-
భూరాబందులు
తిరుపతి/మదనపల్లె: మదనపల్లెలో అధికార పార్టీ నేతల భూ ఆక్రమణలు పెచ్చుమీరిపోయాయి. కంటికి కనిపించిన ఖాళీ స్థలాలన్నింటినీ టీడీపీ నేతలు కబ్జా చేస్తున్నారు. ఇప్పటికే మదనపల్లెలోని మాజీ సైనికుల స్థలాన్ని ఆక్రమించిన అధికార పార్టీ నేతలు తమ ఆక్రమణల పరంపరను కొనసాగిస్తూ పట్టణంలో మిగిలిన ప్రభుత్వ భూములపై కన్నేశారు. ఎవ రి పరిధిలో వారు తమదైన శైలిలో ఆక్రమణలకు పాల్పడుతున్నారు. తాజాగా పట్టణ నడిబొడ్డున ఉన్న ఆర్టీసీకి చెందిన కోట్ల విలువ చేసే స్థలంపై వీరి కన్ను పడింది. టెండరు ద్వారా ఆర్టీసీ నుంచి స్థలాన్ని లీజుకు తీసుకు న్న వ్యాపారి నిర్మిస్తున్న గదుల నిర్మాణాలను శనివారం రాత్రి అడ్డుకుని దౌర్జన్యానికి పాల్ప డ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మదనపల్లె ఆర్టీసీ డిపో పక్కన మెయిన్ రోడ్డుకు ఆనుకుని సర్వే నంబరు 294/1, 294ఏ, 294బీలలో 1,535 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉంది. గతంలో ఆర్టీసీ నిర్మాణాలు పూర్తి కాగా మిగిలిన స్థలాన్ని అధికారులు తమ పరిధిలోనే ఉంచుకున్నారు. ఆదాయ వనరులు పెంచుకునే క్రమంలో ఈ స్థలాన్ని లీజుకివ్వాలని మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. సుమారు రూ.1.50 కోట్ల విలువైన ఈ స్థలా న్ని ఎలాగైనా దక్కించుకోవాలని పక్కనే ఉన్న ఓ చోటా టీడీపీ నేత కన్నేశాడు. తనకున్న అధికార బలంతో ఇప్పటికే పలుమార్లు కోర్టుకెళ్లి ఆర్టీసీ టెండర్లను అడ్డుకునేందుకు స్టేలు తెచ్చారు. దీంతో మూడేళ్లుగా ఆర్టీసీ టెండర్ల ద్వారా గదుల నిర్మాణం చేపట్ట లేక లక్షలాది రూపాయల ఆదాయాన్ని నష్టపోయింది. అయితే రెండు నెలల కిందట హైకోర్టు ఆర్టీసీకి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని అమల్లో పెట్టేందుకు మదనపల్లె డిపో అధికారులు సదరు స్థలాన్ని లీజుకిచ్చేందుకు టెండర్లు పిలిచారు. ఏప్రిల్లో ఈ స్థలాన్ని వెంకటేశ్ అనే వ్యాపారి లీజుకు పొందాడు. నెలకు రూ.42 వేలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని హోటల్ నిర్మాణ పనులు చేపట్టాడు. అయితే పక్కనే ఉన్న ఓ ప్రయివేటు హోటల్ యజమాని దీన్ని అడ్డుకుని ఆ స్థలా న్ని ఆక్రమించేందుకు ప్రయత్నం చేశాడు. శని వారం రాత్రి నిర్మాణ పనులను అడ్డుకుని అక్కడున్న సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. పట్టణ టీడీపీలో క్రియాశీలకంగా ఉండే సదరు యు వ నాయకుడు పార్టీ అండ చూసుకుని ఆక్రమణలకు సిద్ధపడినట్లు సమాచారం. అధికారుల హెచ్చరికలు బేఖాతరు ఆ స్థలం ఆర్టీసీదనీ ఎవరూ జోక్యం చేసుకోవద్దని డిపో మేనేజర్ పెద్దన్నశెట్టి చెప్పినా వినని టీడీపీ నేత తనదైన దందాను ప్రదర్శించారు. స్థలం జోలి కొస్తే సహించేది లేదంటూ హెచ్చరికలు చేయడమే కాకుండా అక్కడున్న సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. అంతేకాకుండా నిర్మాణానికి సిద్ధం చేసిన ఇటుకలు ఇతరత్రా సామాగ్రిని ట్రాక్టర్లలో బలవంతంగా తీసుకెళ్లారు. ఇదేమిటని ప్రశ్నించిన ఆర్టీసీ సిబ్బందిపై గొడవకు దిగి దుర్భాషలాడారు. ఆర్టీసీ సిబ్బందిపై జరిగిన దాడులకు, స్థల ఆక్రమణపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు డిపో మేనేజర్ పెద్దన్నశెట్టి తెలిపారు. ఆ స్థలం మాది ఆర్టీసీ ఆర్ఎం నాగశివుడు మదనపల్లెలోని ఖాళీ స్థలం ఆర్టీసీదనీ, ఎవరో ఆక్రమించేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని తిరుపతి ఆర్టీసీ ఆర్ఎం నాగశివుడు పేర్కొన్నారు. ఈ విషయంలో పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకుని ఆక్రమించేందుకు యత్నించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
‘సాక్షి’పై కేసులో హైకోర్టు స్టే
- హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు - ఓ ఎమ్మెల్యే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తారా? - అసలు ఈ వ్యవహారంలో దర్యాప్తు చేసేందుకు ఏముంది? - టీడీపీ ఎమ్మెల్యే ఫిర్యాదుపై తదుపరి చర్యలన్నీ నిలిపివేత సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల భూ ఆక్రమణలపై కథనాలు ప్రచురించినందుకు సాక్షి విలేకరులు, యాజమాన్యంపై పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు, ఫిర్యాదుదారైన ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తీరును న్యాయమూర్తి తీవ్రంగా ఆక్షేపించారు. ఓ చర్చి ఆస్తులను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కాజేసిన వైనంపై సాక్షి దినపత్రిక గత నెల 6, 7 తేదీల్లో వరుస కథనాలు ప్రచురించింది. అవి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, వర్గపోరును ప్రోత్సహించేలా ఉన్నాయంటూ గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అరండల్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు సాక్షి విలేకరులు, యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 153ఎ, 500, 501, 502, 505ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ సాక్షి విలేకరులతో పాటు యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని సోమవారం జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారించారు. ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు చెల్లదని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్.శ్రీరామ్ స్పష్టం చేశారు. ప్రతిష్టకు భంగం వాటిల్లిందనుకున్నప్పుడు నిబంధనల ప్రకార ం పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకూడదని, సంబంధిత మేజిస్ట్రేట్ ముందు ఫిర్యాదు దాఖలు చేయాలని తెలి పారు. సాక్షి కథనాల వల్ల ప్రభుత్వ ప్రతిష్టకు భంగం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు. ఈ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఇది అధికార దుర్వినియోగమే..: ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ఓ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. ఐపీసీ 153 కింద ఎలా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఆ కథనాలు వర్గపోరును ఎలా ప్రోత్సహిస్తున్నాయని నిలదీశారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలు మీడియాపై పరువు నష్టం కేసులు ఎలా దాఖలు చేస్తాయన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఓ రాష్ట్ర ప్రభుత్వం విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించిన విషయం గుర్తులేదా? అంటూ నిలదీశారు. పరువుకు, ప్రతిష్టకు భంగం కలిగిందని భావిస్తే, దానిపై ఫిర్యాదుకు ఓ నిర్దిష్ట విధానం ఉందని చెప్పారు. మేజిస్ట్రేట్ ముందు దాఖలు చేయాల్సిన ఫిర్యాదును ఎమ్మెల్యే పోలీసులకు చేశారని, వారూ చట్టం నిర్దేశించిన విధానాన్ని పట్టించుకోకుండా కేసు నమోదు చేశారని వ్యాఖ్యానించారు. పోలీసులు పరువు నష్టం కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఇది అధికార దుర్వినియోగం కిందకు రాదా? అనినిలదీశారు. అసలు ఈ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు చేసేందుకు ఏముందని ప్రశ్నిస్తూ.. కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
'నయీం అనుచరులతో ప్రాణభయం'
కరీంనగర్: గ్యాంగ్స్టర్ నయీం అనుచరులతో తమకు ప్రాణభయం ఉందని నయీం బాధితులు ఆరోపించారు. కరీంనగర్లో నయీం బాధితులు బుధవారం మీడియాను ఆశ్రయించారు. ఈ సందర్భంగా బాధితులు వీరలక్ష్మీ, కాంతారావు, రియల్టర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ...14 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దర్ని మాత్రమే అరెస్ట్ చేశారన్నారు. నగునూరు భూ ఆక్రమణలో నయీం, అతని అనుచరులు ఉన్నారని చెప్పారు. భూ ఆక్రమణలతో ప్రమేయమున్న అందరినీ అరెస్ట్ చేయాలని నయీం బాధితులు డిమాండ్ చేశారు. -
ప్లాట్లుగా కొండ పోరంబోకు
సెంటు రూ.3 లక్షల చొప్పున విక్రయం సీఆర్డీఏ అధికారుల అండపై అనుమానం ఓ తెలుగుదేశం పార్టీ నేత నిర్వాకం పట్టించుకోని ప్రభుత్వ శాఖలు ►ప్లాట్లుగా కొండ పోరంబోకు మంగళగిరి : మండలంలోని ఎర్రబాలెం గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి ఒకరు పెనుమాక-ఎర్రబాలెం మధ్యలో కొండను ఆనుకుని మూడు ఎకరాల్లో అనధికార లేఅవుట్ వేసి విక్రయించారు. నాలుగు నుంచి ఐదు సెంట్లను ప్లాట్లుగా విభజించి ఒక్కో సెంటు రూ.3 నుంచి 3.50 లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఆ ప్లాట్లు గ్రామకంఠంలోకి రావని తెలిసి స్థానికులు ఎవరూ కొనుగోలు చేయకపోయినా తనకున్న పరిచయాలతో హైదరాబాద్కు చెందిన వారిని మధ్యవర్తులుగా నియమించి భారీగా కమీషన్లు అందజేసి విక్రయించారు. ఈ వ్యవహారంలో సీఆర్డీఏకు చెందిన కొందరు అధికారులు కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలొచ్చాయి. వారి అండదండలతోనే అక్రమార్కులు కొండపోరంబోకు భూమిని ఆక్రమించి యథేచ్ఛగా ప్లాట్లు వేశారని పలువురు అంటున్నారు. తమ అనుమతి లేనిదే అంగుళం స్థలం కూడా అమ్మటానికి లేదని చెప్పిన సీఆర్డీఏ అధికారులు... ఏకంగా కొండ పోరంబోకు భూమినే విక్రయిస్తే కళ్లు మూసుకొని చూస్తున్నారా...అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మంత్రి అండతోనే.... రాష్ట్ర మంత్రి, సీఆర్డీఏ వైస్చైర్మన్ తనకు అత్యంత సన్నిహితులని ప్లాట్లు అన్నింటినీ గ్రామ కంఠంలో చేర్చి మినహాయిస్తామని హామీ ఇవ్వడంతోనే కొందరు స్థలాలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అనధికార లేఅవుట్లు వేసి ప్లాట్లను విక్రయిస్తున్నా సీఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఎర్రబాలెం కొండకు అటవీశాఖ ఏర్పాటు చేసిన రక్షణగోడను ఆనుకుని ప్లాట్లు వేశారు. రక్షణ గోడ నుంచి అటవీశాఖ వదిలిన 50 అడుగుల భూమిని కలుపుకుని లేఅవుట్కు రోడ్గా ఏర్పాటు చేసినా అటు అటవీశాఖ గానీ ఇటు సీఆర్డీఏ, మరో వైపు రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఆర్డీఏ పరిధిలో అక్రమ నిర్మాణాలతో పాటు ఒక్క అంగుళం భూమి ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న అధికారులకు అధికారపార్టీ నేతలు వేసిన అనధికారలేఅవట్ కనిపించడకపోవడం విశేషం. అనధికార లేఅవుట్, అటవీభూముల ఆక్రమణలపై సీఆర్డీఏ అధికారులతో పాటు రెవెన్యూ, అటవీశాఖ అధికారులను వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని తెలిపారు. -
అమ్మకానికి ఉదయగిరి
⇒ సూత్రధారులు రెవెన్యూ అధికారులు ⇒ పాత్రధారులు తెలుగు తమ్ముళ్లు ⇒ యథేచ్ఛగా ఇళ్ల స్థలాల ఆక్రమణ ఉదయగిరి: ఉదయగిరిలో యథేచ్ఛగా భూఆక్రమణలు, దందాలు సాగుతున్నాయి. దీనికి కొందరు రెవెన్యూ అధికారులు సూత్రధారులు కాగా తెలుగుతమ్ముళ్లు పాత్రధారులుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు రెవెన్యూ అధికారుల సహకారంతో అక్కడ కొందరు తెలుగుతమ్ముళ్లు పాగా వేసి ప్లాట్లు వేసి అమ్మకాలు సాగిస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. దీంతో పేదలకు జానెడు స్థలం దొరకని దుస్థితి నెలకుంది. ఇంటి స్థలాల కోసం రెవెన్యూ అధికారులు చుట్టూ పేదలు తిరుగుతున్నా ఎలాంటి ఫలితం కానరావడం లేదు. సీఎంగా కిరణ్ ఉన్నప్పుడు సాగిస్తున్న ఈ దందా చంద్రబాబు వచ్చేసరికి తారాస్థాయికి చేరింది. తమకు అండగా నిలుస్తున్న అధికారులకు అక్రమార్కులు భారీగా ముడుపులు ముట్టచెబుతున్నారనే ప్రచారం బలంగా ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కాకమునుపు ఉదయగిరిలో ప్రభుత్వ భూములకు పెద్దగా విలువ లేదు. కనీసం ఇల్లు కట్టుకునేందుకు కూడా ఆసక్తి చూపేవారు కాదు. ఉదయగిరి దుర్గాన్ని రాజులు ఏలిన ప్రాంతం కావడంతో ఇక్కడ ఇళ్ల స్థలాలకు పట్టాలు లేవు. కొందరు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్నారు. చాలా వరకు ప్రభుత్వ స్థలాలు అట్లే ఉండిపోయాయి. గత ఆరేడేళ్ల నుంచి ఉదయగిరి పట్టణం క్రమంగా అభివృద్ధి పథంలో పయనించడంతో చుట్టుపక్కల గ్రామీణులు ఇక్కడే ఇళ్లు కట్టుకోవడం ప్రారంభించారు. దీంతో ఇళ్ల స్థలాలకు డిమాండ్ ఏర్పడి ధరలు పెరిగాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు రాజకీయ అండదండలతో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని ప్లాట్లగా విభజించి అమ్మడం ప్రారంభించారు. గతంలో తహశీల్దారుగా పనిచేసిన నారాయణమ్మ ఆక్రమిత స్థలాలను గుర్తించి ప్రభుత్వ స్వాధీనం చేసింది. రెండేళ్లుగా ఇక్కడికి వచ్చిన కొంతమంది తహశీల్దార్లు ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టారు. పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకొని రికార్డులు తారు మారు చేస్తూ ఆక్రమణదారులకు సహాయ సహకారాలు అందిస్తున్నారనే విమర్శలున్నాయి. ఉదయగిరిలోని బీసీ కాలనీ సమీపంలో సర్వే నం.37లో అధికార పార్టీకి చెందిన ఓ నేత బంధువు వారం కొంత స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నంలో భాగంగా చదును చేశాడు. దీనికి గిరాకీ అధికంగా ఉండటంతో కొంతమంది తహశీల్దారుకు ఫిర్యాదు చేశారు. తహశీల్దారు నామమాత్రంగా స్థల పరిశీలన చేసి మిన్నకుండిపోయారు. అలాగే షబ్బీర్ కాలనీ ప్రాంతంలో ఇటీవల లేఔట్లు వేసిన కొంతమంది నేతలు పక్కనే ఉన్న శ్మశానాన్ని ఆక్రమించి ప్లాట్లు వేసుకునేందుకు కొంత చదును చేశారు. స్థానికులు అభ్యంతరం తెలపడంతో ప్రస్తుతానికి నిలిపివేశారు. ఉదయగిరి-కావలి రోడ్డు మార్గంలో సుమారు రూ.50 లక్షల విలువచేసే ఇళ్ల స్థలాలను కొంతమంది నేతలు ఆక్రమించి అమ్మేశారు. మరికొంత స్థలాన్ని కూడా ఆక్రమించేందుకు పావులు కదుపుతున్నారు. టూరిజం బంగ్లా సమీపంలో గతంలో ఇచ్చిన ప్లాట్లను జాయింట్ కలెక్టర్ సౌరభ్గౌర్ రద్దుచేసి దానిని టూరిజం కోసం ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా కొంతమంది అధికార పార్టీ నేతలు ఆ స్థలాన్ని ఖాళీ చేయకుండా వివిధ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. ఎక్కువ ఖరీదు చేసే ఈ స్థలాలు కూడా అమ్మకాలు జరిగాయి. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైంది. ఇక్కడ దర్జాగా ఇళ్లు వెలిశాయి. ఇక్కడే ఉన్న మరికొంత ప్రభుత్వ స్థలాలను అధికార నేతలకు కట్టబెట్టేందుకు రెవెన్యూ అధికారులు అవగాహనకు వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులకు పెద్దమొత్తంలో చేతులు మారినట్టు విమర్శలున్నాయి. అలాగే మోడల్కాలనీ పేరుతో గతంలో ఉదయగిరికి చెందిన కొంతమంది పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయగా, ఇళ్లు కట్టుకోలేదన్న ఉద్దేశంతో రెవెన్యూ అధికారులు వాటిని రద్దుచేశారు. ఈ స్థలంలో కొంతమేర కొందరు ఆక్రమించుకొని ఫెన్సింగ్ వేసుకున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదు. ఈ విధంగా ఉదయగిరి పట్టణంలోని ఇళ్ల మధ్య ప్రభుత్వ స్థలాలు యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతూనే ఉన్నాయి. ఈ వ్యవహారంపై అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు వస్తున్నాయనే ప్రచారం కూడా సాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికావడంపై పట్టణవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి ఆక్రమణ స్థలాలపై సమగ్ర విచారణ జరిపితే కోట్లు విలువైన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణదారుల నుంచి విముక్తి అవుతాయని పట్టణవాసులు ఆశిస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
దిగ్విజయ్ సింగ్ భావోద్వేగ లేఖలో ఏముంది?
KKR vs LSG: విజయం ఎవరిని వరిస్తుంది?
CSK vs PBKS: గెలుపు ఎవరిదో?
Children's Inspirational Story: 'యుద్ధకాంక్ష'! పూర్వం సింహపురిని..
సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement