-
మార్కెట్లోకి మరిన్ని ఉత్పత్తులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాటర్, ఎయిర్ ప్యూరిఫయర్ల తయారీ సంస్థ ‘కెంట్ ఆర్వో సిస్టమ్స్’... కిచెన్ అప్లయన్సెస్ శ్రేణిని విస్తృతం చేసే పనిలో ఉంది. ఇప్పటికే కంపెనీ గ్రైండర్/బ్లెండర్, టోస్టర్, జ్యూసర్, శాండ్విచ్ మేకర్, ఎలక్ట్రిక్ రైస్ కుకర్, ఫ్రైయర్, దోస మేకర్ వంటి ఉపకరణాలను విక్రయిస్తోంది. డిమాండ్ ఉన్న అప్లయన్సెస్ తయారీలోకి ప్రవేశిస్తామని కెంట్ ఆర్వో సిస్టమ్స్ సీఎండీ మహేష్ గుప్త తెలిపారు. సోమవారమిక్కడ నూతన శ్రేణి ఆర్వో వాటర్ ప్యూరిఫయర్లను ప్రవేశపెట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 20 మంది సిబ్బందితో కూడిన పరిశోధన, అభివృద్ధి విభాగం కొత్త అప్లయన్సెస్ రూపకల్పనలో నిమగ్నమైందని ఆయన తెలియజేశారు. డిజిటల్ పవర్ ఉపకరణాలను దశల వారీగా ప్రవేశపెడుతున్నామని, వీటి ఆధారంగా ఇంటర్నెట్ ఆధారిత అప్లయన్సెస్ విడుదల చేయడం సులభమని చెప్పారు. మూడేళ్లలో రూ.1,500 కోట్లు..: కెంట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధితో రూ.950 కోట్ల టర్నోవర్ను నమోదు చేయగలమని ఆశిస్తోంది. ‘మూడేళ్లలో రూ.1,500 కోట్లకు చేరుకుంటాం. టర్నోవరులో 10 శాతం నాన్–ప్యూరిఫయర్ విభాగం నుంచి సమకూరుతోంది. రానున్న రోజుల్లో ఈ విభాగం వాటా మరింత అధికం కానుంది. రూ.1,800 కోట్ల వ్యవస్థీకృత ఆర్వో వాటర్ ప్యూరిఫయర్ల మార్కెట్లో కెంట్కు 40 శాతం వాటా ఉంది. 19 రకాల వాటర్ ప్యూరిఫయర్లను విక్రయిస్తున్నాం’ అని వివరించారు. కాగా, నూతన శ్రేణి నెక్స్ట్జెన్ ఆర్వో వాటర్ ప్యూరిఫయర్ల ధర రూ.14,500–19,000 మధ్య ఉంది. బ్యాక్టీరియా, ఇతర మలినాలు చేరకుండా వాటర్ ట్యాంకులో అల్ట్రా వయోటెల్ రక్షణ ఏర్పాటు ఉంది. అలాగే ప్యూరిటీ వివరాలు తెలిపే డిజిటల్ డిస్ప్లే పొందుపరిచారు. -
కెంట్ ఇక మరింత స్మార్ట్..
♦ కెంట్ ఆర్వో సిస్టమ్స్ డెరైక్టర్ వరుణ్ గుప్తా ♦ ఉపకరణాలన్నీ ఇంటర్నెట్ సౌకర్యంతో... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాటర్ ప్యూరిఫయర్ల వ్యాపారంలో ఉన్న కెంట్ ఆర్వో సిస్టమ్స్ ‘స్మార్ట్’గా అడుగులేస్తోంది. కెంట్ సూపర్బ్ పేరుతో ప్రపంచంలో తొలి స్మార్ట్ ఆర్వో ప్యూరిఫయర్ను ఈ సంస్థ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదే ఊపుతో వచ్చే రెండేళ్లలో అన్ని ఉపకరణాలను ఇంటర్నెట్ సౌకర్యంతో (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) రూపొందిస్తామని కెంట్ డెరైక్టర్ వరుణ్ గుప్తా వెల్లడించారు. నూతన శ్రేణి ఉపకరణాలను హైదరాబాద్ మార్కెట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘స్మార్ట్ ఉపకరణాల వైపు మార్కెట్ దూసుకెళ్తోంది. వాటర్, ఎయిర్ ప్యూరిఫయర్లు, ఇతర ఉపకరణాలను ఇంటర్నెట్ సౌకర్యంతో తయారు చేయాలని నిర్ణయించాం. కొద్ది రోజుల్లో ఈ విభాగంలో వాటర్ ప్యూరిఫయర్ను విడుదల చేస్తాం. ఉపకరణంలో సమస్య ఉంటే నేరుగా సర్వీసింగ్ కేంద్రానికి సమాచారం వెళ్తుంది’ అని వివరించారు. కాగా, టచ్ స్క్రీన్ ఫీచర్ గల కెంట్ సూపర్బ్ ధర రూ.25 వేలు. నీటిలో మలినాలు, టీడీఎస్ స్థాయి, నీటి నిల్వ, ఫిల్టర్ జీవిత కాలం వంటి వివరాలను స్క్రీన్పై చూపిస్తుంది. ఫిల్టర్ జీవిత కాలం మరో 60 గంటలలోపు మాత్రమే ఉంటే అలర్ట్ చేస్తుంది. సులభ వాయిదాల్లో..: సామాన్యునికి అందు బాటులోకి తేవడం లక్ష్యంగా సులభ వాయిదాల్లో(ఈఎంఐ) కొనుగోళ్లను ప్రోత్సహించడానికి మరిన్ని బ్యాంకులతో చేతులు కలుపుతున్నామని వరుణ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఇప్పటికే బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ ద్వారా 1,300లకుపైగా రిటైలర్లు కస్టమర్లకు ఈఎంఐ సౌకర్యం కల్పిస్తున్నారు. సంస్థ అమ్మకాల్లో ఈఎంఐ విభాగం వాటా 4 శాతం ఉంది’ అని చెప్పారు. రూ.100 కోట్లతో ప్లాంటు.. కెంట్ నోయిడాలో రూ.100 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ప్లాంటు ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. నెలకు 75,000 యూనిట్ల ప్యూరిఫయర్లను తయారు చేస్తారు. కంపెనీకి ఇప్పటికే ఉత్తరాఖండ్లోని రూర్కీలో నెలకు 75 వేల యూనిట్ల సామర్థ్యమున్న ప్లాంటు ఉంది. కోల్డ్ ప్రాసెస్ జ్యూసర్లు మినహా ప్యూరిఫయర్లను ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. ఎక్స్క్లూజివ్ స్టోర్లు ఏర్పాటు చేసే అంశాన్ని కంపెనీ పరిశీలిస్తోందని వరుణ్ చెప్పారు. ఏటా 3-4 కొత్త మోడళ్లు ప్రవేశపెడతామని తెలిపారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement