-
టీఆర్ఎస్ వైపు మాధవరం చూపు!
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు త్వరలో టీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన అనంతరం బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి జాబితాలో చేరిస్తే టీఆర్ఎస్లో చేరడానికి సిద్ధమని ఆయన సోమవారం మీడియాకు తెలిపారు. అంతకుముందు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కుమారుడు లోకేశ్ను ఎన్టీఆర్ భవన్లో కలసిన మాధవరం పార్టీ తెలంగాణ నేతల తీరుపై ఫిర్యాదు చేశారు. బీసీ కులాల జాబితా నుంచి తొలగించిన ఆంధ్రప్రదేశ్కు చెందిన 26 కులాల విషయంలో యథాతథస్థితి కొనసాగించాలని తాను అసెంబ్లీలో ప్రస్తావించినా టీడీపీ ఎమ్మెల్యేల నుంచి మద్దతు రాలేదని, ఎవరికి వారే ఎప్పుడు టీఆర్ఎస్లో చేరుదామా అనే ఆలోచనలో ఉన్నారని, అందరూ ఆ పార్టీతో టచ్లో ఉన్నారని లోకేశ్కు తెలిపారు. తెలంగాణలో పార్టీ బతకాలని టీ నాయకులెవరికీ లేదని, ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారని చెప్పారు. ‘నాకు పార్టీ మారే ఆలోచన లేదు...మన పార్టీ వారే అలా ప్రచారం చేస్తున్నారు. ఆ ఆలోచనే ఉంటే మిమ్మల్ని ఎందుకు కలుస్తాను’ అని లోకేశ్కు వివరించినట్టు సమాచారం. -
వెలుగులు నింపుతా
‘పిచ్చుక గూళ్ల లాంటి ఇళ్లల్లో పాతికేళ్లుగా ఎలా నివాసం ఉంటున్నారు.. ఏరోజుకారోజు అన్నట్టుగా రోజు కూలీతో బతుకులీడుస్తున్న మీ భవిష్యత్ ఏమిటి.. ప్రభుత్వం నుంచి సాయం అందకపోతే ఎలా ?..’ అంటూ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విస్తుపోయారు. కూకట్పల్లి ఇందిరానగర్, శ్రీశ్రీనగర్ వాసుల సమస్యలు విన్న ఆయన చలించిపోయారు. ‘మీ కష్టాలు..కన్నీళ్లు తుడిచేస్తా..సమస్యలు లేని బస్తీగా చేస్తా.. మీ బతుకుల్లో వెలుగు నింపుతా... సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి దత్తాత్రేయలను తీసుకువస్తా..పక్కా ఇళ్లు నిర్మిస్తా’నని వారికి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే కృష్ణారావు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్గా మంగళవారం వ్యవహరించారు. ఇందిరానగర్, శ్రీశ్రీనగర్లలో పర్యటించారు. సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరిస్తా.. విద్యుత్, ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ ఆస్పత్రి, డ్రైనేజీలు నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రేషన్కార్డులు, అర్హులకు పింఛన్లు ఇప్పించే బాధ్యతను తీసుకుంటానన్నారు. పేదల సమస్యలు పరిష్కరించినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. - కూకట్పల్లి మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement