-
ఖైరతాబాద్ సస్పెన్స్.. దానంకు ఆ ముగ్గురితో గండం!
సాక్షి, బంజారాహిల్స్: ఇప్పుడు అందరి దృష్టి ఖైరతాబాద్పైనే... కేసీఆర్ ప్రకటించిన 105 మంది టీఆర్ఎస్స్ అభ్యర్ధుల జాబితాలో ఖైరతాబాద్ అభ్యర్ధిని మాత్రం ప్రకటించలేదు. దీంతో ఇక్కడి నుంచి ఎవరికీ సీటు కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన మన్నె గోవర్ధన్రెడ్డితోపాటు బంజారాహిల్స్ కార్పొరేటర్, కేకే కూతురు గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ కార్పొరేటర్, పీజేఆర్ కూతురు పీ విజయారెడ్డి ఇక్కడి నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్ కూడా ఇక్కడి నుంచే పోటీలో ఉండాలనుకుంటున్నారు. గతంలో ఇది ఆయనకు సిట్టింగ్ సీటు. ఈ నేపథ్యంలో ఈ నలుగురిలో టిక్కెట్ ఎవరికి దక్కుతుందోనన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, దానం నాగేందర్ను గోషామహల్లో నిలబెట్టే అవకాశాలుగా మెండుగా ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే వీరెవరూ కాకుండా కొత్తవారిని ఎవరినైనా నిలబెడతారా అన్నదానిపై కూడా చర్చలు జోరుగా సాగుతున్నాయి. మొత్తానికి ఖైరతాబాద్ టికెట్ ఇప్పుడు హాట్హాట్గా మారింది. -
మాయలోళ్లను నమ్మొద్దు: విజయారెడ్డి
హైదరాబాద్: ఓట్ల కోసం వచ్చే మాయలోళ్లను నమ్మవద్దని, పేదలు, అణగారిన వర్గాల పట్ల నిజమైన అభిమానం, ఆదరణ ఉన్న దివంగత పీజేఆర్ కుటుంబ సభ్యురాలిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని విజయారెడ్డి కోరారు. బీఎస్ మక్తా, సుభానీ మసీద్ ప్రాంతం, హరిగేట్ తదితర ప్రాంతాల్లో ఆమె ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఐదేళ్లుగా మంత్రి పదవిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ నియోజకవర్గంలో చేశానని చెబుతున్న అభివృద్ధి ఎక్కడో చూపాలని ఆమె డిమాండ్ చేశారు. అభివృద్ధిని గాలికొదిలేసి, సొంత వ్యవహారాలు, వ్యాపారాలు చక్కబెట్టుకున్న దానంకు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యలతో పాటు రేషన్కార్డులు, వృద్ధాప్య పింఛన్లు సహా పలు ప్రభుత్వ పథకాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు మైనార్టీలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని అందరికీ మంచి రోజులు వస్తాయన్నారు. తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇస్తే తన సత్తా చాటి అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. కొన్నేళ్లుగా పత్తాలేని బీజేపీ అభ్యర్థి చింతల మళ్లీ ఎన్నికలు రాగానే ప్రత్యక్షమయ్యారని, ఆయన అసలు ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. దానం, చింతలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. అడ్డా కూలీలు, రోజువారీ వేతనాలు చేసుకుంటూ బతుకును వెళ్ళ దీస్తున్న వారందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికలకు అత్యంత కీలక ప్రాధాన్యత ఉందని, ప్రతిఒక్కరూ ఓటు వేసే సమయంలో ఒక్కసారి దివంగత మహానేత వైఎస్సార్, పీజేఆర్లను గుర్తుచేసుకోవాలని కోరారు. ఈసందర్భంగా స్థానికులు ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. దివంగత పీజేఆర్తో తమ అనుబంధం గుర్తు చేసుకున్నారు. తండ్రిలాగే విజయారెడ్డి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. -
విజయారెడ్డి గెలవడం ఖాయుం: విజయమ్మ
హైదరాబాద్, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో విజయూరెడ్డి భారీ మెజారిటీలో విజయుం సాధిస్తారని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయువ్ము అన్నారు. ఖైరతాబాద్ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ వేసిన విజయూరెడ్డికి వుద్దతుగా విజయువ్ము వచ్చారు. ys vi అనంతరం వూట్లాడుతూ.. ఖైరతాబాద్లో పీజేఆర్ చేసిన అభివృద్ధి పనులను ప్రజలు ఇంకా మరచిపోలేదని, ఆయన వారసురాలిగా వస్తున్న విజయారెడ్డిని ప్రజలందరూ ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేస్తామని ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రప్రదేశ్లోనూ వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురవేస్తుందని విజయమ్మ ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయుం కోసం ప్రచారం చేస్తానని వెల్లడించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ
డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.
కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు
జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది
నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!
శోభిత పోస్ట్.. సమంత స్టైలిష్ట్ రిప్లై
ముంబై ఎయిర్పోర్టులో 12 కోట్ల విలువైన బంగారం, ఐఫోన్లు సీజ్
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement