-
ఈ వ్యాధి పిల్లలో అరుదుగా వస్తోంది జాగ్రత్తగా ఉండండి
-
మూత్రంలో రక్తం.. తరచూ జ్వరం, కడుపునొప్పిగా అనిపిస్తుందా?
మన శరీరంలో మూత్రపిండాలను కీలకమైన అవయవాలుగా చెప్పుకోవచ్చు. శరీరంలోని విష పదార్థాలను వడపోసి, మూత్రం ద్వారా బయటకు పంపిచే ఇవి హార్మోన్లను, ఎంజైములను కూడా విడుదల చేస్తుంటాయి. రక్తపోటును నియంత్రించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంటాయి. అందుకే బీపీ ఎక్కువగా ఉంటే కిడ్నీ పరీక్షలనూ చేయించుకోవాలి. అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడేవారిలో కిడ్నీ వైఫల్యం చెందే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఎప్పటికప్పుడు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు చేయించుకుంటూ ఉండటం తప్పనిసరి. మూత్రపిండాలకు సంబంధించి నాలుగు రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. 1. కిడ్నీ ఇన్ఫెక్షన్స్ 2. కిడ్నీ స్టోన్స్ 3. కిడ్నీ ఫెయిల్యూర్ 4. కిడ్నీ ట్యూమర్స్ అండ్ క్యాన్సర్స్ మహిళల్లో ఎక్కువగా కనిపించే బ్యాక్టీరియల్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కిడ్నీల వరకు పాకి ఇన్ఫెక్షన్స్కు గురిచేస్తుంటాయి. యాంటీబయాటిక్ కోర్సులతో ఈ సమస్య తొలగిపోతుంది. కిడ్నీల్లో రాళ్ల సమస్య పురుషులలో ఎక్కువ. ఇవి ఇసుక రేణువు పరిమాణం నుంచి గోల్ఫ్బాల్ సైజు వరకు ఉంటాయి. అంత ప్రమాదకరం కాకపోయినా, తీవ్రమైన నొప్పి, బాధ కలిగించే ఈ స్టోన్స్కు సైజును బట్టి అనేక రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అధిక బరువు, పొగతాగడం, మద్యం తీసుకోవడం, రక్తపోటు, షుగర్ లెవల్స్ అదుపులో లేకపోవడం వల్ల కిడ్నీలు ఫెయిలయ్యే ప్రమాదం ఉంది. అయితే పూర్తిగా ఫెయిలైనప్పుడే లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని ఒక సైలెంట్ డిసీజ్గా చెప్పుకోవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్కు డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స పద్ధతులు తప్పనిసరి. పుట్టుకతో వచ్చే కిడ్నీలో కణుతుల సమస్య... పిల్లలకు స్నానం చేయించేటప్పుడు లేదా డాక్టర్ చెకప్కు వెళ్లినప్పుడు బయటపడుతుంది. కణితి పరిమాణం బట్టి మూత్రంలో రక్తం, కడుపునొప్పి, జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, అజీర్ణం, హైబీపీ వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. నెఫ్రోబ్లాస్టోమా లేదా విల్మ్స్ ట్యూమర్గా చెప్పుకునే కిడ్నీృకణుతులు పిల్లల్లో 4, 5 ఏళ్ల వయసులో బయటపడుతూ ఉంటాయి. ఈ కణుతులను పూర్తిగా నయం చేయడం సాధ్యమే. రీనల్ సెల్ కార్సినోమా (ఆర్సీసీ): ఈ రకం కణితి పెద్ద వయసులో కనిపిస్తూ ఉంటుంది. ఊపిరితిత్తులకు, ఇతర భాగాలకు వ్యాపించే గుణం ఈ క్యాన్సర్కు ఎక్కువ. ఒక్కోసారి ఇలా వ్యాప్తి అయిన భాగాల ద్వారా కూడా ఈ క్యాన్సర్ను గుర్తిస్తారు. ఒక్కొక్కసారి రెండు కిడ్నీల్లోనూ కణుతులు ఉండవచ్చు. అనేక సబ్టైపుల్లో ఉండే ఈ క్యాన్సర్ను ఒక్కోసారి ఇతర కిడ్నీ పరీక్షలలో, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలలో కనుగొంటుంటారు. వయసు పైబడే కొద్దీ ఈ క్యాన్సర్ పెరిగే అవకాశం ఎక్కువ. అయితే స్మోకింగ్ చేసే చిన్నవయసు వారిలోనూ ఇది కనిపిస్తున్నట్టు సర్వేలు తెలియజేస్తున్నాయి. స్మోకింగ్, ఆల్కహాల్, అధికబరువు వంటి వాటితో పాటు జీన్మ్యూటేషన్స్ ఈ క్యాన్సర్కు ప్రధాన కారణాలు. లక్షణాలు కనిపించనప్పుడు ఫిజికల్ ఎగ్జామ్, బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, సీటీ, ఎమ్మారై, క్యాల్షియమ్ లెవల్స్ తెలిపే పరీక్షలు చేయించాలి. ఒక్కోసారి ఈ క్యాన్సర్ బయటపడేసరికే ఊపిరితిత్తులకు, ఎముకలకు పాకి ఉండవచ్చు. కాబట్టి చెస్ట్ ఎక్స్రే, బోన్స్కాన్ కూడా చేయిస్తూ ఉంటారు. కిడ్నీ మొత్తంగా తీసివేసే సర్జరీతో పాటు క్యాన్సర్ రకాన్ని బట్టి కీమో, రేడియోథెరపీలను ఇవ్వాలి. ఈరోజుల్లో కిడ్నీలను లాపరోస్కోపిక్ పద్ధతుల్లో కూడా తొలగించడం సాధ్యమే. క్యాన్సర్ కాని కణుతులకు కూడా సైజుని బట్టి రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ కణుతులు ఎక్కువగా ఉన్నా, లేదా చాలా పెద్దగా ఉన్న సందర్భాల్లోనూ కిడ్నీలను తొలగించడం జరుగుతుంది. ట్యూమర్ స్టేజ్ మీద ఆధారపడి, సర్జరీని మూడురకాలుగా చేస్తుంటారు. రాడికల్ నెఫ్రెక్టమీ : ఈ సర్జరీలో కిడ్నీతో పాటు అడ్రినల్ గ్లాండ్స్, లింఫ్ నాళాలను, కణజాలాన్ని మొత్తంగా తీసివేస్తారు. కణితి పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సర్జరీ చేస్తారు. సింపుల్ నెఫ్రెక్టమీ: స్టేజ్1 కిడ్నీ క్యాన్సర్కు ఒక్క కిడ్నీని మాత్రమే తీసివేస్తారు. పార్షియల్ నెఫ్రెక్టమీ: పుట్టుకతో ఒకే ఒక్క కిడ్నీ ఉండి, దానిలో కణితి కనిపించినప్పుడు, కణితి ఉన్నంతవరకు మాత్రమే తీసివేస్తారు. ఒక్కొక్కసారి రెండు కిడ్నీల్లోనూ కణుతులు ఏర్పడినప్పుడు కణుతుల వరకు మాత్రమే తొలగిస్తారు. తొలిదశలోనే గుర్తించి, ఒక కిడ్నీని మాత్రమే తీసివేసినప్పుడు సర్జరీ అయిన కొద్దిరోజుల్లోనే వారు సాధారణ జీవితాన్ని గడపగలుగుతారు. రెండింటినీ తీసివేసినా, లేదా ఒక్కటి తీసేశాక రెండోది పనిచేయకపోయినా డయాలసిస్ చేయించుకుంటూ వీలైనంత త్వరగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడం మంచిది. చికిత్స పూర్తయ్యాక కూడా ఫాలోఅప్ కేర్ తప్పనిసరి. సీటీ స్కాన్, చెస్ట్ ఎక్స్రే వంటి టెస్ట్లు క్రమం తప్పకుండా చేయించుకోవాలి. మూత్రంలో రక్తం కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా ఉండటంతోపాటు, స్మోకింగ్, ఆల్కహాల్ విషతుల్యమైన పదార్థాలకు దూరంగా ఉండటం వల్ల మూత్రపిండాలను కొంతవరకైనా కాపాడుకోగలిగిన వారమవుతాము. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421 -
ముంబై మహిళ కిడ్నీలో..
ముంబై : ఓ మహిళ కిడ్నీ నుంచి దాని కంటే 50 రెట్లు పెద్దగా ఉన్న కణితిని భారత డాక్టర్లు విజయవంతంగా తొలగించారు. మంజూ దేవీ(28) గత మూడేళ్లుగా కిడ్నీ వద్ద కణితితో బాధపడుతున్నారు. భారీ పరిమాణంలో పెరిగిన కణితి మిగిలిన శరీర భాగాల పనితీరుకు అడ్డు వస్తుండటంతో దాన్ని తొలగించాలని లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ ఆసుపత్రి డాక్టర్లు నిర్ణయించారు. దాదాపు ఎనిమిది గంటల పాటు సర్జరీ నిర్వహించి 5.5 కేజీల కణితిని తొలగించారు. కిడ్నీకి ఏర్పడిన కణితిల్లో ప్రపంచంలో ఇదే అతి పెద్దదని చెప్పారు. ఆపరేషన్ క్లిష్టతరం అవుతుందనే ఉద్దేశంతో ఇప్పటివరకూ మంజూ దేవీ డాక్టర్లు సర్జరీ చేసేందుకు వెనుకాడారని వైద్యులు పేర్కొన్నారు. మేజర్ సర్జరీ కావడంతో అన్ని ప్రికాషన్స్ తీసుకున్న అనంతరమే శస్త్రచికిత్స చేసినట్లు తెలిపారు. -
అతిపెద్ద కిడ్నీ కణితిని తొలగించిన ఎయిమ్స్ వైద్యులు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రపంచంలో అతిపెద్ద కిడ్నీ కణితిని తొలగించారు. కిడ్నీ కేన్సర్తో బాధపడుతున్న 65 ఏళ్ల కేఎల్ దాస్కు ఆపరేషన్ చేసి 5.018 కిలోల బరువున్న కణితిని తీసివేశారు. వైద్య పరిభాషలో ఇదే అతిపెద్ద కిడ్నీ కణితని వైద్యులు తెలిపారు. ప్రపంచంలో ఇలాంటి కేసు రావడం ఇదే తొలిసారని వైద్యులు చెప్పారు. పేషంట్ కుడి కిడ్నీ సాధారణ సైజు కంటే 35 రెట్లు వాపు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఊపిరితిత్తులకు కూడా కేన్సర్ సోకినట్టు పరీక్షల్లో తేలింది. శరీరంలోని ఇతర భాగాలకు కేన్సర్ వ్యాపించకుండా నివారించేందుకు వైద్యులు ఆపరేషన్ చేశారు. దాస్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గతంలో గంగారామ్ ఆస్పత్రిలో 2.5 కిలోల బరువున్న కిడ్నీ కణితిని తొలగించారు. అప్పట్లో ఇదే అతిపెద్దదిగా నమోదైంది. తాజాగా దీనికి రెట్టింపున్న కణితిని తొలగించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement