-
Deepika Deshwal: ముచ్చటగా మూడోసారి...
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మూడుసార్లు ప్రసంగించిన తొలి భారతీయ యువతిగా లా ఆఫీసర్ దీపికా దేశ్వాల్ చరిత్ర సృష్టించింది. కాలేజీ రోజుల నుంచి సేవాపథంలో నడుస్తున్న దిల్లీకి చెందిన దీపిక ఎంతోమంది బాధితులకు అండగా నిలిచి, ఎన్నోరకాల సేవాకార్యక్రమాల్లో పాల్గొంది. నలుగురిని ఒకటి చేసి తన దారిలో నడిచేలా చేసింది... పీహెచ్డీ స్కాలర్ అయిన దీపికా దేశ్వాల్కు చదువు మాత్రమే ప్రపంచం కాదు. కాలేజీ రోజుల నుంచి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అంటే ఇష్టం. కోవిడ్ కల్లోల కాలంలో సామాజిక సేవా కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొంది. పంజాబ్లోని మోగా జిల్లాలో ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుంటూ పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వందలాదిమందికి సహాయం అందించింది. స్నేహితులు, బంధువులను కూడా తన సేవాకార్యక్రమాలలో భాగం చేసింది. అన్నదానం నుంచి అనుకోకుండా ఆపదలో చిక్కుకున్న వారికి సహాయం చేయడం వరకు ఎన్నో చేసింది. తన జీతం మొత్తం కరోనా బాధితుల చికిత్స కోసం విరాళంగా ఇచ్చేది. ఆమె తండ్రి కూడా తన జీతంలోని కొంతమొత్తాన్ని విరాళంగా ఇచ్చేవాడు. ఏ అవసరం ఎప్పుడు వచ్చినా ఫోన్ చేయమంటూ ఎంతోమందికి తన ఫోన్ నంబర్ ఇచ్చింది. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు ఫోన్ వచ్చినా పరుగులు తీసేది. బాధితులకు అన్ని రకాలుగా అండగా నిలిచేది. సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతున్న 80 మంది అమ్మాయిలకు అండగా నిలిచి, నేరస్థులు అరెస్ట్ అయేలా ఉద్యమించింది. వ్యభిచార కూపంలో చిక్కుకున్న అమ్మాయిలను రక్షించి వారికి పునరావాసం ఏర్పాటయ్యేందుకు కృషి చేసింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగానికి మనదేశం తరఫున ప్రాతినిధ్యం వహించింది. మహిళా సాధికారత నుంచి మానవ హక్కుల వరకు ఎన్నో కార్యక్రమాలలో క్రియాశీల పాత్ర పోషించిన దీపికకు న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మూడోసారి ప్రసంగించే అరుదైన అవకాశం లభించింది. గత రెండు సమావేశాల్లో ‘మానవ హక్కులు–మహిళా హక్కులు’ అంశంపై మాట్లాడి 150 దేశాలకు చెందిన ప్రతినిధుల ద్వారా ప్రశంసలు అందుకుంది. మనసున్న దీపిక ఆటల్లోనూ బంగారం అనిపించుకుంది.‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’ లో రెజ్లింగ్, జూడోలలో ఆరుసార్లు బంగారు పతకం గెలుచుకుంది. ఆత్మరక్షణకు సంబంధించి అమ్మాయిల కోసం రకరకాల వర్క్షాప్లు నిర్వహించింది. -
పదవీ విరమణ వయసు పెంపు సాధ్యం కాదు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం సాధ్యం కాదని హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలని, న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సు దీనితో సమానంగా ఉండటానికి రాజ్యాంగ నిబంధనలు అంగీకరించవని స్పష్టం చేసింది. ఈ తేడా సహేతుకమైనదేనని, దీనిని అలాగే కొనసాగించాలని ఆల్ ఇండియా జడ్జిల అసోసియేషన్ కేసులో సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందని హైకోర్టు గుర్తు చేసింది. న్యాయాధికారుల రిటైర్మెంట్ వయస్సు పెంపుపై ఫుల్ కోర్టు (పాలనాపరమైన నిర్ణయాల కోసం హైకోర్టు న్యాయమూర్తులందరు సమావేశమవడం) నిర్ణయం తీసుకోజాలదని తేల్చి చెప్పింది. ఆ నిర్ణయాధికారం ఫుల్కోర్టుకు లేదని, అలా చేయడం సుప్రీంకోర్టు తీర్పును అతిక్రమించడమే అవుతుందని స్పష్టం చేసింది. పైపెచ్చు ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టంలోని సెక్షన్ 3(1ఏ) ప్రకారం న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లుగానే ఉందని, దానిని సవరించనప్పుడు 62 ఏళ్లకు పెంచడం సాధ్యం కాదంది. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది. విశ్రాంత న్యాయాధికారి కె.సుధామణి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. విజయనగరం జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న కె.సుధామణి వయసు 60 ఏళ్లకు చేరుకోవడంతో ఆమెకు పదవీ విరమణ వర్తింపజేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ సుధామణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయాధికారుల రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని కోరారు. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది జె. సుధీర్ వాదనలు వినిపించారు. హైకోర్టు తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపించారు. -
న్యాయం కావాలి
కేటాయింపు జాబితాపై తెలంగాణ న్యాయాధికారుల భగ్గు పదవులకు 120 మంది మూకుమ్మడి రాజీనామా సంఘం అధ్యక్షుడికి లేఖ సమర్పణ వారంలో సమస్య పరిష్కారం కావాలి.. లేదంటే రాజీనామా లేఖను గవర్నర్కు సమర్పించాలని విజ్ఞప్తి రాజీనామా లేఖలో హైకోర్టుపై ఘాటైన పదజాలం మాపై కోర్టు సవతితల్లి ప్రేమ చూపింది మెజారిటీ జడ్జీలు పక్షపాతంతో ఉన్నారు ఇప్పటికైనా కనువిప్పు కాకుంటే ప్రాణత్యాగానికైనా సిద్ధం న్యాయాధికారులు రోడ్డెక్కడం చరిత్రలో ఇదే తొలిసారి సీనియర్ న్యాయమూర్తులతో ఏసీజే అత్యవసర సమావేశం సాక్షి, హైదరాబాద్: కిందిస్థాయి న్యాయవ్యవస్థలో న్యాయాధికారుల కేటాయింపు చిచ్చు రోజురోజుకూ రాజుకుంటోంది. హైకోర్టు రూపొందించిన ప్రాథమిక కేటాయింపుల జాబితాను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ న్యాయాధికారులు.. తాజాగా రాజీనామాస్త్రాలను సంధించారు. రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న దాదాపు 120 మంది న్యాయాధికారులు ఆదివారం తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. రాజీనామా లేఖను న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు కె.రవీందర్రెడ్డికి సమర్పించారు. ఏడు రోజుల్లో సమస్య పరిష్కారం కావాలని, లేని పక్షంలో తమ రాజీనామాలన్నింటినీ గవర్నర్ నరసింహన్కు సమర్పించాలని కోరారు. అనంతరం అధ్యక్షుడు రవీందర్రెడ్డి, కార్యదర్శి వరప్రసాద్, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ప్రసాద్ నేతృత్వంలోని ప్రతి నిధి బృందం గవర్నర్ నరసింహన్ను కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ నేపథ్యంలో రాత్రి 8.30 గంటల సమయంలో సీనియర్ న్యాయమూర్తులతో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే అత్యవసర సమావేశం నిర్వహించారు. అంతకుముందు హైదరాబాద్లోని ఓ హోటల్లో న్యాయాధికారుల సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. దీనికి న్యాయాధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. ఈ రాజీనామా లేఖలో న్యాయాధికారులు తమ ఆవేదన వ్యక్తంచేశారు. హైకోర్టుపై ఘాటైన పదజాలం ఉపయోగించారు. లేఖలో ఏముందంటే.. మాపై సవతి ప్రేమ... ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యాయాధికారుల విభజనకు హైకోర్టు శ్రీకారం చుట్టడంతో మేమెం తో సంతోషించాం. అయితే న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితా చూసిన తర్వాత హైకోర్టు మాపై సవతి ప్రేమ చూపినట్లు అర్థమైంది. హైకోర్టు రిజిస్ట్రీ తమకు నచ్చిన విధంగా వ్యవహరించినట్లు స్పష్టమైం ది. ఆంధ్రప్రదేశ్లో అన్ని కేడర్లలో పోస్టులను ఖాళీగా ఉంచి, తెలంగాణలో మాత్రం ఖాళీలు లేకుండా చేశారు. ఏపీకి చెందిన యువ న్యాయాధికారులను ఉద్దేశపూర్వకంగా తెలంగాణకు కేటాయించారు. తద్వారా తెలంగాణ న్యాయాధికారుల పదోన్నతి అవకాశాలను హైకోర్టు దెబ్బతీసింది. రాజకీయంగా, పాల నాపరంగా తెలంగాణను సాధించుకున్నా.. ఇప్పటికీ మేం ఏపీ హైకోర్టు కింద పనిచేస్తున్నామనే భావన కలుగుతుందే తప్ప.. ఉమ్మడి హైకోర్టు కింద చేస్తున్నామనిపించడం లేదు. పక్షపాత వైఖరితో ఉన్నారు.. మీ (రవీందర్రెడ్డి) నేతృత్వంలో సంఘం ప్రతినిధులు రాష్ట్ర గవర్నర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. అన్యాయాన్ని ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా మాకు అన్యా యం జరిగిందని ఏసీజేనే చెప్పారు. తర్వాత కేంద్ర ప్రభుత్వానికి వినతులు పంపాం. దురదృష్టవశాత్తూ ఏ ఒక్కరూ మనకు జరిగిన అన్యాయంపై స్పందించలేదు. దీంతో హైకో ర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంపై మేం విశ్వాసం కోల్పోయాం. ఈ మొత్తం వ్యవహారంలో మెజారిటీ హైకోర్టు న్యాయమూర్తులు పక్షపాత వైఖరితో ఉన్నారు కాబట్టి.. సమస్యలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయరాదని గత సమావేశంలో తీర్మానించాం. హైకోర్టు అన్యాయంగా వ్యవహరిస్తోంది తెలంగాణ న్యాయవాదులు, న్యాయ శాఖ ఉద్యోగులు మన తరఫున గత మూడు వారాలుగా పోరాటం చేస్తున్నారు. ఇందుకు ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేస్తున్నాం. న్యాయాధికారులు సీసీఏ నిబంధనలకు, ప్రవర్తనా నియమావళికి లోబడి పనిచేయాలని మాకు తెలు సు. అయితే న్యాయాధికారుల కేటాయింపుల్లో హైకోర్టు ఉద్దేశపూర్వకంగా నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా, అన్యాయంగా వ్యవహరి స్తోంది. గత మూడు వారాలు గా న్యాయవాదులు, ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నా హైకోర్టు తన తప్పులను సరిదిద్దుకోవడం గానీ, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవ డం గానీ చేయ డం లేదు. ప్రాణత్యాగానికైనా సిద్ధం.. ఈ పరిస్థితుల్లో న్యాయం అందుతుందనే నమ్మకం మాకు లేదు. ఆంధ్రా పాలకుల కింద ఏ మాత్రం పనిచేయలేం. న్యాయాధికారులం కావడంతో మా మనస్సాక్షికి విరుద్ధంగా మౌనంగా ఉంటూ వస్తున్నాం. ఇక మౌనంగా ఉండటం మా వల్ల కాదు. బంగారు తెలంగాణ కోసం మా న్యాయాధికారుల పోస్టులను వదులుకోవాలని భారమైన హృదయంతో నిర్ణయం తీసుకున్నాం. మా రాజీనామాలు పైస్థాయిలో ఉన్న వ్యక్తులకు కనువిప్పు కలిగించకుంటే.. హైకోర్టు ప్రాంగణంలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి ప్రాణాలు వదిలేందుకు కూడా సిద్ధం. మా రాజీనామాలను మీకు(రవీందర్రెడ్డి) సమర్పిస్తున్నాం. వాటిని ఆమోదం కోసం గవర్నర్కు సమర్పించగలరని కోరుతున్నాం. మౌన ప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు సర్వసభ్య సమావేశం ముగిసిన తర్వాత న్యాయాధికారులందరూ గన్పార్క్ వద్దకు చేరుకున్నారు. అక్కడ అమరవీరులకు నివాళులు అర్పించి సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.రవీందర్రెడ్డి, వరప్రసాద్ల నేతృత్వంలో రాజ్భవన్ వరకు మౌన ప్రదర్శన చేపట్టారు. ఖైరతాబాద్ చౌరస్తా వద్దకు చేరుకోగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. గవర్నర్ను కలిసేందుకు అనుమతి లేదన్నారు. తాము ఆందోళనలు చేయడానికి వెళ్లడం లేదని, వినతిపత్రం సమర్పించడానికి వెళుతున్నామని చెప్పడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. అయితే ఇంత మందిని అనుమతించబోమని, ఓ ప్రతినిధి బృందాన్ని మాత్రమే పంపుతామని పేర్కొన్నారు. దీంతో ఎనిమిది మందితో కూడిన ప్రతినిధి బృందం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్కు వినతిపత్రం సమర్పించింది. ప్రాథమిక కేటాయింపులతో తెలంగాణ న్యాయాధికారులకు జరుగుతున్న అన్యాయాన్ని గవర్నర్కు వివరించారు. ఇందులో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని అభ్యర్థించారు. ఈ విషయంపై వీరు గవర్నర్ను కలవడం ఇది రెండోసారి. ఇలా న్యాయం చేయాలంటూ న్యాయాధికారులు రోడ్డెక్కడం న్యాయవ్యవస్థ చరిత్రలో ఇదే మొదటిసారి. మరోవైపు జూలై 1 నుంచి సమ్మె చేయాలని న్యాయశాఖ ఉద్యోగులు తీర్మానించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement