-
కరోనా 'ఖబరస్థాన్'
సాక్షి, సిటీబ్యూరో: మనిషి జీవితంలో మరణం సహజం. ఏదో ఒకరోజు మృత్యువు పలకరిస్తుంది. అందరూ పుడమితల్లిలో లీనం కావాల్సిందే. కానీ కరోనా వైరస్తో మృత్యువాత పడినవారిని ఖననం చేయడం ఓ సమస్యగా మారింది. మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు ఇటు జీహెచ్ఎంసీ, అటు పోలీస్, వైద్యారోగ్య శాఖలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో శవాల ఖననం సమస్య తీవ్ర స్థాయికి చేరింది. పలు సందర్భాల్లో కుటుంబ సభ్యులు కూడా శవాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరిస్తున్న పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. కరోనాతో మరణించిన ముస్లింల కోసం బాలాపూర్లోని ఫకీర్ముల్లా దర్గా సమీపంలో ప్రత్యేకంగా ఖబరస్థాన్ ఏర్పాటు చేశారు. బాలాపూర్ మండలం హయాతుల్లాఖాన్ వక్ఫ్ బోర్డుకు చెందిన 100 ఎకరాల భూమిని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్మే అక్బర్ ఒవైసీ ఇందుకోసం కేటాయించారు. దీంతో ఈ ప్రాంతంలో కోవిడ్ మృతులను ఇక్కడ ఖననం చేస్తున్నారు. అయితే.. ఇటీవల కరోనాతో మృతి చెందిని వారి ఖనన సమస్య తలెత్తడంతో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వంద ఎకరాల్లో ఉన్న శ్మశానంలోనుంచి 50 ఎకరాలు స్థలాన్ని కరోనా మృతుల ఖననానికి కేటాయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఖననం చేసే ప్రక్రియ కొనసాగుతుంది. స్థానిక శ్మశానాల్లో నిరాకరించడంతో.. . కరోనా మృతుల ఖననానికి స్థానికంగా ఉన్న శ్మశానాల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థలం సమస్యతో పాటు వైరస్ ప్రబలకుండా జాగ్రత్తల కోసం నిరాకరిస్తున్నారు. కారణం.. మృతుడి ద్వారా వైరస్ ఇతరులకు ప్రబలే ప్రమాదం పొంచి ఉందని జాగ్రత్త వహిస్తున్నారు. మరణించిన వ్యక్తికి స్థానిక ప్రదేశంలోని ఖబరస్థాన్లో ఖననం చేయడానికి పలు ప్రాంతాల్లో అనుమతించడం లేదు. మరికొన్ని ప్రాంతాల శ్మశానాల్లో కమిటీలు ఖననం కోసం స్థలాలు కేటాయించడం లేదు. నగరంలో దాదాపు అన్ని శ్మశానాలు జనావాసాల మధ్యనే ఉన్నాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న వారికి వైరస్ సోకుతుందనే భయం వెంటాడుతోంది. ఈ కారణంగా కరోనా మృతుల కోసం బాలాపూర్లో ప్రత్యేకంగా ఖబరస్థాన్ను ఏర్పాటు చేశారు. నిబంధలకనుగుణంగానే.. కరోనాతో మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులు స్థానిక కార్పొరేటర్కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం కార్పొరేటర్ ఖబరస్థాన్ ఇన్చార్జి మహ్మద్ సిరాజుద్దీన్ ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారు. అతడు పూర్తి వివరాలు తీసుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమాధి తవ్విస్తారు. ఒకవేళ పేదవారైతే అన్ని ఖర్చులూ స్థానిక శ్మశాన కమిటీనే భర్తిస్తుంది. మృతదేహాన్ని జీహెచ్ఎంసీ, హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు పోలీసుల సమక్షంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖననం చేస్తారు. -
ఖబరస్థాన్ స్థలం ఆక్రమణ
పత్తి చెట్లు ధ్వంసం బోరున విలపించిన కౌలు రైతు ఉప్పరపల్లి(చెన్నారావుపేట) : మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలోని ఖబరస్థాన్ స్థలంను ఓ రైతు ఆక్రమించాడు. అంతేగాక ఆ స్థలంలో పత్తి చేను వేసుకున్న కౌలు రైతు పంటను ధ్వంసం చేసిన సంఘటన శనివారం జరిగింది. గ్రామానికి చెందిన ముస్లింలకు గ్రామశివారులోని సర్వే నంబర్ 234/ఆ లో ఎకరం 30 గుంటల భూమి ఉంది. అందులోని 10 గుంటల భూమిలో సమాధులు ఉన్నాయి. మిగిలిన ఎకరం 20 గుంటల భూమిని ముస్లింల అభివృద్ధికి గ్రామానికి చెందిన మహ్మద్ రాజమహ్మద్కు కౌలుకు ఇచ్చారు. అతడు అందులో పత్తి సాగు చేశాడు. శుక్రవారం గ్రామానికి చెందిన మహ్మద్ మహబూబ్(80) అనారోగ్యంతో మృతిచెందాడు. అతడిని సమాధి చేయడానికి తీసుకెళ్తుండగా ఇదే గ్రామానికి చెందిన కుక్కల రాజాలు తన భూమిలో నుంచి శవాన్ని తీసుకెళ్లద్దంటూ అడ్డుకున్నాడు. రాజాలు భూమికి ఆనుకొని ఖబరస్థా¯Œæకు వెళ్లే దారి ఉంది. రాజాలు దారిని ఆక్రమించుకొని ఖబరస్థాన్కు వెళ్లడానికి దారి లేదన్నాడు. దీంతో అతడితో వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం శవాన్ని ముస్లింలు సమాధి చేశారు. దీన్ని దృష్టిలో పెట్టకొని రాజాలు శుక్రవారం రాత్రి ఖబరస్థాన్లో సాగు చేస్తున్న పత్తి మొక్కలను ధ్వంసం చేశాడని బాధిత రైతు మహ్మద్ రాజమహ్మద్ వాపోయాడు. తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీస్స్టేçÙన్లో, ఆర్డీఓ, కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు కౌలు రైతు రాజమహ్మద్, పెద్దలు ఖాదర్, మౌలానా, రహిమోద్దిన్, యాకూబ్పాషా, షరీఫ్, తదితరులు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement