-
భద్రాద్రి ఆలయంలో కీలక మార్పులు
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రామాయలంలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 14 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఉన్నపళంగా తప్పించారు. అలాగే 100 గ్రాముల లడ్డూ సైజును 80 గ్రాములకు కుదించారు. రెగ్యులర్గా ఉండే ఉద్యోగులను అంతర్గతంగా బదిలీలు చేశారు. ఇంత అత్యవసరంగా మార్పులు ఎందుకు చేశారో తెలియరాలేదు. -
'శ్రీవారి' సబ్సిడీ లడ్డూలకు ఎసరు?
ధర్మకర్తల మండలి సభ్యుల కమిటీ భేటీలో చర్చ ప్రతి భక్తునికీ 100 గ్రాముల ఉచిత లడ్డూ ఇవ్వాలనే యోచన తోమాల, అర్చనతోపాటు వీఐపీ ఎల్-1,2 టికె ట్ల రుసుం పెంపు ప్రతిపాదన తిరుమల : శ్రీవారి భక్తులకు అందిస్తున్న సబ్సిడీ లడ్డూలకు ఎసరు పెట్టాలని టీటీడీ భావిస్తోంది. శుక్రవారం ఇక్కడ భేటీ అయిన ధర్మకర్తల మండలి సభ్యుల కమిటీ ప్రధానంగా దీనిపైనే చర్చించింది. తోమాల, అర్చనతోపాటు వీఐపీ-1,2 టికెట్ల ధరలను కూడా భారీగా పెంచే ప్రతిపాదన దిశగా ఆలోచిస్తున్నారు. శ్రీవారి లడ్డూ తయారీకోసం టీటీడీకి రూ.30 ఖర్చవుతోంది. అయినప్పటికీ కాలిబాట భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా ఇస్తున్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాల్లో ప్రస్తుతం రోజుకు 15 వేల నుంచి 20 వేల వరకు భక్తులు వస్తున్నారు. ఈ లెక్కన వీరికి ఇచ్చే ఉచిత లడ్డూ కోసం రోజుకు రూ. 4.5 లక్షల నుంచి రూ.6 లక్షలు, ఏడాదికి రూ.16.20 కోట్ల నుంచి 21.60 కోట్ల వరకు అదనపు భారం పడుతోంది. వారపు రద్దీ, పర్వదినాల్లో నడచివచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా చూస్తే టీటీడీపై రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు పడే అవకాశం ఉంది. ఇదే తరహాలోనే కాలిబాట భక్తులతోపాటు సర్వదర్శన భక్తులకు సబ్సిడీ ధరతో ఒక లడ్డూ రూ.10 చొప్పున రూ.20కి రెండు ఇస్తున్నారు. ఇలా ఏడాదిలో సుమారు రూ.20 నుంచి రూ.25 కోట్ల మేర భారం పడుతోంది. మొత్తంగా ఏడాదికి టీటీడీ సుమారు రూ.50 కోట్ల వరకు ఖర్చు పెడుతోంది. ధరల పెంపుకే మొగ్గు.. శ్రీవారి లడ్డూ ధరల పెంపు భావనలో టీటీడీ ధర్మకర్తల మండలి ఆలోచిస్తోంది. ఇందుకు సంబంధించి రెండు నెలలుగా చర్చ కొనసాగిస్తూనే ఉంది. పనిలోపనిగా ఉచిత లడ్డూ, సబ్సిడీ లడ్డూలు ఇచ్చే పథకానికీ మంగళం పాడాలని చూస్తోంది. వీటి స్థానంలో ప్రతి భక్తునికీ సుమారు 100 గ్రాముల లడ్డూను ఉచితంగా అందించాలనే అంశాన్ని పరిశీలిస్తోంది. పోటును మరింత విస్తరించి లడ్డూ తయారీ సంఖ్యను పెంచి భక్తులు కోరినన్ని లడ్డూలు ఇవ్వాలని యోచిస్తోంది. శుక్రవారం నిర్వహించిన ధర్మకర్తల మండలి సభ్యుల భేటీలో సభ్యుల్లో కొందరు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సేవల ధరల పెంపు ప్రతిపాదన శ్రీవేంకటేశ్వర స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించే భాగ్యం తోమాల, అర్చన సేవల్లో పాల్గొనే భక్తులకు దక్కుతుంది. సోమ, మంగళ, బుధ, గురువారాల్లో జరిగే ఈ అరుదైన సేవా టికెట్లు ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చేవారితోపాటు ప్రముఖులకు మాత్రమే తక్కువ సంఖ్యలో లభిస్తాయి. ప్రస్తుతం ఒక టికెట్టు బ్యాంకు కోటాలో రూ.220, సిఫారసు కోటాలో రూ.440గా ఉంది. ఈ ధరను కూడా భారీగా పెంచాలని భావిస్తున్నారు. అలాగే హారతి, తీర్థం, శఠారి మర్యాదలతో కూడిన వీఐపీ -1, 2 టికెట్ల ధరను పెంచడం వల్ల వాటిని కోరే వారి సంఖ్యను తగ్గింవచ్చన్న భావనతో ఉన్నారు. కల్యాణ మండపాల అద్దెలు, తిరుమలలోని పలు అతిథిగృహాల అద్దెల పెంపు దిశగా లెక్కలు వేశారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
అమెరికా పారిపోయిన అయ్యా.. కొడుకులు
ఏపీలో అల్లర్లు చేసింది వీరే..
కుప్పంలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి సిద్ధమవుతున్న ఓటర్లు
కర్నూల్ లో వజ్రాల వేట
యాక్షన్ ఎంటర్టైనర్గా బిగ్బ్రదర్.. రిలీజ్ ఎప్పుడంటే?
అది పచ్చ బ్యాచ్ పనే.. రేవ్ పార్టీ కథనాలపై కాకాణి ఫైర్..
హైదరాబాద్లో మళ్లీ దంచికొడుతున్న వాన
పోలీస్ స్టేషన్ పై దాడి చేసి పారిపోయిన చింతమనేని
మంచి వ్యక్తిగా ఉండాలనుకోవడం లేదు!.. కానీ..
ప్రెగ్నెన్సీ.. దీర్ఘకాలం వాయిదాలో సమస్యా? అయితే ఇలా చేయండి!
తప్పక చదవండి
- జూన్ రెండో వారంలో తెలంగాణకు రుతుపవనాలు !
- యాక్షన్ ఎంటర్టైనర్గా బిగ్బ్రదర్.. రిలీజ్ ఎప్పుడంటే?
- హైదరాబాద్లో మళ్లీ దంచికొడుతున్న వాన
- ‘28 శాతం జీఎస్టీ’, సుప్రీం వైపు.. గేమింగ్ కంపెనీల చూపు
- కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెట్టాలి: కేటీఆర్
- అదృష్టం ఎవరిని వరిస్తోంది.. ఎస్బీఐ ఛైర్మన్ పదవి కోసం పోటీ
- అతడొక క్లాస్ ప్లేయర్.. ఎంత చెప్పుకున్న తక్కువే: ప్యాట్ కమ్మిన్స్
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
- సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది!
- Jr NTR Birthday: 'మ్యాన్ ఆఫ్ మాసెస్'గా ఎన్టీఆర్ ఎలా ఎదిగాడు..?
Advertisement