-
పత్తి.. పండలే..
ఖమ్మం వ్యవసాయం: పత్తి దిగుబడి జిల్లాలో గణనీయంగా తగ్గిపోయింది. సాగు విస్తీర్ణం ఎక్కువగానే ఉన్నా.. పంట ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. జిల్లావ్యాప్తంగా ఉన్న పంట భూమిలో దాదాపు 40 శాతం పత్తి పంట సాగు చేశారు. వర్షాధారంగా, నీటిపారుదల కింద పండే పంట కావడంతో ఇక్కడి రైతులు పత్తి పంటకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 2017–18లో 5,81,767.5 ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణం కాగా.. 5,31,822.5 ఎకరాల్లో వివిధ రకాల పంటలను ఖరీఫ్లో సాగు చేశారు. మొత్తం విస్తీర్ణంలో అధికంగా 2,41,752.5 ఎకరాల్లో రైతులు పత్తి పంట వేశారు. ప్రతి ఏటా దాదాపు ఇంతే విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్నారు. సాగు ఆరంభంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. పూత, కాత దశలో వాతావరణ ప్రభావంతో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. జూన్లో కురిసిన వర్షాలకు పంట విస్తారంగా సాగు చేశారు. జూలైలో వర్షం అనుకూలించలేదు. దీంతో పైరు ఆశాజనకంగా లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో పైరుకు గులాబీ రంగు పురుగు ఆశించింది. ఇక ఆగస్టులో సాధారణానికి మించి కురిసిన వర్షాలు పంటను బాగా దెబ్బతీశాయి. వర్షాలకు పూత రాలిపోగా.. కాయ విచ్చుకునే దశలో నీరు లోనకు చేరి పనికి రాకుండా పోయింది. అరకొరగా చేతికొచ్చిన పంట కూడా నాణ్యతగా లేని పరిస్థితి. సెప్టెంబర్ చివరి నుంచి పంట తొలితీతను రైతులు ప్రారంభించారు. అక్టోబర్లో తొలితీత తీసిన తర్వాత రైతుల్లో పంటపై ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. సహజంగా పైరు నుంచి రెండు, మూడో తీతలు ఆశాజనకంగా ఉంటాయి. కానీ.. ఆగస్టు వర్షాలతో అందుకు భిన్నమైన పరిస్థితులు ఎదురయ్యాయి. దిగుబడులు లేకపోవడంతో విక్రయాలు లేక జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లో గల యార్డులు వెలవెలబోతున్నాయి. పత్తి పంటకు ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకోవడంతో రైతులు ఆ పంటను తొలగించి.. దాని స్థానంలో మొక్కజొన్న వేశారు. జిల్లాలో పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. సాగు విస్తీర్ణం గణం.. దిగుబడి దారుణం జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా ఉన్నా.. పంట దిగుబడి మాత్రం దారుణంగా పడిపోయింది. దాదాపు 2.41 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. నీటిపారుదల కింద ఎకరాకు 15 క్వింటాళ్లు, వర్షాధారంగా 10 క్వింటాళ్ల మేర దిగుబడులు వస్తాయి. ఈ లెక్కన జిల్లాలో సుమారు 25 లక్షల క్వింటాళ్ల మేర ఉత్పత్తి రావాల్సి ఉండగా.. కేవలం 5.5 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి మాత్రమే వచ్చింది. అంటే దాదాపు ఐదోవంతు పంట మాత్రమే పండింది. ఇంత దారుణమైన దిగుబడి ఇటీవల కాలంలో ఎప్పుడూ లేదని రైతులు పేర్కొంటున్నారు. ఎకరాకు 2.50 క్వింటాళ్లకు మించలే.. ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల కారణంగా పత్తి ఎకరాకు సగటున 2.50 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదు. తొలితీత ఎకరాకు క్వింటా, రెండో తీతలో క్వింటాన్నరకు మించి దిగుబడి రాలేదు. నీటిపారుదల, వర్షాధారంగా కూడా ఇవే రకమైన దిగుబడులు వచ్చాయి. ముంచిన తెగుళ్లు, వర్షాలు ఈ ఏడాది పంట దిగుబడులు తగ్గేందుకు ప్రధాన కారణం వర్షాలు. దీనికి తోడు తెగుళ్లు. ఆగస్టులో కురిసిన అధిక వర్షాల ప్రభావం పంట దిగుబడులపై తీవ్రంగా ఉంది. ఆగస్టు రెండు, మూడు వారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో గాలి, నేలలో తేమశాతం విపరీతంగా పెరిగి పైరుకు ప్రతికూలంగా మారి.. పైరు పండుబారిపోయింది. తెగుళ్లు కూడా ఆశించాయి. ప్రధానంగా గులాబీ రంగు పురుగు ఆశించి నష్టం కలిగించింది. పల్లపు ప్రాంతంలో వేసిన పంట కనీసం పనికి రాలేదు. ఆ తర్వాత అరకొరగా ఉన్న పంటపై డిసెంబర్లో ‘పెథాయ్’ తుపాను మరోసారి నష్టం కలిగించింది. ఇక అరకొరగా పండిన పంట కూడా వర్షాల వల్ల రంగుమారి నాణ్యత లేకుండా పోయింది. వెలవెలబోయిన మార్కెట్లు జిల్లాలో వ్యవసాయ మార్కెట్లకు విక్రయానికి వచ్చే పత్తి పంట దిగుబడులు లేకపోవడంతో ఆయా మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ఖమ్మం, ఏన్కూరు, నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్లలో పత్తి కొనుగోళ్లు జరుగుతుంటాయి. సీజన్లో ఖమ్మం మార్కెట్లో నిత్యం సగటున 25వేల బస్తాలు విక్రయానికి వస్తుంటాయి. ఈ ఏడాది 5వేల నుంచి 6వేలకు మించి పత్తి బస్తాలు విక్రయానికి రాలేదు. దీంతో వ్యవసాయ మార్కెట్లు కళ తప్పాయి. అంతేకాక మార్కెట్లకు వచ్చే ఆదాయం కూడా తగ్గుతోంది. వ్యాపారులు కూడా పంట విక్రయాలకు రాకపోవడంతో నిరుత్సాహంగా ఉన్నారు. పత్తి స్థానంలో మొక్కజొన్న ఖరీఫ్లో సాగు చేసిన పత్తిని రైతులు తొలగించి.. నీటి వనరులున్న ప్రాంతాల్లో మొక్కజొన్న సాగు చేశారు. కొందరు రైతులు పత్తి పంటను వదిలేశారు. పత్తి స్థానంలో వేసిన మొక్కజొన్న పంట కూడా ఆశాజనకంగా లేదు. ఈ పంటకు కత్తెర పురుగు ఆశించింది. దీంతో ఈ పంట కూడా రైతులకు నిరాశ కలిగిస్తోంది. నాలుగెకరాల్లో 8 క్వింటాళ్లు.. నాలుగెకరాల్లో పత్తి పంట సాగు చేశా. తొలితీతలో ఎకరానికి క్వింటా చొప్పున 4 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రెండో తీతలో 4 క్వింటాళ్లు వచ్చింది. మొత్తం 8 క్వింటాళ్లు వచ్చింది. గత ఏడాది ఎకరాకు 7 క్వింటాళ్లకుపైగా దిగుబడి వచ్చింది. – బొల్లి కృష్ణయ్య, రైతు, విశ్వనాథపల్లి, సింగరేణి మండలం ఆశించిన దిగుబడి రాలేదు.. ఈ ఏడాది పత్తి కనీస ఉత్పత్తి లేదు. వ్యవసాయ మార్కెట్లకు కనీసంగా కూడా పంట విక్రయానికి రావడం లేదు. నిత్యం సీజన్లో 30వేల నుంచి 40వేల బస్తాల పత్తి విక్రయానికి వచ్చేది. ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కేవలం 10వేల నుంచి 15వేల బస్తాల పత్తి కూడా విక్రయానికి రావడం లేదు. మార్కెటింగ్ శాఖ ఆదాయంపై కూడా ప్రభావం పడింది. – రత్నం సంతోష్కుమార్, జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి -
రాజకీయ గ్రహణం
దేశంలోనే 25శాతం పత్తి విత్తనోత్పత్తి సాధించే గద్వాల ప్రాంతానికి రాజకీయ గ్రహణం పట్టింది. విత్తనోత్పత్తిలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పేరుగాంచిన ఈ ప్రాంతం నేడు కుదేలవుతోంది. వాతావరణ పరంగా అనువుగా ఉండే ఈ ప్రాంతం లో విత్తనోత్పత్తికి ఎలాంటి ఆటంకాలు లేకపోవడంతో వ్యాపారులు మూడు దశాబ్దాల క్రితం ఇక్కడ దృష్టి కేంద్రీకరించారు. కానీ ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు,వర్గాలు విత్తనోత్పత్తిని దెబ్బతీసేలా ఉన్నారుు. గద్వాల, న్యూస్లైన్: గద్వాల ప్రాంత రైతులకు పత్తివిత్తనోత్పత్తి సాగు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. గతేడాది పదివేల ఎకరాల విస్తీర్ణానికి కుదించిన కంపెనీలు, ప్రస్తుత ఖరీఫ్ పంటకు ఇంకా విత్తనాలే ఇవ్వలేదు. ఐదువేల ఎకరాలకు మించి సాగు లేకుండా విత్తనాలను ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీడ్ పత్తి విత్తనోత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్గనైజర్లు రాజకీయాలతో అనుబంధం కావడం, గ్రూపులుగా విడిపోవడం, కంపెనీల అధిపతులకు నేతలతో ఫోన్లు చేయించడం ఇలాంటి సంఘటనలతో గద్వాల ప్రాంతంలో పత్తి విత్తనోత్పత్తిని కంపెనీలు వదులుకునే పరిస్థితికి తీసు కొచ్చేలా చేశాయి. కంపెనీల వద్ద రెండేళ్లకు సరిపడా పత్తి విత్తనాల స్టాక్ ఉన్నట్లు స్థానిక ఆర్గనైజర్లు చెబుతున్నా, వాస్తవంలో మూడేళ్లుగా జరుగుతున్న సంఘటనలు, పత్తి పంట పుప్పొడి రాక పోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నారుు. మూడు దశాబ్దాల క్రితం ప్రారంభ ం.. గద్వాల ప్రాంతంలో ఉన్న వాతావరణ పరిస్థితులు, వర్షాలను ఆధారంగా చేసుకుని పత్తివిత్తనోత్పత్తికి గద్వాల డివిజన్ ప్రాంతం మంచి అనువుగా ఉంది. దీంతో సీమాంధ్ర నుంచి పలువురు రైతులు ఇక్కడికి వచ్చి పత్తివిత్తనోత్పత్తి సాగును ప్రారంభించారు. వారితోపాటు ఇక్కడి రైతులు కూడా పత్తివిత్తనోత్పత్తిలో భాగస్వామ్యం కావడం తో ఏటేటా పత్తి విత్తనోత్పత్తి సాగు విస్తరిస్తూ వ చ్చింది. ఇలా 30వేల ఎకరాలకు విస్తరించిన పత్తి విత్తనోత్పత్తి రైతులకు మంచి గిట్టుబాటు ధరను అందించడం కూడా మరో కారణమైంది. ఎకరాకు అధిక రాబడి... ఎకరా పత్తి విత్తనోత్పత్తి సాగు చేసిన రైతుకు లక్ష నుంచి రూ.1.50 లక్షల ఆదాయం వస్తోంది. దీనికి తోడు సాగునీటి వనరులు ఉన్న రైతులు ఇంటిల్లిపాది తమకున్న రెండెకరాల్లో పనిచేస్తే పెట్టుబడులు పోగా ఏటా రూ. 2 లక్షల నుంచి 3 లక్షలు మిగులుబాటు అయ్యేవి. దీనికి తోడు పత్తి విత్తనోత్పత్తి సాగుకు అవసరమైన పెట్టుబడులను కంపెనీలు, ఆర్గనైజర్లు తక్కువ వడ్డీకి ఇవ్వడం కూడా రైతులకు మరింత ఉపయోగకరంగా ఉండేది. ఆదాయం వస్తున్న ఆర్గనైజర్లలో వర్గాలు... గద్వాల ప్రాంతంలో ఏటా 30వేల ఎకరాల పత్తి విత్తనోత్పత్తి జరగడం, పత్తి విత్తనాలను పండిం చిన రైతుల నుంచి ఆర్గనైజర్ల వరకు క్రయ, విక్రయాలలో దాదాపు వేయి కోట్ల వరకు వ్యాపారం జరిగేది. ఇంతటి ఆదాయం ఉండటంతో ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్లు దశాబ్ద కాలంగా కోట్లకు పడగెత్తారు. ఆదాయం వస్తున్న ఆర్గనైజర్లు ఒకేతాటిపై ఉండే పరిస్థితి నుంచి రాజకీయ నేతల అనుచరులుగా మారిపోయారు. ఇలా వర్గాలుగా చేరి విత్తనోత్పత్తి సంస్థలకు రాజకీయాల బెదిరింపులను తీసుకెళ్లే వరకు వెళ్లారు. దీంతో కం పెనీలు ఈ ప్రాంతంలో పత్తివిత్తనోత్పత్తికి పెట్టుబడులు పెట్టడం అంత శ్రేయస్సు కాదన్న ఉద్దేశంతో రెండేళ్లుగా తగ్గింపును ప్రారంభించారు. నిల్వలు పేరుకుపోవడం వల్లే కంపెనీల వద్ద సీడ్ నిల్వలు పెద్ద ఎత్తున పేరుకపోయాయి. ప్రస్తుత ఏడాది 3 కోట్ల ప్యాకెట్ల నిల్వ లు నిలిచిపోయా యి. అందుకే ప్రస్తుతం 40వేల నుంచి 25వేలకు విస్తీర్ణం తగ్గించారు. వచ్చే ఏడాది మూడువేల ఎకరాలకు మించి పత్తి సాగు ఉండే అవకాశం లేదు. నిల్వలు పూర్తిగా కమర్షియల్కు వెళ్లిపోవడం జరిగితే రెండేళ్లలో మళ్లీ పత్తి విత్తనోత్పత్తి గతేడాది మాది రిగానే అధిక విస్తీర్ణానికి పెరగొచ్చు. రైతు లు అధైర్య పడవద్దు. - సీడ్ గ్రోయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభాకర్రెడ్డి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement