-
భూముల కొనుగోళ్లకు టాప్–5 కారిడార్లు
న్యూఢిల్లీ: తెలంగాణలోని కొంపల్లి–మేడ్చల్–శామీర్పేట, మహారాష్ట్రలోని నేరల్–మాతేరన్, గుజరాత్ లోని సనంద్–నల్సరోవర్ భూములపై పెట్టుబడులకు టాప్–5 కారిడార్లుగా కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. వచ్చే పదేళ్లలో వీటి నుంచి పెట్టుబడులపై ఐదు రెట్ల వరకు రాబడులు రావచ్చ ని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో భూములను కొనుగో లు చేసే ఇన్వెస్టర్లు.. వాటిని వీకెండ్ హోమ్స్, హాలీడే హోమ్స్, రిటైర్మెట్ హోమ్స్గా అభివృద్ధి చేయడం ద్వారా స్థిరమైన అద్దె ఆదాయం పొందొచ్చని పేర్కొంది. దీనికితోడు పెట్టుబడి సైతం వృద్ధి చెందుతుందని, తద్వారా మంచి రాబడులు సొంతం చేసుకోవచ్చని తెలిపింది. ‘‘భూమి పై పెట్టుబడి పెట్టడం రాబోయే రోజుల్లో బంగారం గనిని వెలికి తీసినట్టే అవుతుంది. మెరుగైన రాబడులకు వీలుగా ఆ భూమిని వినయోగించుకోవడం తెలిస్తే పెట్టుబడి కలిసొస్తుంది’’అని కొలియర్స్ ఇండియా పేర్కొంది. మూడు రెట్లు హైదరాబాద్ శివార్లలోని కొంపల్లి–మేడ్చల్–శామీర్పేట కారిడార్లో భూములపై రాబడులు వచ్చే పదేళ్లలో మూడు రెట్లు ఉంటాయని కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా వేసింది. పెట్టుబడిని భూమి ఎన్నో రెట్లు పెంచగలదని, సరైన రీతిలో వినియోగిస్తే స్థిరమైన ఆదాయానికి వనరుగా మారుతుందని సూచించింది. అద్దె ఆదాయం, పెట్టుబడి వృద్ధి, వ్యాపార కార్యకలాపాల ద్వారా ఇలా ఎన్నో రూపాల్లో ఆదాయం పొందొచ్చని వివరించింది. దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లోని ఆర్థిక, పారిశ్రామిక కేంద్రాలకు సమీపంలో వచ్చే సూక్ష్మ మార్కెట్లకు రానున్న సంవత్సరాల్లో మంచి డిమాండ్ ఏర్పడుతుందని, స్మార్ట్ ఇన్వెస్టర్లకు ఇవి మంచి రాబడులు ఇస్తాయని అంచనా వేసింది. -
పెళ్లి హాలులోనే వరుడి ఆత్మహత్య
దుండిగల్: మరికొద్ది గంటల్లో తాళి కట్టా ల్సిన చేతులతో తనమెడకే ఉరితాడు బిగించుకున్నాడు ఓ వరుడు. తల్లి లేని బాధ తెలియనివ్వకుండా పెంచి న తాతయ్య..పెళ్లికి నెల రోజులు ముందే తనువు చాలించడం.. ‘పెళ్లి కొడుకు’ను చేసే కార్యక్రమం విషయ మై తండ్రితో గొడవ వంటి కారణా లతో కుంగిపోయిన వరుడు ఆత్మహ త్యకు పాల్పడ్డాడు. వరుడిగా పెళ్లిపీట లెక్కితే చూద్దామని మురిసిపోయిన బంధుమిత్రులకు, కుటుంబ సభ్యు లకు గుండెకోత మిగిల్చాడు. వధూవరులను ఆశీర్వదించడానికి వేడుకకు వచ్చిన వారు ఘటన గురించి తెలిసి నివ్వెరపోయారు. పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. అల్లారుముద్దుగా పెంచిన తాతయ్య మలక్పేటకు చెందిన రిటైర్డ్ లెక్చరర్ నక్కెర్తి శ్రీనివాస్చారి, పద్మజ రాణిల కుమారుడు సందీప్(24). చిన్నతనంలోనే సందీప్ తల్లి మృతి చెందింది. దీంతో శ్రీనివాస్చారి రెండో వివాహం చేసుకోవడంతో సందీప్ చిన్నతనం నుంచి తాతయ్య జాగేశ్వరరావు వద్ద పెరిగాడు. జాగేశ్వరరావు కూడా సందీప్కు తన తల్లి లేని లోటు తెలియనివ్వకుండా పెంచాడు. బీటెక్ వరకు చదువుకున్న సందీప్కు బోయిన్పల్లికి చెందిన ఓ యువతితో ఏప్రిల్ నెలలో నిశ్చితార్థం చేశారు. అయితే చిన్నప్పటినుంచి తనను అల్లారుముద్దుగా పెంచిన తాతయ్య జాగేశ్వరరావు నెలక్రితం మృతి చెందడంతో సందీప్ బాగా కుంగిపోయాడు. తాతయ్య చనిపోయి నెల కూడా గడవకుండానే తనకు పెళ్లి ఏమిటంటూ వ్యతిరేకిస్తూ వచ్చాడు. అయినప్పటికీ పెద్దలు ఈనెల 10న కొంపల్లి టీ–జంక్షన్లో ఉన్న శ్రీకన్వెన్షన్లో పెళ్లి నిశ్చయించారు. ‘పెళ్లి కొడుకు’తంతుపై రేగిన వివాదం.. సాంప్రదాయం ప్రకారంగా తండ్రి ఇంట్లో పెళ్లి కొడుకును చేసే కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా సందీప్ దీన్ని వ్యతిరేకించాడు. ‘తన తల్లి చనిపోయిన ఇంట్లో నేను ‘పెళ్లి కొడుకు’కార్యక్రమాన్ని చేసుకోలేను’అని సందీప్ చెప్పడంతో ఆ కార్యక్రమానికి ఓ ఇంటిని అద్దెకు కూడా తీసుకుని నిర్వహించారు. ఈ క్రమంలో తండ్రి సందీప్ వైఖరిని తప్పుపట్టగా..ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగి వివాదం చెలరేగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సందీప్ ఆదివారం తెల్లవారుజామున కొంపల్లిలో ఉన్న వివాహ వేదిక వద్దకు వచ్చి తనకు కేటాయించిన గదిలోకి వెళ్లిపోయాడు. సర్దుకుంటుందనుకుంటే.. సందీప్ కోపాన్ని కుటుంబ సభ్యులు అంతగా పట్టించుకోలేదు. గదిలోకి వెళ్లిన సందీప్ను చూసి అంతా సర్దుకుపోతుందనుకుని ఒంటరిగా వదిలేశారు కుటుంబ సభ్యులు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు వివాహ వేడుకలకు సిద్ధం చేసేందుకు సందీప్ గది తలుపును తట్టగా ఎంతకీ స్పందన లేదు. దీంతో మాస్టర్ కీ తో తలుపులు తెరిచి చూడగా సీలింగ్కు వేలాడుతూ సందీప్ కనిపించాడు. వెంటనే సందీప్ను సుచిత్ర సర్కిల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా..అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కన్నీరు మున్నీరైన బంధువులు ఉదయం 7.30 గంటలకు వరుడు సందీప్ ఆత్మహత్య చేసుకోవడంతో వివాహ వేదికైన శ్రీకన్వెన్షన్ గేట్లు మూసుకుపోయాయి. విషయం తెలియని ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, మిత్రులు ఒక్కొక్కరిగా కన్వెన్షన్ సెంటర్కు రాగా జరిగిన విషయం తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ‘‘సందీప్ చాలా మంచి పిల్లవాడని, అతను ఇలా చేసుకోవడమేమిట’’ని చెప్పుకుంటున్నారు. ‘సందీప్ ను ఎప్పుడో పదవ తరగతి చదువుతున్నప్పుడు చూశా..ఇప్పుడు పెళ్లి కొడుగ్గా చూద్దామని ఏలూరు నుంచి వచ్చాను.. కాని అతను ఇలా చేసుకుంటాడని అనుకోలేదంటూ’ఓ బంధువు చెప్పుకొచ్చారు. ఆస్పత్రిలో ఘర్షణ పడ్డ సందీప్ తండ్రి.. చిన్నతనం నుంచే తన కొడుకును తనకు కాకుండా దూరం చేశారంటూ సందీప్ తండ్రి శ్రీనివాస చారి గుండెలవిసేలా రోదిస్తున్నాడు. ఈ క్రమంలో జాగేశ్వరరావు తరఫుబంధువులతో సందీప్ను తన నుంచి దూరం చేయడమే కాకుండా, తాత, పిన్ని దగ్గరకు రాకుండా కట్టడి చేశారంటూ శ్రీనివాసచారి ఘర్షణ పడగా...పేట్ బషీరాబాద్ పోలీసులు వారిని విడదీశారు. సందీప్ ఆత్మహత్యకు గల ప్రధాన కారణం తాతయ్య మరణమేనా మరేదైనా వ్యవహారం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. సందీప్ ఫోన్ తెరిచిన తర్వాత మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశముందని పేట్ బషీరాబాద్ సీఐ మహేశ్ తెలిపారు. వివాహ వేదిక వద్దనే సందీప్ ఆత్మహత్య కేసును పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
ఫంక్షన్హాల్లో పెళ్లికుమారుడు ఆత్మహత్య
-
కాసేపట్లో పెళ్లి.. ఫంక్షన్హాల్లో తీవ్ర విషాదం!
సాక్షి, హైదరాబాద్: మరికాసేపట్లో పెళ్లి.. బంధుమిత్రపరివారం రాక మొదలైంది. పచ్చటి పందిరి, మేళతాళాలతో ఫంక్షన్హాల్ కూడా ముస్తాబైంది. కాసేపట్లో నూతన వధూవరులు పెళ్లిపీఠాలు ఎక్కాల్సి ఉంది. మూడుముళ్లు, ఏడు అడుగులతో దంపతులై కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. కానీ, ఇంతలో ఏమైంది తెలియదు. పచ్చగా కళకళలాడుతున్న పెళ్లి ప్రాంగణంలో విషాదం చోటుచేసుకుంది. చక్కగా ముస్తాబై పెళ్లిపీఠాలు ఎక్కాల్సిన వరుడు ఉరిపోసుకున్నాడు. వివాహంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన అతడు అంతలో తనువు అర్ధంతరంగా చాలించాడు. ఈ ఘోర విషాద ఘటన షేక్బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో పెళ్లి వేడుక నిండుగా జరుగుతుండగానే వరుడు సందీప్ అనూహ్యంగా ఉరేసుకొని చనిపోయాడు. ఉదయం పది గంటలకు పెళ్లి జరగాల్సి ఉండగా.. ఉదయమే వరుడి కుటుంబసభ్యులు, బంధువులు ఫంక్షన్హాల్కు చేరుకున్నారు. ఫంక్షన్ హాల్లోని గదిలో వరుడికి మేకప్ చేస్తుండగా ఉదయం ఏడు గంటల సమయంలో ఒంటరిగా గదిలోపలి నుంచి సందీప్ గడియపెట్టుకున్నాడు. ఎంతకూ వరుడు బయటకు రాకపోవడంతో అనుమానించిన కుటుంబసభ్యులు, బంధువులు గది తలుపులు బద్దలుకొట్టి తెరవడంతో సందీప్ అప్పటికే ఉరికి వేసుకొని ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వెంటనే పెళ్లిని రద్దు చేశారు. ఈ ఘటనతో ఫంక్షన్హాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. వధూవరుల కుటుంబాలు దిగ్భ్రాంతి చెందాయి. వరుడి కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస చారి, పద్మ దంపతుల కుమారుడైన సందీప్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. అతని ఆత్మహత్యకు కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. -
‘సైన్మా’ సూపర్ హిట్
హిమాయత్నగర్: అక్కడకు వెళ్తే సినిమా థియేటర్కు వెళ్లినట్టుంటుంది. లోనికి అడుగుపెట్టగానే సినిమాకు వచ్చినట్టు అనుభూతి కలుగుతుంది. మనకు కేటాయించిన సీట్లో కూర్చోగానే.. పాత సినిమాల్లోని ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్ వీనులకు విందు చేస్తాయి. అదే కొంపల్లిలోని ‘సైన్మా’ రెస్టారెంట్. ఈ హోటల్ సినిమా వాతావరణాన్ని గుర్తు చేస్తే.. ఫుడ్ మాత్రం బాహుబలి సినిమాను తలపిస్తుంది. సరికొత్త థీమ్కు కేరాఫ్గా నిలుస్తున్న ఈ రెస్టారెంట్ నగర టెక్కీలు, యువతకు తెగ నచ్చేసింది. అంతా ‘సైన్మా’నే తెలంగాణలో సినిమా అనే పదాన్ని ‘సైన్మా’ అని పలుకుతారు. అదే పేరుతో ఓ కొత్త రెస్టారెంట్ను ఏర్పాటు చేయాలని నగరానికి చెందిన సందీప్రెడ్డి, అక్షయ్రెడ్డిలు డిసెంబర్లో కొంపల్లిలో ఏర్పాటు చేశారు. రెస్టారెంట్ ఎంట్రన్స్ నుంచే ‘సైన్మా’ సందడి మొదలవుతుంటుంది. రెస్టారెంట్ లోపల మొదటి సినిమా నుంచి ఇటీవల విడుదలైన సినిమాల పోస్టర్లు, హీరో, హీరోయిన్ల స్టిల్స్ ఆకట్టుకుంటాయి. ఈ రెస్టారెంట్లో ఉన్నంతసేపు థియేటర్లో ఉన్నట్లే అనిపించడం గమనార్హం. పగలు ఆడియో..రాత్రి వీడియో.. రెస్టారెంట్లో లంచ్ టైంలో ఆపా మధురాలు.. ఓల్డ్ మెలోడీ పాటలు శ్రావ్యంగా వినిపిస్తాయి. లంచ్ అవర్ అంతా ఆడియో సాంగ్స్ను వింటూ ఎంచక్కా మనకు నచ్చిన ఫుడ్ని ఎంజాయ్ చేయోచ్చు. ఇక రాత్రి డిన్నర్ సెక్షన్కు రూటు మార్చుతారు. లోపల పెద్ద స్క్రీన్పై అలనాటి వీడియో సాంగ్స్ను ప్లే చేస్తారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ.. ఇలా అందరి హీరోల ఎవర్గ్రీన్ వీడియో సాంగ్స్తో రెస్టారెంట్ సరికొత్తగా మారిపోతుంది. అంతేకాదు ఇక్కడ వడ్డించే ఫుడ్ కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుంది. బాహుబలి చికెన్.. తమలపాకు కబాబ్.. బాహుబలి పార్ట్–1, పార్ట్–2 సినిమాలకు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న ఈ రెస్టారెంట్ నిర్వాహకులు ‘బాహుబలి చికెన్’ అనే కొత్త కాన్సెప్ట్ని పరిచయం చేశారు. బాహుబలి సినిమాలో తల్వార్తో హీరో ప్రభాస్ ప్రత్యర్థులను మట్టికరిపించాడు. ఇప్పుడు అదే తరహాలో తల్వార్తో చికెన్ పీసులు గుచ్చి అందిస్తారు. చికెన్ కబాబ్లో చాలా వెరైటీలే ఇక్కడ ఉన్నాయి. ఈ రెస్టారెంట్లో మరో ప్రత్యేకం ‘తమలపాకు కబాబ్’. పాన్ తింటుంటే ఎలా ఉంటుందో అదే రీతిలో ఈ కబాబ్ ఉంటుంది. ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం తాము ప్రవేశపెట్టినట్లు నిర్వాహకులు సందీప్రెడ్డి, అక్షయ్రెడ్డి చెబుతున్నారు. జింజర్ చికెన్ బిర్యానీ కూడా హైదరాబాద్ బిర్యానీ తరహీ ఫేమస్. మంచి ఘాటుగా ఉండే ఈ బిర్యానీకి నగర టెక్కీలు ఇష్టంగా లాగించేస్తున్నారు. సరికొత్త రుచులుమా ప్రత్యేకత ఇండియాలోనే ఈ థీమ్తో వచ్చిన తొలి రెస్టారెంట్ మాదే. నగర వ్యాప్తంగా మారెస్టారెంట్ హాట్ టాపిక్గా ఉంది. అందరికీ ‘సైన్మా’ వాతావరణంలో ఫుడ్ని తినిపించాలనే కాన్సెప్ట్తో దీన్ని ప్రారంభించాం. భోజనప్రియుల కోరికలకు అనుగుణంగా రుచులను అందిస్తాం. – సందీప్రెడ్డి, అక్షయ్రెడ్డి, ‘సైన్మా’ యాజమాన్యం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement