ ఇవ్వకపోతే జన, ధన బలంతో ఇండిపెండెంట్గానైనా బరిలోకి దిగుతామని కేఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే ఆపార్టీ తో పాటు అన్ని పారీ్టల్లో తీవ్ర చర్చకు తెరలేపాయి. అసలు ఈ వివాదానికి ఆద్యుడు బీసీ జనార్దన్రెడ్డి అని కేఈ కుటుంబం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దిగజారుతున్న ప్రతిష్ట కర్నూలుకు వచ్చిన ‘న్యాయరాజధాని’కి వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబుకు జిల్లా వాసుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. భవిష్యత్తులో ఈ ఉద్యమం మరింత ఉధృతం కానుంది. ప్రజలంతా ‘న్యాయరాజధాని’ కావాలనే భావనలో ఉండటం, చంద్రబాబు దానికి భిన్నంగా వ్యవహరించడం టీడీపీకి పెద్ద అడ్డంకి. దీన్ని దాటుకుని ముందుకు వెళ్లడమే కష్టమనే భావనలో ఉన్న టీడీపీని అంతర్గత రాజకీయాలు, నేతల ధిక్కారస్వరాలు మరింత దిగజారుస్తున్నాయి. -
వైభవంగా అప్పన్న చందనోత్సవం
సింహాచలం: వైశాఖ శుద్ధ తదియని పురస్కరించుకుని సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. భక్తులు స్వామివారి నిజరూపాన్ని దర్శించుకొని పరవశించారు. పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం తెల్లవారుజాము ఒంటిగంటకు స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి చందనం ఒలుపును అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆరాధన నిర్వహించి దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజుకు తొలిదర్శనం కల్పించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు రెండు లక్షల మంది భక్తులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి స్వామికి పట్టువస్త్రాలు అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈవో అనిల్కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు, డాలర్ శేషాద్రి తరలివచ్చి స్వామివారికి పట్టువస్త్రాలు అందజేశారు. విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర సరస్వతి, మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొల్లురవీంద్ర, చినరాజప్ప, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీతారామ్మూర్తి, జస్టిస్ శివశంకర్రావు, జె.ఉమాదేవి, ఎ.రామలింగేశ్వరరావు, సినీ నటుడు రాజేంద్రప్రసాద్, విశ్వంజీమహరాజ్ స్వామి దర్శించుకున్నారు -
'ఏపీలో హైకోర్టుకు మాకు అభ్యంతరం లేదు'
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు పెట్టుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. గురువారం ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు విభజనపై తెలంగాణ న్యాయవాదులు అనవసర రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర పరిధిలో హైకోర్టు విభజన ఉందనే ఉద్దేశంతో ఢిల్లీలో ధర్నా చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కేఈ అన్నారు. -
మహానందికి పోటెత్తిన భక్తులు
మహానంది: కర్నూలు జిల్లా మహానందీశ్వరుడి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. స్వామి దర్శనం కోసం 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. దాదాపు 60 వేల మంది భక్తులు నందీశ్వరుడి దర్శనం కోసం వేచి ఉన్నారు. కాగా ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, దేవాదాయ శాఖా మంత్రి మాణిక్యాల రావు ఈ రోజు స్వామిని దర్శించుకున్నారు. వారి కోసం భక్తుల దర్శనాలను అరగంట సేపు నిలిపివేయడంతో భక్తులు దేవస్ధానం సిబ్బందిపై మండిపడ్డారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement