-
కౌలు రైతులపై అక్షర దాడి !
-
కౌలు రైతులకు అండగా నిలిచిన జగనన్న ప్రభుత్వం
-
కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ పచ్చి అబద్ధాలు
-
కౌలు రైతుకు మేలేదీ?
వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఖరీఫ్ నుంచి అమలు చేయనున్న పెట్టుబడి సాయం పథకంపై కౌలు రైతులు నిరాశతో ఉన్నారు. పెట్టుబడి సాయాన్ని పట్టాదారులకు కాకుండా క్షేత్రస్థాయిలో పంట సాగుచేస్తున్న తమకు ఇవ్వాలని కోరుతున్నారు. పెట్టుబడి సాయం పథకంతో తమకు ఎలాంటి ప్రయోజనం లేదని తెలిసి ఆవేదన చెందుతున్నారు. భూపట్టాదారుల్లోని ధనిక రైతులు వ్యవసాయాన్ని వదిలి ఇతర రంగాల్లో స్థిరపడ్డారు. వారి భూమిని సామాన్య రైతులు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. తాము భూయజమానులకు కౌలు చెల్లిస్తుండగా, ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని వారికే ఇస్తుండటం ఏమిటని అంటున్నారు. జిల్లాలో 1,69,892 ఎకరాల సాగు భూమి జిల్లాలోని 16 మండలాల్లో 1,69,892 ఎకరాల సాగుభూమి ఉంది. ఇందులో 3,74,519 రైతులు భూములు కలిగి ఉన్నట్లు రెవెన్యూ అధికారులు రికార్డుల ప్రక్షాళనలో గుర్తించారు. భూమి కలిగిన రైతుల్లో సుమారు 50శాతానికి పైగా తమ భూములను ఇతరులకు కౌలుకు ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే కౌలుకు తీసుకున్న వారు ఆయా భూములకు సంబంధించి ఎకరానికి రూ.8 నుంచి రూ.11వేల వరకు కౌలు చెల్లిస్తుండగా ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయంతో భూ యజమానికి మరో రూ.4 వేలు అదనంగా లబ్ధిచేకూరనుంది. కౌలు రైతులను ఆదుకోని ప్రభుత్వం అనేక కష్టనష్టాలను ఎదుర్కొని పంటసాగు చేస్తున్న కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పంటసాగు చేసిన సమయంలో అనుకోని విపత్తులు వచ్చి నష్టపోయిన సమయంలో సైతం తమకు ప్రభుత్వం పంటనష్ట పరిహారం అందించిన పరిస్థితులు లేవని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి ఆర్థికంగా చేయూతనందించాలని కౌలు రైతులు కోరుతున్నార సాగు చేసిన వారికే డబ్బులు ఇవ్వాలి పంట సాగు చేసిన వారికే ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి. పంటలు ఒకరు సాగు చేస్తే ఇంకొకరికి డబ్బులు ఇస్తామనటం సరైనది కాదు. డబ్బులు పట్టాదారులకే ఇవ్వటం వల్ల మాకు ఎలాంటి మేలు జరగదు. – నల్లమాస హరినాథ్, కౌలు రైతు, బయ్యారం రైతులందరికీ సాయం అందించాలి పంటలు పండించే రైతులందరికీ ప్రభుత్వం సాయం అందించాలి. పట్టాదారులకే కాకుండా కాస్తులో ఉన్న ప్రతి రైతుకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించినప్పుడే రైతులు పంటలసాగుపై దృష్టి పెడతారు. వీటితోపాటు పండించిన పంటకు గిట్టుభాటు ధర కల్పించాలి. – గౌని ఐలయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి -
అప్పు పుట్టక.. ఎలా నాగలి నడక
సాక్షి ప్రతినిధి, ఏలూరు : బ్యాంకుల నుంచి అప్పు పుట్టడం లేదు. వెబ్ల్యాండ్కు బయోమెట్రిక్ విధానాన్ని అనుసంధానించటంతో విత్తనాలపై రాయితీ అందటం లేదు. జిల్లాలో మూడు లక్షల మంది కౌలు రైతులు ఉండగా.. ఖరీఫ్ సీజన్ ఆరంభమై 10 రోజులు కావస్తున్నా ఒక్కరికైనా పైసా రుణం దక్కలేదు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితుల్లో ఖరీఫ్ సాగును ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక వారంతా సతమతమవుతున్నారు. జిల్లాలోని కౌలు రైతులను పెట్టుబడి సమస్య వెంటాడుతోంది. ఈ ఏడాది ఖరీఫ్ సాగును ముందస్తుగా చేపట్టామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. జూన్ 1న కాలువలకు గోదావరి జలాలు విడుదల చేశారు. తంటాలు పడి నారుమడులు పోసిన కౌలు రైతులు పెట్టుబడికి అప్పులిచ్చే వారికోసం వెతుకులాడే పనిలో నిమగ్నమయ్యారు. డెల్టాలో 80 శాతం మంది కౌలు రైతులే వరి సాగు చేస్తున్నారు. జిల్లాలో మూడు లక్షల మంది కౌలు రైతులు ఉండగా.. వారిలో అధిక శాతం మంది డెల్టాలోనే ఉన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 5.30 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. నెల రోజుల క్రితమే రబీ పం టను విక్రయించగా వచ్చిన సొమ్ము గత ఖరీఫ్, రబీ పంటల కోసం చేసిన అప్పులు తీర్చడానికి సరిపోయింది. దీంతో తొలకరి పంటకు సొమ్ములందక బిత్తరచూపులు చూస్తున్నారు. కౌలు రైతులకు బ్యాంకుల నుంచి అప్పు పుట్టే పరిస్థితి లేకుండా పోయింది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు అప్పులు కూడా దొరకడం కష్టంగా మారింది. ధాన్యాన్ని లెవీగా సేకరించే విధానం అమల్లో ఉన్నప్పుడు మిల్లర్లు, కమీషన్ వ్యాపారులు కౌలు రైతులకు అప్పులు ఇచ్చేవారు. కోతలు పూర్తయ్యాక వారే ధాన్యం కొని.. అప్పుపోగా మిగిలిన సొమ్మును వారి చేతిలో పెట్టేవారు. ఇప్పుడు ప్రభుత్వమే నేరుగా ధాన్యం సేకరిస్తుండటంతో మిల్లర్లు, కమీషన్ వ్యాపారులు అప్పులివ్వడం మానేశారు. ప్రైవే టు వ్యాపారులెవరైనా అప్పులిచ్చినా నూటికి రూ.2 నుంచి రూ.5 వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. ఎరువులు, పురుగు మందుల్ని అరువు పద్ధతిన కొనుగోలు చేయాల్సి రావడంతో కొందరు డీలర్లు నకిలీ, నాణ్యత లేనివాటిని అంటగడుతున్నారు. లక్ష్యానికి దూరంగా రుణాలు ఈ ఏడాది రూ.6,526 కోట్లను రైతులకు రుణా లుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా.. అం దులో 10 శాతం కౌలు రైతులకు అందేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. 80 శాతం పైగా పొలాలను సాగుచేసే కౌలు రైతులకు 10 శాతమే ఇచ్చేలా చూస్తామని ప్రభుత్వం చెబుతోంది. అదికూడా వారికి దక్కడం లేదు. గత ఏడాది రూ.5,176 కోట్లను 3.98 లక్షల మంది రైతులకు రుణాలుగా ఇచ్చారు. ఇందులో వ్యక్తిగత, రైతుమిత్ర, జేఎల్జీ గ్రూపుల ద్వారా కౌలు రైతులకు దక్కింది కేవలం రూ.21 కోట్లు మాత్రమే. అంటే మొత్తం రుణంలో 0.4 శాతం కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది ఖరీఫ్లో రూ.3,300 కోట్లను బ్యాంకర్లు రుణాలుగా ఇవ్వాల్సి ఉండగా.. అవి భూ యజ మానులకు దక్కుతున్నాయి తప్ప కౌలు రైతుకు చేరడం లేదు. ఒక సర్వే నంబర్పై ఒకరికే రుణం ఇస్తామంటున్న బ్యాంకర్లు క్షేత్రస్థాయిలో ఎవరు సాగు చేస్తున్నారు, ఎవరికి రుణం ఇవ్వాలనే అంశాన్ని పట్టించుకోవడం లేదు. మరోవైపు రుణం విషయంలో బ్యాంకులకు ప్రభుత్వం కూడా హామీ ఇవ్వలేకపోతోంది. రుణమాఫీలోనూ అన్యాయమే రుణమాఫీ విషయంలోనూ కౌలు రైతులకు అన్యాయం జరిగింది. జిల్లాలో కౌలు రైతులకు రూ.165 కోట్లు మాఫీ కావాల్సి ఉండగా.. ఈ మూడేళ్లలో కేవలం రూ.40 కోట్లు మాత్రమే మాఫీ అయ్యింది. రుణమాఫీ పథకానికి అర్హులైన రైతులను వడ్డీల భారం వేధిస్తోంది. ఆ మొత్తాన్ని రైతులు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో వారికి కొత్త రుణాలు ఇవ్వడం లేదు. చేటు తెచ్చిన బయోమెట్రిక్ విధానం తాజాగా రుణాల మంజూరు కోసం ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తోంది. దీనిని వెబ్ల్యాండ్కు అనుసంధానం చేశారు. ఇది సరిగా పనిచేయకపోవడంతో వ్యవసాయ శాఖ సకాలంలో దీనిని అమలు చేయలేకపోతోంది. వెబ్ల్యాండ్లో పేరు నమోదైన భూ యజమాని వచ్చి వేలిముద్ర వేస్తేనే వెబ్ల్యాండ్ ఓపెన్ అవుతోంది. అందువల్ల రుణాలు భూ యజమానులకే అందుతున్నాయి. కౌలు రైతులకు రుణార్హత గుర్తింపు కార్డులిచ్చినా.. వాటిని బయోమెట్రిక్ విధానానికి అనుసంధానం చేయలేదు. ఫలితంగా విత్తనాల కొనుగోలు, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పొందలేక కౌలు రైతు సతమతమవుతున్నాడు. వరి విత్తనాలపై కిలోకు రూ.ఐదు చొప్పున సబ్సిడీ ఇస్తుండగా.. 30 కిలోలకు రూ.150 మాత్రమే దక్కుతోంది. ఈ సొమ్ము వెబ్ల్యాండ్, ఇతర పనుల మీద తిరగడానికే సరిపోతోంది. వేసవిలో జీలుగ, పిల్లిపెసర, జనుము వంటి పచ్చిరొట్ట విత్తనాలపై 75 శాతం సబ్సిడీ ఇచ్చినా కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా అందలేదు. 2008లో రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. పంట రుణాలకు సంబంధించి రూ.లక్ష వరకూ ఎలాంటి హామీ అవసరం లేదు. కౌలు రైతు లేదా రైతు నుంచి వ్యక్తిగత ధ్రువీకరణ (సెల్ఫ్ డిక్లరేషన్) తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా లక్ష వరకు వడ్డీ లేని రుణం రైతుకు అందితే ఏడాదికి రూ.24 వేల వరకూ వడ్డీ రూపంలో లబ్ధి చేకూరుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కౌలు రైతులకు రుణాలు అందేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
నాట్లు వేశాం.. పంట రుణాలు ఇవ్వండి
ఏలూరు (సెంట్రల్) : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం కలెక్టరేట్ వద్ద కౌలు రైతులు ధర్నా చేశారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. జిల్లాలో 3 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, చట్టప్రకారం భూ యజమానితో సంబంధం లేకుండా అందరికీ రుణార్హత గుర్తింపు కార్డులు ఇవ్వాల్సి ఉందని జిల్లా కౌలు రైతుల సంఘం అధ్యక్షుడు జుత్తిగ నరసింహమూర్తి అన్నారు. అధికారులు చెబుతున్న లెక్కలు వాస్తవ పరిస్థితికి దూరంగా ఉన్నాయని, కార్డుల జారీలో కొందరు సొమ్ములు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.6,200 కోట్లు రుణ లక్ష్యం ప్రకటించినా కౌలు రైతులకు ఒక శాతం కూడా రుణాలు ఇవ్వలేదని విమర్శించారు. జీవో ప్రకారం ప్రతి కౌలు రైతుకూ రూ.లక్ష వడ్డీలేని రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివిధ సంఘాల నాయకులు డి.అశోక్కుమా ర్, డీఎన్వీడీ ప్రసాద్, జక్కంశెట్టి సత్యనారాయణ, పీవీ రామకృష్ణ ధర్నాకు సంఘీభావం తెలిపారు. అనంతరం కలెక్టర్ కె.భాస్కర్కు వినతిపత్రం అందించారు. కౌలు రైతులు కలెక్టరేట్ నుంచి ర్యాలీగా వెళ్లి వ్యవసాయశాఖ జేడీ కార్యాలయాన్ని ముట్టడించారు. వ్యవసాయశాఖ డీడీ, ఆంధ్రా బ్యాంకు ఏజీఎం కార్యాలయాల్లో వినతి పత్రాలు అందించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఏపీ ఎన్నికలపై సీఎం జగన్ ట్వీట్
May 15th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
స్ట్రాంగ్ రూముల్లో అభ్యర్థుల భవితవ్యం:
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి హేయమైన చర్య
విజయం వైఎస్సార్ సీపీదే
20న ఎడ్ల బండలాగుడు పోటీలు
No Headline
ఓటేసిన 15,89,412 మంది
Hyderabad: కాస్త పెరిగినా చివరి స్థానమే..
జేసీకి భారీ షాక్..ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
Advertisement