-
శ్రీవారి సేవలో జస్టిస్ నరసింహారెడ్డి
తిరుమల: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన వైకుంఠం నుంచి ఆలయంలోకి వె ళ్లారు. శ్రీవేంకటేశ్వరస్వామి, వకుళమాతాదేవిని దర్శించుకున్నారు. జస్టిస్ నరసింహారెడ్డికి టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి, లడ్డూప్రసాదాలు అందజేశారు. కాగా, తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 38,292 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. వీరికి 24 గంటలు, కాలిబాటల్లో నడిచివచ్చిన భక్తులకు 9 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభిస్తోంది. -
ధర్మాసనంపై నమ్మకం కోల్పోయారు !
చుండూరు బాధితుల తరఫున హైకోర్టులో స్పెషల్ పీపీ అఫిడవిట్ 10న హాజరై స్పష్టత ఇవ్వాలని అటార్నీ జనరల్కు ధర్మాసనం ఆదేశం ఈ ఊచకోత కేసులో ప్రభుత్వ వైఖరి తెలపాలని సీఎస్కు స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: చుండూరు దళితుల ఊచకోత కేసు మంగళవారం హైకోర్టులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారిస్తున్న ధర్మాసనం పట్ల కొందరు బాధితులు నమ్మకం కోల్పోయారంటూ స్పెషల్ పీపీ బొజ్జా తారకం దాఖలు చేసిన అఫిడవిట్ సంచలనం రేపింది. దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ధర్మాసనం... స్పెషల్ పీపీ బాధితుల తరఫున పనిచేయాలా? లేక ప్రభుత్వ సలహా ఆధారంగా పనిచేయాలా? అని సందేహం వ్యక్తం చేసింది. దీనిపై స్పష్టతనిచ్చి కోర్టుకు సహాయం చేసేందుకు అటార్నీ జనరల్ లేదా ఆయన ద్వారా అధీకృత వ్యక్తిగా నియమితులైన సీనియర్ న్యాయవాది గానీ 10న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1991, ఆగస్టు 6న గుంటూరు జిల్లా చుండూరులో చోటుచేసుకున్న 8 మంది దళితుల ఊచకోత ఘటనపై సుదీర్ఘ విచారణ తరువాత ప్రత్యేక న్యాయమూర్తి అనీస్ 2007, ఆగస్టు 1న తీర్పు వెలువరించారు. నిందితులకు ఉరిశిక్ష విధించే అరుదైన కేసు కాదని పేర్కొంటూ మొత్తం 179 నిందితుల్లో 123 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. 21 మందికి యావజ్జీవం, 35 మందికి ఏడాది జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ తీర్పులోని కొన్ని అంశాలపై సందేహాలు లేవనెత్తుతూ బాధిత కుటుంబాలు హైకోర్టును ఆశ్రయించాయి. శిక్ష పడినవారు తమ శిక్షను రద్దు చేయాలంటూ పిటిషన్ వేశారు. మరోవైపు నిర్దోషులుగా విడుదలైన వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం పిటిషన్లు దాఖలు చేసింది. ఈ కేసుల్లో వాదనలు వినిపించేందుకు న్యాయవాది బొజ్జా తారకం, రఘునాథ్లను స్పెషల్ పీపీలుగా ప్రభుత్వం నియమించింది. ఈ వ్యాజ్యాలన్నింటిపై జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం కొద్ది రోజులుగా విచారణ సాగిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం విచారణ సమయంలో బాధితుల తరఫున బొజ్జా తారకం ధర్మాసనం పట్ల అవిశ్వాసం వ్యక్తం చేశారు. కేసు విచారణ తీరు చూస్తుంటే తమకు న్యాయం జరిగేలా కనిపించట్లేదని బాధితుల్లో కొందరు నమ్మకం కోల్పోయారంటూ అఫిడవిట్ను ధర్మాసనం ముందుంచారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వాదనల ప్రారంభంలో అభ్యంతరం లేదని చెప్పి... ఇప్పుడిలా అభ్యంతరాలు ఉన్నాయనడం ఎంత వరకు సబబని ప్రశ్నించింది. ‘‘కోర్టుపై నమ్మకం లేనిది మీకా (స్పెషల్ పీపీ)? లేక బాధితులకా?’’ అంటూ తారకాన్ని అడిగింది. బాధితులకంటూ తారకం సమాధానం చెప్పగా... వారి పేర్లు చెప్పాలని ధర్మాసనం కోరింది. పేర్లు తెలుసుకోవాల్సి ఉందని ఆయన చెప్పడంతో... పేర్లు తెలుసుకోకుండానే ప్రమాణపత్రం(అఫిడవిట్)దాఖలు చేశారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. చట్ట ప్రకారం బాధితుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించడానికి వీల్లేదని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి తెలియచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తూ విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది. -
స్పెషల్ సీఎస్ హాజరుకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో స్వయంగా కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రభాకర్ డి.థామస్ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో ఓటర్ల వేలిపై వేసే సిరా (ఇంక్) సరఫరాకు సంబంధించి ఓఎస్ఎస్ లేబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ దాఖలు చేసిన కేసులో అధికారులు కోర్టు ఆదేశాలు పాటించకపోవడంతో న్యాయమూర్తి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement