-
టీఆర్ఎస్ విజయాన్ని ఆపలేరు
షాద్నగర్ రూరల్: కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా తమ విజయాన్ని ఆపలేరని ఆపద్ధర్మ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. జిల్లేడు చౌదరిగూడ మండల పరిధిలోని పీర్జాపూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, ఛత్రపతి యువజన సంఘం సభ్యులు ఆదివారం మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యాన, మంత్రి సమక్షంలో గులాబీ కండువాలు వేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ శివారులోని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకపోతున్న కాంగ్రెస్ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని తెలిపారు. టీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అన్నివర్గాల ప్రజలకు లబ్ధి చేకూరిందని స్పష్టంచేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేసిందని చెప్పారు. టీఆర్ఎస్ పథకాలే తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని ధీమా వ్యక్తంచేశారు. మహాకూటమితో ప్రజలకు ఓరిగేదేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఉనికి కోసం పాకులాడుతోందని ఎద్దేవాచేశారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింగ్రావు, కొందూటి నరేందర్, ఎంఎస్ నట్రాజ్, బాబురావు, ముస్తాఫా, హఫీజ్, మల్లయ్య, చెన్నయ్య, ఆంజనేయులు, శీలం శ్రీకాంత్, హన్మంతు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్య సంస్కరణలు దేశానికే ఆదర్శం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో చేపట్టిన సంస్కరణలు దేశానికే ఆదర్శమని ఐటీ, పట్టణాభివృద్ధి మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో మంత్రి లక్ష్మారెడ్డి చొరవతో ఆరోగ్యశాఖలో గుణాత్మక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. ‘నేను రాను బిడ్డో’ అని పాడుకునే రోజుల నుంచి ‘నేను వస్త బిడ్డో సర్కార్ దవాఖానాకు’అనే స్థాయిలో ప్రభుత్వ దవాఖానాలను తీర్చిదిద్ది, ప్రజలను ఆ వైపు ఆకర్షితులను చేయడం సామాన్య విషయం కాదన్నారు. మల్కాజిగిరి బీజేఆర్ నగర్లో వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను మంత్రి లక్ష్మారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్తో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నగరంలో నిరుపేదలకు మరింత మెరుగైన వైద్య సదుపాయలు అందించడానికి బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బీజేఆర్ నగర్తోపాటు మరో 17 బస్తీ దవాఖానాలు నేటి నుంచి పనిని ప్రారంభిస్తాయన్నారు. మరో నెల రోజుల్లోగా 40 దవాఖానాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. నగరంలో ప్రతి 10వేల మందికి ఒక దవాఖానా చొప్పున వెయ్యి బస్తీ దవాఖానాలను దశలవారీగా ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ దవాఖానాలు అందుబాటులోకి వస్తే బస్తీ ప్రజలకు మరింతగా వైద్య సేవలు అందుతాయన్నారు. వైద్యరంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులు, పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్లు తగ్గి, సహజ ప్రసవాలు పెరిగాయని చెప్పారు. బస్తీ దవాఖానాల్లో మెరుగైన వైద్య సేవలు మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బస్తీ దవాఖానాలు స్థానిక ప్రజలకు ఆరోగ్య పరమైన సలహాలు ఇవ్వడంతో పాటు మెరుగైన వైద్యసేవలు అందిస్తాయన్నారు. మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే కనకారెడ్డి, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ తదితరులు పాల్గొన్నారు. ఫలక్నుమాలోని హషిమాబాద్, మలక్పేట, గడ్డి అన్నారంలలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీలతో కలసి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. -
అవయవదానంలో మనమే నంబర్ వన్
సాక్షి, హైదరాబాద్: అవయవదానంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. అవయవాల సేకరణ, అవగాహన, శిక్షణ, సాఫ్ట్వేర్ నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఇందుకు గుర్తింపుగా నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ (ఎన్వోటీటీవో) అవార్డును ప్రకటించింది. సోమవారం ‘నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే’సందర్భంగా ప్రభుత్వం తరఫున జీవన్ధాన్ ఇన్చార్జి డాక్టర్ స్వర్ణలత ఢిల్లీలో ఈ అవార్డు అందుకోనున్నారు. తమిళనాడును దాటేసి.. తమిళనాడు జనాభా 8 కోట్లు కాగా.. తెలంగాణ జనాభా 3.5 కోట్లు. తమిళనాడులో గత 11 ఏళ్లలో 5,367 అవయవాలను సేకరించి దేశంలోనే తొలి స్థానంలో ఉంది. తెలంగాణలోని నిమ్స్ జీవన్దాన్ ఆధ్వర్యంలో 2013 నుంచి 2017 అక్టోబర్ వరకు 414 మంది దాతల నుంచి 1,675 అవయవాలను సేకరించారు. గతేడాది వరకు రెండోస్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి తొలిస్థానంలో నిలిచింది. జనాభా ప్రతిపాదికన పరిశీలిస్తే.. తమిళనాడుతో పోలిస్తే అవయవ దానంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉన్నట్లు ఎన్వోటీటీవో తెలిపింది. అవయవదానంపై అవగాహన, శిక్షణ, సాప్ట్వేర్ నిర్వహణ.. ఇలా అన్ని విభాగాల్లోనూ ముందు నిలిచిందని కొనియాడింది. ఇక కేరళ ఇప్పటివరకు 701 అవయవాలు సేకరించి మూడోస్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో నిలిచాయి. బ్రెయిన్డెడ్ స్థితిలో తమ అవయవాలను దానం చేసేందుకు అనేక మంది ఇప్పటికే తమ పేర్లను జీవన్దాన్లో నమోదు చేసుకున్నారు. దాతల్లో ప్రముఖ క్రీడాకారులు అనిల్కుంబ్లే, గౌతం గంభీర్, నటుడు అక్కినేని నాగార్జున, హీరోయిన్ ప్రియాంకా చోప్రా, టాలీవుడ్ నటి సమంత సహా 30 వేల మందికిపైగా ఉన్నారు. మరోవైపు 4,203 మంది గుండె, కాలేయం, కిడ్నీ దాతల కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో 2,221 మంది కిడ్నీ కోసం, 1,897 మంది కాలేయ మార్పిడి చికిత్సల కోసం ఎదురుచూస్తున్నారు. అవయవ మార్పిడికి కేంద్ర బిందువుగా.. అవయవమార్పిడి చికిత్సలను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చింది. బ్రెయిన్డెడ్ దాత నుంచి సేకరించిన గుండె, కాలేయ మార్పిడి చికిత్సలకు రూ.10.5 లక్షల చొప్పున, ఏకకాలంలో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సకు రూ.13.6 లక్షలు, బోన్మ్యారో చికిత్సకు రూ.8.7 లక్షలు, లైవ్డోనర్ కాలేయ మార్పిడి చికిత్సకు రూ.13 లక్షల చొప్పున చెల్లిస్తోంది. కేవలం బ్రెయిన్డెడ్ బాధితులే కాదు.. బతికుండగానే శరీర భాగాలను బాధితులకు ఉచితంగా ఇచ్చేందుకు బంధువులు(లైవ్ డోనర్స్)ముందుకు వస్తున్నారు. దీంతో హైదరాబాద్ అవయవ మార్పిడికి కేంద్ర బిందువుగా మారుతోంది. ఈ అవార్డు బాధ్యతను పెంచింది: లక్ష్మారెడ్డి, మంత్రి, వైద్య ఆరోగ్యశాఖ అవయవదానంలో రాష్ట్రానికి జాతీయస్థాయిలో ప్రథమ స్థానం లభించడం సంతోషం. ఈ అవార్డు మా బాధ్యతను మరింత పెంచింది. అన్ని దానాలకంటే అవయవదానం గొప్పది. జీవితానంతరం ప్రతి ఒక్కరూ అవయవాలను దానం చేయాలి. ఒక వ్యక్తి చేసిన అవయవదానంతో మరో ఎనిమిది మందికి పునర్జన్మ ప్రసాదించవచ్చు. -
సిద్దిపేట జిల్లా.. క్యాష్లెస్..
- అధికార యంత్రాంగం సిద్ధం కావాలి: సీఎం కేసీఆర్ - నియోజకవర్గంలో ‘క్యాష్లెస్ విధానం’పై పాఠాలు నేర్వాలి - మున్ముందు బ్యాంకుల పాత్ర గణనీయంగా పెరుగుతుంది - సంస్థాగతంగా బలోపేతం కావాలి.. పనితీరు మెరుగుపడాలి - సిద్దిపేటలో ప్రతి ఒక్కరికీ డెబిట్ కార్డులు జారీ చేయాలి సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట నియోజక వర్గం తర్వాత సిద్దిపేట జిల్లాను కూడా నగదురహిత లావాదేవీల జిల్లాగా మార్చ నున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఇందుకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలని ఆదేశించారు. నగదురహిత లావాదేవీల నియోజక వర్గంగా సిద్దిపేటను తీర్చిదిద్దే క్రమంలో అనుభవ పాఠాలు నేర్చుకోవాలని, వాటిద్వారా రాష్ట్రవ్యాప్తంగా తలెత్తే ఇబ్బందులకు పరిష్కారం చూపాలని బ్యాంకర్లకు సూచించారు. సిద్దిపేటను నగదురహిత లావాదేవీల నియోజక వర్గంగా తీర్చిదిద్దే అంశంపై మంగళవా రం ప్రగతిభవన్లో బ్యాంకర్లతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకర్ల కృషిని అభినందించారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కేంద్రం తీసుకుంటున్న చర్యలతో బ్యాంకుల పాత్ర పెరుగుతుందని, అందుకు తగ్గట్లు బ్యాంకులు సంస్థాగతంగా బలోపేతం కావాలన్నారు. నగదురహిత లావాదేవీల నిర్వహణ కోసం బ్యాంకుల పనితీరు మెరుగుపడాలని సూచించారు. ‘‘తగిన న్ని స్వైపింగ్ యంత్రాలు అందుబాటు లోకి తేవాలి. సిద్దిపేటలో 4 వేలకు పైగా స్వైపింగ్ యాంత్రాలను సమకూర్చాలి. ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతాలు తెరిచి డెబిట్ కార్డులు జారీ చేయాలి. కార్డుల ద్వారానే కాక మొబైల్ యాప్ల ద్వారా కూడా లావాదేవీలను ప్రోత్సహించాలి. బ్యాంకు ఖాతాల నిర్వహణ, కార్డుల వినియోగంపై గ్రామ సభల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలి. మొబైల్ యాప్ల ద్వారా లావాదేవీలపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులను భాగస్వామ్యం చేసుకోవాలి. ముందుగా విద్యార్థులకు అవగాహన కల్పించి వారి ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యక్రమం కొనసాగాలి. ఇందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యచరణ రూపొందించాలి. ఆర్టీసీ బస్సుల్లో పూర్తి స్థాయిలో స్వైప్ మిషన్లు పెట్టాలి. చార్జీలు చెల్లించడానికి మొబైల్ యాప్స్ను వినియోగించేలా చూడాలి. వ్యాపారులందరికీ ఖాతాలు తెరవాలి’’ అని బ్యాంకర్లకు సీఎం సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు టి.హరీశ్ రావు, జగదీశ్రెడ్డి, లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement