-
భూముల డిజిటల్ సర్వేకు ప్రత్యేక నెట్వర్క్
భూ సమస్యలకు పరిష్కారం.. రెవెన్యూ శాఖ ప్రతిపాదించిన విధంగా ప్రత్యేక నెట్ వర్క్ ఏర్పాటు చేసి భూమి పార్శిళ్ల విస్తీర్ణాన్ని నిర్ధారిస్తే చాలా వరకు భూముల సర్వేకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కావడంతోపాటు నిజాం కాలం నాటి రికార్డుల సవరణ కూడా చేయాల్సి ఉంటుంది. పక్కాగా వివరాలు.. ఇలా చేస్తే సర్వే నంబర్ల వారీగా సబ్ డివిజన్ల పరిధిలోని భూముల విస్తీర్ణం నిర్ధారణ అవుతుంది. ఏ సర్వే నంబర్లో ఎంత భూమి ఉందో తేలి పోనుంది. దీని ఆధారంగానే కొత్త రికార్డులు తయారు చేయాల్సి ఉంటుంది. అంటే భూములకు టైటిల్ గ్యారంటీ ఇవ్వడమే. చిక్కుముళ్లూ ఉన్నాయి.. ఒకవేళ ప్రభుత్వం ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు ద్వారా భూముల విస్తీర్ణాన్ని తేలిస్తే క్షేత్రస్థాయిలో సమస్యలు వస్తాయి. తన పాస్ పుస్తకంలో ఉన్న వివరాల మేరకు గుంట భూమి తగ్గినా రైతు అంగీ కరించడు. పెరిగిన విస్తీర్ణం మేరకు జరి గేందుకు సరిహద్దు రైతులు ఒప్పుకోరు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూవివాదాల సమస్యకు శాశ్వతంగా తెరదించడంతోపాటు భూ రికార్డుల తారుమారుకు వీల్లేని విధంగా భూముల డిజిటల్ సర్వే చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఇందులో భాగంగా భూముల హద్దులే కాకుండా వాటి విస్తీర్ణాన్నీ ఖరారు చేయాలనే యోచనతో ముందుకెళ్తోంది. ఇందుకోసం రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక కసరత్తు చేస్తోంది. డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) విధానంలో కేవలం భూముల హద్దులు (బౌండరీలు) మాత్రమే నిర్ధారించగలమని, ఆయా భూముల విస్తీర్ణం తేల్చలేమని భావిస్తున్న రెవెన్యూ శాఖ... ఇందుకోసం ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. విజువల్ రిఫరెన్స్ స్టేషన్స్ (వీఆర్ఎస్)–గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) పరిజ్ఞానాలను ఉపయోగించి రూపొందించే ఈ నెట్వర్క్తో గ్రౌండ్ కంట్రోల్ పాయింట్ల (జీసీపీ)ను అనుసంధానించాల్సి ఉంటుందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇందుకోసం డ్రోన్లను ఉపయోగించి తీసిన భూముల చిత్రాలను వాడాలని నివేదికలో పేర్కొంది. ప్రస్తుత విధానంలో సాధ్యం కాదు... డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) విధానంలో ప్రస్తుతమున్న భూమి హద్దులను అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా గుర్తించగలమని రెవెన్యూ (సర్వే) శాఖ అంటోంది. వాటి ఆధారంగా భూముల విస్తీర్ణం తేల్చడం సాధ్యం కాదని, ఇందుకోసం 2డీ సాంకేతిక పరిజ్ఞానంతో అక్షాంశ, రేఖాంశాల ఉపరితల కొలతలను లెక్కకట్టాల్సి ఉంటుందని చెబుతోంది. ఇలా లెక్క కట్టేందుకు అనుభవం, నైపుణ్యంగల సర్వేయర్లు పెద్ద సంఖ్యలో అవసరం అవుతారని, అంత మంది సర్వేయర్లను సమకూర్చుకోవడం సాధ్యం కాదని తేల్చింది. ఒకవేళ అలా లెక్కకట్టినా నిజాం కాలంలో తయారైన రికార్డుల్లో ఉన్న భూ విస్తీర్ణం కంటే ఈ కొలతల ద్వారా తేల్చే విస్తీర్ణం తక్కువ వస్తుందని అంచనా వేస్తోంది. అప్పుడు రికార్డులన్నింటినీ సవరించాల్సి ఉంటుందని, ఇందుకు చాలా ఖర్చు అవడంతోపాటు సమయం వృథా అవుతుందని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వివరించింది. తరుణోపాయం ఏమిటి? ఈ నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై తర్జనభర్జనలు పడిన రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక సాఫ్ట్వేర్ను ఉపయోగించి 3డీ డిజిటల్ టెర్రయిన్ మోడల్ను తయారు చేసింది. ఈ పద్ధతిలో ఉపయోగపడేలా 10 సెంటీమీటర్ల ప్రాదేశిక స్పష్టత వచ్చే విధంగా డ్రోన్ల ద్వారా భూముల చిత్రాలను సేకరించింది. ఈ చిత్రాలను వర్చువల్ గ్రౌండ్ పాయింట్లుగా పరిగణనలోకి తీసుకోనుంది. ఈ చిత్రాల జియో రిఫరెన్స్ ద్వారా భూముల సరిహద్దు పాయింట్లను 5 సెంటీమీటర్లకు అటుఇటుగా నిర్ధారించనుంది. ప్రతి గ్రామంలోని భూముల విస్తీర్ణ హద్దులు చెరిగిపోకుండా ట్రై, బై జంక్షన్లను తయారు చేసి వాటిని జీసీపీలుగా, రెఫరెన్స్ స్టేషన్లుగా ఉపయోగించుకోనుంది. ఇప్పటికే డిజిటల్ సర్వే కోసం ఎంపిక చేసిన పైలట్ గ్రామాల్లో ఈ విధానం ద్వారా గ్రౌండ్ కంట్రోల్ పాయింట్ల (జీసీపీ) కోఆర్డినేట్లను నిర్ధారించింది. ఇప్పుడు ఈ జీసీపీలను ప్రత్యేక నెట్వర్క్తో అనుసంధానించడం ద్వారా హద్దుల అక్షాంశ, రేఖాంశాలను గుర్తించడమే కాక భూ విస్తీర్ణం లెక్కలను కూడా తేల్చనుంది. -
ఏసీబీ వలలో ‘టీబీ’ చేప
ఏలూరు సిటీ, న్యూస్లైన్ : అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం నాడు ఓ లంచగొండి అధికారి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈనెల 4న ల్యాండ్ సర్వే రికార్డ్స్ ఏడీ లలిత్కుమార్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడగా, వారం రోజులు తిరక్కుండానే జిల్లా క్షయ నియంత్రణ శాఖ అధికారి ఆర్.సుధీర్బాబు ఏసీబీ వలలో చిక్కారు. అదే శాఖలో పనిచేస్తున్న సూపర్వైజర్ను బదిలీ చేసినందుకు నజరానాగా రూ.40 వేలు అడిగిన సదరు అధికారి.. జీపీఎఫ్ నుంచి రుణం తీసుకుని మరీ ఆ మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే... పెరవలి మండలం కానూరు పీహెచ్సీ సబ్ సెంటర్లో మూడేళ్లుగా వక్కలంక వెంకట సూర్య త్రినాథకృష్ణారావు సీనియర్ టీబీ ట్రీట్మెంట్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. తణుకు, జంగారెడ్డిగూడెంలో టీబీ ట్రీట్మెంట్ యూనిట్లను కొత్తగా ఏర్పాటు చేశారు. కానూరులో పనిచేస్తున్న కృష్ణారావును తణుకులోని ట్రీట్మెంట్ యూనిట్కు నవంబర్ 6న బదిలీ చేశారు. ఆయన నవంబర్ 7న విధుల్లో చేరారు. 9వ తేదీన తణుకు యూనిట్కు వెళ్లిన జిల్లా క్షయ నియంత్రణ అధికారి ఆర్.సుధీర్బాబు అతన్ని బదిలీ చేసినందుకు నజరానాగా రూ.40వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పోస్టు కోసం చాలామంది వేచి చూస్తున్నారని, దీనికి మంచి డిమాండ్ ఉందని చెప్పాడు. ‘డబ్బులిస్తేనే ఇక్కడ పనిచేస్తావ్.. లేదంటే కానూరు పంపించేస్తా’నంటూ సుధీర్బాబు బెదిరించారు. తన వద్ద అంత సొమ్ము లేదని, కొంత తగ్గిస్తే ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తానని కృష్ణారావు చెప్పారు. చివరకు రూ.35 వేలకు బేరం కుదిరింది. తొలుత రూ.20 వేలు ఇవ్వాలని, అనంతరం జీపీఎఫ్ రుణం నుంచి కొంత డబ్బు ఇవ్వాలని కోరారు. దీంతో కృష్ణారావు సోమవారం ఉదయం ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు రంగంలోకి దిగారు. కృష్ణారావుకు సొమ్ములు ఇచ్చి జిల్లా క్షయ నివారణ కార్యాల యానికి పంపించారు. సుధీర్బాబు అక్కడ లేకపోవడంతో స్థానిక ఇజ్రారుుల్పేటలోని ఆయన నివాసానికి పంపించారు. ఇంటివద్ద ఉన్న సుధీర్బాబు రూ.20వేలు తీసుకుం టుండగా, అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు సొమ్ముతో సహా సుధీర్బాబును పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో సీఐ యు.విల్సన్, సిబ్బంది పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement