-
కృష్ణా జలాలపై తగ్గేదే లేదు
సాక్షి, అమరావతి: కృష్ణా నది జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్లాలని జల వనరుల శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణలో రాజీ పడే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2)కు కేంద్ర జల్ శక్తి శాఖ కొత్త మార్గదర్శకాలతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖలు రాయాలని ఆదేశించారు. రాష్ట్ర హక్కులను పరిరక్షించేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని చెప్పారు. కృష్ణా జలాలపై కేంద్రం తాజా విధి విధానాలపై సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, న్యాయ నిపుణులతో సీఎం వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కృష్ణా జలాల పంపిణీపై గతంలో బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1), బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) చేసిన కేటాయింపులపై సమగ్రంగా చర్చించారు. కేడబ్ల్యూడీటీ–2 తదుపరి నివేదిక ద్వారా మిగులు జలాల కేటాయింపుల్లోనూ రాష్ట్రానికి నష్టం జరిగిన అంశంపైనా చర్చించారు. ఈ పరిణామాలన్నీ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమని అధికారులు సీఎం వైఎస్ జగన్కు వివరించారు. విభజన చట్టానికి విరుద్ధం కేంద్ర మార్గదర్శకాలు విభజన చట్టం సెక్షన్–89లో పేర్కొన్న అంశాలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. రాష్ట్ర విభజనకు ముందు చేసిన కేటాయింపులకు కట్టుబడి ఉండాలని విభజన చట్టం స్పష్టం చేస్తుంటే.. దీనిని ఉల్లంఘించేలా కేంద్రం మార్గదర్శకాలు ఉన్నాయని వివరించారు. ఇప్పటికే సుప్రీం కోర్టు ముందు పలు పిటిషన్లు పెండింగ్లో ఉన్నప్పటికీ, కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పారు. అలాగే అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టంలో క్లాజ్–4ను కూడా కేంద్రం ఉల్లంఘించిందని, 2002కు ముందు చేసిన కేటాయింపులను, పంపకాలను పునఃపరిశీలించరాదని ఈ చట్టం స్పష్టం చేస్తోందని తెలిపారు. గోదావరి జలాల కేటాయింపులను ఇంకో బేసిన్కు తరలించుకోవచ్చన్న వెసులుబాటుతో మన రాష్ట్రం పోలవరం నుంచి తరలించే నీటిని పరిగణనలోకి తీసుకుని ఆమేరకు తెలంగాణకు కృష్ణా జలాల్లో అదనపు కేటాయింపులు చేసే అంశాన్ని కూడా కేడబ్ల్యూడీటీ–2కు నిర్దేశించడం సమంజసం కాదని, ఇది రాష్ట్రానికి నష్టమని అధికారులు వివరించారు. అదే తెలంగాణ గోదావరి నుంచి 214 టీఎంసీలను కృష్ణా బేసిన్కు తరలిస్తున్నప్పటికీ, ఆ మేరకు కృష్ణా జలాలను అదనంగా మన రాష్ట్రానికి కేటాయించేలా కేడబ్ల్యూడీటీ–2కు జారీ చేసిన విధి విధానాల్లో చేర్చకపోవడంపైనా సమావేశంలో చర్చించారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్గనిర్దేశం చేశారు. -
బ్రిజేష్ ట్రిబ్యునల్కు కొత్త మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కృష్ణా నదీ జలాల పంపిణీ, కేటాయింపులకు సంబంధించి జస్టిస్ బ్రిజేష్కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ)–2కు కొత్త విధి విధానాల(టరŠమ్స్ ఆఫ్ రెఫరెన్సస్)ను కేంద్రం జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేడబ్ల్యూడీటీ–1(బచావత్ ట్రిబ్యునల్) కేటాయించిన 811 టీఎంసీలతోపాటు.. పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణాకు మళ్లించే గోదావరి జలాలకుగాను గోదావరి ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన జలాల(45 టీఎంసీలు)ను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసి, వాటాలు తేల్చి.. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయాలని నిర్దేశించింది. తద్వారా విభజన చట్టంలో సెక్షన్–89లో ‘ఏ’, ‘బీ’ నిబంధలనకు సరి కొత్త నిర్వచనం చెప్పింది. ప్రాజెక్టులంటే.. ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన దశలో ఉన్నవని స్పష్టీకరించింది. ఈ విధి విధానాల మేరకు నీటి కేటాయింపులపై విచారణ చేసి 2024 మార్చి 31లోగా అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల(ఐఎస్ఆర్డబ్ల్యూడీ) చట్టం–1956లో సెక్షన్–5(3) ప్రకారం నివేదిక ఇవ్వాలని కేడబ్ల్యూడీటీ–2కు నిర్దేశించింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్మోహన్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు (గెజిట్ నెంబర్ 4204) జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం 2014 జూలై 14న సెక్షన్–3 ప్రకారం కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేయాలని చేసిన ఫిర్యాదు ఆధారంగా కేడబ్ల్యూడీటీ–2కు కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదించిన మరిన్ని విధి విధానాలకు బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర జల్ శక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం పేర్కొన్న మార్గదర్శకాల మేరకు ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపై కేడబ్ల్యూడీటీ–2 విచారణ చేస్తోంది. కేంద్రం ఇప్పుడు జారీ చేసిన విధి విధానాలతో కృష్ణా జలాల పంపిణీ మళ్లీ మొదటికొచ్చినట్లయింది. బచావత్ ట్రిబ్యునల్ సమీక్ష చట్ట విరుద్ధం ఐఎస్ఆర్డబ్ల్యూడీ చట్టం–1956లో సెక్షన్–6(2) ప్రకారం ఒక ట్రిబ్యునల్ పరిష్కరించిన జల వివాదాన్ని మళ్లీ పునఃసమీక్షించడం చట్టవిరుద్ధం. పరిష్కారమైన జల వివాదం సుప్రీంకోర్టు తీర్పుతో సమానం. అందుకే బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టీఎంసీల జోలికి వెళ్లకుండా.. వాటిని యథాతథంగా బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ కొనసాగించింది. కానీ.. ఇప్పుడు కేంద్ర జల్ శక్తి శాఖ వాటిని పంపిణీ చేయాలని బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కు నిర్దేశించడం గమనార్హం. పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల్లో నాగార్జునసాగర్కు ఎగువన 45 టీఎంసీలను కృష్ణాలో అదనంగా వాడుకునే అవకాశాన్ని గోదావరి ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఇచ్చింది. అదే ట్రిబ్యునల్.. గోదావరి జలాలను ఏ బేసిన్కు మళ్లించినా.. ఆ నది జలాల్లో అదనపు వాటాను దాని పరిధిలోని రాష్ట్రాలకు ఇవ్వాలని నిర్దేశించింది. కాళేశ్వరంతోపాటు వివిధ ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్ 240 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు మళ్లిస్తోంది. వాటిని బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కు జారీ చేసిన విధి విధానాల్లో చేర్చకపోవడం గమనార్హం. పదేళ్ల తర్వాత మరిన్ని విధి విధానాలా! కృష్ణా జలాల పంపిణీకి 2004 ఏప్రిల్ 2న సెక్షన్–4 ద్వారా ఏర్పాటైన బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్.. సెక్షన్–5(2) కింద 2010 డిసెంబర్ 30న నివేదికను.. 2013 నవంబర్ 29న తదుపరి నివేదికను కేంద్రానికి సమర్పించింది. ట్రిబ్యునల్కు నిర్దేశించిన లక్ష్య సాధనపై కేంద్రం సంతృప్తి చెందితే సెక్షన్–12 కింద ఆ ట్రిబ్యునల్ను రద్దు చేయొచ్చు. లక్ష్య సాధనపై సంతృప్తి చెందకపోతే తదుపరి నివేదిక ఇచ్చిన మూడు నెలల్లోగా అదనపు విధి విధానాలను నిర్దేశించి, మళ్లీ విచారణ చేయాలని కోరే అధికారం కేంద్రానికి ఉంటుంది. కానీ.. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తదుపరి నివేదిక ఇచ్చి దాదాపు పదేళ్లు పూర్తవడం గమనార్హం. -
ముగింపా? కొనసాగింపా?
సాక్షి, అమరావతి: కృష్ణా నదీజలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తరచుగా వివాదాలకు దారితీస్తున్న సమస్యల పరిష్కారానికి రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) వచ్చే నెల 3న నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదికతోనైనా జల వివాదాలకు తెరపడుతుందా లేదా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్ల నిర్వహణ నియమావళి, విద్యుదుత్పత్తి, మళ్లించిన వరదజలాలను కోటాలో కలపడం ప్రధానమైన మూడు సమస్యలని మే 6న జరిగిన కృష్ణా బోర్డు 16వ సర్వ సభ్య సమావేశంలో బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ గుర్తించారు. ఆ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చేందుకు బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై అధ్యక్షతన రెండు రాష్ట్రాల ఈఎన్సీలు, జెన్కోల సీఈలు సభ్యులుగా ఆర్ఎంసీని ఏర్పాటు చేశారు. సమస్య –1: రూల్ కర్వ్పై తలో మాట బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్కు 512, తెలంగాణకు 299 టీఎంసీలు నీటిని కేటాయిస్తూ కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. దీని ఆధారంగా శ్రీశైలం, నాగార్జునసాగర్లలో ఏ ప్రాజెక్టు ఆయకట్టుకు ఎప్పుడు నీటిని విడుదల చేయాలనే నియమావళి (రూల్ కర్వ్) ముసాయిదాను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) రూపొందించింది. ఈ రూల్ కర్వ్పై ఆర్ఎంసీ చర్చించింది. సీడబ్ల్యూసీ రూపొందించిన రూల్ కర్వ్ను ఏపీ ప్రభుత్వం ఆమోదించగా, తెలంగాణ వ్యతిరేకించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 114 టీఎంసీలు (చెన్నైకి తాగునీరు, ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు– నగరి) బచాత్ ట్రిబ్యునల్, విభజన చట్టం కేటాయింపులు చేశాయని ఏపీ ప్రభుత్వం గుర్తు చేస్తోంది. ఆ మేరకు నీటి కేటాయింపులు ఉండాల్సిందేనని స్పష్టం చేస్తోంది. సీడబ్ల్యూసీ కూడా ఏపీ వాదననే సమర్థిస్తోంది. సమస్య–2: విద్యుదుత్పత్తిపై తకరారు సాగర్, కృష్ణా డెల్టా ఆయకట్టులో సాగు, తాగునీటి అవసరాలున్నప్పుడు, కృష్ణా బోర్డు కేటాయించిన నీటిని మాత్రమే శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేస్తూ విద్యుదుత్పత్తి చేయాలన్నది నిబంధన. శ్రీశైలంలో ఉత్పత్తయ్యే విద్యుత్ నీటి కేటాయింపుల మేరకు 64% వాటా తమకు రావాలని ఏపీ స్పష్టం చేస్తుండగా.. తెలంగాణ మాత్రం తమకు 76% వాటా కావాలని ప్రతిపాదిస్తోంది. సమస్య–3: వరద జలాల మళ్లింపు.. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో నీటి మట్టం గరిష్ట స్థాయిలో ఉండి, దిగువకు విడుదల చేస్తున్నప్పుడు.. ప్రకాశం బ్యారేజ్ ద్వారా కడలిలో జలాలు కలుస్తున్నప్పుడు.. అంటే వరద రోజుల్లో రెండు రాష్ట్రాలు ఏ మేరకు జలాలు మళ్లించినా వాటిని కోటాలో కలపకూడదని ఏపీ ప్రభుత్వం ఆది నుంచి ప్రతిపాదిస్తోంది. దీన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. -
‘గట్టు’ ఎత్తిపోతల కొలిక్కి!
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఆ పథకం ‘గట్టు’న పడింది. కృష్ణా నదీజలాల ఆధారంగా చేపట్టనున్న గట్టు ఎత్తిపోతల పథకం తుది డిజైన్ ఖరారైనట్లు తెలుస్తోంది. నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా ఉన్న రేలంపాడు రిజర్వాయర్ నుంచే నీటిని తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద జరిగిన భేటీలో నిర్ణయించినట్లు తెలిసింది. రెండ్రోజుల కిందట ఈ ఎత్తిపోతలపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో చర్చించిన సీఎం 1.5 టీఎంసీలతో రిజర్వాయర్ నిర్మించాలని సూచించినట్లు తెలిసింది. నిజానికి గద్వాల జిల్లాలోని గట్టు, ధారూర్ మండలాల పరిధిలో 33 వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా గట్టు ఎత్తిపోతలకు రూ.554 కోట్లతో రెండేళ్ల కిందటే అనుమతులు ఇచ్చారు. ఈ అనుమతుల సమయంలో 4 టీఎంసీల సామర్థ్యం ఉన్న రేలంపాడు రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకోవాలని నిర్ణయించగా, ఈ పథకం శంకుస్థాపన సమయంలో నీటిని తీసుకునే ప్రాంతాన్ని రేలంపాడు నుంచి జూరాలకు మార్చాలని సీఎం సూచించారు. దీనితోపాటే రిజర్వాయర్లో నీటినిల్వ కనీసంగా 15 టీఎంసీల మేర ఉండేలా చూడాలని సూచించారు. ఈ మేరకు ఇంజనీర్లు రూ.4 వేల కోట్లతో ప్రతిపాదనలు వేశారు. అయితే బడ్జెట్ భారీగా పెరుగుతుండటం, జూరాల నుంచి నీటిని తీసుకునే క్రమంలో దూరం పెరిగి, లిఫ్టింగ్ ఎక్కువగా ఉండటంతో ఈ ప్రతిపాదనను పక్కనపెట్టారు. మొదటగా ప్రతిపాదించినట్లే..: మొదటగా ప్రతిపాదించినట్లే రేలంపాడు నుంచి నీటిని తీసుకోవాలని, అయితే 0.60 టీఎంసీ సామర్థ్యం ఉన్న పెంచికలపాడుకు కాకుండా నేరుగా రాయపురం వద్ద 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు. దీనికి సుమారు రూ.వెయ్యి కోట్లతో అంచనా వేశారు. అయితే 3 టీఎంసీల రిజర్వాయర్తో 1,300 ఎకరాల మేర భూసేకరణ అవరాలు ఉండటం, ఇందులో భారీగానే ప్రైవేటు భూమి ఉండటంతో మళ్లీ దీన్ని 1.5 టీఎంసీలకు కుదించాలని తాజాగా నిర్ణయించినట్లుగా తెలిసింది. అలా అయితే భూసేకరణ అవసరాలు తగ్గడంతోపాటు మరో రూ.150 కోట్ల మేర తగ్గి రూ.850 కోట్ల వ్యయమే అవుతుందని తేల్చారు. ఈ ప్రతిపాదనకు సీఎం కేసీఆర్ సైతం సానుకూలత తెలిపినట్లుగా ఇరిగేషన్ శాఖ వర్గాలు వెల్లడించాయి. -
రాష్ట్ర హక్కులను పరిరక్షించండి
సాక్షి, అమరావతి / సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాలను అక్రమంగా వాడుకుని, న్యాయబద్ధంగా దక్కిన వాటా జలాలను దక్కనివ్వకుండా చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవించే హక్కును కాలరాస్తోన్న తెలంగాణ సర్కార్ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వంద శాతం స్థాపిత సామర్థ్యంతో జల విద్యుత్ ఉత్పత్తి చేయాలని తెలంగాణ జెన్కోకు దిశా నిర్దేశం చేస్తూ తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో 34ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. విభజన చట్టంలో సెక్షన్–87 ప్రకారం కృష్ణా బోర్డు పరిధిని తక్షణమే ఖరారు చేసి.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లతోపాటు పులిచింతల ప్రాజెక్టునూ బోర్డు అ«ధీనంలోకి తెచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరింది. ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రోటోకాల్ (నిర్వాహక నియమావళి) ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) కేటాయింపుల మేరకు కృష్ణా బోర్డు ద్వారా రెండు రాష్ట్రాలకు నీటిని విడుదల చేసేలా కేంద్రానికి దిశానిర్దేశం చేయాలని విన్నవించింది. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వం, కృష్ణా బోర్డు, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ జెన్కోలను ప్రతివాదులుగా చేర్చింది. రిట్ పిటిషన్లో పేర్కొన్న ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. తాగు, సాగు నీటికే ప్రాధాన్యత ఇవ్వాలి ► బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం.. నదీ జలాల వినియోగంలో తాగునీరు, గృహ అవసరాలు, సాగు నీటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నప్పుడే విద్యుత్ ఉత్పత్తి చేయాలి. జాతీయ జల విధానం కూడా ఇదే చెబుతోంది. ► కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయిస్తూ 1976 మే 21న ఉత్తర్వులు జారీ చేసింది. మిగులు జలాలను హక్కుగా కాకుండా వినియోగించుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు కల్పించింది. ► బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులు, ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా.. ఆంధ్రప్రదేశ్కు 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను కేటాయిస్తూ 2015 జూన్ 18, 19న కేంద్ర జల్ శక్తి శాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన సర్దుబాటుపై రెండు రాష్ట్రాల జల వనరుల శాఖ అధికారులు సంతకాలు చేశారు. ► అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956లో సెక్షన్–4(1), సెక్షన్–6(2) ప్రకారం.. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను ముట్టుకోకూడదు. ఆ అవార్డును పునఃసమీక్షించడానికి వీల్లేదు. అందుకే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం లభ్యత ఆధారంగా చేసిన కేటాయింపులను ముట్టుకోలేదు. ► నదిలో 75 శాతం నీటి లభ్యత 2,130 టీఎంసీల కంటే అదనంగా ఉన్న.. నికర, మిగులు జలాలు 448 టీఎంసీలను మాత్రమే పంపిణీ చేసింది. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 194 టీఎంసీలను కేటాయించింది. ► అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956లో సెక్షన్(5), సెక్షన్–5(3) కింద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసింది. ఈ అంశం ఇప్పుడు న్యాయ విచారణలో ఉంది. 3.17 కోట్ల మందికి తాగునీరు.. 44.78 లక్షల ఎకరాల ఆయకట్టు ► కృష్ణా నది జలాల్లో ఎస్సెల్బీసీకి 19, నాగార్జునసాగర్ కుడి కాలువకు 132, ఎడమ కాలువకు 32.25, కృష్ణా డెల్టాకు 152.20, గుంటూరు ఛానల్కు 4, వైకుంఠపురం పంపింగ్ స్కీంకు 2, చెన్నైకి తాగునీటి సరఫరాకు 15 టీఎంసీలు వెరసి 356.45 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కింద 28.43 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ► విభజన చట్టంలో 11వ షెడ్యూల్లో కేంద్రం అధికారికంగా గుర్తించిన మిగులు జలాల ఆధారంగా చేపట్టిన గాలేరు–నగరికి 38, హంద్రీ–నీవాకు 40, వెలిగొండకు 43.5 తెలుగుగంగకు 29 వెరసి 150.5 టీఎంసీల కేటాయింపు ఉంది. వీటి కింద 16,35,500 ఎకరాల ఆయకట్టు ఉంది. మొత్తం శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల కింద ఆంధ్రప్రదేశ్కు 560.95 టీఎంసీల వాటా దక్కాలి. ఈ నీటితో 44,78,500 ఎకరాల ఆయకట్టు ఆధారపడింది. ► కృష్ణా జలాలపై సాగు, తాగునీటి కోసం 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3.17 కోట్ల మంది ఆధారపడ్డారు. ఇందులో తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలే 2.3 కోట్ల మంది ఉన్నారు. 854 అడుగులకు దిగువన విద్యుత్ ఉత్పత్తి చేయరాదు ► శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టాన్ని 854 అడుగులుగా బచావత్ ట్రిబ్యునల్ ఖరారు చేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ఆయకట్టుకు సాగునీటి అవసరాల కోసం 1996 జూన్ 15న శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టాన్ని 834 అడుగులకు తగ్గిస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో 69ను జారీ చేసింది. కానీ.. 2004 సెప్టెంబర్ 28న శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టాన్ని 854 అడుగులకు పునరుద్ధరిస్తూ జీవో 107ను ఉమ్మడి రాష్ట ప్రభుత్వం జారీ చేసింది. బచావత్ ట్రిబ్యునల్, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం శ్రీశైలంలో 854 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉన్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి వీల్లేదు. ► శ్రీశైలంలో 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్సార్బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్, గాలేరు–నగరి ఆయకట్టుకు నీళ్లందించవచ్చు. దుర్భిక్ష రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయవచ్చు. శ్రీశైలంలో 834 అడుగుల్లో నీటి మట్టం ఉంటే హంద్రీ–నీవా, 840 అడుగుల్లో నీటి మట్టం ఉంటే వెలిగొండ ప్రాజెక్టులకు నీళ్లందించడానికి అవకాశం ఉంటుంది. ► కృష్ణా బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తుంగలో తొక్కుతూ.. ఆపరేషనల్ ప్రోటోకాల్స్ను బుట్టదాఖలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వస్తోంది. ఇదే అంశాన్ని కృష్ణా బోర్డు చైర్మన్కు అనేక సార్లు ఫిర్యాదు చేశాం. బోర్డు ఉత్తర్వులు బేఖాతర్ ► ఈ నీటి సంవత్సరంలో రెండవ రోజైన అంటే జూన్ 2న శ్రీశైలం ప్రాజెక్టులో 808.5 అడుగుల్లో 33.44 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండేవి. అయినప్పటికీ శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. ఇదే అంశంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశాం. బోర్డు ఉత్తర్వులను తుంగలో తొక్కి యథేచ్ఛగా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ► ఈనెల 13 నాటికి శ్రీశైలంలో 808.70 అడుగుల్లో 33.58 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. జూన్ 1 నుంచి ఈ నెల 13 వరకూ శ్రీశైలం ప్రాజెక్టులోకి 29.59 టీఎంసీలు వస్తే.. తెలంగాణ సర్కార్ అక్రమంగా 27.93 టీఎంసీలను తోడేసింది. ► తెలంగాణ సర్కార్ అక్రమంగా ఆ నీటిని వాడుకోకపోయి ఉంటే.. ఈ పాటికి శ్రీశైలం ప్రాజెక్టులో 839.8 అడుగుల్లో నీటి నిల్వ 61.51 టీఎంసీలు ఉండేది. మరో 27.78 టీఎంసీల ప్రవాహం వచ్చి చేరితే శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 854 అడుగులకు పెరిగి.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగు నీరు, చెన్నైకి తాగునీరు అందించే అవకాశం ఉండేది. ► నాగార్జునసాగర్ నుంచి 27.35 టీఎంసీలు, పులిచింతల నుంచి 7.84 టీఎంసీలను తెలంగాణ అక్రమంగా వాడుకుంది. దీంతో ప్రకాశం బ్యారేజీ నుంచి ఈనెల 13 నాటికే 7.54 టీఎంసీల జలాలు వృథాగా సముద్రంలో కలిశాయి. ► మొత్తంగా ఈనెల 13 నాటికే శ్రీశైలం, సాగర్, పులిచింతల నుంచి 63.12 టీఎంసీలను తెలంగాణ అక్రమంగా వాడుకుంటూ ఆంధ్రప్రదేశ్కు న్యాయబద్ధంగా దక్కాల్సిన నీటిని దక్కనివ్వకుండా చేస్తోంది. పలుమార్లు ఫిర్యాదు చేసినా.. శ్రీశైలం ప్రాజెక్టులో అక్రమంగా నీటిని వాడుకుని విద్యుత్ ఉత్పత్తి చేయకుండా తెలంగాణ సర్కార్ను ఆదేశించాలని జూన్ 11న కృష్ణా బోర్డును కోరాం. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంపై జూన్ 17న, జూన్ 23న, జూన్ 29న, 30న కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశాం. అయినా తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి ఆపలేదు. దీంతో ఈ నెల 1న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దృష్టికి తీసుకెళ్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ సర్కార్ అక్రమాలకు అడ్డుకట్ట వేసి, కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. విలువైన జలాలను వృథాగా సముద్రంలో కలిసే పరిస్థితులు సృష్టించడంపై ఈనెల 5న మరోసారి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్కు సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేసి.. తెలంగాణ అక్రమంగా నీటిని వాడుకోకుండా అడ్డుకట్ట వేయాలని కేంద్ర జల్ శక్తి శాఖకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ ఈనెల 7న ప్రధాని నరేంద్ర మోదీకి సైతం మరోసారి లేఖ రాశారు. అయినా తెలంగాణ ప్రభుత్వ వ్యవహార శైలిలో మార్పు రాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను హరిస్తోంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను పరిరక్షించాలని సుప్రీంకోర్టుకు విన్నవిస్తున్నాం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement