-
దళితులు ధనికులు కావాలె.. ఏ పార్టీ వాళ్లయినా దళితబంధు ఇద్దాం
సిరిసిల్ల: సమాజంలో అణచివేతకు గురై, అట్టడుగున ఉన్న దళితులను ధనికులను చేసే లక్ష్యంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం రాష్ట్ర ఎస్సీ, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి పోడుభూములకు పట్టాలు, ఎస్సీ చిరువ్యాపారులకు ఆర్థిక సాయం అందించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దళితబంధులో తొలి విడతలో ప్రతి నియోజ కవర్గానికి 100 కుటుంబాలకు అందించామని, విప్లవాత్మక మార్పులు వచ్చాయని అన్నారు. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 1100 యూనిట్లు అందిస్తామని తెలిపారు. ఏ పార్టీ వారైనా అందరికీ దళితబంధు ఇస్తామన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ధనికులు ఏ నీళ్లు తాగుతారో.. వీర్నపల్లి తండాలోనూ అవే నీళ్లు తాగేలా ఇంటి ముందు నల్లా పెట్టి నీళ్లు అందిస్తున్నామన్నారు. కొమురం భీమ్ స్ఫూర్తితో జల్, జమీన్, జంగల్ నినాదాలతో నీళ్లు సాధించి, పోడుభూములకు పట్టాలిచ్చి, కొత్తగా 5 లక్షల ఎకరాల్లో 8 శాతం పచ్చదనాన్ని పెంచామన్నారు. 70 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం 9 ఏళ్లలో చేసి చూపించామని, తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ వివరించారు. రైతులకు బీమా చేయిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే అన్నారు. సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికి మోడల్గా మారిందని రాష్ట్ర ఎస్సీ, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. వ్యవసాయ కాలేజీకి బాబూ జగ్జీవన్రామ్ పేరు తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వ్యవసాయ కళాశాలకు బాబూ జగ్జీవన్రామ్ కళాశాలగా నామకరణం చేశారు. ఆయన వర్ధంతి సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన జగ్జీవన్రామ్ విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు. 128 మంది ఎస్సీ చిరువ్యాపారులకు రూ.62 లక్షల మేరకు ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు. జిల్లాలో 1,614 మంది గిరిజనులకు 2,558.34 ఎకరాల పోడు భూములకు పట్టాలను అందించారు. జెడ్పీ చైర్పర్సన్ అరుణ, వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబు, కలెక్టర్ అనురాగ్ జయంతి, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
జమునా హేచరీస్ భూములు బాధిత రైతులకు పంపిణీ
మెదక్ జోన్/ వెల్దుర్తి: మెదక్ జిల్లా మాసాయిపేట, చిన్నశంకరంపేట మండలాల్లోని వివాదాస్పద అసైన్డ్ భూములను అధికారులు బుధవారం బాధిత రైతులకు అప్పగించారు. తమ భూములను కాజేశారంటూ ఆయా మండలాల్లోని అచ్చంపేట, హకీంపేట, దరిపల్లి గ్రామాల రైతులు ప్రస్తుత బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (జమునా హేచరీస్)పై గతేడాది ఏప్రిల్లో సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వ ఆదేశంతో సర్వే చేయించిన కలెక్టర్ హరీశ్ 66 ఎకరాల అసైన్డ్ భూములు కబ్జాకు గురై నట్లుగా ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించారు. దీనిపై జమునా హేచరీస్ కోర్టును ఆశ్రయిం చగా, 2021 నవంబర్లో మరో సర్వే చేశారు. 85 ఎకరాల 19 గుంటల భూమి కబ్జాకు గురైనట్టు గుర్తించి నివేదిక అందించారు. దీంతో ఈ భూమిని తిరిగి బాధితులకు అప్పగించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ప్రత్యేక జీఓ విడుదల చేసింది. దీంతో బుధవారం రెవెన్యూ అధికారులు మూడు సర్వే బృందాలను ఏర్పాటు చేసి బాధిత రైతులకు ఆయా సర్వే నంబర్లలో డివిజన్ల వారీగా హద్దులు చూపెట్టారు. ఈ ప్రక్రియ పరిశీలించడానికి వచ్చిన మెదక్ ఎంపీ ప్రభాకర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి బాధిత లబ్ధిదారులకు ఆ మేరకు పట్టా సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. మాసాయిపేట మండ లం అచ్చంపేట శివారులోని 77, 78, 79, 80, 81, 82 సర్వే నంబర్లలో 62 మంది బాధితులకు 84 ఎకరాల 19 గుంటలు, హకీంపేట శివారులో సర్వే నంబరు 97లో ముగ్గురు రైతులకు ఎకరం భూమికి సంబంధించి పట్టాలు అందజేశారు. పట్టాలు సరే.. నిర్మాణాల సంగతేంటి? ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టాలతో రైతులు హర్షం వ్యక్తం చేయగా, కొందరు మాత్రం అయోమయంలో ఉన్నారు. వారికి చూపించిన హద్దుల్లో హేచరీస్కు చెందిన శాశ్వత కట్టడాలు ఉండటంతో వాటిని ఎవరు..ఎప్పుడు తొలగిస్తారు అందులో తామెలా వ్యవసాయం చేసుకునేదని పలువురు వాపోతున్నారు. ఇదిలా ఉండగా..పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు అడ్డుకుం టారేమోనని తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి ఆధ్వ ర్యంలో పోలీసులు జమునా హేచరీస్ ముందు మోహరించారు. ఎవరైనా ఆందోళనలు చేస్తే అరెస్టు లు చేసి అక్కడి నుంచి తరలించేందుకు వీలుగా ప్రైవేట్ బస్సులు, డీసీఎంలను ఏర్పాటు చేశారు. -
మైనార్టీల భూములపైనా లింగమనేని పంజా
మంగళగిరి: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఐజేఎం సంస్థ పేరుతో ప్రాచుర్యం పొందిన లింగమనేని రమేష్ చివరకు మైనార్టీల భూములనూ వదల్లేదు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ, చినకాకాని, నిడమర్రు గ్రామాల్లో ఐజేఎం లింగమనేని రియల్ ఎస్టేట్ పేరుతో అపార్ట్మెంట్లు, విల్లాలతో పాటు సుమారు 1,200 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. వాటిలో వందలాది ఎకరాల ప్రైవేటు భూములతో పాటు ప్రభుత్వ పోరంబోకు భూములు కూడా ఉన్నట్టు ఆరోపణలున్నాయి. తాజాగా పీర్ల మాన్యం భూములను లింగమనేని రమేష్ సతీమణి సుమన పేరిట ఉండటాన్ని గుర్తించిన అధికారులు నోటీసులు జారీ చేశారు. కాజ గ్రామంలో రైల్వే గేటుకు అవతల, ఇవతల పీర్ల మాన్యం పేరుతో ఇనాం భూములు 11.25 ఎకరాలు ఉన్నాయి. పూర్వం దాతలు పీర్ల మాన్యం కింద అందజేసిన భూములను కౌలుకు ఇచ్చి.. వాటిపై వచ్చే ఆదాయంతో ముస్లింలు పీర్ల పండుగలను జరుపుకుంటారు. గ్రామంలో సర్వే నంబర్ 287/5లోని 2.06 ఎకరాలు లింగమనేని సుమన పేరున ఉన్నాయి. 287/1ఏ2, 287/1ఏ2ఏ, 287/1ఏ2బీ, 287/1ఏ2సీ, 287/1ఏ2డీ, 287/1బీ సర్వే నంబర్లలో మరో 9.19 పీర్ల మాన్యం భూములు ఉన్నాయి. అవన్నీ శ్యామల మల్లికార్జునరెడ్డి, సింహాద్రి నాగేశ్వరమ్మ, సింహాద్రి ప్రసాద్రెడ్డి, మెట్టు వెంకట కాశీ విశ్వనాథం, శ్యామల విజయలక్ష్మి, శ్యామల శ్రీనివాస్రెడ్డి, సింహాద్రి సామ్రాజ్యం, సింహాద్రి ప్రసాద్రెడ్డి, సింహాద్రి వెంకటరామారెడ్డి ఆ«దీనంలోకి మళ్లాయి. సదరు భూములను పీర్ల మాన్యం కౌలుకు మాత్రమే ఇచ్చి అనుభవించాల్సి ఉండగా భూములకు పట్టాలు, పాస్ పుస్తకాలు పుట్టించి విక్రయాలు జరిపారు. దానికి అప్పటి పీర్ల మేనేజర్ లావాదేవీలు నిర్వహించడం విశేషం. ఎకరం రూ.3 కోట్లకు పైగా పలుకుతోంది. 2013 రెవెన్యూ చట్టం ప్రకారం భూములకు పట్టాలు ఉన్నా, పాస్ పుస్తకాలు ఉన్నా చెల్లవని, తిరిగి వక్ఫ్ బోర్డు స్వాదీనం చేసుకోవచ్చని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై తహసీల్దార్ జీవీ రాంప్రసాద్ వివరణ కోరగా.. ఆర్ఎస్ఆర్ ప్రకారం పీర్ల మాన్యం భూములు 11 ఎకరాలను గుర్తించి ఆ భూముల్లో ఉన్న యజమానులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. నోటీసులు అందుకున్న వారు తమకు అనుకూలంగా కోర్టు తీర్పు ఉందని చెబుతున్నారన్నారు. కోర్టు తీర్పు ఉన్నా చట్ట ప్రకారం పీర్ల మాన్యం భూములు (ఇనాం భూములు) వక్ఫ్ బోర్డుకు చెందుతాయన్నారు. నోటీసులు జారీ చేసి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని, విచారణ అనంతరం నిర్ణయం తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. -
ఉత్సాహంగా పట్టాల పంపిణీ
సాక్షి నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇంటిస్థలం పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాల పంపిణీ కొనసాగుతోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇల్లు’ పథకం కింద 15వ రోజు శుక్రవారం కూడా వీటి పంపిణీ ఉత్సాహంగా సాగింది. ఆయా లే అవుట్ల వద్ద వేలాదిమంది ప్రజలతో కోలాహలం నెలకొంది. స్థలం వచ్చినవాళ్లు, ఇళ్లు మంజూరైనవాళ్లు, టిడ్కో ఇళ్లు వచ్చినవాళ్లు పట్టాలు, పత్రాలు తీసుకుని ఉత్సాహంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పడం కనిపించింది. తూర్పుగోదావరి జిల్లాలో 41,913 మందికి పట్టాలు, పత్రాలు అందజేశారు. కాపు కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ పాల్గొన్నారు. విశాఖలో 16,475 మందికి పట్టాలు అందజేశారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు విజయసాయిరెడ్డి, సత్యవతి, ఎమ్మెల్యే కన్నబాబు పాల్గొన్నారు. కృష్ణాజిల్లాలో 7,630 ఇళ్లపట్టాలను పేదలకు అందజేశారు. మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎమ్మెల్యేలు రక్షణనిధి, కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో 4,246 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో 3,639 మందికి పట్టాలు అందజేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 3,383 మందికి ఇంటి స్థలం పట్టాలు, 469 మందికి టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 2,900 మందికి పట్టాలు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లాలో 2,805 మందికి పట్టాలిచ్చారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లాలో 2,133 మందికి పట్టాలు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లాలో 1,236 పట్టాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యేలు తొగురు ఆర్థర్, డాక్టర్ జె.సుధాకర్ పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో 956 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలం పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేశారు. -
స్థలం మాది.. ఇల్లు మాది.. జగనన్న వరం ఇది..
సాక్షి నెట్వర్క్: బెలూన్లు ఎగురవేసేవారు.. మిఠాయిలు పంచేవారు.. పరస్పరం అభినందించుకునేవారు.. పట్టాలను పైకి చూపిస్తూ చేతులు జోడించేవారు.. జై జగన్ అంటూ ప్లకార్డులు పట్టుకున్నవారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోలు పట్టుకుని కృతజ్ఞతగా చూస్తున్నవారు.. వైఎస్సార్ జగనన్ననగర్ పేరుతో వేసిన ముగ్గులు.. ఎటు చూసినా కోలాహలమే. పండుగ వాతావరణమే. కొత్తబట్టలు ధరించి సంబరంగా స్థలాలు చూసుకుంటూ ‘ఈ స్థలం మాది..’ అనుకుంటూ భావోద్వేగంతో చెమ్మగిల్లిన కళ్లతో కనిపించినవారు లెక్కలేనంతమంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పథకంలో జరుగుతున్న పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం 12వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కనిపించిన దృశ్యాలివి. అన్ని జిల్లాల్లోను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ఇంటిస్థల పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. పట్టాల పంపిణీ జరిగిన గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. అందరూ తమ ఇంట్లో శుభకార్యం అన్నట్లుగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎవరెవరికి స్థలాలు వచ్చాయి, ఇళ్లు ఎంతమందికి మంజూరయ్యాయి.. అంటూ చర్చించుకోవడం కనిపించింది. భార్యాభర్తలు, పిల్లలతో కలిసి తమ స్థలం వద్ద ఫొటోలు తీసుకుంటూ ఆనందంగా కనిపించారు. కొందరు తమ స్థలాల్లో శంకుస్థాపన చేశారు. విజయనగరం జిల్లాలో 43,937 స్థలం పట్టాలు, ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. విశాఖ జిల్లాలో 39,203 మందికి పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేశారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, అన్నంరెడ్డి అదీప్రాజ్, గుడివాడ అమర్నాథ్, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, పెట్ల ఉమాశంకర్గణేష్, యూవీ రమణమూర్తిరాజు, శెట్టి ఫాల్గుణ, వాసుపల్లి గణేష్కుమార్, తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. కృష్ణాజిల్లాలో 35,124 పట్టాలు పంపిణీ చేశారు. మంత్రులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 22,968 పట్టాలు పంపిణీ చేశారు. మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్, ఎంపీ వంగా గీతా, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లాలో 11,743 మందికి, కర్నూలు జిల్లాలో 8,831 మందికి పట్టాలు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 8,649 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని, మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో 7,881 పట్టాలు అందజేశారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి హాజరయ్యారు. గుంటూరు జిల్లాలో 7,787 మందికి పట్టాలు పంపిణీ చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 4,762 స్థలపట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేశారు. మంత్రులు అనిల్కుమార్యాదవ్, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో 4,417 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో 3,776, శ్రీకాకుళం జిల్లాలో 3,357 మందికి పట్టాలు, ఇళ్ల పత్రాలు అందజేశారు. సీఎంకు రుణపడి ఉంటాను నేను దివ్యాంగుడిని. తల్లిదండ్రులు మృతి చెందడంతో పిన్నమ్మ ఇంట్లో ఉంటున్నా. సొంతిల్లు లేదు. తల్లిదండ్రులు ఉన్న సమయంలోనూ అద్దె ఇంట్లోనే ఉండేవాళ్లం. గతంలో పలుసార్లు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వలంటీర్ మా ఇంటికి వచ్చి స్థలం కోసం దరఖాస్తు చేయించాడు. ప్రస్తుతం ఇంటి పట్టా మంజూరు అయ్యింది. ఎట్టకేలకు సొంతింటి కల నెరవేరుతోంది. జగనన్నకు రుణపడి ఉంటాను. – మహేశ్వరరెడ్డి, తుమ్మలపెంట, కొలిమిగుండ్ల మండలం, కర్నూలు జిల్లా ఐదేళ్ల కల తీరింది మా ఇద్దరిదీ నక్కలదిన్నె గ్రామమే. ఐదేళ్ల కిందట పెళ్లయింది. మేం ఇద్దరు పిల్లలతో పూరి గుడిసెలో నివాసం ఉంటున్నాం. ఇంటి స్థలం కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మాకు ఇంటి స్థలంతోపాటు ఇల్లు కూడా మంజూరైంది. ఐదేళ్ల సొంతింటి కల నెరవేరుతోంది. స్థలం, ఇల్లు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – చిరంజీవి, నవీన దంపతులు, నక్కలదిన్నె, చాపాడు మండలం, వైఎస్సార్ జిల్లా
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటు హక్కును వినియోగించుకోవాలి
14న భద్రకాళికి నాయీబ్రాహ్మణుల సేవలు
పట్టభద్రుల ఎమ్మెల్సీ సందడి
పటిష్ట ఏర్పాట్ల మధ్య ఈవీఎంల కమిషనింగ్
ఫ్లయింగ్ స్క్వాడ్ అప్రమత్తంగా ఉండాలి
No Headline
నీటి ఎద్దడి రాకుండా పక్కా ప్రణాళిక
ఉన్నత స్థాయికి ఎదగాలి
ఆయిల్పాం రైతులు జాగ్రత్తలు పాటించాలి
4వేల బస్తాల జొన్నల కొనుగోలు
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement