-
కొమురవెల్లిలో బ్లాస్టింగ్లు!
సిద్దిపేట: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అందులోభాగంగా గుడి పక్కన కొండ రాళ్లు తొలగించడానికి సదరు కాంట్రాక్టర్ బ్లాస్టింగ్లు జరుపుతుండటంతో ఆదివారం ఆలయ కార్యాలయానికి, స్థానిక భవనాల గోడలకు బీటలువారాయి. దీంతో స్వామివారి మూల విరాట్టుకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. పదేపదే బ్లాస్టింగ్లు చేయడం వల్ల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రమాదం బారిన పడే అవకాశముందని, బ్లాస్టింగులు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు ఆలయ అధికారులను కోరుతున్నారు. ఈ విషయమై ఆలయ ఈవోకు వినతి పత్రం అందించడానికి వెళ్లిన సమయంలో బ్లాస్టింగ్ జరిగి పెద్ద బండరాయి వచ్చి ఆలయ కార్యాలయం వద్ద పడింది. ఈ విషయంపై ఈవో బాలాజీని వివరణ కోరగా తక్షణమే బ్లాస్టింగ్ను నిలిపివేసి, కెమికల్తో బండరాళ్లను తొలగించాలని సూచించినట్లు తెలిపారు. -
కొమురవెల్లిలో భక్తుల సందడి
► మల్లన్న నామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణం కొమురవెల్లి(సిద్దిపేట): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామిని ఆషాడమాసంలో దర్శిం చుకోవడానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆదివారం రాష్ట్రంలోని సిద్దిపేట, జనగామ, జగిత్యాల, వరంగల్, హైదరా బాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కొమురవెల్లిలో ఉదయం భక్తులు ఆలయంలోని గంగిరేగు చెట్టు ప్రాంగణం, ఆలయ ముఖమండపం, రాతిగీరలు, రాజగోపురం, కోడేల స్తంభం వద్ద భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు భక్తులు భోనాలు తీసి పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు శ్రీమల్లికార్జునస్వామి, బలిజమేడలాదేవికి, గొల్లకేతమ్మలకు ఓడిబియ్యం పోశారు. భక్తులు మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. ఆలయ ఈఓ రామకృష్ణరావు, అధికారులు, సిబ్బంది భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. -
కొమురవెల్లి ఆలయంలో గోవులను సంరక్షించాలి
• ఈ విషయమై సీఎం కేసీఆర్కు లేఖ రాస్తా • విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి హైదరాబాద్: కొమురవెల్లి దేవాలయంలో భక్తులు సమర్పిం చే ఆవులను కబేళాలకు తరలించడం దురదృష్టకరమని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గోవులను సంరక్షించాలని సీఎం కేసీఆర్కు లేఖ రాయనున్నట్లు స్వామిజీ తెలిపారు. హైదరాబాద్ చందానగర్లోని విశాఖ శారద పీఠం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం లో విరాట్ విశ్వశాంతి మహాయజ్ఞం గురువారం వైభవంగా నిర్వహించారు. విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానం దేంద్ర సరస్వతి శారద మాత పీఠ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి స్వామిజీ మాట్లాడుతూ కేసీఆర్ యజ్ఞాలు, యాగాలు, దేవాలయాల సంరక్షణ కోసం ఎంతో కృషి చేస్తున్నా.. కొమురవెల్లిలో మాత్రం దారుణం జరుగుతోందన్నారు. గోసంరక్షణ ద్వారా అంతా మంచే జరుగుతుందన్నారు. గోవధ మంచిది కాదని, వాటి ఏడుపు రాష్ట్రానికి కీడు చేస్తుందని అన్నారు. భక్తులు సమర్పించే గోవుల ద్వారా వచ్చే పాలను దేవతామూర్తులకు వినియోగించాలని కోరారు. విదేశీ విద్య సరికాదు: ప్రస్తుత ప్రభుత్వాలు, కొంతమంది హిందూవాదులమని చెప్పుకొనేవారు ఆధ్యాత్మిక వ్యాపా రాలు చేస్తున్నారని ఆరోపించారు. సంప్రదాయాలకు, ఆచా రాలకు తిలోదకాలిచ్చి యువతీ యువకుల ను, కుటుం బాలను మోసం చేస్తున్నారన్నారు. భారతీయ సంప్రదా యంతో కూడిన చదువులను వదిలేసి, విదేశీ పద్ధతులకు అనుగుణంగా విద్యను అందించడం సరికాదన్నారు. రామాయణం, భారతం, భగవద్గీత, మనిషి జీవన విధానాలకు ఉపకరించే వేదాలను ఇచ్చిన దేశం మనదని గుర్తు చేశారు. నేడు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుందన్నారు. దేవాలయ ప్రాంగణంలో గురువారం చండీహోమం, సుదర్శన హోమం, రుద్ర హోమం, నవగ్రహ పుండలిని హోమం, సుబ్రహ్మణ్య హోమం తదితర ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఓ మదీ మేలుకో..!
‘ఎన్నికల సమయంలో డ్యూటీ పీరియడ్గా పరిగణించాలి’
స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించిన ఎస్పీ
లూజు పెట్రోల్ విక్రయించరాదు
24న ఎచ్చెర్ల ఐటీఐలో జాబ్ మేళా
మల్లేష్కు కన్నీటి వీడ్కోలు
తగ్గని ఎన్నికల వేడి
మహేంద్రతనయలో పడి యువకుడి మృతి
ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షకు 97 మంది గైర్హాజరు
ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య
తప్పక చదవండి
- కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- మధ్యవర్తిత్వం..వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం
- Election Commission of India: ఐదో విడతలో 59.06 శాతం
- చత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం
Advertisement