-
నీలం స్థానంలో కాట..
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగుస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల చివరి, నాలుగో జాబితాను గురువారం రాత్రి ప్రకటించింది. మిగిలిన నాలుగు స్థానాలకు కొత్తగా అభ్యర్థులను ప్రకటించడంతోపాటు అదనంగా పటాన్చెరు అభ్యర్థిని మార్చింది. ఈ స్థానంపై తలెత్తిన పంచాయితీని పరిష్కరించింది. ముందుగా ప్రకటించిన నీలం మధు ముదిరాజ్ స్థానంలో పాతకాపు కాట శ్రీనివాస్గౌడ్ వైపే అధిష్టానం మొగ్గుచూపింది. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న నీలం మధు ముదిరాజ్కు మూడో జాబితాలో పటాన్చెరు టికెట్ కేటాయించినప్పటికీ బీఫామ్ ఇవ్వని అధిష్టానం.. తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అనుచరుడైన శ్రీనివాస్గౌడ్కు టికెట్ కేటాయించింది. దీంతో దామోదర పట్టుబట్టి తన పంతం నెగ్గించుకున్నట్లయింది. అలాగే సూర్యాపేట స్థానం నుంచి రాంరెడ్డి దామోదర్రెడ్డి, పటేల్ రమేశ్రెడ్డి మధ్య పెద్ద ఎత్తున పోటీ నెలకొనగా అధిష్టానం మాత్రం దామోదర్రెడ్డినే అభ్యర్థిగా ఎంపిక చేసింది. మరోవైపు తుంగతుర్తి అభ్యర్థిగా అనూహ్యంగా గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల శామ్యూల్ టికెట్ దక్కించుకున్నారు. మాదిగ, మాల కుల సమీకరణల్లో భాగంగానే అధిష్టానం శామ్యూల్ను ఎంపిక చేసిందనే చర్చ జరుగుతోంది. అలాగే పొత్తులో భాగంగా సీపీఎం కోరిన మిర్యాలగూడ టికెట్ ఎట్టకేలకు బలమైన నాయకుడు బత్తుల లక్ష్మారెడ్డికే దక్కింది. దీంతో అక్కడి కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. చార్మినార్ టికెట్ను స్థానిక నేత మహ్మద్ ముజీబ్ ఉల్లాహ్ షరీఫ్కు పార్టీ కేటాయించింది. గురువారం విడుదల చేసిన నాలుగో జాబితాతో కలిపి మొత్తం 118 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించినట్లయింది. పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించడం తెలిసిందే. -
యడ్యూరప్పకు నిరాశ
బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్పకు తీవ్ర నిరాశే ఎదురైంది. కుమారుడు విజయేంద్రతోపాటు, సన్నిహితురాలు శోభా కరాంద్లజే (యశ్వంత్పూర్ కోసం) లకు సోమవారం విడుదల చేసిన నాలుగో జాబితాలోనూ చోటు దక్కలేదు. మైసూరు జిల్లా వరుణ నియోజకవర్గం నుంచి తన కొడుకు విజయేంద్ర పోటీ చేయడంలేదని నంజనగుడులో ఏర్పాటుచేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో యడ్యూరప్ప చెప్పారు. దీంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికతోపాటు.. అక్కడున్న ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. అటు, రెండ్రోజుల క్రితం బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి రేవణ్ణ సిద్దయ్య (లింగాయత్ వర్గం బలమైన నాయకుడు)కు వరుణ నుంచి బీ–ఫామ్ ఇచ్చే అవకాశముంది. రేవణ్ణకు ఆరెస్సెస్నుంచి బలమైన మద్దతుంది. వరుణ, యశ్వంత్పూర్ సహా మరో రెండు నియోజకవర్గాలకు మంగళవారం అభ్యర్థులను ప్రటించే అవకాశం ఉంది. బళ్లారిలో రెడ్డి సోదరులపైనే ఆధారం తూర్పు కర్ణాటక ప్రాంతంలో గాలి జనార్దనరెడ్డి సోదరులపైనే బీజేపీ నమ్మకం పెట్టుకుంది. అందుకే శ్రీరాములు, రెడ్డి సోదరుల కుటుంబసభ్యులు, అనుచరులకు ఏడు టికెట్లు ఇచ్చింది. గాలి మేనల్లుడు, రియల్టర్ లల్లేశ్ రెడ్డిని కన్నడ హోం మంత్రి ఆర్ రామలింగారెడ్డిపై (బీటీఎం లేఔట్ నుంచి) పోటీకి దించనుంది. ఈ ప్రాంతంలోని రెడ్డి ఓట్లను బీజేపీ వైపుకు తీసుకురావటంలో గాలి పాత్ర కీలకం కానుంది. బీజేపీ దీనిపైనే విశ్వాసం ఉంచింది. -
జిల్లాలో భారీగా పెరిగిన ఓటర్లు
నిజామాబాద్ అర్బన్, న్యూస్లైన్: నూతన గణాంకాల ప్రకారం జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 18,53,288 గా నమోదైంది. మార్చి తొమ్మిది వరకు కొత్తగా ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకున్న ఓటర్లను కలుపుకొని తుది జాబితాను జిల్లా యంత్రాంగం ప్రకటించింది. 48,523 మంది కొత్త ఓటర్ల పేర్లు జాబితాలో చేరాయి. ఫిబ్రవరిలో అధికారికంగా ఓటర్ల సంఖ్య జిల్లా వ్యాప్తంగా 18,04,765గా నమోదైంది. ప్రస్తుతం కొత్త ఓటర్లతో సంఖ్య పెరిగిపోయింది. ఆర్మూర్ నియోజకవర్గంలో 4,038 మంది, బోధన్ 4,289, జుక్కల్లో 3,083, బాన్సువాడలో 3,520, ఎల్లారెడ్డిలో 3,206, కామారెడ్డిలో 3,797, నిజామాబాద్ అర్బన్లో 14,511, నిజామాబాద్ రూరల్లో 7,189, బాల్కొండ నియోజకవర్గంలో 4,096 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement