-
‘టౌన్’ బండి.. డౌన్
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సిబ్బంది కొరత, సమస్యలకు చిన్న ఉదాహరణ ఇది. పంచాయతీలుగా ఉన్నప్పటి నామమాత్రపు సిబ్బందితోనే చాలా మున్సిపాలిటీలు కొనసాగుతున్నాయి. సరిపడా అధికారులు, సిబ్బంది లేకపోవడం.. ఉన్నా ఇన్చార్జులే కావడంతో కొత్త పురపాలక సంస్థల్లో పాలన సరిగా జరగని దుస్థితి నెలకొంది. దీనితో అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతోందని, వివిధ అనుమతులు, పారిశుధ్యం వంటి సేవలు సరిగా అందడం లేదని.. పన్నుల వసూళ్లు కూడా జరగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ సమస్యపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.. సాక్షి, హైదరాబాద్: పెరిగిన జనాభా, నివాస ప్రాంతాల విస్తరణ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం పలు మేజర్ గ్రామపంచాయతీలను మున్సిపాలి టీలుగా, కార్పొరేషన్లుగా అప్గ్రేడ్ చేసింది. కొత్తగా 77 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. ఇది జరిగి దాదాపు మూడేళ్లు అవుతున్నా వాటికి అవసరమైన అధికారులు, సిబ్బంది నియామకం జరగలేదు. పేరుకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లుగా మారినా.. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పటి పరిస్థితే ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కొత్తవి ఏర్పాటైన మొదట్లో.. ఆయా జిల్లాల్లో అప్పటికే ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొందరిని సీనియారిటీ ఆధారంగా కొత్త మున్సిపాలిటీలకు కమిషనర్లు, మేనేజర్లుగా డిప్యుటేషన్లపై నియమించారు. కొందరికైతే రెండేసి మున్సిపాలిటీలకు ఇన్చార్జి కమిషనర్గా, మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. గతంలో గ్రామపంచాయతీలుగా ఉన్నప్పటి సిబ్బంది నుంచే.. శానిటేషన్ ఇంజనీర్లు, ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లను ఎంపిక చేసి వెళ్లదీసుకొస్తున్నారు. అక్రమాలను అడ్డుకునేదెలా? మున్సిపాలిటీకి ఆదాయం సమకూరేది టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల నుంచే. గ్రామపంచాయతీ నుంచి ఇళ్ల అనుమతి పొంది, అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఘటనలు వెలుగులోకి రావడంతో.. కొత్త మున్సిపాలిటీల్లో ఇళ్ల నిర్మాణాలకు టీఎస్బీపాస్ అనుమతి తప్పనిసరని పురపాలక శాఖ ప్రకటించింది. అయితే కొత్తగా అనుమతులు మంజూరు చేయడానికిగానీ, పంచాయతీలు ఇచ్చిన అనుమతులు చెల్లవని చెప్పడానికిగానీ టౌన్ ప్లానింగ్ అధికారులు లేని దుస్థితి. కేవలం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న హైదరాబాద్ శివార్లలోని కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు మాత్రం డిప్యుటేషన్ మీద టౌన్ ప్లానింగ్ సిబ్బందిని నియమించడంతో.. వారు అక్రమ నిర్మాణాలపై దృష్టిపెట్టగలుతున్నారు. ఇతర చోట్ల చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. పన్నుల ఆదాయానికీ గండి ఇంటిపన్నుతో పాటు ఇతర పన్నుల వసూలు చేసే రెవెన్యూ సిబ్బంది లేకపోవడంతో ఆదాయానికి గండి పడుతోంది. అభివృద్ధి పనులతోపాటు టౌన్ ప్లానింగ్ విభాగానికి అనుమతుల కోసం వచ్చే దరఖాస్తుల పరిశీలనకు ప్రతి మున్సిపాలిటీకి ఇంజనీర్లు ఉండాలి. కానీ కొత్త మున్సిపాలిటీల్లో ఇంజనీర్ల కొరత నెలకొంది. సమగ్ర ప్రణాళిక రూపొందించేందుకు, ఏయే ప్రాంతాల్లో ఏ విధమైన అభివృద్ధి చేయాలన్న నివేదికలు రూపొందించేందుకు అధికారులు లేరు. ఏదైనా అంశంపై మున్సిపాలిటీకి వచ్చే ప్రజలకు సమాధానం చెప్పేవారు కూడా లేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏడాదిన్నర క్రితమే ప్రకటించినా..: రాష్ట్రంలోని కొత్త, పాత మున్సిపాలిటీల్లో కమిషనర్, మేనేజర్ నుంచి శానిటరీ జవాన్ వరకు 4 వేల పోస్టులు అవసరమని పురపాలక శాఖ గతంలో లెక్కతేల్చింది. జనాభా ప్రాతిపదికన ఏయే మున్సిపాలిటీకి, కార్పొరేషన్కు ఏయే స్థాయిలోని అధికారులు, సిబ్బంది ఎంద మంది అవసరమనే నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. 2020 జూలై 14న మంత్రి కేటీఆర్ పురపాలకశాఖ అధికారులతో సమావేశమై.. తొలివిడతగా 2 వేల పోస్టుల భర్తీకి కసరత్తు చేయాలని ఆదేశించారు. కానీ ఇప్పటివరకు నియామకాలు జరగలేదు. తాజాగా 129 మున్సిపాలిటీల్లో 3,700 మంది వార్డు ఆఫీసర్లను నియమించాలని అధికారులు నిర్ణయించారు. వీటితోపాటు పెండింగ్లో ఉన్న పోస్టుల భర్తీని కూడా పూర్తి చేయాలనేది ఆలోచన. ఈ ప్రక్రియ పూర్తయితే తప్ప కొత్త మున్సిపాలిటీల్లో అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ఇబ్బంది తప్పదని స్థానికులు అంటున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో గ్రామపంచాయతీలుగా ఉన్న అలంపూర్, వడ్డేపల్లిలను మున్సిపాలిటీలుగా మార్చారు. మంచిర్యాల మున్సిపాలిటీ నుంచి డిప్యుటేషన్పై వచ్చిన నిత్యానంద్.. ఈ రెండు మున్సిపాలిటీలకు ఇన్చార్జి కమిషనర్గా ఉన్నారు. అలంపూర్ మున్సిపాలిటీలో మేనేజర్, అకౌంటెంట్, బిల్ కలెక్టర్, ఏఈ, టౌన్ప్లానింగ్ ఏఈ పోస్టులకు ఇన్చార్జి అధికారులే ఉన్నారు. ఆర్ఐ, శానిటరీ ఇన్స్పెక్టర్, వర్క్ ఇన్స్పెక్టర్, జూనియర్ అకౌంటెంట్ వంటి కీలక పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. శానిటేషన్, ఇతర సిబ్బంది అయితే పూర్తిగా ఔట్ సోర్సింగే. వడ్డేపల్లి మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి. పది కీలక పోస్టులకుగాను ఏడింటిలో ఇన్చార్జులే ఉన్నారు. ► మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలి టీలో కమిషనర్తోపాటు టీపీవో పోస్టులకు ఇన్ చార్జులను నియమించిన ప్రభుత్వం.. మేనేజర్, జూనియర్ అసిస్టెంట్లను మాత్రమే డిప్యుటేషన్ మీద పంపించింది. ఇక ఏ పోస్టుకూ అధికారులు లేరు. శానిటరీ ఇన్స్పెక్టర్ సహా పారిశుధ్య సిబ్బందిని ఔట్ సోర్సింగ్లో తీసుకొని బండి నడిపిస్తున్నారు. ► బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లో టౌన్ప్లానింగ్ సిబ్బంది కొరత ఉంది. డిప్యూటీ సిటీ ప్లానర్ (డీసీపీ) మాత్రమే ఉన్నారు. ఆయన కూడా ఇన్చార్జినే. నలుగురు సూపర్వైజర్లు, ఒక ఏసీపీ పోస్టులకు సంబంధించి ఎవరూ లేరు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ముగ్గురు ఏఈలు అవసరం. ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. ఇద్దరు ఈఈ ఉండాల్సి ఉన్నా.. ఎవరూ లేరు. ► రామాయంపేట మున్సిపాలిటీలో అంతా ఇన్ చార్జుల పాలనే. 20 మందికిగాను.. మున్సిపల్ కమిషనర్, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు. గతంలో మేజర్ పంచాయతీగా ఉన్నప్పటి సిబ్బందితోనే పాలన కొనసాగుతోంది. ళీ చిట్యాల మున్సిపాలిటీలో ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్, మేనేజర్, జూనియర్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్, రెవెన్యూ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మున్సిపల్ ఇంజనీర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లుగా ఇన్చార్జులే ఉన్నారు. ► కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో కమిషనర్, ఏఈ, టీపీవో ఇన్చార్జులే. ఏఈ, ఇంజనీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ , అకౌంట్స్ విభా గంలో ఏవో, జేఏవో, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, టౌన్ ప్లానింగ్ టీపీ, టీపీఎస్, శానిటర్ ఇన్స్పెక్టర్, హెల్త్ అసిస్టెంట్, రెవెన్యూ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బిల్ కలెక్టర్లు నలుగురికి ఒక్కరే, జూనియర్ అసిస్టెంట్లు నలుగురికి ఇద్దరే ఉన్నారు. పలు కొత్త మున్సిపాలిటీల్లోని పరిస్థితి ఇదీ.. ► కొత్త మున్సిపాలిటీల్లో అధికారులు, సిబ్బంది లేకపోవడంతో అంతకు ముందున్న గ్రామ పంచాయతీ పరిస్థితికి ఇప్పటికి తేడా లేని దుస్థితి. ► మున్సిపాలిటీల్లో గెలిచిన పాలక మండళ్లు తీసుకుంటున్న నిర్ణయాలు సరిగా అమలు కావడం లేదు. ► కొందరు కమిషనర్లు, కీలక అధికారులు రెండేసి మున్సిపాలిటీలకు ఇన్చార్జులుగా ఉంటుండటంతో పాలన కుంటుపడుతోంది. ► టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది లేకపోవడం వల్ల కొత్త మున్సిపాలిటీల్లో భవన నిర్మాణాలకు అనుమతులు రావడం లేదు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునే యంత్రాంగం లేదు. ► గ్రామ పంచాయతీ పర్మిషన్ పేరుతో కొత్త మున్సిపాలిటీల్లో ఇప్పటికీ భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలోని కొత్త మున్సిపాలిటీల్లో మాత్రం స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి.. ఇతర మున్సిపాలిటీలు, రెవెన్యూ శాఖల నుంచి సిబ్బందిని తెప్పించి మరీ అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. కానీ జిల్లాలో ఈ పరిస్థితి లేదు. ► పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక యంత్రాంగం లేదు. కమిషనర్లుగా వ్యవహరిస్తున్న అధికారులు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించి చెత్త తొలగింపు, ఇతర పారిశుధ్య పనులు చేయిస్తున్నారు. ► హైదరాబాద్ శివార్లలోని జవహర్నగర్, బండ్లగూడ జాగీర్, పీర్జాదిగూడ వంటి కొత్త కార్పొరేషన్లలో పాలకమండళ్ల హడావుడే తప్ప అధికారులు చేపట్టిన కొత్త ప్రాజెక్టులు ఏమీ లేవు. భవన నిర్మాణాల అనుమతుల విషయంలో ఆలస్యం జరుగుతోందన్న ఫిర్యాదులు ఉన్నాయి. అడుగడుగునా సమస్యలే.. అధికారులు, సిబ్బంది లేకుంటే మున్సిపాలిటీలు ఎందుకు? పౌరులకు మౌలిక సదు పాయాలు కల్పించడమ నేది స్థానిక సంస్థల బాధ్యత. మున్సిపాలిటీ, కార్పొరేషన్ నుంచి సౌకర్యాలు ఆశిం చడం ప్రజల హక్కు. కొత్త మున్సి పాలిటీలు ఏర్పాటు చేసి.. కమిషనర్లను, సిబ్బందిని నియమించకపోవడం వల్ల స్థానిక సంస్థల ఉద్దేశం దెబ్బతింటుంది. అధికారులను నియ మించకపోవడం శోచనీయం. పట్టణాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కావాలి. ప్రభుత్వం ఇప్పటికైనా రెగ్యులర్ స్టాఫ్ను నియమిస్తే మంచిది. – ఆర్వీ చంద్రవదన్, రిటైర్డ్ ఐఏఎస్, ఎంసీహెచ్ మాజీ అదనపు కమిషనర్ -
మరో విషాదం: 55మంది శిశువులు బలి
ముంబై: గోరఖ్పూర్, ఫరూఖాబాద్ మిగిల్చిన విషాదాన్ని మర్చిపోక ముందే మరో ఘోరం వెలుగు చూసింది. వెంటిలేటర్ల కొరత విషాదం శిశువులను వెంటాడుతోంది. మహారాష్ట్ర నాసిక్లోని ఒక జిల్లా ఆసుపత్రిలో ఏకంగా 55మంది పసిబిడ్డలు ఆసుపత్రి నిర్లక్ష్యానికి అసువులు బాశారు. ఆక్సిజన్ కొరత, వెంటిలేటర్, ఇతర ఆరోగ్య సౌకర్యాల లోపంతో మరణించడం కలకలం సృష్టించింది. అంతేకాదు గత ఏప్రిల్నుంచి అయిదు నెలలకాలంలో 187మంది చనిపోవడం మరింత ఆందోళన రేపింది. నాసిక్ ప్రత్యేక నవజాత కేర్ యూనిట్లో ఈ ఆగస్టులో సుమారు 350 మంది పిల్లలు ఆసుపత్రిలో చేరగా, వీరిలో 55 మంది పిల్లలు మరణించారు. తమ ఆసుపత్రిలో వెంటిలేటర్ సౌకర్యం లేని కారణంగానే ఈ మరణాలు సంభవించాయని ఆసుపత్రి వైద్యులు జీఎం హోలే తెలిపారు. మరోవైపు శిశువుల మరణాలను ధృవీకరించిన సివిల్ సర్జన్ సురేష్ జగ్దలే ఆసుపత్రి నిర్ల్యక్షం ఏమీలేదని వాదించారు. పిల్లలు ప్రీ మెచ్యూర్గా పుట్టడం, ఊపిరితిత్తుల బలహీనత లాంటి కారణాల వల్ల కూడా మరణాలు సంభవించాయని జగ్దలే చెప్పారు. గతనెల నుంచి (ఏప్రిల్ నుంచి) 187 మంది శిశువులు మరణించారని తెలిపారు. అటు రాష్ట్ర ఆరోగ్య మంత్రి దీపక్ సావంత్ సురేష్ జగ్దలేకు మద్దతు పలికారు. దాదాపు చివరి దశలో శిశువును ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. వీటిని నివారించడానికి ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక "ప్రోటోకాల్"ను త్వరలో అమలు చేస్తామని మంత్రి చెప్పారు. కాగా గత నెలలో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్ పూర్లో బి.ఆర్.డి. మెడికల్ కాలేజీలో 70 మందికి పైగా నవజాత శిశువులు, ఫరూఖాబాదులో కనీసం 49 మంది పిల్లలు మరణించిన సంగతి తెలిసిందే. -
చిల్లర కష్టాలు
తణుకు(పశ్చిమ గోదావరి జిల్లా): ఉదయం పాల ప్యాకెట్ దగ్గర నుంచి మార్కెట్లో కూరగాయల కొనుగోలు, బస్సు ప్రయాణం ఇలా ప్రతిచోట చిల్లర అవసరం. ఈ పరిస్థితుల్లో మార్కెట్లో చిల్లర కష్టాలు వెంటాడుతున్నాయి. రూపాయి, రెండు, అయిదు రూపాయల నాణేలు దొరకడం కష్టంగా మారింది. దీంతో వ్యాపారులతో పాటు ప్రజలకూ ఇబ్బందులు తప్పడంలేదు. చిల్లర లేక అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నూటికి రూ.10 కమీషన్ చెల్లించి చిల్లర నాణేలు కొనుగోలు చేసి వ్యాపారాలు సాగించాల్సి వస్తోంది. అంతర్జాతీయంగా రూపాయి విలువ తగ్గినా మార్కెట్లో మాత్రం నిత్యం రూపాయి చిల్లర నాణెం లేనిదే వ్యాపార లావాదేవీలు ముందుకు సాగడంలేదు. వ్యాపారం కుదేలు మార్కెట్లో చిల్లర కొరత కారణంగా వ్యాపారాలు కుదేలవుతున్నాయి. నిత్యం చిల్లర లేకపోతే రూపాయి, రెండు వంటి చిల్లరను కొన్ని సందర్భాల్లో వ్యాపారులు వదులుకోవాల్సిన పరిస్థితి. రూపాయి తక్కువైనా పర్లేదు కానీ చిల్లర చెల్లించి సహకరించాలని వ్యాపారులు కోరుతున్నారు. ప్రస్తుతం ప్రజలు వస్తువుల కొనుగోలుకు 10, 20, 50, 1,00, 5,00, 1,000 నోట్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో హోటళ్లు, మెడికల్, కిరాణా, కూరగాయల మార్కెట్లో వ్యాపారులకు చిల్లర కోసం ఇబ్బందులు తప్పడంలేదు. ఆర్టీసీ బస్సుల్లో అయితే కండక్టర్ల కష్టాలు అన్నీఇన్నీ కావు. కొందరు షాపుల్లో చిల్లర బదులు చాక్లెట్లు ఇచ్చి సరి చేసుకుంటున్నారు. బ్యాంకులు కొంత మేర చిల్లరను ప్రత్యేక కౌంటర్ల ద్వారా మేళాలు ఏర్పాటు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నప్పటికీ వ్యాపారుల పూర్తి అవసరాలను మాత్రం తీర్చలేకపోతున్నారు. దీంతో 90 శాతం వ్యాపారులు మాత్రం చిల్లర నాణేలు కమీషన్ పద్ధతిలో సమకూర్చుకోవడం చిరు వ్యాపారులకు భారంగా మారుతోంది. రోజువారి సంపాదనలో కొంత మొత్తం చిల్లర కొనుగోలుకే వెచ్చించాల్సివస్తోందని వ్యాపారులు వాపోతున్నారు. చిల్లరవ్యాపారం నిత్యం రూ.అర కోటి చిల్లర కొరతను కొందరు వ్యాపారంగా మార్చుకుంటున్నారు. రూ.100 విలువ చేసే చిల్లర కావాలంటే అదనంగా రూ.పది తీసుకుంటున్నారు. సర్వసాధారణంగా కనిపించే చిల్లర వ్యాపారం ద్వారా నిత్యం రూ.50 లక్షల మేర కమీషన్ చేతులు మారుతోందంటే ఆశ్చర్యం కలగక మానదు. పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో చిల్లర నాణేలు విక్రయించేందుకు ప్రత్యేక వ్యాపారులు ఉండగా కొందరు కిరాణా షాపులు, కిళ్లీ బడ్డీల దుకాణాల్లో చిల్లర వ్యాపారం జరుగుతోంది. దేవాలయాల్లో హుండీలను తెరిచే సమయంలో అక్కడి అధికారులకు సైతం ‘కమీషన్’ చెల్లించి మరీ చిల్లర కొనుగోలు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరికొందరు వ్యాపారులు బిక్షాటన చేసే వారి వద్ద నుంచి చిల్లర తీసుకుని వారికి నోట్లు ఇస్తున్నారు. రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకు బ్యాంకులు చిల్లర నాణేలు అందించే మేళాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ అది పాటించడంలేదు. కష్టాలు తప్పడం లేదు ప్రస్తుతం ఏ వస్తువు కొనుగోలు చేసినా ఎమ్మార్పీలు చిల్లర మొత్తంలోనే ఉంటున్నాయి. వాటి కొనుగోలు అనంతరం ప్రజలకు చిల్లర ఇవ్వాల్సి వస్తోంది. దీంతో గత్యంతరం లేక కమీషన్ రూపంలో చిల్లర కొనుగోలు చేసి కొనుగోలుదారులకు ఇస్తున్నాం. – వి.సూర్యనారాయణ, కిరాణా వ్యాపారి, వేల్పూరు 10 శాతం కమీషన్ ఇచ్చి కొంటున్నాం నా దుకాణంలో ప్రతి రోజు రూ.వెయ్యి వరకు చిల్లర అవసరమవుతుంది. అయితే చిల్లర కొరత కారణంగా కొన్ని సందర్భాల్లో బేరాలు వదులుకుంటున్నాం. దీంతో భారమైనా రూ.10 శాతం కమీషన్ ఇచ్చి చిల్లర కొనుగోలు చేస్తున్నాం. – వైసీహెచ్ కృష్ణమూర్తి, వ్యాపారి -
ఏటా 50 లక్షల మరణాలకు అదే కారణం
లండన్: ఇటీవలికాలంలో బాగా తగ్గిపోతున్న శారీరక శ్రమకు ప్రజలు చెల్లిస్తున్న మూల్యం ఎంతో తెలుసా.. సంవత్సరానికి 67.5 బిలియన్ డాలర్లతో పాటు 50 లక్షల మంది ప్రాణాలు. ఇంటర్నేషనల్ టీమ్ ఆఫ్ రీసెర్చర్స్ నిర్వహించిన తాజా పరిశోధనలో వ్యాయామం లేకపోవటం మూలంగా 67.5 బిలియన్ డాలర్లను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్యం విషయంలో ఖర్చు చేస్తున్నారని తేల్చారు. వారానికి కనీసం 150 నిమిషాల శారీరక శ్రమ చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతున్నా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వయోజనుల్లో 50 శాతం మంది కూడా ఈ మార్క్ను చేరుకోవటం లేదని పరిశోధకులు వెల్లడించారు. రోజుకు ఎనిమిది గంటలకు పైగా కూర్చొని పనిచేసేవారిలో సరైన శారీరక శ్రమ లేకపోయినట్లయితే వారిలో అకాల మరణాలు సంభవించే అవకాశం పెరుగుతోందని పరిశోధనలో తేలింది. శరీరానికి సరైన వ్యాయామం లేకపోవటం మూలంగా గుండె జబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన ఎకిలండ్ తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement