-
ఖరీఫ్కు గడ్డుకాలం
సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఈ ఖరీఫ్ ప్రారంభం నుంచి రైతుకు అన్నీ ఆటంకాలే ఎదురవుతున్నాయి. పాలనాపరమైన అంశాల్లో జాప్యం, వాతావరణం అనుకూలించకపోవడం వంటి పరిస్థితుల్లో రైతులు అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. గత ఏడాది ఇదే నెలలో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరిగాయి. రైతులు, వ్యవసాయ కార్మికులు ఈ పనుల్లో హడావుడిగా ఉన్నారు. ఇప్పుడు పనులు ప్రారంభించే అవకాశాలు లేక రైతులు దిక్కులు చూస్తుంటే, వ్యవసాయ కార్మికులు పనులు లేక ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. రెతులకు ఏలికలు ఇచ్చిన హామీలు, వాతావరణం అనుకూలించకపోవడం ఈ దుస్థితికి కారణం. ముఖ్యంగా బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తం రుణాలను టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రద్దు చేస్తారని ఆ పార్టీ నాయకులు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. అందుకు విరుద్ధంగా సీఎం రుణమాఫీపై తమ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు బ్యాంకులకు అందకపోవడంతో పాత రుణాలు రద్దు కాక కొత్త రుణాలు మంజూరుకాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో రొక్కం లేక విత్తనమే కొనుగోలు చేయలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. జిల్లాలో పంటల సాధారణ విస్తీర్ణం 2.39 లక్షల హెక్టార్లు. వరి, పత్తి, మిర్చి, పొగాకు, జొన్న, మొక్కజొన్న, సజ్జ పంటలు సాగవుతుంటాయి. వర్షాలు లేక రిజర్వాయర్లలోని నీటి మట్టం అడుగంటటంతో ప్రభుత్వం కూడా కాలువలకు సాగునీటిని విడుదల చేయలేక పోయింది. ప్రతీ సంవత్సరం జూలై రెండో వారంలో నారుమడులు సిద్ధం చేసుకునేందుకు ప్రభుత్వం కాలువలకు నీటిని విడుదల చేసేది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు తాగునీటి అవసరాలకు మాత్రమే రెండుసార్లు విడుదల చేసింది. రుణమాఫీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు లేకపోవడంతో బ్యాంకర్లు కొత్త రుణాలు మంజూరు చేయడం లేదు. పాత రుణాలు రద్దు కాక రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. గత ఏడాది జూన్ నెల 20 వ తేదీ నాటికి బ్యాంకర్లు రైతులకు సుమారు రూ.1000 కోట్ల రుణాలను ఇస్తే ఈఏడాది ఇప్పటి వరకు రూ.125 కోట్లు మాత్ర మే ఇచ్చారు. రూ.6,328 కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యంగా తీసుకున్నాయి. రుణమాఫీ కారణంగా కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితిలో బ్యాంకర్లు లేరు. రుణమాఫీ, ప్రతికూల వాతావరణం కారణంగా ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందుల అమ్మకాలు కూడా గత ఏడాదితో పోల్చితే పూర్తిగా పడిపోయాయి. గత ఏడాది, ప్రస్తుతం పంటల సాగు ఇలా ఉంది. -
ఖరీఫ్.. రిలీఫ్
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్లైన్: నాలుగేళ్లుగా వరుస అతివృష్టి, అనావృష్టితో కరువు బారిన విలవిల్లాడుతున్న రైతాంగానికి ఈ ఏడాది ఊరట లభిస్తోంది. ఖరీఫ్ ఆరంభం నుంచి వర్షాలు ఆశాజనకంగా కురుస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా పంటలు కళకళలాడుతున్నాయి. కేసీ కెనాల్, ఎల్ఎల్సీ, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ తదితర కాల్వల కింద వరినాట్లు ముమ్మరమయ్యాయి. నీటి ఆధారంతో పాటు వర్షాధార పంటలు పచ్చని కళ సంతరించుకోవడంతో ఏటా నష్టాలను మూటకట్టుకుంటున్న రైతుల్లో ఆశలు చిగురించాయి. కొద్దిరోజుల నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలతో చాలా వరకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు జల కళను సంతరించుకున్నాయి. ఆదివారం నుంచి మంగళవారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కోడుమూరు, గూడూరు, క్రిష్ఱగిరి తదితర మండలాల్లో భారీ వర్షం కురవడంతో హంద్రీ నది పోటెత్తింది. ఈ కారణంగా రెండేళ్ల క్రితం ఎండిన బోర్లలోనూ భుగర్భ జలాలు మెరుగవడంతో రైతుల సంతోషానికి హద్దే లేకపోతోంది. కర్నూలు సమీపంలోని వక్కెరవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 126 మి.మీ కాగా మొదటి 10 రోజుల్లోనే 106.1 మి.మీ నమోదు కావడం విశేషం. ఇప్పటికే 19 మండలాల్లో సాధారణ వర్షపాతాన్ని మించి వర్షం కురిసింది. రుద్రవరం, సంజామల, వెలుగోడు, చాగలమర్రి, జూపాడుబంగ్లా, ఉయ్యలవాడ, బండిఆత్మకూరు, దొర్నిపాడు, నంద్యాల మండలాల్లో మత్రమే ఈ నెలలో ఇప్పటి వరకు తక్కువ వర్షపాతం నమోదైంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ పంటలకు ఉపశమనం లభించినట్లయిందని.. అయితే కొద్ది రోజులు తెరిపి ఇస్తే మేలని జేడీఏ ఠాగూర్ నాయక్ అభిప్రాయపడ్డారు. ఖరీప్ సాధారణ సాగు 5.61 లక్షల హెక్టార్లు కాగా.. 5.50 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది పత్తి భారీగా సాగు చేశారు. సాధారణ సాగు 70వేల హెక్టార్లు కాగా.. ఈసారి 1.75 లక్షల హెక్టార్లకు చేరుకోవడం విశేషం. నీటిపారుదల మెరుగవడంతో వరిసాగు భారీగా పెరిగే అవకాశం ఏర్పడింది. వరి సాధారణ సాగు 90వేల హెక్టార్లు ఉండగా, ఇప్పటికే దాదాపు 70వేల హెక్టార్లలో వరినాట్లు పడ్డాయి. తాజా వర్షాలతో వరి పైర్లు కళకళలాడుతున్నాయి. ఇదిలాఉండగా కొన్ని పంటలకు చీడపీడల బెడద ఎక్కువైంది. వ్యవసాయశాఖలో అటెండర్ మొదలుకొని డీడీఏ స్థాయి అధికారి వరకు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నెల రోజులకు పైగా సమ్మెలో ఉండటంతో రైతులకు సలహాలు ఇచ్చే వారు కరువయ్యారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కృషి విజ్ఞాన కేంద్రంలో స్వర్ణోత్సవం
పాఠశాలలు తెరిచే నాటికి పనుల పూర్తి
అక్రమ రవాణా అడ్డుకట్టకు చర్యలు
కేటీపీఎస్ గేమ్స్ సెక్రటరీగా టి.మహేశ్
అప్పుడూ ఇప్పుడూ 'అంతే'
మనమే అభివృద్ధి చేసుకుందాం..
సకుటుంబ సపరివార సమేతం
బీటీపీఎస్ కీర్తి ప్రతిష్టలు పెంచాలి
వంద కేజీల గంజాయి స్వాధీనం
పీహెచ్సీలో డిప్యూటీ డీఎంహెచ్ఓ తనిఖీ
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement