-
జగనన్నను చూసే.. కష్టాలను తట్టుకోవడం నేర్చుకున్నా
సాక్షి, విజయనగరం: ఒక సాధారణ గిరిజన ఉద్యోగి కుటుంబానికి చెందిన ఆమెకు... మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానం ఏర్పడింది. విద్యాభ్యాసం, ఉద్యోగం, వివాహం తర్వాత కూడా అది అంతకంతకూ పెరుగుతూ పోయింది. ఈ క్రమంలో అనూహ్యంగా దక్కిన రాజకీయ అవకాశం ఆమెను ఎమ్మెల్యే చేసింది. ఆ తర్వాత ప్రజా ప్రతినిధిగా, రాజకీయ నేత భార్యగా జీవితంలో సమతూకం పాటిస్తూ ప్రజల ఆదరాభిమానాలు గెలుచుకున్నారు. ఎవరూ వెళ్లేందుకు సాహసించని మారుమూల గిరిజన పల్లెల్లో ప్రతి గడప తొక్కుతూ, ప్రతి ఇంటి సమస్య తెలుసుకుని పరిష్కరిస్తూ జనం గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు విజయనగరం జిల్లా కురుపాం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి. మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేస్తున్న పుష్ప శ్రీవాణితో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ వివరాలివీ.. పెళ్లి కాగానే రాజకీయాల్లోకి.. మాది పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామం. మేం ముగ్గురం అక్కా చెల్లెళ్లం. ఒక తమ్ముడు. నేను రెండో అమ్మాయిని. నాన్న నారాయణమూర్తి ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించారు. 10వ తరగతి వరకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో, ఇంటర్ జంగారెడ్డిగూడెంలో చదివా. డిగ్రీ అక్కడే మహిళా కళాశాలలో పూర్తి చేశా. విశాఖ మద్దిలపాలెం కె.ఎన్.ఆర్.ఐ కళాశాలలో బీఈడీ అభ్యసించా. జంగారెడ్డిగూడెంలోనే గిరిజన సంక్షేమ హైస్కూల్లో ఉపాధ్యాయురాలిగా ఏడాదిన్నర పనిచేశా. మాకు బ్యాక్గ్రౌండ్ అంటూ ఏమీ లేదు కానీ చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే చాలా ఇష్టం. 2014లో మా పెళ్లి చూపుల సమయానికి సరిగ్గా ఎన్నికల ప్రక్రియ సాగుతోంది. అప్పుడే వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. వివాహమైన 15 రోజులకే నన్ను వైఎస్సార్సీపీ కురుపాం నియోజకవర్గ కో ఆర్డినేటర్గా నియమించారు. మార్చి 14న పరీక్షిత్ రాజుతో పెళ్లయితే కొద్ది రోజులకే ప్రచారానికి దిగాను. మే 6న పోలింగ్. ఎమ్మెల్యేగా 19 వేల ఓట్ల పైగా మెజార్టీతో గెలిచా. రాజన్న నాకు దైవం.. జగనన్నది గొప్ప వ్యక్తిత్వం నేను 2004లో డిగ్రీ చేస్తుండగా అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి గెలుస్తారా? చంద్రబాబు గెలుస్తారా? అని మా స్నేహితుల మధ్య పందెం సాగింది. నేను చెప్పినట్టే రాజశేఖరరెడ్డి గెలిచారు. వేసవి సెలవుల్లో చింతలపూడి దగ్గరున్న వెలగలపల్లిలోని స్నేహితురాలి ఇంటికి 15 రోజులు వెళ్లాను. అక్కడ రాజకీయాలు, వైఎస్ రాజశేఖరరెడ్డి పైనే చర్చలు సాగేవి. అప్పుడు వైఎస్ అంటే అభిమానం ఇంకా పెరిగింది. వైఎస్ ఫొటోలను ఇంటి నిండా అంటించేశా. ‘మనం ఉద్యోగులం అలా చేయకూడదమ్మా’ అని నాన్న చెప్పినా వినేదాన్ని కాదు. నాకేదైనా కష్టం వస్తే ఇప్పటికీ రాజశేఖరరెడ్డి ఫొటో దగ్గరకు వెళ్లి చెప్పుకొంటా. జగనన్నది చాలా గొప్ప వ్యక్తిత్వం. అంత ఆప్యాయత ఏ నాయకుడిలోనూ చూడలేదు. వైఎస్సార్ అని పచ్చ బొట్టు.. నేను, నా భర్త డబ్బుకి పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వం. విలువలకే మా ప్రాధాన్యం. దీనిని కూడా వైఎస్ను చూసి అలవర్చుకున్నాం. పార్టీ ఫిరాయింపు కోసం టీడీపీ నుంచి చాలామంది ఫోన్ చేసి ప్రలోభ పెట్టాలని చూశారు. కానీ, మేం దేనికీ లొంగలేదు. వైఎస్పై మా అభిమానం చాటడం కోసం చేతిపై ‘వైఎస్ఆర్’ అని పచ్చబొట్టు పొడిపించుకున్నా. ఇక ఇచ్చిన మాట కోసం, ప్రజల కోసం ఎన్ని కష్టాలెదురైనా తట్టుకుని నిలబడటం జగనన్న నుంచే నేర్చుకున్నా. రాజకీయాల్లోకి వచ్చాక వ్యక్తిగత జీవితం బాగా తగ్గిపోయింది. పెళ్లయిన తర్వాత రాజకీయ పర్యటనలే తప్ప ఇద్దరం ఎక్కడికీ వ్యక్తిగతంగా వెళ్లలేదు. ఐదేళ్లు కష్టపడ్డాం. జగనన్న సీఎం అయితే చాలు అంతా హ్యాపీగా ఉంటాం. విడదీయరాని బంధం 2012 ఉప ఎన్నికల సమయంలో మా ప్రాంతానికి వచ్చిన జగన్నను కలిసేందుకు మూడు గంటల పాటు వేచి చూశా. కరచాలనం చేశాక జగనన్న నా తలపై చేయి వేసి ఆశీర్వదించారు. ఆ క్షణం జీవితంలో మర్చిపోలేను. పరీక్షిత్తో వివాహానికి నిశ్చయించాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి ఉంటుందని చెప్పగానే సంతోషంగా ఒప్పుకొన్నా. మొదటినుంచి మా కుటుంబం వైఎస్ఆర్ కుటుంబంతో ముడిపడి ఉంది. మా తమ్ముడు ఫీజు రీయింబర్స్మెంట్తోనే బీటెక్ చదివాడు. ఇంకో మాట... జగనన్న సలహాతోనే మా పెళ్లి జరిగింది. అందుకే ఏటా మా పెళ్లి రోజు ఆయనను తప్పనిసరిగా కలిసి ఆశీసులు తీసుకుంటాం. ప్రజా సేవలోనే సంతోషం లక్ష్యం గొప్పదైనప్పుడు నడిచే దారిలో రాళ్లున్నా, ముళ్లున్నా లెక్క చేయొద్దు అనుకుంటూ ముందుకెళ్తా. ఈ రోజు మా నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా నన్ను వారి ఇంటి ఆడపడుచుగా చూస్తారు. నియోజకవర్గ పర్యటనకు వెళ్తే గిరిజనులు వాళ్లింటి అమ్మాయే ఎమ్మెల్యే అయినట్లు భావిస్తున్నారు. నేను కూడా వాళ్ల మధ్య కూర్చొనే భోజనం చేస్తా. వాళ్ల సమస్యలు వింటుంటా. వారం రోజులు గడప గడపకు వెళ్లడం, ఆ ఫొటోలన్నీ కలిపి ఐటీడీఏ పీవో, కలెక్టర్కు ఇవ్వడం ఇదే నా పని. -
భద్రగిరి సీహెచ్సీ వైద్యుల నియూమకంలో జాప్యం
అసెంబ్లీలో ప్రశ్నించిన కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి సాక్షి ప్రతినిధి, విజయనగరం: గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి సీహెచ్సీలో పూర్తి స్థాయిలో వైద్యుల్లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని, మరో నలుగురిని నియమించాలని గతంలో సభ దృష్టికి తీసుకొచ్చినా ఇంతవరకు స్పందన లేదని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి బుధవా రం శాసనభలో జీరో అవర్లో ప్రశ్నించారు. భద్రగిరి సీహెచ్సీలో ఉన్న ఒక్క వైద్యుడు పూర్తి స్థాయిలో గిరిజనులకు వైద్యం చేయలేకపోతున్నారని ఆమె వివరించారు. దీంతో రోగులు పార్వతీపురం, విజయనగరం ప్రాంతాలకు వ్యయప్రయూసలకు గురై వెళ్తున్నారని, అక్కడ కూడా గిరిజన రోగు లు వివక్షకు గురవుతున్నారని వివరించారు. దీంతో వారి ఆరోగ్యం మరింత క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఐదుగురు వైద్యులకు ఒక్కరే ఉన్నారన్నారు. మిగతా నాలుగు పోస్టులను భర్తీ చేయాలని గత సమావేశాల్లో కోరినప్పుడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదని గుర్తు చేశారు. ఈసారి తప్పకుండా భర్తీ చేస్తామని సంబంధిత మంత్రి హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి సాక్షికి చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అభిమాని ఐఫోన్ బద్దలు కొట్టాడు.. గ్లౌవ్స్ గిఫ్ట్గా ఇచ్చాడు! వీడియో
విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!
వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
బాబును చీల్చి చెండాడిన మహిళలు
కేరళలో ‘వెస్ట్ నైల్’ వైరస్ కేసులు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement