-
'కిష్ట్వార్'పై కేంద్రం ఉదాసీనత: రాజనాథ్
జమ్మూ కాశ్మీర్లో ఇటీవల కిష్ట్వార్ పట్టణంలో చోటుచేసుకున్న మతఘర్షణల పట్ల కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహారించిందని భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్ష్యుడు రాజనాథ్ సింగ్ ఆరోపించారు. గురువారం న్యూఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో ఆయన జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ... ముస్లిం, హిందు మతల మధ్య చోటు చేసుకుంటున్న ఘర్షణలతో దేశ భద్రతకు ముప్పువాటిల్లే అవకాశాలున్నాయన్నారు. కొంత మంది వ్యక్తులు భారత గడ్డపై ఉంటూ, పాకిస్థాన్ జిందాబాద్ అంటున్నారని ఆయన పేర్కొన్నారు. అలాంటి వారి వల్లే దేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకుంటే ఇలాంటివారి ఆటలు కట్టించవచ్చని రాజనాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. -
ఒమర్ ప్రభుత్వంపై మెహబూబా ముఫ్తి నిప్పులు
కిష్టావార్ జిల్లాలో మతపరమైన ఘర్షణలు చోటి చేసుకుని ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్న ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహారిస్తుందని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తి ఆదివారం శ్రీనగర్లో ఆరోపించారు. ఘర్షణలు చెలరేగిన కిష్టావార్ జిల్లాలోని ప్రాంతాల్లో పర్యటించేందుకు ఆదివారం ఆమె ప్రయాణామైయ్యారు. అయితే ఆమె ప్రయాణాన్ని పోలీసు ఉన్నతాధికారులు అడ్డుకున్నారు. దీనిపై ఆమె తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఒమర్ ప్రభుత్వంపై మెహబూబా ముఫ్తి నిప్పులు చెరిగారు. కిష్టావార్ జిల్లాలో చోటు చేసుకున్న ఘర్షణలో 2 మరణించగా, 60 మందికిపైగా గాయపడ్డారని, ఇంత జరిగిన రాష్ట ప్రభుత్వం మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తుందని ఎద్దేవా చేశారు. రాష్టంలో ఇంత దారుణం చోటు చేసుకున్న ప్రజల మధ్య సోదరభావం, మతసామర్యం పెంపొందించేందుకు ఒక్క చర్య చేపట్టకపోవడంతో ఒమర్పై మండిపడ్డారు. ఆ ప్రభుత్వ విధానల వల్ల రాష్ట్రంలోని వివిధ మతాలు ఐకమత్యంగా జీవించలేని పరిస్థితి నెలకొందన్నారు. మతాల మధ్య సామరస్యం అనేది నేతి బీరకాయలో నెయ్యి చందం మాదిరిగా తయారైందన్నారు. -
రాజకీయ నేతలను రానివ్వం: ఒమర్ అబ్దుల్లా
పుకార్లు నమ్మొద్దని తమ రాష్ట్ర ప్రజలకు జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విజ్ఞప్తి చేశారు. కిష్ట్వార్ సంఘటనపై దర్యాప్తు నివేదిక ఆధారంగా తక్షణమే చర్య తీసుకుంటామని ఆయన హామీయిచ్చారు. ప్రజల మనోభావాలతో ఆడుకునే రాజకీయ పార్టీలతో జాగ్రత్తగా ఉండాలని ఆయన హితవు పలికారు. కిష్ట్వార్ మతఘర్షణల్లో ఇద్దరు మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మతఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించేందుకు అరుణ్ జైట్లీతో సహా రాజకీయ నాయకులెవరినీ అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. కాగా, కిష్ట్వార్ జిల్లాలో పర్యటించేందుకు వచ్చిన బీజేపీ నేత అరుణ్జైట్లీని జమ్మూ ఎయిర్పోర్టులో పోలీసులు నిర్బంధించారు. కిష్ట్వార్ జిల్లాలో చెలరేగిన మత ఘర్షణల నేపథ్యంలో ఆరు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. కిష్ట్వార్ జిల్లాలో శుక్రవారం జరిగిన మత ఘర్షణల్లో ఇద్దరు మరణించగా, ఇరవై మందికి గాయాలైన సంగతి తెలిసిందే. ఈద్ ప్రార్థనల తర్వాత కొందరు దేశ వ్యతిరేక నినాదాలు చేయడంతో ఘర్షణలు మొదలయ్యాయి. దీనికి నిరసనగా బీజేపీ, వీహెచ్పీ, బజరంగదళ్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో జమ్మూలో శనివారం ర్యాలీ నిర్వహించారు. సీఆర్పీఎఫ్ బలగాలు అడ్డుకోవడంతో, వారిపై రాళ్లు రువ్వారు. దీంతో సీఆర్పీఎఫ్ జవాన్లు లాఠీలు ఝుళిపించి, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో జమ్మూ ఎస్పీ సహా ఏడుగురు గాయపడ్డారు.మరోవైపు, హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ గీలానీ ఆదివారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
నిప్పుల కొలిమి..
తప్పక చదవండి
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement