-
‘లైన్’ క్లియర్..
సాక్షిప్రతినిధి, ఖమ్మం : భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైల్వే లైన్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుత బడ్జెట్లో నిధులు కేటాయించడంతో మందకొడిగా సాగుతున్న భూసేకరణ పనులు ఇక వేగవంతం కానున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు రైల్వే శాఖ పరంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తమ ఎంపీల ద్వారా విన్నవించుకున్నప్పటికీ.. ఈ ఒక్క ప్రాజెక్టుకు మాత్రమే నిధులు కేటాయించింది. కేంద్ర బడ్జెట్లో రైల్వే లైన్ భూసేకరణకు రూ.120కోట్లు కేటాయించిన నేపథ్యంలో పనులు ఊపందుకోనున్నాయి. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజ్మీరా సీతారాంనాయక్ అనేక ప్రతిపాదనలు ఇచ్చారు. అయితే రైల్వే లైన్కు మినహా ఏ ఒక్కదానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. దశాబ్ద కాలంగా ఇటు కొత్తగూడెం, అటు సత్తుపల్లివాసులను రైల్వే లైన్ ఊరిస్తోంది. సింగరేణి సంస్థ లైన్ నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చినా.. సర్వే పనులు ఆలస్యం కావడంతో పనులు పట్టాలెక్కని పరిస్థితి. గతంలో మంజూరు చేసిన రైల్వే లైన్ ప్రాజెక్ట్లో ఈ లైన్ ఉండటంతో కేంద్రం బడ్జెట్లో రూ.120కోట్లు మంజూరు చేసింది. సుమారు 53 కిలోమీటర్లు ఉండే మార్గంలో పెద్ద ఎత్తున భూములు సేకరించాల్సి ఉంది. అయితే కొత్త భూసేకరణ విధానం ప్రకారం ఆ నిధులు ఏ మేరకు సరిపోతాయనే అంశం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఉన్న నిధులతోనే భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులు నిర్ణయించారు. భూసేకరణ పూర్తయి.. పరిహారం చెల్లించే ప్రక్రియ కొలిక్కి వస్తే తప్ప నిర్మాణ పనులు ప్రారంభమయ్యే పరిస్థితి లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 2010–11 బడ్జెట్లో కేంద్ర రైల్వే శాఖ రైలు మార్గం నిర్మాణానికి అనుమతిచ్చింది. సుమారు రూ.337.50కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సర్వే పనులు పూర్తి చేశారు. సత్తుపల్లి వరకు 53.25 కిలోమీటర్ల మేరకు ఎలక్ట్రికల్ లైన్లతో లైన్ నిర్మాణం జరగాల్సి ఉంది. భూసేకరణ కోసం రైల్వే శాఖ రూ.19.04కోట్లు వ్యయం చేయాల్సి ఉండగా.. సింగరేణి సంస్థ రైల్వేకు రూ.318.64కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. 2012, ఆగస్టులో సర్వే నిమిత్తం రూ.6.38కోట్లను రైల్వే శాఖకు సింగరేణి చెల్లించింది. లైన్ నిర్మాణం పూర్తయితే సింగరేణి సంస్థ ప్రతీ ఏడాది 6 మిలియన్ టన్నుల చొప్పున 25 ఏళ్లపాటు బొగ్గును రైలు మార్గంలో రవాణా చేసేందుకు రైల్వే శాఖతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైల్వే లైన్ నిర్మాణం భూసేకరణ కోసం కేంద్రం రూ.120కోట్లు కేటాయించింది. దీంతో పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. కాలయాపనతో పెరిగిన అంచనా వ్యయం తొలుత రూ.360కోట్లతో భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని భావించారు. అయితే కాలయాపన కావడంతో ప్రాజెక్టు వ్యయం రెండింతలు పెరిగింది. ఈ నేపథ్యంలో నిర్మాణ వ్యయం తగ్గించుకునేందుకు 2015లో సింగరేణి సంస్థ రీ సర్వే కోసం రైట్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. సర్వే చేసిన రైట్స్ సంస్థ రూ.792కోట్ల అంచనాతో రూపొందించిన ప్రణాళికకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. భూసేకరణ, సర్వే, అటవీ శాఖ అనుమతుల కోసం సింగరేణి రూ.80కోట్ల నిధులు విడుదల చేసింది. రైలు మార్గానికి సర్వే పూర్తి కావడంతో భూసేకరణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఐదు స్టేషన్లు.. పెనుబల్లి జంక్షన్ ఈ మార్గంలో ఐదు స్టేషన్లతో పెనుబల్లి జంక్షన్గా ఏర్పాటు చేస్తున్నారు. 3.4 కిలోమీటర్ వద్ద సీతంపేట స్టేషన్, 22.8 కిలోమీటర్ వద్ద భావన్నపాలెం, 39.25 కిలోమీటర్ వద్ద చండ్రుగొండ స్టేషన్, 44 కిలోమీటర్ వద్ద పెనుబల్లి జంక్షన్, 53.2 కిలోమీటర్ వద్ద సత్తుపల్లి రోడ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే భూసార పరీక్షలు పూర్తి చేశారు. రైలు మార్గంలో ఉన్న చెరువులు, కుంటలు, వాగులపై వంతెనల నిర్మాణం కోసం నీటిపారుదల శాఖ అధికారులతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సత్తుపల్లి రోడ్ రైల్వేస్టేషన్ను కొత్త లంకపల్లి శివాలయం వెనుక ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల వరకు ఓపెన్కాస్టుకు వెళ్లే విధంగా లైన్ వేస్తున్నారు. కొత్త లంకపల్లి రాష్ట్రీయ రహదారిపై రైలు కోసం ఓవర్ బ్రిడ్జి కట్టేందుకు ప్రతిపాదనలు చేశారు. -
భూబిల్లును ఓడించి తీరుతాం
రాజస్తాన్లో పార్టీ సమావేశంలో రాహుల్ * మోదీ 56 అంగుళాల ఛాతీని ప్రజలు 5.6 అంగుళాలకు తగ్గిస్తారని వ్యాఖ్య జైపూర్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం భూసేకరణ బిల్లును ప్రవేశపెడితే తమ పార్టీ ఓడించి తీరుతుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆరు నెలల్లో ప్రజలు ప్రధాని మోదీ 56 అంగుళాల ఛాతీని 5.6 అంగుళాలకు తగ్గిస్తారని వ్యాఖ్యానించారు. రాజస్తాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని లండన్ నుంచి లలిత్ మోదీ రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపిస్తున్నాడని మండిపడ్డారు. శుక్రవారమిక్కడ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం, రాజస్తాన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో భూసేకరణ బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్ ఓడించి తీరుతుంది. మొదటిసారి ప్రతిపక్షానికి సాయం చేసే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వారికి అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్కు సాయం చేస్తున్నారు. రైతుల నుంచి ఒక్క అంగుళం భూమి కూడా లాక్కోకుండా చూస్తాం. ఆ 56 అంగుళాల ఛాతీ(మోదీని ఉద్దేశించి) 5.6 అంగుళాలకు తగ్గిపోతుంది. వచ్చే ఆరు నెలల కాలంలో కాంగ్రెస్, ఈ దేశ ప్రజలు, రైతులు, కూలీలు ఈ పనిచేయబోతున్నారు’ అని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ.. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ను ఉద్దేశించి ‘56 అంగుళాల’ వ్యాఖ్య చేశారు. ‘ములాయంజీ.. యూపీని గుజరాత్గా మార్చడం అంత సులభం కాదు. అలా మారాలంటే 24 గంటల కరెంటు ఇవ్వాలి. అంతకుమించి 56 అంగుళాల ఛాతీ ఉండాలి’ అని అన్నారు. కాగా రాహుల్ రాజస్తాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నాటి ఆంగ్లేయుల పాలనతో పోల్చారు. ‘లండన్ నుంచి లలిత్ మోదీ రిమోట్ బటన్ నొక్కితే.. ఇక్కడ రాజే ఎగురుతున్నారు’ అని దుయ్యబట్టారు. పెద్దఎత్తున నల్లధనాన్ని వెనకేసుకున్న లలిత్కు రాజే సాయం చేశారని విమర్శించారు. ఇది వసుంధర ప్రభుత్వం కాదని, లలిత్ మోదీ ప్రభుత్వమని పేర్కొన్నారు. ‘నల్ల’ మాటలేమయ్యాయి? ఎన్నికల్లో అనేక మాటలు చెప్పిన మోదీ ఇప్పుడు వాటన్నింటినీ పక్కన పెట్టేశారని రాహుల్ విమర్శించారు. ‘అవినీతిని నిర్మూలిస్తామన్నారు. విదేశాల నుంచి నల్లధనం వెనక్కి తెప్పిస్తామన్నారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామన్నారు. ఇప్పుడు లలిత్ లక్షల కోట్లు వెనకేసుకొని లండన్లో కూర్చొన్నాడు. ఆయన్ను వెనక్కి రప్పించండి. ఇక్కడ నడుస్తున్న ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేయండి. గతంలో రాజే, లలిత్ కలిసి వ్యాపారాలు చేశారు. బీజేపీ రాష్ట్రాల్లో జరిగిన స్కాంలపై 56 అంగుళాల ఛాతీ ఉన్న ప్రధాని ఏమీ మాట్లాడరు’ అని ఎద్దేవా చేశారు. అధికారాలన్నింటినీ ప్రధాని తన వద్దే అట్టిపెట్టుకొని, మంత్రులను డమ్మీలుగా మార్చేశారన్నారు. -
'మోదీ 56 అంగుళాల ఛాతి 5.6కు తగ్గుతుంది'
న్యూఢిల్లీ: భూసేకరణ చట్టం సవరణ బిల్లు విషయంలో ప్రధాని నరేంద్రమోదీని వదిలిపెట్టే సమస్యేలేదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మరో ఆరు నెలల్లో ప్రస్తుతం ప్రధాని మోదీకి ఉన్న 56 అంగులాల ఛాతీ..5.6 అంగుళాలకు తగ్గిపోతుందని ఘాటుగా విమర్శించారు. భూసేకరణ చట్టం సవరణ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటో ఆరోజు పార్లమెంటులో చూస్తారులే అన్నారు. మోదీ ఛాతీని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ వెంటనే స్పందించింది. కేవలం 5.6 అంగుళాల మేరకు మాత్రమే చూడగలిగినవారు దాని వెనుక ఎంత ఉందో చూడలేరని సంబిత్ పాత్రా ఎదురుదాడి చేశారు. అంతేకాకుండా, లలిత్ మోదీ నేరానికి పాల్పడ్డారని, ఆర్థిక చట్టాలను అతిక్రమించారని, ప్రధాని నరేంద్రమోదీగారు వెంటనే ఆయన్ను వెనక్కి రప్పించాలని డిమాండ్ చేశారు. త్వరలో మొదలయ్యే వర్షాకాల సమావేశాల్లో లలిత్ మోదీ వ్యవహారంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, సుష్మా స్వరాజ్ల పాత్రలను ఎండగట్టనున్నామని కూడా పరోక్షంగా రాహుల్ గాంధీ సంకేతాలిచ్చారు. ఇదే జరిగితే, మరోసారి పార్లమెంటులోని ఉభయసభలు దద్ధరిల్లనున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement