-
పెద్దమంగళారం 'పంచాయతీ టు అసెంబ్లీ'
సాక్షి, వికారాబాద్: మండల పరిధిలోని పెద్దమంగళారం రాజకీయ కీర్తిని ఘడించింది. ఉమ్మడి రాష్ట్రానికి ముగ్గురు ఎమ్మెల్యేలను అందించి రాజకీయ చరిత్రకెక్కింది. 1952, 1957లో షాబాద్ ఎమ్మెల్యేగా, 1959లో రెవెన్యూ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కొండా వెంకట రంగారెడ్డి పెద్దమంగళారం వాసి. 1978–82 మధ్యకాలంలో చేవెళ్ల ఎమ్మెల్యేగా ఉన్న చిరాగ్ ప్రతాప్లింగంగౌడ్, 1983–85 మధ్యకాలంలో చేవెళ్ల ఎమ్మెల్యే పదవిలో ఉన్న కొండా లక్ష్మారెడ్డి పెద్దమంగళారం పంచాయతీకి చెందినవారే. విలీనానికి వ్యతిరేకం కేవీఆర్.. 1890 డిసెంబర్ 12న పెద్దమంగళారంలో రైతు కుటుంబంలో జన్మించిన కొండా వెంకట రంగారెడ్డి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. జమీందార్లకు, జాగీర్దార్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఆయన రైతుల పక్షాన పోరాటం చేశారు. ఆ సమయంలో జైలు జీవితం సైతం అనుభవించారు. 1952–57 వరకు షాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. 1956లో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. పెద్దమనుషుల ఒప్పందంలో ఆయన కీలక భూమిక పోషించారు. 1959లో నీలం సంజీవరెడ్డి ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ఆయన అనంతరం ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 1969లో తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తి ప్రత్యేక రాష్ట్రంకోసం పోరాటం చేశారు. 1970 జూలై 24న ఆయన తుదిశ్వాస విడిచారు. ఇవి చదవండి: సీఎంను అందించిన భాగ్యనగరం! -
ఆనాడే పోరాడారు..
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: రజాకార్ల నిరంకుశ పాలనకు ఎదురొడ్డారాయన. ఆంధ్రలో హైదరాబాద్ రాష్ర్ట విలీనానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. తెలంగాణ స్వయంప్రతిపత్తికి ఆ రోజుల్లోనే పట్టుబట్టిన నాయకుడే కొండా వెంకటరంగారెడ్డి. సమైక్య రాష్ట్రంలో తొలి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేవీ రంగారెడ్డి 1890 డిసెంబర్ 12న మొయినాబాద్ మండలం పెద్ద మంగళారంలో జన్మించారు. ఉర్దూ భాషలో ప్రావీణ్యుడైన కొండా వకీలుగా పనిచేశారు. హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా వ్యవహరించిన రంగారెడ్డి అప్పట్లో ఆ రాష్ట్రాన్ని ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేయాలనే ప్రతిపాదనకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వయం పాలనకు అవకాశమివ్వకుండా ఆంధ్రలో కలపాలనే ఆలోచనను విరమించుకోవాలని కేంద్రంపై ఒత్తిడి చేశారు. స్వయంప్రతిపత్తి కోసం యువత ప్రాణాలర్పించడంతో చలించిన కొండా మంత్రి పదవికి రాజీనామా చేశారు. 1956 ఫిబ్రవరి 26న రాష్ట్ర విలీన సమయంలో పెద్ద మనుషుల ఒప్పందంలో కీలక సభ్యుడిగా వ్యవహరించారు కేవీ రంగారెడ్డి. ఈయన మేనల్లుడే మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి. మామ స్మృత్యర్థం చెన్నారెడ్డి 1978లో ‘రంగారెడ్డి’ జిల్లాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ఆ రోజుల్లోనే బలంగా చాటిన కొండా వెంకటరంగారెడ్డి 123 జయంతి గురువారం. ప్రత్యేక రాష్ట్ర కల సాకారమవుతున్న వేళ ఆయనకిదే నిజమైన నివాళి అని చెప్పుకోవచ్చు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పోలింగ్ కు కౌంట్ డౌన్
సునీల్ నరైన్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
వాజ్పేయిని ఒప్పించి రోడ్లేశా!
నాయకుల గెలుపులో.. ప్రజలదే తుది నిర్ణయం!
29వ సారి ఎవరెస్ట్ను అధిరోహించిన కమీ రీటా షెర్పా
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు (ఫొటోలు)
ఓటేయండి.. రాయితీ పొందండి
వివాదాలు.. సంచలనాలు.. కేసులు
ప్రత్యామ్నాయంగా..
ఓటు ఎటో!
తప్పక చదవండి
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- AP: వ్యవసాయం పండగ
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- ఆడియోతో అడ్డంగా దొరికిపోయిన షర్మిల
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement